14-11-2025, 09:00 AM
జననం చిట్గాంగ్. భారత స్వాతంత్య పోరాటంపై చిన్న వయస్సు నుండీ ఆసక్తి. హైకాలేజీ చదువు (Chittogram) చిటోగ్రామ్లో మరియు డాకాలో ముగించి పై చదువులకు కలకత్తాకు వచ్చారు. బితుని కాలేజ్లో ఫిలాసఫీలో గ్రాడ్యుయేషన్ చదివి ప్రధమ శ్రేణిలో ముగించారు. కాలేజీ టీచరుగా ఉద్యోగం ప్రారంభించారు. వారికి నిక్నైంమ్ రాణి. ఆకాలంలో పాలక బ్రిటీష్ వారు వారి పహర్టలి క్లబ్ ముందు కుక్కలు భారతీయులకు ప్రవేశం లేదని బోర్డును తగిలించారు. దాన్ని చూచిన ప్రీతీలత మనస్సుకు ఎంతో ఆవేదన కలిగింది. ప్రీతీలత సూర్యసేన్ స్థాపించిన ఆంగ్లేయులకు వ్యతిరేక సమాజంలో చేరింది. పదిహేను మంది భారతీయ స్వాతంత్యవాదులతో ఆ క్లబ్లో ప్రవేశించింది. ఆయుధాలతో (తుపాకులు) ఇరువర్గాలకు జరిగిన కాల్పులలో ఒక వ్యక్తి (భారతీయుడు) మరణించాడు. పదకొండుమందికి తీవ్రగాయాలు బ్రిటీష్ వారి కాల్పుల వలన ఏర్పడ్డాయి. బ్రిటీష్ సెక్యూరిటీ ఆఫీసర్లు బ్రతికిన అందరినీ పట్టుకొన్నారు. వారి చేతుల్లో చిక్కి చావడం కంటే ఆత్మాహుతి చేసుకోవడం శ్రేయస్కరమని ప్రీతిలత తనకు తానుగా సెనైడ్ త్రాగి (మ్రింగి) వీరమరణాన్ని పొందినది. ఆమెకున్న అపారదేశభక్తి, ఆంగ్లేయుల పట్ల వున్న తీవ్రనిరసనకు ఆమె స్వయంగా చేసుకొన్న సైనెడ్ త్రాగి ఆత్మాహుతి ప్రత్యక్ష సాక్ష్యం. ఆమెది చరిత్రపుటలలో శాశ్వతంగా నిలిచిపోయిన వీరమరణం.
6. బినాదాస్ : జననం 24 జనవరి 1911 (కృష్ణానగర్, బెంగాల్), నిర్యాణం 26 డిశంబర్ 1986 (జీవితకాలం 75 సంవత్సరాలు)
రుషికేస్లో మరణించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. స్వాతంత్ర్య సమరంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటాన్ని సాగించిన వారిలో, నిర్భయంగా ఎదిరించిన వీర వనిత. తనకు 21 సంవత్సరాల వయస్సున బెంగాల్ గవర్నర్ను కలకత్తా యూనివర్శిటీలో జరిగిన కాన్ ఒకేషన్ సమయంలో గవర్నర్ (Strnley jarson) ప్రసంగం నచ్చక అతన్ని కాల్చిన వీరవనిత. వీరు (chahatri Sanga) చహత్రీ సంఘం సభ్యురాలు. ఎందరో స్త్రీలకు స్వాతంత్య సమరంలో పాల్గొనేటందుకు ఉత్తేజపరచిన గొప్ప కార్యకర్త. వీరి భర్తగారి పేరు జతిష్చంద్ర భూమిక్. వీరికి ఇరువురు సంతతి. మగపిల్లలు, వారు ప్రేమ్ కిరణ్, కైలాస్. మనకు స్వాతంత్యం సిద్ధించిన తరువాత (1947 ఆగస్టు 15వ తేది) మన గవర్నమెంటు ఆమె సాహసోపేత సత్ సమాజ నిర్మాణానికి చేసిన సేవలకు గౌరవంగా వారికి 1960లో పద్మశ్రీ అవార్డును బహూకరించారు. 26 డిశంబర్ 1986 ఆమె శవాన్ని రోడ్డు ప్రక్కన మార్గాన నడుచువారు గుర్తించారు. సెక్యూరిటీ ఆఫీసర్లకు తెలియజేశారు. ఆ చివరిదశలో వారి ఆ దుస్థితికి కారణం ఏమిటి! విధి బలీయమైనది.
