10-02-2019, 03:01 AM
భక్తికి, రక్తికి ఆనవాలం ఈ శృంగార నగరి శిల్పాలను చూస్తే మైమరచిపోతారు
![[Image: IndiaTvbf1daa_main.jpg]](https://resize.indiatvnews.com/en/centered/oldbucket/715_431/mainnational/IndiaTvbf1daa_main.jpg)
కొండలే అయినా మనస్సు దోచే కళా ఖండాలు. రాళ్లే అయినా..రమ్యమనిపించే అద్భుతాలు. బొమ్మలే అయినా..నాట్యాన్ని కళ్లకు కడతాయి. ప్రపంచంలోనే అద్భుతం అనిపించే అరుదైన కళారీతి ఈ ఖజురహో శిల్పాలు. వాస్తవికతకు దగ్గరగా..మనస్సుని హత్తుకునేలా..ఆలోచనలు పరవళ్లు తొక్కేలా ..రూపుదిద్దుకున్నవే ఈ శిల్పాలు. చూడగానే..ఏ కదలిక లేకున్నా మౌనముద్రలో ఉన్నశిల్పాలు మస్తిష్కాన్ని తొలుస్తాయి. మనస్సును కదిలిస్తాయి. మనిషిని ఉద్రేకపరుస్తాయి. ఆ మౌనం జీవన పాఠాలు చెబుతుంది. సృష్టి రహస్యాన్ని బోధిస్తుంది. అందుకే ఈ పర్యాటక కేంద్రం ప్రేమికులకు నందనవనం..కొత్త జంటలకు బృందావనం..అతే ఖజురహో..అపురూప శృంగార శిల్పనగరి గురించి తెలుసుకుందాం..
ఇసుకరాతి శిల్పాలు బంగారు వర్ణంలో
![[Image: youtuve_1497524134.jpg]](https://im.indiatimes.in/content/2017/Jun/youtuve_1497524134.jpg)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖజురహో కేత్రం ఉంది. ఇది ఒక మోస్తరు పట్టణమే కానీ, లోనికి వెళ్లే కొద్దీ బయటకు రానివ్వకుండా చేస్తుంది. ఇక్కడ ఆలయాలపై నిలిచిన ఇసుకరాతి శిల్పాలు బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉత్సుకత రేకెత్తిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆలయాలు భక్తికి, అనురక్తికి సరికొత్త అర్థం చెబుతాయి
![[Image: images?q=tbn%3AANd9GcTe_ft_9lBZ2TCygM4Mq...RG5TCgR9AQ]](https://encrypted-tbn0.gstatic.com/images?q=tbn%3AANd9GcTe_ft_9lBZ2TCygM4MqRIDhP9QcJzTo4klFy1YRoRG5TCgR9AQ)
అలా ప్రసిద్ది చెందిన ఆలయాల్లో దేవీ జగదాంబ ఆలయం, విష్ణుమూర్తి, చిత్రగుప్తుని ఆలయం, పార్వతీ దేవి ఆలయం, గంగామాత ఆలయాలున్నాయి. ఈ ఆలయాన్ని సౌండ్ స్టోన్ తో నిర్మించారు. ఇవి బఫ్, పింక్, లేత పసుపు వర్ణాల్లో ఉంటాయి. క్రీ.శ 950-1050 మధ్య చందేలా రాజుల హయాంలో రూపుదిద్దుకున్న ఈ ఆలయాలు భక్తికి, అనురక్తికి సరికొత్త అర్థం చెబుతాయి.
చందేలా రాజులు ఖజురహో రాజధానిగా
![[Image: 9172b1a250a537b9c3478ab753bf31d5--temple...temple.jpg]](https://i.pinimg.com/736x/91/72/b1/9172b1a250a537b9c3478ab753bf31d5--temple-architecture-*****-temple.jpg)
చందేలా రాజులు ఖజురహో రాజధానిగా మధ్యభారతాన్ని పరిపాలించారు. ఆ సమయంలోనే ఖజురహోలో ఉన్న ఆలయాలన్నీ నిర్మింపబడ్డాయి. వాటిలో మతంగేశ్వర ఆలయం అతి ప్రాచీనమైనది. అలాగే లక్ష్మణ మందిరం, మహావిష్ణువు కొలువుదీరిన ఆలయం మరియు ఆలయంలో ఉన్న వందలాది శిల్పాలు వేలాది భావాలను స్పురింపజేస్తాయి.
