Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - ఉచితాలు - అనుభవాలు
ఉచితాలు - అనుభవాలు
రచనపెద్దాడ సత్యనారాయణ



అదొక రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయము. మధ్యాన్నము క్యాంటీన్లో సిబ్బంది లంచ్ చేస్తున్నారు. 



“హాయ్ నర్సింగ్! ఈమధ్య లో రెండు రోజులు లంచ్ కి వస్తున్నావ్ ఏమిటి. కూర్చొ” అని పక్కన ఉన్న సీట్ ఇస్తాడు వెంకట్. 



“ఏం చెప్పాలి రా.. ఉచిత బస్సు సౌకర్యం వచ్చినప్పటి నుంచి దోస్తుల ఇంటికి, తల్లిగారింటికి చూడాలనుకున్నప్పుడల్లా వెళ్ళిపోతుంది” అని జవాబు ఇస్తాడు నర్సింగ్. 



చాలామంది ఇళ్లల్లో ఇదే లెక్క రా. నా భార్య నిన్న సిద్దిపేట పోయింది. ఎప్పుడొస్తుందో తెలవదు” అన్నాడు వెంకట్.. 



లంచ్ అయిన తర్వాత అందరూ తమ సెక్షన్స్ లోకి వెళ్లిపోతారు. 



***
నర్సింగ్ భార్య శాంతి తల్లిగారింటికి వెళుతుంది. ఇంట్లో తండ్రి తప్ప తల్లి కనిపించలేదు. 



“నాయనా! అమ్మ యాడికి వెళ్ళింది?” 



“అమ్మ కరీంనగర్ పోయింది. వాళ్ళ అమ్మగారిని చూసి మూడు ఏళ్ళు అయింది. ఉచిత బస్సు సౌకర్యం ఉందని వారం దినాలు ఉండి వస్తానని చెప్పింది” అన్నాడు తండ్రి. 



“నాయనా, ఇప్పుడు నేను వంట చేయాలా?”



“వద్దు బిడ్డ, ఇద్దరము హోటల్ కి వెళ్లి భోం చేసివద్దాము”. 



“సరే నాయనా” అంది శాంతి. 



ఇద్దరు హోటల్ కి వెళ్తారు. హోటల్ బిల్లు 300 అవుతుంది. 



‘చ.. నాకు బస్సు చార్జీ 200 మిగిలింది అనుకుంటే నాయనికి 300 ఖర్చు అయ్యింది’ అనుకుని, “నాయనా! నువ్వు కూడా నాతో హైదరాబాద్ వచ్చేయి” అంటుంది. 



“మీ అమ్మ ఎప్పుడు వస్తుందో తెలవదు. వారం అని చెప్పినా రెండు దినాల్లోనే రావచ్చు” అన్నాడు తండ్రి. 
***
నర్సింగ్ సాయంత్రం ఇంటికి వెళ్లిన తర్వాత తనే వంట చేసుకోవాలని గుర్తుకొచ్చింది. బద్ధకముగా ఉన్నందు వలన హోటల్ కి వెళ్లి టిఫిన్ చేసి వచ్చాడు మరుసటి రోజు పొద్దున్నే టిఫిన్ చేద్దాం అని బయలుదేరబోయాడు. ఇంతలో శాంతి తలుపు తోసుకుని లోపలికి వచ్చింది. 



“నేను టిఫిన్ చేయలేదు. హోటల్ కి వెళ్లి టిఫిన్ చేద్దామా” అంటాడు నర్సింగ్. 
“వద్దు, నేను పది నిమిషాల్లో రెడీ చేస్తాను” అని చెప్తుంది శాంతి. 



“ఏమైంది శాంతి జల్ది వచ్చేసినావు?” అడిగాడు నర్సింగ్. 



“అదే.. మా అమ్మ వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళినది” అని చెప్తుంది. 



మరుసటి రోజు ఆఫీసులో లంచ్ టైంలో సుశీల రాగిణి తో “నీవు డైటింగ్ చేస్తున్నావా.. చిక్కిపోయావ్?” అంటుంది. 



“డైటింగా పాడా.. ఉచిత బస్సు ప్రయాణం వచ్చిన తర్వాత నా పెనిమిటి పెట్రోల్ సేవింగ్ ఆని అన్ని పనులకు నన్నే పంపిస్తున్నాడు” అని తన బాధ చెప్తుంది రాగిణి. 



రాగిణి సాయంత్రం ఇంటికి వెళ్లిన తర్వాత భర్తతో “నావల్ల మీకు 1300 బస్సు పాస్ మిగిలింది. బయట పనులకు నేను తిరగడం వల్ల వెయ్యి రూపాయలు మిగిలింది. ఆ డబ్బులు నాకు ఇస్తే మంచి చీర కొనుక్కుంటాను” అంటుంది. 



“రాగిణీ! నువ్వు కష్టపడటము నాకు ఇష్టం లేదు. ఇకమీదట నేనే వెళ్లి సరుకులు తెస్తాను” అంటాడు ఆమె భర్త. 



మరుసటి రోజు రాగిణి సుశీలకు థాంక్స్ చెప్తుంది. 



అక్కడ వెంకటరావు భార్య ఉచిత బస్సు అని హోటల్ కి వెళ్లి టిఫిన్ తిని, భర్తకు కూడా తెచ్చేది. బస్సు టికెట్ కంటే టిఫిన్ ధరే ఎక్కువ అయ్యేది. ఈ నిజం తెలుసుకొని ఉచిత ప్రయాణాలు మానుకొని ఇంట్లోనే టిఫిన్ చేయడం మొదలుపెట్టింది. 
***
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - పాత గుడ్డలు - by k3vv3 - 19-12-2025, 02:35 PM



Users browsing this thread: 1 Guest(s)