బాలురు మరియు బాలికలారా!.... రెండు రోజులుగా నేను మీకు చెప్పిన మహారాణి పద్మిని, మహారాణి రుద్రమదేవి, కమలాదాస్ కల్పనా దాస్, ప్రీతీలత, బినాదాస్ గొప్ప దేశభక్తులు సమాజోద్దారకులు. వారి దృష్టిలో కులమతాలు లేవు. అందరూ భారతీయులనే పవిత్రభావన. వీరేకాదు... ఇంకా ఎందరో మహనీయులు మనదేశ స్వాతంత్ర్య పోరాటంలో పాలు పంచుకున్నారు. జైళ్ళకు వెళ్ళారు. ఆంగ్ల సెక్యూరిటీ ఆఫీసర్ల చేత లాఠీదెబ్బలు తిన్నారు. కొందరు వారిచేత కాల్చి చంపబడ్డారు. కొందరు ఉరితియ్యబడ్డారు. వారంతా భావి భారత పౌరులైన మీకందరికీ మనందరికీ ఆదర్శమూర్తులు.
ప్రస్తుతంలో మనం సర్వస్వతంత్రులం. దేశంలో హిందువులు, ''లు, క్రిస్టియన్స్, బౌద్దులు ఇంకా.... ఎందరో వున్నారు. మన దృష్టి మనకందరికీ వుండవలసినది సమభావన. ఎవరి మతం సిద్ధాంతాలు, నమ్మకాలు వారివి వారికే సొంతం. పరస్పర విమర్శలు తగదు. స్నేహం సౌభ్రాతృత్వాలను మనస్సున వుంచుకొని అందరూ భారతీయులమని భావించి కలసి మెలసి అన్నదమ్ములుగా అక్క చెల్లెళ్ళుగా ఏకతా భావనతో జీవితాన్ని గడపాలి. కుల మార్పులు, ప్రేమ పేరుతో వర్ణాంతర వివాహాలు మత మార్పులు తగదు. తప్పు. అందరినీ సృష్టించింది ఆ సర్వేశ్వరుడనే విశ్వాసం మనందరి హృదయాల్లో వుండాలి. ఐకమత్యంతో జీవితాన్ని సాగించాలి. ఎవరినీ ఏ విషయంలోనూ విమర్శించకూడదు. వ్యక్తిగత ద్వేషం, వ్యతిరేక చర్చ మహాపాపం.... పాతకం. ముఖ్యంగా అతివలను వేధించడం, వారికి బాధను కలిగించడం దానవత్వం. ఈ ప్రపంచంలో ఉండేవి రెండే జాతులు. ఆడ... మగ... ఒకరులేనిదే మరొకరు లేరు. బాలులారా!.... మీరు ప్రతి స్త్రీ మూర్తిని గౌరవించాలి.... ఆదరించాలి..... అభిమానించాలి. వారు ఆపదలో వుంటే చేయకలిగిన సాయం చేయాలి. అది మీ ధర్మం. మానవత్వం. బాలికలారా!.... మీ జీవితంలో మూడు ప్రధాన దశలు.
1. అమ్మి పాత్ర (మీ బాల్యం) పుట్టిన నాటినుంచి వివాహం అయ్యేంతవరకూ ఈ దశ. మీరు పుట్టిన ఇంట అమ్మా, నాన్న సోదరీ సోదరుల ప్రేమానురాగాలతో.... ఆనందంగా గడిచిపోతుంది.