ఖజురహో సౌందర్యమంతా ఆలయ గోపురాలు
![[Image: khajuraho-banner-2.gif]](http://www.india-tourguide.com/wp-content/uploads/2018/02/khajuraho-banner-2.gif)
ఖజురహో సౌందర్యమంతా ఆలయ గోపురాలు, స్తంభాల్లోనే ప్రతిష్టితమై ఉంది. ఈ ఖజురహో ఆలయ సమూహంలో వరాహ మందిర మరో అద్భుతం. చాలా పెద్దగా ఉన్న వరాహ విగ్రహం ఒక అద్భుతమనుకుంటే, ఆ విగ్రహంపై 674 దేవతా మూర్తులు చెక్కడం మరో విశేషం. ఇవన్నీ పర్యాటకుల కళ్ళు తిప్పుకోనీయకుండా చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
జగత్తులో కనివిని ఎరుగని శిల్పకళ
![[Image: Khajuraho_temple.jpg]](https://upload.wikimedia.org/wikipedia/commons/f/fe/Khajuraho_temple.jpg)
ఒక్కొక్క ఆలయం ఈ గజత్తులో కనివిని ఎరుగని శిల్పకళను సంతరించుకున్నాయి. కానీ, ఆ రాజులు పోయాక..ఏ రాజులూ ఇక్కడి సౌందర్యాన్ని గుర్తించలేదు. దాంతో వందల సంవత్సరాల ఇక్కడి ఆలయాలు, శిల్పాలు ఏ ఆదరణకూ నోచుకోలేదు. కానీ బ్రిటిష్ హయాంలో మళ్లీ ఖజురహో గొప్పదనం బయటి ప్రపంచానికి తెలిసింది.
ఎన్నో వింతలకు కొలువయ్యాయి
![[Image: 2215255408_2h.jpg]](https://c1.hiqcdn.com/customcdn/500x500/blog/sites/default/files/2215255408_2h.jpg)
ఒకప్పుడు 80 ఆలయాలతో అలరారిన చందేలా రాజధానిలో కాలపరీక్షను తట్టుకుని నిలబడ్డవి 22 ఆలయాలే! అలా కొన్నే ..ఎన్నో వింతలకు కొలువయ్యాయి. అంతులేని కళనైపుణ్యాలు దాగున్న ఈ ఆలయాలను నిత్యం వేలాది మంది దేశ, విదేశీయులు సందర్శిస్తారు.
![[Image: IndiaTvbf1daa_main.jpg]](https://resize.indiatvnews.com/en/centered/oldbucket/715_431/mainnational/IndiaTvbf1daa_main.jpg)
కొండలే అయినా మనస్సు దోచే కళా ఖండాలు. రాళ్లే అయినా..రమ్యమనిపించే అద్భుతాలు. బొమ్మలే అయినా..నాట్యాన్ని కళ్లకు కడతాయి. ప్రపంచంలోనే అద్భుతం అనిపించే అరుదైన కళారీతి ఈ ఖజురహో శిల్పాలు. వాస్తవికతకు దగ్గరగా..మనస్సుని హత్తుకునేలా..ఆలోచనలు పరవళ్లు తొక్కేలా ..రూపుదిద్దుకున్నవే ఈ శిల్పాలు. చూడగానే..ఏ కదలిక లేకున్నా మౌనముద్రలో ఉన్నశిల్పాలు మస్తిష్కాన్ని తొలుస్తాయి. మనస్సును కదిలిస్తాయి. మనిషిని ఉద్రేకపరుస్తాయి. ఆ మౌనం జీవన పాఠాలు చెబుతుంది. సృష్టి రహస్యాన్ని బోధిస్తుంది. అందుకే ఈ పర్యాటక కేంద్రం ప్రేమికులకు నందనవనం..కొత్త జంటలకు బృందావనం..అతే ఖజురహో..అపురూప శృంగార శిల్పనగరి గురించి తెలుసుకుందాం..
