14-11-2025, 08:59 AM
అమ్మి.. అమ్మ.. అత్త!..
రచన: సిహెచ్. సీఎస్. రావు
తెలుగు ప్రధాన ఉపాధ్యాయురాలు సుమలత రావుగారు క్లాస్ గదిలో ప్రవేశించారు. పిల్లలు నమస్కారాన్ని తెలిపారు. ఉపాధ్యాయురాలు చిరునవ్వుతో.... "ఈరోజు నేను మీకు మన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడిన గొప్ప చరిత్ర నాయకీమణులు చిత్తూరుకోట (రాజ్యం) మహారాణి పద్మావతి, ఓరుగల్లు (వరంగల్) మహారాణి రుద్రమదేవి గురించి చెబుతాను శ్రద్ధగా వినండి. మన ఈ పరమపవిత్ర భారతదేశానికి ప్రపంచ చరిత్రలో గొప్ప విశిష్టత ఉంది. కారణం మన పూర్వీకులు ఆడవారిని తమతో సమానంగా భావించేవారు.... గౌరవించేవారు.... అభిమానించేవారు.
ఆ కఠిక సత్యం ప్రకారం మన దేశ చరిత్రలో ప్రసిద్ధికెక్కిన వీర నారీమణులు.
1. మహారాణి పద్మావతి వీరికి మరో పేరు పద్మిని (1351-1400 CE) Common Era)
వీరి దేశభక్తి, వీరత్వం, త్యాగం, జీవిత బలిదానం అసమానం.... అద్వితీయం. ఆమె సింహాళ (శ్రీలంక) రాజ్యపు యువరాణి. అపురూపమై అద్వితీయమైన అందచందాలు ఆమెకు సొంతం. చిత్తూరు కోట రాజు రతన్సేన్ (మౌర్య వంశస్థులు) పద్మావతి అందాన్ని గురించి హీరామన్ (మాట్లాడే చిలుక) చెప్పగా విని, సాహసోపేతంగా అన్వేషణ సాగించి, పద్మావతిని కలిసికొని, తన వివరాలు ఆమెకు తెలియజేసి వారి తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకొని వారిని చిత్తూరు కోటకు తీసుకొని వచ్చాడు రతన్సేన్. ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తూరును ఆక్రమించి రతన్ సేన్ను బంధించి చెరసాలలో వుంచాడు. వారి రాజగురువు ’కుంభాల్నెరుదేవ్పాలు, పద్మావతిదేవి అందానికి ఆకర్షితుడై తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆమెను కోరాడు. అల్లాఉద్దీన్ షరతులను అంగీకరించిన రతన్సేన్ చిత్తూరుకు తిరిగి వచ్చాడు. పద్మావతి కుంభాల్నెరుదేవ్పాలు స్వభావాన్ని, కోరికను రతన్సేన్కు తెలియజేసింది. దేవ్పాలు, రతన్సేన్ ద్వంద్వ యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో ఇరువురూ మరణించారు. పద్మావతీ అందచందాలను గురించి విన్న అల్లావుద్దీన్ చిత్తూరు కోటను ముట్టడించారు. చిత్తూరు సైన్యం అతన్ని ఎదురించింది. అల్లా ఉద్దీన్ ఖిల్జీ సైన్యం ధాటికి చిత్తూరు సైన్యం తట్టుకోలేక ఓడిపోయింది. రాణి పద్మావతి తన అంతఃపుర సహచరులు (ఆడవారు) జౌహార్ (అగ్నిలో ప్రయోపవేశం) దీపాల జ్వాలల్లో స్వీయ ఆత్మాహుతి చేసుకొని, అల్లాఉద్దీన్ ఖిల్జీని లక్ష్యాన్ని ఓడించి, తమ రాజ్య గౌరవాన్ని ఆ రీతిగా కాపాడుకొన్నారు ఆ మహారాణి పద్మినీదేవి. ఈ చేదు విచారకరమైన సంఘటన 1303లో జరిగినది.
2. రెండవ మహానాయకి మహారాణి రుద్రమదేవి :-
ప్రతి స్త్రీ మూర్తి (ఈ దేశాన) త్యాగానికి ప్రతిరూపం.... మహారాణి రుద్రమదేవి ఆంధ్ర అతివల పౌరుష సావాసాలకు దేశభక్తికి గొప్ప నిదర్శనం. కాకతీయ వంశంలో జన్మించి ఒక ధృవతారగా వెలిగిన మహారాణి రుద్రమదేవి. వీరి జననం శా.శ (శాలివాహన శకం) 1261 మార్చి 25. ఆమె తండ్రిగారు గణపతిదేవుడు. తల్లి సోమలదేవి. గణపతిదేవుడు రుద్రమదేవిని చిన్నతనం నుంచి మగబిడ్డను పెంచినట్లు పెంచి రాజ్య రక్షణకు కావలసిన అన్నిరంగాలలో సద్గురువులు చెంత శిక్షణను కల్పించారు. వారికి పుత్ర సంతానం లేని కారణంగా వారు ఆమెను రుద్ర దేవుడని (నామకరణం చేసి) పిలిచేవారు. యుక్త వయస్సులో రాజ్యపాలనా విషయంలో రాణి రుద్రమదేవి తండ్రికి మంచి మంచి సలహాలను ఇచ్చేది. ఆమె వివాహాన్ని నిరవద్యపుర (నిడదవోలు) ప్రాంతాన్ని పాలిస్తున్న తూర్పు చాళుక్యుడైన వీరభద్రుడికి ఇచ్చి వివాహాన్ని జరిపించారు గణపతిదేవుడు. రుద్రమదేవికి ఇరువురు కుమార్తెలు. పెద్దకుమార్తె పేరు ముమ్మడమ్మ. ఈమె భర్తపేరు మహాదేవుడు వారి పుత్రుడే ప్రతాపరుద్రుడు. రుద్రమాంబ (దేవి) ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. రుద్రమ దేవి రెండవ కుమార్తె రుయ్యమ్మ. కాకతీయ రాజులలో అగ్రగణ్యుడైన గణపతి దేవుని తర్వాత 1269లో రుద్రమదేవి రుద్ర మహారాజు బిరుదంగా కాకతీయ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించింది.
కానీ.... ఓర్వలేని సామంతులు ఒక మహిళ పాలకురాలు కావడాన్ని సహించలేక తిరుగుబాటు చేశారు. అదే సమయంలో నెల్లూరు పాండ్యులు క్రిందికి, వేంగి ప్రాంతం గొంకరాజు మొదటి నరసింహుడు క్రిందికి వెళ్ళినాయి. పాకసాటి కాయస్థ అంబదేవుడు, కళింగ నరశింహుని కుమారుడు వీరభానుడు తిరుగుబాట్లు చేశారు. రుద్రమ తన సేనలతో కలసికట్లుగా ఆ తిరుగుబాట్లనన్నింటినీ విజయవంతంగా అణచివేసింది. రుద్రమాంబ ఎదుర్కొన్న దండయాత్రలన్నింటిలో దేవగిరి యాదవరాజుల దండయాత్ర అతి పెద్దది. కీలకమైనది. యాదవరాజు మహాదేవుడు ఓరుగల్లును ముట్టడించాడు. రుద్రమదేవి యాదవులను ఓడించి, దేవగిరి దుర్గం వరకు తరిమికొట్టింది. వేరేదారి లేక యాదవరాజు మహాదేవుడు సంధికి వచ్చి, యుద్ధనష్ట పరిహారంగా మూడుకోట్ల సువర్ణాలను రుద్రమదేవికి చెల్లించాడు. రుద్రమదేవి తాను స్వయంగా కాయస్త రాజ్యంపై దాడి చేసింది. కాయస్త రాజు అంబదేవునితో జరిగిన యుద్ధంలో రుద్రమదేవి మరణించింది. రుద్రమదేవికి గల ఇతర బిరుదు రాయగజకేసరి. 1289 లో మహారాణి రుద్రమదేవి రణరంగంలో వీరమరణం పొందారని నల్లగొండ జిల్లా చందుపట్ల శాసనంలో ఆ వీరవనిత నిర్యాణాన్ని గురించి వివరించబడింది. అతివలు అబలలు కారు సబలలు అని నిరూపించిన మహావీర నాయకురాలు మహారాణి రుద్రమదేవి. వీరి జీవితకాలం 1261 నుండి 1289 వరకు. మన తెలుగు వారి ప్రాంతంలోకి అడుగును పెట్టనీయకుండా ''లతో పోరాడిన ధీరవనిత రాణి రుద్రమదేవి."