2. వివాహం, పిల్లల అనంతరం పాత్ర అమ్మ: మీ సంతతి వలన మీకు ఆ హోదా (పేరు) లభిస్తుంది. మీ వూరు, ఇంటిపేరూ మారిపోతాయి. పుట్టింట అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, అమ్మా, నాన్నలు మీవారు. అత్తగారి ఇంట అత్తామామలు, బావమరుదులు, బావలు, మరదళ్ళు, వదినలు వుంటారు. మీరు మీ పుట్టింటి వారిని ఏ రీతిగా ప్రేమాభిమానాలతో చూచుకొంటారో, అదే రీతిగా అత్తవారింటి వారిని చూచుకోవాలి. వారి వలన మీరు కొన్ని విమర్శలకు గురి అయినా సహనంతో వారిని గౌరవించి అభిమానించాలి. మీ మంచితనంతో వారిని గెలవాలి. మీ బిడ్డలకు మంచి క్రమశిక్షణతో, వారికి మన దేశ పవిత్ర చరిత్రను మన గొప్ప నాయకుల ఆదర్శాలను, జీవిత విధానాన్ని, త్యాగాలను గురించి చెప్పి నేర్పి వారిని ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదే. అదేరీతిగా భర్తకు కార్యాషు దాసి కరణేసు మంత్రి, భోజ్యేషుమాత, శయనేసు రంభగా అంటే తల్లిగా, మంత్రిగా, (హితుడిగా) మాతగా, ప్రియురాలిగా మీ జీవితాంతం వర్తించాలి. వృద్ధాప్యంలో పరస్పర అవగాహనతో మంచి మిత్రులుగా ఒకరికొకరు సహాయం చేసుకొంటూ దైవచింతనతో జీవితాన్ని ప్రశాంతగా గడపాలి. అత్తామామలను అనాధ ఆశ్రమాల పాలు చేయకూడదు. వారి బిడ్డను వారికి దూరం చేయరాదు. మీరంతా నేడు విద్యార్థులు. బాగా చదివి ఉన్నతులు కావాలి. భావిజీవితంలో మీరు ఎవరెవరూ ఎటువంటి పదవులను, జీవిత విధానాలకు చేరుకుంటారో అది సర్వేశ్వరుల నిర్ణయం. అస్థికతను గౌరవించాలి. అభిమానించాలి. మనవారందరూ సిద్ధాంతాలను అంటే.... సత్యం, ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీ, ప్రేమ, సౌభ్రాతృత్వాలను పాటించారు. వీటన్నింటినీ ఈ వయస్సు నుండే అలవరచుకోవాలి. పాటించాలి.
3. అత్తగారి పాత్ర :- ఈ పాత్ర నిర్వహణ కోడలు ఇంటికి వచ్చాక స్త్రీ జీవితంలో ప్రారంభం అవుతుంది. మీకు కూతురు ఎంతో, మీ అబ్బాయిని వివాహం చేసుకొని అతన్ని నమ్మి తన కన్నవారిని సోదరసోదరీలందరికీ దూరమై మీ ఇంటికి వచ్చిన ఆడబిడ్డను మీ కన్న కూతురులా చూచుకోవాలి. ప్రేమించాలి.... అభిమానించాలి. కూతురికి ఒక న్యాయం, కోడలికి ఒక న్యాయం (వేరు వేరుగా) ఏ ధర్మశాస్త్రాలలోనూ లేదు. వచ్చిన కోడలు అమాయకురాలైతే తనలో తాను ఏడ్చుకుంటుంది. గడుసుదైతే మీ కుమారుడికి మీ గురించి (అత్తగారు) చిలవలు వలవలు చెప్పి, వేరు కాపురాన్ని పెట్టిస్తుంది. అలా పెట్టకలిగిన వ్యక్తి ధన్యుడు. కారణం తన తల్లితత్వం అతనికి చిన్న వయస్సు నుండీ తెలుసు కదా!. కోడలు రాగానే ఆమె తన చెల్లిని చూచేతీరు, భార్యను చూచే రీతిని గురించి, ఆలోచించి ఇటు తల్లికి చెప్పలేక, అటు భార్యను సమర్థించలేక, విడిగా వేరు కాపురం పెడితే రచ్చలు జరగవని ఇరువురి మధ్యన (అమ్మ, ఆలి) తాను నలిగిపోకుండా ప్రశాంతంగా బ్రతకాలనుకొంటాడు. వేరుకాపురం పెడతాను. పోతే అమాయకుడైనవాడు, తల్లిని అతిగా గౌరవించి అభిమానించేవాడు, భార్యకు నచ్చచెప్పలేనివాడు, ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని ఆలోచించకుండా, ఆఫ్ట్రాల్ ఆడమనిషి, నా భార్య కదా అని తన ఇల్లాలిని విమర్శించడం, తిట్టడం, ఇంకా ఆవేశం పెరిగితే కొట్టడం లాంటి చర్యలకు దిగజారిపోతే, ఆ యువతి (అతని భార్య) నేటి కాలంలో దాదాపు చదువు విషయంలో భార్యాభర్తలు సరిసమానం తానూ ఉద్యోగం చేసి సంపాదిస్తున్న కారణంగా ఆ భర్తమీద విసుగు, విరక్తి, ద్వేషం పెరిగి విడాకులకు సిద్ధం అవుతుంది. ఆడవారికి ఆడవారే శత్రువులు కాకూడదు. మంచి మిత్రులుగా శ్రేయోభిలాషులుగా కలిసిమెలసి ఉంటూ, కుటుంబాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుకోవాలి. ఈ అత్తపాత్ర చాలా క్లిష్టమైనది. కూతురిలా కోడలిని చూచుకోవాలన్న గొప్ప మనస్సు ఆ అత్తపాత్రకు అతి ముఖ్యం. అప్పుడే ఆ సంసారంలో అందరూ కలిసి ఆనందంగా జీవించగలరు." మేడంగారు చెప్పడం ఆపేశారు. చేతి వాచీని చూచారు.
"బాల బాలులారా!.... మీ అందరి భవిష్యత్తు బాగుండాలని, మీరు మీ సాటివారి మన్ననలను పొందాలని, మీ జీవన యాత్రను ఆనందమయంగా సాగించాలని ఇదంతా మీకు చెప్పాను. రేపు ఆదివారం శలవు. ఎల్లుండి సోమవారం నుండి ఫైనల్ పరీక్షలు.... బాగా చదవండి. పరీక్షలన్నింటినీ బాగా వ్రాయండి. మంచి మార్కులతో ఉత్తీర్ణులు కండీ. మీ అందరికీ నా శుభాశీస్సులు" నవ్వుతూ ముగించారు సుమలతా రావుగారు. లాంగ్ బెల్ గంట మ్రోగింది.
తెలుగు ప్రధాన పండితులు, ఉభయ భాషా ప్రవీణులు సుమలతారావుగారు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థుల గదినుండి బయటికి వచ్చి నడిచారు.
పిల్లలందరూ.... పుస్తకాలను సర్దుకొని క్లాస్ రూం నుండి బయటికి వారి వారి ఇండ్లకు బయలుదేరారు.
*
సమాప్తి
6. బినాదాస్ : జననం 24 జనవరి 1911 (కృష్ణానగర్, బెంగాల్), నిర్యాణం 26 డిశంబర్ 1986 (జీవితకాలం 75 సంవత్సరాలు)
రుషికేస్లో మరణించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. స్వాతంత్ర్య సమరంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటాన్ని సాగించిన వారిలో, నిర్భయంగా ఎదిరించిన వీర వనిత. తనకు 21 సంవత్సరాల వయస్సున బెంగాల్ గవర్నర్ను కలకత్తా యూనివర్శిటీలో జరిగిన కాన్ ఒకేషన్ సమయంలో గవర్నర్ (Strnley jarson) ప్రసంగం నచ్చక అతన్ని కాల్చిన వీరవనిత. వీరు (chahatri Sanga) చహత్రీ సంఘం సభ్యురాలు. ఎందరో స్త్రీలకు స్వాతంత్య సమరంలో పాల్గొనేటందుకు ఉత్తేజపరచిన గొప్ప కార్యకర్త. వీరి భర్తగారి పేరు జతిష్చంద్ర భూమిక్. వీరికి ఇరువురు సంతతి. మగపిల్లలు, వారు ప్రేమ్ కిరణ్, కైలాస్. మనకు స్వాతంత్యం సిద్ధించిన తరువాత (1947 ఆగస్టు 15వ తేది) మన గవర్నమెంటు ఆమె సాహసోపేత సత్ సమాజ నిర్మాణానికి చేసిన సేవలకు గౌరవంగా వారికి 1960లో పద్మశ్రీ అవార్డును బహూకరించారు. 26 డిశంబర్ 1986 ఆమె శవాన్ని రోడ్డు ప్రక్కన మార్గాన నడుచువారు గుర్తించారు. సెక్యూరిటీ ఆఫీసర్లకు తెలియజేశారు. ఆ చివరిదశలో వారి ఆ దుస్థితికి కారణం ఏమిటి! విధి బలీయమైనది.
బాలురు మరియు బాలికలారా!.... రెండు రోజులుగా నేను మీకు చెప్పిన మహారాణి పద్మిని, మహారాణి రుద్రమదేవి, కమలాదాస్ కల్పనా దాస్, ప్రీతీలత, బినాదాస్ గొప్ప దేశభక్తులు సమాజోద్దారకులు. వారి దృష్టిలో కులమతాలు లేవు. అందరూ భారతీయులనే పవిత్రభావన. వీరేకాదు... ఇంకా ఎందరో మహనీయులు మనదేశ స్వాతంత్ర్య పోరాటంలో పాలు పంచుకున్నారు. జైళ్ళకు వెళ్ళారు. ఆంగ్ల సెక్యూరిటీ ఆఫీసర్ల చేత లాఠీదెబ్బలు తిన్నారు. కొందరు వారిచేత కాల్చి చంపబడ్డారు. కొందరు ఉరితియ్యబడ్డారు. వారంతా భావి భారత పౌరులైన మీకందరికీ మనందరికీ ఆదర్శమూర్తులు.
ప్రస్తుతంలో మనం సర్వస్వతంత్రులం. దేశంలో హిందువులు, ''లు, క్రిస్టియన్స్, బౌద్దులు ఇంకా.... ఎందరో వున్నారు. మన దృష్టి మనకందరికీ వుండవలసినది సమభావన. ఎవరి మతం సిద్ధాంతాలు, నమ్మకాలు వారివి వారికే సొంతం. పరస్పర విమర్శలు తగదు. స్నేహం సౌభ్రాతృత్వాలను మనస్సున వుంచుకొని అందరూ భారతీయులమని భావించి కలసి మెలసి అన్నదమ్ములుగా అక్క చెల్లెళ్ళుగా ఏకతా భావనతో జీవితాన్ని గడపాలి. కుల మార్పులు, ప్రేమ పేరుతో వర్ణాంతర వివాహాలు మత మార్పులు తగదు. తప్పు. అందరినీ సృష్టించింది ఆ సర్వేశ్వరుడనే విశ్వాసం మనందరి హృదయాల్లో వుండాలి. ఐకమత్యంతో జీవితాన్ని సాగించాలి. ఎవరినీ ఏ విషయంలోనూ విమర్శించకూడదు. వ్యక్తిగత ద్వేషం, వ్యతిరేక చర్చ మహాపాపం.... పాతకం. ముఖ్యంగా అతివలను వేధించడం, వారికి బాధను కలిగించడం దానవత్వం. ఈ ప్రపంచంలో ఉండేవి రెండే జాతులు. ఆడ... మగ... ఒకరులేనిదే మరొకరు లేరు. బాలులారా!.... మీరు ప్రతి స్త్రీ మూర్తిని గౌరవించాలి.... ఆదరించాలి..... అభిమానించాలి. వారు ఆపదలో వుంటే చేయకలిగిన సాయం చేయాలి. అది మీ ధర్మం. మానవత్వం. బాలికలారా!.... మీ జీవితంలో మూడు ప్రధాన దశలు.
1. అమ్మి పాత్ర (మీ బాల్యం) పుట్టిన నాటినుంచి వివాహం అయ్యేంతవరకూ ఈ దశ. మీరు పుట్టిన ఇంట అమ్మా, నాన్న సోదరీ సోదరుల ప్రేమానురాగాలతో.... ఆనందంగా గడిచిపోతుంది.
2. వివాహం, పిల్లల అనంతరం పాత్ర అమ్మ: మీ సంతతి వలన మీకు ఆ హోదా (పేరు) లభిస్తుంది. మీ వూరు, ఇంటిపేరూ మారిపోతాయి. పుట్టింట అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, అమ్మా, నాన్నలు మీవారు. అత్తగారి ఇంట అత్తామామలు, బావమరుదులు, బావలు, మరదళ్ళు, వదినలు వుంటారు. మీరు మీ పుట్టింటి వారిని ఏ రీతిగా ప్రేమాభిమానాలతో చూచుకొంటారో, అదే రీతిగా అత్తవారింటి వారిని చూచుకోవాలి. వారి వలన మీరు కొన్ని విమర్శలకు గురి అయినా సహనంతో వారిని గౌరవించి అభిమానించాలి. మీ మంచితనంతో వారిని గెలవాలి. మీ బిడ్డలకు మంచి క్రమశిక్షణతో, వారికి మన దేశ పవిత్ర చరిత్రను మన గొప్ప నాయకుల ఆదర్శాలను, జీవిత విధానాన్ని, త్యాగాలను గురించి చెప్పి నేర్పి వారిని ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదే. అదేరీతిగా భర్తకు కార్యాషు దాసి కరణేసు మంత్రి, భోజ్యేషుమాత, శయనేసు రంభగా అంటే తల్లిగా, మంత్రిగా, (హితుడిగా) మాతగా, ప్రియురాలిగా మీ జీవితాంతం వర్తించాలి. వృద్ధాప్యంలో పరస్పర అవగాహనతో మంచి మిత్రులుగా ఒకరికొకరు సహాయం చేసుకొంటూ దైవచింతనతో జీవితాన్ని ప్రశాంతగా గడపాలి. అత్తామామలను అనాధ ఆశ్రమాల పాలు చేయకూడదు. వారి బిడ్డను వారికి దూరం చేయరాదు. మీరంతా నేడు విద్యార్థులు. బాగా చదివి ఉన్నతులు కావాలి. భావిజీవితంలో మీరు ఎవరెవరూ ఎటువంటి పదవులను, జీవిత విధానాలకు చేరుకుంటారో అది సర్వేశ్వరుల నిర్ణయం. అస్థికతను గౌరవించాలి. అభిమానించాలి. మనవారందరూ సిద్ధాంతాలను అంటే.... సత్యం, ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీ, ప్రేమ, సౌభ్రాతృత్వాలను పాటించారు. వీటన్నింటినీ ఈ వయస్సు నుండే అలవరచుకోవాలి. పాటించాలి.
3. అత్తగారి పాత్ర :- ఈ పాత్ర నిర్వహణ కోడలు ఇంటికి వచ్చాక స్త్రీ జీవితంలో ప్రారంభం అవుతుంది. మీకు కూతురు ఎంతో, మీ అబ్బాయిని వివాహం చేసుకొని అతన్ని నమ్మి తన కన్నవారిని సోదరసోదరీలందరికీ దూరమై మీ ఇంటికి వచ్చిన ఆడబిడ్డను మీ కన్న కూతురులా చూచుకోవాలి. ప్రేమించాలి.... అభిమానించాలి. కూతురికి ఒక న్యాయం, కోడలికి ఒక న్యాయం (వేరు వేరుగా) ఏ ధర్మశాస్త్రాలలోనూ లేదు. వచ్చిన కోడలు అమాయకురాలైతే తనలో తాను ఏడ్చుకుంటుంది. గడుసుదైతే మీ కుమారుడికి మీ గురించి (అత్తగారు) చిలవలు వలవలు చెప్పి, వేరు కాపురాన్ని పెట్టిస్తుంది. అలా పెట్టకలిగిన వ్యక్తి ధన్యుడు. కారణం తన తల్లితత్వం అతనికి చిన్న వయస్సు నుండీ తెలుసు కదా!. కోడలు రాగానే ఆమె తన చెల్లిని చూచేతీరు, భార్యను చూచే రీతిని గురించి, ఆలోచించి ఇటు తల్లికి చెప్పలేక, అటు భార్యను సమర్థించలేక, విడిగా వేరు కాపురం పెడితే రచ్చలు జరగవని ఇరువురి మధ్యన (అమ్మ, ఆలి) తాను నలిగిపోకుండా ప్రశాంతంగా బ్రతకాలనుకొంటాడు. వేరుకాపురం పెడతాను. పోతే అమాయకుడైనవాడు, తల్లిని అతిగా గౌరవించి అభిమానించేవాడు, భార్యకు నచ్చచెప్పలేనివాడు, ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని ఆలోచించకుండా, ఆఫ్ట్రాల్ ఆడమనిషి, నా భార్య కదా అని తన ఇల్లాలిని విమర్శించడం, తిట్టడం, ఇంకా ఆవేశం పెరిగితే కొట్టడం లాంటి చర్యలకు దిగజారిపోతే, ఆ యువతి (అతని భార్య) నేటి కాలంలో దాదాపు చదువు విషయంలో భార్యాభర్తలు సరిసమానం తానూ ఉద్యోగం చేసి సంపాదిస్తున్న కారణంగా ఆ భర్తమీద విసుగు, విరక్తి, ద్వేషం పెరిగి విడాకులకు సిద్ధం అవుతుంది. ఆడవారికి ఆడవారే శత్రువులు కాకూడదు. మంచి మిత్రులుగా శ్రేయోభిలాషులుగా కలిసిమెలసి ఉంటూ, కుటుంబాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుకోవాలి. ఈ అత్తపాత్ర చాలా క్లిష్టమైనది. కూతురిలా కోడలిని చూచుకోవాలన్న గొప్ప మనస్సు ఆ అత్తపాత్రకు అతి ముఖ్యం. అప్పుడే ఆ సంసారంలో అందరూ కలిసి ఆనందంగా జీవించగలరు." మేడంగారు చెప్పడం ఆపేశారు. చేతి వాచీని చూచారు.
"బాల బాలులారా!.... మీ అందరి భవిష్యత్తు బాగుండాలని, మీరు మీ సాటివారి మన్ననలను పొందాలని, మీ జీవన యాత్రను ఆనందమయంగా సాగించాలని ఇదంతా మీకు చెప్పాను. రేపు ఆదివారం శలవు. ఎల్లుండి సోమవారం నుండి ఫైనల్ పరీక్షలు.... బాగా చదవండి. పరీక్షలన్నింటినీ బాగా వ్రాయండి. మంచి మార్కులతో ఉత్తీర్ణులు కండీ. మీ అందరికీ నా శుభాశీస్సులు" నవ్వుతూ ముగించారు సుమలతా రావుగారు. లాంగ్ బెల్ గంట మ్రోగింది.
తెలుగు ప్రధాన పండితులు, ఉభయ భాషా ప్రవీణులు సుమలతారావుగారు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థుల గదినుండి బయటికి వచ్చి నడిచారు.
పిల్లలందరూ.... పుస్తకాలను సర్దుకొని క్లాస్ రూం నుండి బయటికి వారి వారి ఇండ్లకు బయలుదేరారు.
*
సమాప్తి
ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)