13-11-2025, 01:59 PM
"రేపు ఉదయమే వెళ్ళొచ్చుగా!"
"స్వామి! ఎల్లుండే నా కూతురి వివాహం! రేపు వియ్యలవారు అడిగిన ధనం ఇవ్వాలి లేదంటే పెళ్లి ఆగిపోతుందని ఏడుస్తున్నాను!" అన్నాడు వ్యాపారి బాధగా
అతని పరిస్థితి చూసిన ఆ సాధువుకు జాలి కలిగింది. వెంటనే తన వద్ద ఉన్న ఒక చిన్న కాగితం ముక్క తీసుకుని, ఏదో రాసి, మొత్తం మడిచిపెట్టి ఆ వ్యాపారి చేతికి ఇచ్చి, ఇలా చెప్పాడు..
"ఇది చేతిలో పెట్టుకుని నదిపైన అడుగులు వేస్తూ నడుచుకుంటూ గబగబా ఆవలి ఒడ్డుకి వెళ్ళు! ఎటూ చూడకుండా వేగంగా వెళ్లు! నువ్వు క్షేమంగా ఆవలి ఒడ్డుకు చేరుకుంటావు" అని చెప్పాడు సాధువు
ఆయన మడిచి ఇచ్చిన ఆ కాగితం పిడికిట పట్టుకుని 'జై గురుదేవా!' అంటూ సాధువును తలచుకుంటూ నది పైన నడుచుకుంటూ టకటకా ఎక్కడా ఆగకుండా వెళ్లిపోతున్నాడు ఆ వ్యాపారి.
చివరికి ఆఖరు పడవను కూడా దాటేసి, వెళ్ళసాగాడు. ఇక మరో రెండు అంగల్లో ఒడ్డుకు చేరుకునేవాడు. అతడిలో సంతోషం, కుతూహలం కూడా పెరిగిపోయింది.
"నది పైన నడిచే అంతటి శక్తి ఇచ్చిన ఈ కాగితంలో ఏముందో! ఓసారి చూద్దాం!" అని అనుకుని కుతూహలంతో ఆ కాగితం తెరిచి చూస్తాడు.
అందులో "శ్రీరామ" అని తారకమంత్రం రాసి ఉంది.
"ఓస్! ఇంతేనా! పేరు రాసి ఉందా? ఇంకేముందో అనుకున్నా! ఎంత గొప్ప మంత్రం ఉందేమో అనుకున్నా!" అని పగలబడి నవ్వాడు
ఆ వెంటనే నీళ్ళల్లో బుడుంగుమని మునిగాడు.
నదీ ప్రవాహంలో కొట్టుకుంటూ బుద్దివచ్చి, అజ్ఞానాన్ని క్షమించమని సిద్ధుని తలుచుకోగానే ఆ నామమే చెబుతూ ఉండు ఒడ్డుకు క్షేమంగా చేరతావు అని వినబడింది.
ఇక ఎంతో ఉత్సాహంగా రామ నామం చెబుతుంటే, నీటి ప్రవాహంలో పెద్ద అల వచ్చి ఆ వ్యాపారిని ఒడ్డుకు నెట్టి వేసింది. బ్రతుకు జీవుడా అనుకుని తప్పుగా మాట్లాడినందుకు చెంపలు వాయించుకుని ఇంటి ముఖం పట్టాడు.
దీనిలో నీతి చెప్పండి పిల్లలూ! అంది అమ్మమ్మ.
మేము ఆలోచిస్తుంటే తనే చెప్పింది.
"ప్రతి మనిషి పెద్దవాళ్ళు చెప్పినప్పుడు చేసే ఏ పని అయినా త్రికరణ శుద్ధిగా చేయాలి. అనుమానంతో చేస్తే ఆ పని చెడిపోతుంది"
"అయితే అమ్మమ్మా! ఆ వ్యాపారి నదిని దాటి ఒడ్డుకు వచ్చాక, ఆ కాగితం విప్పి చూస్తే ఏమీ అయ్యేది కాదు కదా!" అంది మా చిన్న చెల్లి.
"పని అయిపోయాక హేళనగా మాట్లాడినా కూడా అది ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఎప్పుడు కూడా ఎవ్వరినీ హేళనగా మాట్లాడరాదు! భగవంతుడి నామం మంత్రం. నామాన్ని హేళనగా మాట్లాడితే, దైవనింద చేసినట్లే! అందుకని ఎప్పుడూ వినయంతో ఉండాలి" అని చెప్పింది
బుద్ధిగా తల ఊపి,
" ఇక నిద్ర వస్తోంది. పడుకుందాం!" అంది తను
"అలాగే! కానీ మళ్ళీ నేను చెప్పింది చదివి పడుకోండి!" అంది.
అమ్మమ్మ ఇలా చిన్నికృష్ణుడి పైన పాట చెప్పింది.
నందగోప కుమార నవనీత చోరా!
రుక్మిణీ సత్యభామకు మనోహారా!
ముత్యాల హారాలు కదులంగ లేరా!
ముద్దు ఇచ్చి పోర మోహనాకారా!
జో.. జో... జో.. II 2II
నిన్నరాత్రి వేళ మా ఇంటికొచ్చి నిలువుటద్దం తెచ్చి ఇచ్చినాడూ,
నీలాల బావిని తెచ్చిచ్చినాడు
నీడ చూతము రారే అని పిలిచినాడూ..
II నందగోప II జో..జో
పిల్లనగ్రోవొక్కటి తెచ్చిచ్చినాడూ,
పిలువవే గోపెమ్మ ప్రేమతో హరినీ
జో... జో... జో
II నందగోప కుమార II
చెబుతూనే నిద్రపోయాం.
మరి మీరూ...
"స్వామి! ఎల్లుండే నా కూతురి వివాహం! రేపు వియ్యలవారు అడిగిన ధనం ఇవ్వాలి లేదంటే పెళ్లి ఆగిపోతుందని ఏడుస్తున్నాను!" అన్నాడు వ్యాపారి బాధగా
అతని పరిస్థితి చూసిన ఆ సాధువుకు జాలి కలిగింది. వెంటనే తన వద్ద ఉన్న ఒక చిన్న కాగితం ముక్క తీసుకుని, ఏదో రాసి, మొత్తం మడిచిపెట్టి ఆ వ్యాపారి చేతికి ఇచ్చి, ఇలా చెప్పాడు..
"ఇది చేతిలో పెట్టుకుని నదిపైన అడుగులు వేస్తూ నడుచుకుంటూ గబగబా ఆవలి ఒడ్డుకి వెళ్ళు! ఎటూ చూడకుండా వేగంగా వెళ్లు! నువ్వు క్షేమంగా ఆవలి ఒడ్డుకు చేరుకుంటావు" అని చెప్పాడు సాధువు
ఆయన మడిచి ఇచ్చిన ఆ కాగితం పిడికిట పట్టుకుని 'జై గురుదేవా!' అంటూ సాధువును తలచుకుంటూ నది పైన నడుచుకుంటూ టకటకా ఎక్కడా ఆగకుండా వెళ్లిపోతున్నాడు ఆ వ్యాపారి.
చివరికి ఆఖరు పడవను కూడా దాటేసి, వెళ్ళసాగాడు. ఇక మరో రెండు అంగల్లో ఒడ్డుకు చేరుకునేవాడు. అతడిలో సంతోషం, కుతూహలం కూడా పెరిగిపోయింది.
"నది పైన నడిచే అంతటి శక్తి ఇచ్చిన ఈ కాగితంలో ఏముందో! ఓసారి చూద్దాం!" అని అనుకుని కుతూహలంతో ఆ కాగితం తెరిచి చూస్తాడు.
అందులో "శ్రీరామ" అని తారకమంత్రం రాసి ఉంది.
"ఓస్! ఇంతేనా! పేరు రాసి ఉందా? ఇంకేముందో అనుకున్నా! ఎంత గొప్ప మంత్రం ఉందేమో అనుకున్నా!" అని పగలబడి నవ్వాడు
ఆ వెంటనే నీళ్ళల్లో బుడుంగుమని మునిగాడు.
నదీ ప్రవాహంలో కొట్టుకుంటూ బుద్దివచ్చి, అజ్ఞానాన్ని క్షమించమని సిద్ధుని తలుచుకోగానే ఆ నామమే చెబుతూ ఉండు ఒడ్డుకు క్షేమంగా చేరతావు అని వినబడింది.
ఇక ఎంతో ఉత్సాహంగా రామ నామం చెబుతుంటే, నీటి ప్రవాహంలో పెద్ద అల వచ్చి ఆ వ్యాపారిని ఒడ్డుకు నెట్టి వేసింది. బ్రతుకు జీవుడా అనుకుని తప్పుగా మాట్లాడినందుకు చెంపలు వాయించుకుని ఇంటి ముఖం పట్టాడు.
దీనిలో నీతి చెప్పండి పిల్లలూ! అంది అమ్మమ్మ.
మేము ఆలోచిస్తుంటే తనే చెప్పింది.
"ప్రతి మనిషి పెద్దవాళ్ళు చెప్పినప్పుడు చేసే ఏ పని అయినా త్రికరణ శుద్ధిగా చేయాలి. అనుమానంతో చేస్తే ఆ పని చెడిపోతుంది"
"అయితే అమ్మమ్మా! ఆ వ్యాపారి నదిని దాటి ఒడ్డుకు వచ్చాక, ఆ కాగితం విప్పి చూస్తే ఏమీ అయ్యేది కాదు కదా!" అంది మా చిన్న చెల్లి.
"పని అయిపోయాక హేళనగా మాట్లాడినా కూడా అది ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఎప్పుడు కూడా ఎవ్వరినీ హేళనగా మాట్లాడరాదు! భగవంతుడి నామం మంత్రం. నామాన్ని హేళనగా మాట్లాడితే, దైవనింద చేసినట్లే! అందుకని ఎప్పుడూ వినయంతో ఉండాలి" అని చెప్పింది
బుద్ధిగా తల ఊపి,
" ఇక నిద్ర వస్తోంది. పడుకుందాం!" అంది తను
"అలాగే! కానీ మళ్ళీ నేను చెప్పింది చదివి పడుకోండి!" అంది.
అమ్మమ్మ ఇలా చిన్నికృష్ణుడి పైన పాట చెప్పింది.
నందగోప కుమార నవనీత చోరా!
రుక్మిణీ సత్యభామకు మనోహారా!
ముత్యాల హారాలు కదులంగ లేరా!
ముద్దు ఇచ్చి పోర మోహనాకారా!
జో.. జో... జో.. II 2II
నిన్నరాత్రి వేళ మా ఇంటికొచ్చి నిలువుటద్దం తెచ్చి ఇచ్చినాడూ,
నీలాల బావిని తెచ్చిచ్చినాడు
నీడ చూతము రారే అని పిలిచినాడూ..
II నందగోప II జో..జో
పిల్లనగ్రోవొక్కటి తెచ్చిచ్చినాడూ,
పిలువవే గోపెమ్మ ప్రేమతో హరినీ
జో... జో... జో
II నందగోప కుమార II
చెబుతూనే నిద్రపోయాం.
మరి మీరూ...
ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)