గంట మ్రోగింది. తెలుగు ప్రధాన ఉపాధ్యాయురాలు సుమలతారావు గారి పిరీయడ్ ముగిసింది. "రేపు కలుద్దాం" అని చిరునవ్వుతో చెప్పి క్లాస్ గది నుండి బయటికి నడిచారు.
మరుదినం విద్వాన్ ఉభయ భాషా ప్రవీణులు (తెలుగు సంస్కృతము) ప్రధాన ఉపాధ్యాయురాలు సుమలతా రావు గారు క్లాసు గదిలోనికి వచ్చారు. పిల్లలనందరినీ పరీక్షగా చూచారు.
"నిన్న మనం మన దేశానికి స్వాతంత్ర్యం లభించక ముందు మన సంస్కృతిని, మన సిద్ధాంతాలను గొప్పగా నమ్మి, మన ఆనాటి విరోధులపై వీరోచిత పోరాటాన్ని సాగించి వీరమరణం పొందిన, చిత్తూరు మహారాణి పద్మావతి దేవిని గురించి, మన ఆంధ్రభూమిన జన్మించిన వీరనారీమణి మహారాణి రుద్రమదేవిని గురించి చెప్పుకోవడం జరిగింది. ఈనాడు పందొమ్మిదవ శతాబ్దంలో మన పాలకులైన ఆంగ్లేయులను నిరసిస్తూ, వారితో స్వతంత్ర్యం కోసం పోరాటం చేసి అమరులైన వీరనారీమణులు, కమలాదాస్ గుప్త, కల్పనాదత్, ప్రీతీలతలను గురించి మీకు వివరిస్తాను.
3. కమలాదాస్ గుప్త : (జననం 11మార్చి 1907 - నిర్యాణం 19 జూలై 200) (జీవితకాలం 93 సంవత్సరాలు)
భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయులను ఎదిరించి పోరాడిన వీరవనిత. ఆంగ్లేయులపై ఐదుసార్లు తుపాకిని ప్రేల్చింది. ఐదుసార్లు గురి తప్పింది. తొమ్మిది సంవత్సరాలు కఠిన కారాగార శిక్షను అనుభవించింది. జైలునుండి విడుదలైన తర్వాత 1939లో దాస్ కాంగ్రెస్ పార్టీలో (బెంగాల్) చేరింది. 1942 నుండి 1945 వరకూ మరలా జైలు శిక్ష అనుభవించింది. ఆంగ్లేయులను ఎదిరించడమే జీవిత ఆశయంగా వారితో పోరాడిన వీరనారీమణి. అంతేకాకుండా వారు గొప్ప కవయిత్రి. కథలు, పాటలు (కవితలు) ఎన్నో వ్రాశారు. ఎన్నో అవార్డులు సాధించారు. వీరిని 1984లో నోబుల్ ప్రైజుకు మన ప్రభుత్వం ఎంపిక చేసింది.
4. కల్పనాదత్ :- వీరి జననం 27 జూలై 1913 నిర్యాణం 8 ఫిబ్రవరి 1995 (జీవితకాలం 82 సంవత్సరాలు).
భారత స్వాతంత్ర్య ఉద్యమ కర్త సూర్యసేన్ నేతృత్వంలో సాయుధ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న వీరాంగన. భయం అన్నది ఆమెకు తెలియదు. తన దేశభక్తి పూరిత సంభాషణలతో ఎందరో ఆడవారిలో చైతన్యాన్ని కలిగించింది. తన జీవితాన్ని దేశ స్వాతంత్ర్యం కోసం అంకితం చేసిన మహాత్యాగి. స్వాతంత్ర్యం సిద్ధించేవరకూ నిరంతరం ప్రజల మధ్యన వుంటూ వారిని స్వాతంత్ర్యాభిలాషులుగా మార్చిన స్త్రీమూర్తి. మనకు స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత, వారికి మన గవర్నమెంటు 1979 జూన్ 6వతేదిన్ పూణెలో ’వీర మహిళ’ అవార్డును ఇచ్చి సత్కరించారు. దేశంలో జరిగిన స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వనితలలో వీరిది ప్రముఖ పాత్ర.
5. ప్రీతిలత :- జననం 5 వ తేది మే 1911 - నిర్యాణం 24వ తేది సెప్టెంబరు 1932 (21సంవత్సరాలు జీవితకాలం)
రచన: సిహెచ్. సీఎస్. రావు
తెలుగు ప్రధాన ఉపాధ్యాయురాలు సుమలత రావుగారు క్లాస్ గదిలో ప్రవేశించారు. పిల్లలు నమస్కారాన్ని తెలిపారు. ఉపాధ్యాయురాలు చిరునవ్వుతో.... "ఈరోజు నేను మీకు మన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడిన గొప్ప చరిత్ర నాయకీమణులు చిత్తూరుకోట (రాజ్యం) మహారాణి పద్మావతి, ఓరుగల్లు (వరంగల్) మహారాణి రుద్రమదేవి గురించి చెబుతాను శ్రద్ధగా వినండి. మన ఈ పరమపవిత్ర భారతదేశానికి ప్రపంచ చరిత్రలో గొప్ప విశిష్టత ఉంది. కారణం మన పూర్వీకులు ఆడవారిని తమతో సమానంగా భావించేవారు.... గౌరవించేవారు.... అభిమానించేవారు.
ఆ కఠిక సత్యం ప్రకారం మన దేశ చరిత్రలో ప్రసిద్ధికెక్కిన వీర నారీమణులు.
1. మహారాణి పద్మావతి వీరికి మరో పేరు పద్మిని (1351-1400 CE) Common Era)
వీరి దేశభక్తి, వీరత్వం, త్యాగం, జీవిత బలిదానం అసమానం.... అద్వితీయం. ఆమె సింహాళ (శ్రీలంక) రాజ్యపు యువరాణి. అపురూపమై అద్వితీయమైన అందచందాలు ఆమెకు సొంతం. చిత్తూరు కోట రాజు రతన్సేన్ (మౌర్య వంశస్థులు) పద్మావతి అందాన్ని గురించి హీరామన్ (మాట్లాడే చిలుక) చెప్పగా విని, సాహసోపేతంగా అన్వేషణ సాగించి, పద్మావతిని కలిసికొని, తన వివరాలు ఆమెకు తెలియజేసి వారి తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకొని వారిని చిత్తూరు కోటకు తీసుకొని వచ్చాడు రతన్సేన్. ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తూరును ఆక్రమించి రతన్ సేన్ను బంధించి చెరసాలలో వుంచాడు. వారి రాజగురువు ’కుంభాల్నెరుదేవ్పాలు, పద్మావతిదేవి అందానికి ఆకర్షితుడై తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆమెను కోరాడు. అల్లాఉద్దీన్ షరతులను అంగీకరించిన రతన్సేన్ చిత్తూరుకు తిరిగి వచ్చాడు. పద్మావతి కుంభాల్నెరుదేవ్పాలు స్వభావాన్ని, కోరికను రతన్సేన్కు తెలియజేసింది. దేవ్పాలు, రతన్సేన్ ద్వంద్వ యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో ఇరువురూ మరణించారు. పద్మావతీ అందచందాలను గురించి విన్న అల్లావుద్దీన్ చిత్తూరు కోటను ముట్టడించారు. చిత్తూరు సైన్యం అతన్ని ఎదురించింది. అల్లా ఉద్దీన్ ఖిల్జీ సైన్యం ధాటికి చిత్తూరు సైన్యం తట్టుకోలేక ఓడిపోయింది. రాణి పద్మావతి తన అంతఃపుర సహచరులు (ఆడవారు) జౌహార్ (అగ్నిలో ప్రయోపవేశం) దీపాల జ్వాలల్లో స్వీయ ఆత్మాహుతి చేసుకొని, అల్లాఉద్దీన్ ఖిల్జీని లక్ష్యాన్ని ఓడించి, తమ రాజ్య గౌరవాన్ని ఆ రీతిగా కాపాడుకొన్నారు ఆ మహారాణి పద్మినీదేవి. ఈ చేదు విచారకరమైన సంఘటన 1303లో జరిగినది.
2. రెండవ మహానాయకి మహారాణి రుద్రమదేవి :-
ప్రతి స్త్రీ మూర్తి (ఈ దేశాన) త్యాగానికి ప్రతిరూపం.... మహారాణి రుద్రమదేవి ఆంధ్ర అతివల పౌరుష సావాసాలకు దేశభక్తికి గొప్ప నిదర్శనం. కాకతీయ వంశంలో జన్మించి ఒక ధృవతారగా వెలిగిన మహారాణి రుద్రమదేవి. వీరి జననం శా.శ (శాలివాహన శకం) 1261 మార్చి 25. ఆమె తండ్రిగారు గణపతిదేవుడు. తల్లి సోమలదేవి. గణపతిదేవుడు రుద్రమదేవిని చిన్నతనం నుంచి మగబిడ్డను పెంచినట్లు పెంచి రాజ్య రక్షణకు కావలసిన అన్నిరంగాలలో సద్గురువులు చెంత శిక్షణను కల్పించారు. వారికి పుత్ర సంతానం లేని కారణంగా వారు ఆమెను రుద్ర దేవుడని (నామకరణం చేసి) పిలిచేవారు. యుక్త వయస్సులో రాజ్యపాలనా విషయంలో రాణి రుద్రమదేవి తండ్రికి మంచి మంచి సలహాలను ఇచ్చేది. ఆమె వివాహాన్ని నిరవద్యపుర (నిడదవోలు) ప్రాంతాన్ని పాలిస్తున్న తూర్పు చాళుక్యుడైన వీరభద్రుడికి ఇచ్చి వివాహాన్ని జరిపించారు గణపతిదేవుడు. రుద్రమదేవికి ఇరువురు కుమార్తెలు. పెద్దకుమార్తె పేరు ముమ్మడమ్మ. ఈమె భర్తపేరు మహాదేవుడు వారి పుత్రుడే ప్రతాపరుద్రుడు. రుద్రమాంబ (దేవి) ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. రుద్రమ దేవి రెండవ కుమార్తె రుయ్యమ్మ. కాకతీయ రాజులలో అగ్రగణ్యుడైన గణపతి దేవుని తర్వాత 1269లో రుద్రమదేవి రుద్ర మహారాజు బిరుదంగా కాకతీయ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించింది.
కానీ.... ఓర్వలేని సామంతులు ఒక మహిళ పాలకురాలు కావడాన్ని సహించలేక తిరుగుబాటు చేశారు. అదే సమయంలో నెల్లూరు పాండ్యులు క్రిందికి, వేంగి ప్రాంతం గొంకరాజు మొదటి నరసింహుడు క్రిందికి వెళ్ళినాయి. పాకసాటి కాయస్థ అంబదేవుడు, కళింగ నరశింహుని కుమారుడు వీరభానుడు తిరుగుబాట్లు చేశారు. రుద్రమ తన సేనలతో కలసికట్లుగా ఆ తిరుగుబాట్లనన్నింటినీ విజయవంతంగా అణచివేసింది. రుద్రమాంబ ఎదుర్కొన్న దండయాత్రలన్నింటిలో దేవగిరి యాదవరాజుల దండయాత్ర అతి పెద్దది. కీలకమైనది. యాదవరాజు మహాదేవుడు ఓరుగల్లును ముట్టడించాడు. రుద్రమదేవి యాదవులను ఓడించి, దేవగిరి దుర్గం వరకు తరిమికొట్టింది. వేరేదారి లేక యాదవరాజు మహాదేవుడు సంధికి వచ్చి, యుద్ధనష్ట పరిహారంగా మూడుకోట్ల సువర్ణాలను రుద్రమదేవికి చెల్లించాడు. రుద్రమదేవి తాను స్వయంగా కాయస్త రాజ్యంపై దాడి చేసింది. కాయస్త రాజు అంబదేవునితో జరిగిన యుద్ధంలో రుద్రమదేవి మరణించింది. రుద్రమదేవికి గల ఇతర బిరుదు రాయగజకేసరి. 1289 లో మహారాణి రుద్రమదేవి రణరంగంలో వీరమరణం పొందారని నల్లగొండ జిల్లా చందుపట్ల శాసనంలో ఆ వీరవనిత నిర్యాణాన్ని గురించి వివరించబడింది. అతివలు అబలలు కారు సబలలు అని నిరూపించిన మహావీర నాయకురాలు మహారాణి రుద్రమదేవి. వీరి జీవితకాలం 1261 నుండి 1289 వరకు. మన తెలుగు వారి ప్రాంతంలోకి అడుగును పెట్టనీయకుండా ''లతో పోరాడిన ధీరవనిత రాణి రుద్రమదేవి."
గంట మ్రోగింది. తెలుగు ప్రధాన ఉపాధ్యాయురాలు సుమలతారావు గారి పిరీయడ్ ముగిసింది. "రేపు కలుద్దాం" అని చిరునవ్వుతో చెప్పి క్లాస్ గది నుండి బయటికి నడిచారు.
మరుదినం విద్వాన్ ఉభయ భాషా ప్రవీణులు (తెలుగు సంస్కృతము) ప్రధాన ఉపాధ్యాయురాలు సుమలతా రావు గారు క్లాసు గదిలోనికి వచ్చారు. పిల్లలనందరినీ పరీక్షగా చూచారు.
"నిన్న మనం మన దేశానికి స్వాతంత్ర్యం లభించక ముందు మన సంస్కృతిని, మన సిద్ధాంతాలను గొప్పగా నమ్మి, మన ఆనాటి విరోధులపై వీరోచిత పోరాటాన్ని సాగించి వీరమరణం పొందిన, చిత్తూరు మహారాణి పద్మావతి దేవిని గురించి, మన ఆంధ్రభూమిన జన్మించిన వీరనారీమణి మహారాణి రుద్రమదేవిని గురించి చెప్పుకోవడం జరిగింది. ఈనాడు పందొమ్మిదవ శతాబ్దంలో మన పాలకులైన ఆంగ్లేయులను నిరసిస్తూ, వారితో స్వతంత్ర్యం కోసం పోరాటం చేసి అమరులైన వీరనారీమణులు, కమలాదాస్ గుప్త, కల్పనాదత్, ప్రీతీలతలను గురించి మీకు వివరిస్తాను.
3. కమలాదాస్ గుప్త : (జననం 11మార్చి 1907 - నిర్యాణం 19 జూలై 200) (జీవితకాలం 93 సంవత్సరాలు)
భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయులను ఎదిరించి పోరాడిన వీరవనిత. ఆంగ్లేయులపై ఐదుసార్లు తుపాకిని ప్రేల్చింది. ఐదుసార్లు గురి తప్పింది. తొమ్మిది సంవత్సరాలు కఠిన కారాగార శిక్షను అనుభవించింది. జైలునుండి విడుదలైన తర్వాత 1939లో దాస్ కాంగ్రెస్ పార్టీలో (బెంగాల్) చేరింది. 1942 నుండి 1945 వరకూ మరలా జైలు శిక్ష అనుభవించింది. ఆంగ్లేయులను ఎదిరించడమే జీవిత ఆశయంగా వారితో పోరాడిన వీరనారీమణి. అంతేకాకుండా వారు గొప్ప కవయిత్రి. కథలు, పాటలు (కవితలు) ఎన్నో వ్రాశారు. ఎన్నో అవార్డులు సాధించారు. వీరిని 1984లో నోబుల్ ప్రైజుకు మన ప్రభుత్వం ఎంపిక చేసింది.
4. కల్పనాదత్ :- వీరి జననం 27 జూలై 1913 నిర్యాణం 8 ఫిబ్రవరి 1995 (జీవితకాలం 82 సంవత్సరాలు).
భారత స్వాతంత్ర్య ఉద్యమ కర్త సూర్యసేన్ నేతృత్వంలో సాయుధ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న వీరాంగన. భయం అన్నది ఆమెకు తెలియదు. తన దేశభక్తి పూరిత సంభాషణలతో ఎందరో ఆడవారిలో చైతన్యాన్ని కలిగించింది. తన జీవితాన్ని దేశ స్వాతంత్ర్యం కోసం అంకితం చేసిన మహాత్యాగి. స్వాతంత్ర్యం సిద్ధించేవరకూ నిరంతరం ప్రజల మధ్యన వుంటూ వారిని స్వాతంత్ర్యాభిలాషులుగా మార్చిన స్త్రీమూర్తి. మనకు స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత, వారికి మన గవర్నమెంటు 1979 జూన్ 6వతేదిన్ పూణెలో ’వీర మహిళ’ అవార్డును ఇచ్చి సత్కరించారు. దేశంలో జరిగిన స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వనితలలో వీరిది ప్రముఖ పాత్ర.
5. ప్రీతిలత :- జననం 5 వ తేది మే 1911 - నిర్యాణం 24వ తేది సెప్టెంబరు 1932 (21సంవత్సరాలు జీవితకాలం)
ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)