ఇసుకరాతి శిల్పాలు బంగారు వర్ణంలో
![[Image: youtuve_1497524134.jpg]](https://im.indiatimes.in/content/2017/Jun/youtuve_1497524134.jpg)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖజురహో కేత్రం ఉంది. ఇది ఒక మోస్తరు పట్టణమే కానీ, లోనికి వెళ్లే కొద్దీ బయటకు రానివ్వకుండా చేస్తుంది. ఇక్కడ ఆలయాలపై నిలిచిన ఇసుకరాతి శిల్పాలు బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉత్సుకత రేకెత్తిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆలయాలు భక్తికి, అనురక్తికి సరికొత్త అర్థం చెబుతాయి
అలా ప్రసిద్ది చెందిన ఆలయాల్లో దేవీ జగదాంబ ఆలయం, విష్ణుమూర్తి, చిత్రగుప్తుని ఆలయం, పార్వతీ దేవి ఆలయం, గంగామాత ఆలయాలున్నాయి. ఈ ఆలయాన్ని సౌండ్ స్టోన్ తో నిర్మించారు. ఇవి బఫ్, పింక్, లేత పసుపు వర్ణాల్లో ఉంటాయి. క్రీ.శ 950-1050 మధ్య చందేలా రాజుల హయాంలో రూపుదిద్దుకున్న ఈ ఆలయాలు భక్తికి, అనురక్తికి సరికొత్త అర్థం చెబుతాయి.
చందేలా రాజులు ఖజురహో రాజధానిగా
![[Image: 9172b1a250a537b9c3478ab753bf31d5--temple...temple.jpg]](https://i.pinimg.com/736x/91/72/b1/9172b1a250a537b9c3478ab753bf31d5--temple-architecture-*****-temple.jpg)
చందేలా రాజులు ఖజురహో రాజధానిగా మధ్యభారతాన్ని పరిపాలించారు. ఆ సమయంలోనే ఖజురహోలో ఉన్న ఆలయాలన్నీ నిర్మింపబడ్డాయి. వాటిలో మతంగేశ్వర ఆలయం అతి ప్రాచీనమైనది. అలాగే లక్ష్మణ మందిరం, మహావిష్ణువు కొలువుదీరిన ఆలయం మరియు ఆలయంలో ఉన్న వందలాది శిల్పాలు వేలాది భావాలను స్పురింపజేస్తాయి.
ఖజురహో సౌందర్యమంతా ఆలయ గోపురాలు
![[Image: khajuraho-banner-2.gif]](http://www.india-tourguide.com/wp-content/uploads/2018/02/khajuraho-banner-2.gif)
ఖజురహో సౌందర్యమంతా ఆలయ గోపురాలు, స్తంభాల్లోనే ప్రతిష్టితమై ఉంది. ఈ ఖజురహో ఆలయ సమూహంలో వరాహ మందిర మరో అద్భుతం. చాలా పెద్దగా ఉన్న వరాహ విగ్రహం ఒక అద్భుతమనుకుంటే, ఆ విగ్రహంపై 674 దేవతా మూర్తులు చెక్కడం మరో విశేషం. ఇవన్నీ పర్యాటకుల కళ్ళు తిప్పుకోనీయకుండా చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
జగత్తులో కనివిని ఎరుగని శిల్పకళ
![[Image: Khajuraho_temple.jpg]](https://upload.wikimedia.org/wikipedia/commons/f/fe/Khajuraho_temple.jpg)
ఒక్కొక్క ఆలయం ఈ గజత్తులో కనివిని ఎరుగని శిల్పకళను సంతరించుకున్నాయి. కానీ, ఆ రాజులు పోయాక..ఏ రాజులూ ఇక్కడి సౌందర్యాన్ని గుర్తించలేదు. దాంతో వందల సంవత్సరాల ఇక్కడి ఆలయాలు, శిల్పాలు ఏ ఆదరణకూ నోచుకోలేదు. కానీ బ్రిటిష్ హయాంలో మళ్లీ ఖజురహో గొప్పదనం బయటి ప్రపంచానికి తెలిసింది.
ఎన్నో వింతలకు కొలువయ్యాయి
![[Image: 2215255408_2h.jpg]](https://c1.hiqcdn.com/customcdn/500x500/blog/sites/default/files/2215255408_2h.jpg)
ఒకప్పుడు 80 ఆలయాలతో అలరారిన చందేలా రాజధానిలో కాలపరీక్షను తట్టుకుని నిలబడ్డవి 22 ఆలయాలే! అలా కొన్నే ..ఎన్నో వింతలకు కొలువయ్యాయి. అంతులేని కళనైపుణ్యాలు దాగున్న ఈ ఆలయాలను నిత్యం వేలాది మంది దేశ, విదేశీయులు సందర్శిస్తారు.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK