21-10-2025, 01:51 PM
బంధువులు, హితులు రఘునందన్తో.... ’పిల్లలు చిన్నవారు కదా పెంచి పెద్ద చేయాలి కదా, అందునా ఆడపిల్లలు తల్లి అవసరం వారికి ఎంతైనా ఉంటుంది. నీవు మరో పెండ్లి చేసుకో!" అన్నారు. బలవంతం చేశారు. బ్రతిమిలాడారు.
కానీ.... రఘునందన వారి మాటలను వినిపించుకోలేదు. ఆ పిల్లలను సవతి తల్లి సరిగ్గా చూడదని అతని భయం. ఆ కారణం మరో వివాహాన్ని అతను చేసుకోలేదు. తల్లీ, తండ్రి తానే అయ్యి వారిని పెంచి పెద్ద చేశాడు రఘునంద.
జానకి బ్రతికి వుండగ పుట్టిన కవల పిల్లల వయస్సు పన్నెండు సంవత్సరాలు, లక్ష్మి వయస్సు పదునెనిమిది సంవత్సరాల ప్రాయంలో, ఆ దంపతులు తమ మేనల్లుడు రామ్లాల్తో లక్ష్మి వివాహాన్ని జరిపించారు. అది ఆ ఇంట్లో జరిగిన గొప్ప శుభకార్యం.
ప్రస్తుతంలో అహల్యా సుమతీల వయస్సు పదహారు సంవత్సరాలు. వారు ప్లస్ టు చదువుతున్నారు.
*
ప్రతి సంవత్సరం తాను జరిపించే శ్రీరామనవమి ఉత్సవానికి రఘునందన్ తన అల్లుడు రామ్లాల్, కూతురు లక్ష్మి, మనుమరాలు పావని ఆహ్వానించారు. అప్పటికి వారు ఆ వూరికి వచ్చి ఒక సంవత్సరం గడిచింది.
ఇంటికి వచ్చిన బావ అక్కలను అహల్య, సుమతిలు ఎంతో ఆదరంగా ఆహ్వానించారు. చిన్నారి పావనిని ఎత్తుకొని ముద్దులాడారు.
పావని అహల్య చేతుల నుండి క్రిందికి జారింది. ఆమె కళ్ళల్లో కన్నీరు. అహల్యా, సుమతిలు భయపడ్డారు. పావనీ ఏడుపుకు కారణం తెలియనివారు ఆశ్చర్యపోయారు. తమ అక్క లక్ష్మిని పిలిచారు. లక్ష్మి వారిని సమీపించింది.
పావని.... వేగంగా ఆ ఇంటిని, వెనుక పెరటి భాగాన్ని కన్నీటితో వేగంగా తిరిగింది. పొంగి వచ్చిన ఏడుపుతో బోరున ఏడుస్తూ వుంది పావని.
అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగింది. బిడ్డకు ఏమైందనే ఆవేదన....
పావనీ!... రఘునందనను సమీపించింది ఏడుస్తూ....
"ఏమయ్యా!... నన్ను మరిచిపోయావా! ఎలా వున్నావు? నేను... నేను... నీ జానకినీ.... నీ జానకినీ...."
రఘునందన చేతులు పట్టుకొని భోరున ఏడ్చింది పావని.
అందరి పరిస్థితి అయోమయం....
"జానకి.... జానకి..." రఘునందన పెదాలు అప్రయత్నంగా పలికాయి.
పావనీ, అహల్యా సుమతీలను సమీపించింది. వారి చేతులను తన చేతుల్లోకి తీసుకొంది.
"ఏమ్మా!....అహల్యా, సుమతీ ఎలా వున్నార్రా!..... మీ నాన్న మిమ్మల్ని బాగా చూసుకొంటున్నాడా!" దీనంగా కన్నీటితో అడిగింది.
అహల్యా, సుమతీలకు అయోమయ పరిస్థితి..... వారి నయనాల్లో కన్నీరు. అప్పటికి పెద్దవారైన రఘునందన్కు, రామ్లాల్ లక్ష్మీలకూ విషయం అర్థం అయ్యింది.
’ఈ పావని ఎవరో కాదు!.... ఎవరో కాదు!..... చనిపోయిన నా భార్య లక్ష్మి....’ అనుకొన్నాడు రఘునందన్.
"నా కూతురు పావని ఎవరో కాదు నా లక్ష్మి తల్లి.... మా అత్తయ్యా!’ అనుకొన్నాడు రామ్లాల్.
"నా కూతురు పావని నాకు జన్మనిచ్చిన తల్లి...’ అనుకొంది లక్ష్మి.
రఘునందన వేగంగా ఇంటినుండి బయటికి నడిచాడు. తన ప్రక్క ఇంట్లో వున్న డాక్టర్ లక్ష్మణ్ జీకి విషయాన్ని చెప్పాడు. లక్ష్మణ్జీ ఆశ్చర్యపోయాడు.
తన మందుల సంచిని చేతికి తీసుకొని....
"పదండి. నేను పాపను చూస్తాను" అన్నాడు అయోమయ స్థితిలో.
ఇరువురూ రఘునందన ఇంట్లోకి వచ్చారు.
పావనీ తన ఇరువురు కూతుళ్ళను ఏం చదువుతున్నారని అడిగింది.
"అమ్మా!....అమ్మా!.... మీరువురువూ బాగా చదువుకోవాలి. పెద్ద చదువులు చదవాలి. గొప్పవారు కావాలి. మీ నాన్నను బాగా చూసుకోవాలి" దీనంగా కన్నీటితో చెప్పింది.
ఇంట్లోకి వచ్చిన డాక్టర్ లక్ష్మణ్ జీ ఆ మాటలను విన్నాడు ఆశ్చర్యపోయాడు.
అతన్ని చూచిన (పావని) లక్ష్మి!.....
"ప్యారా భయ్యా! లక్ష్మణ్ జీ ఆప్ కైసే హో.... పత్నీ బచ్చే సభీ కుశల్ మంగళ్ హోనా!"
చిరునవ్వుతో అడిగింది పావని.
లక్ష్మణ్జీకి విషయం అర్థం అయ్యింది.
"పూర్వజన్మ జ్ఞాపకాలు" అతని పెదవులు అప్రయత్నంగా పలికాయి.
"డాక్టర్ సాబ్! నా బిడ్డ!...." ఆ తరువాత మాట్లాడలేకపోయాడు రామ్లాల్ ఆవేదనతో....
"లక్ష్మణ్ మామా! మేర బేటీ.... మేర బేటీ....! బొంగురు పోయిన కంఠంతో కన్నీటితో ఆ తరువాత ఏమీ చెప్పలేకపోయింది లక్ష్మి.
అహల్యా, సుమతీలు కన్నీటితో ఆశ్చర్యంగా చూస్తున్నారు.
లక్ష్మణ్ జీ కొన్ని క్షణాలు ఆలోచించాడు.
పావనిని సమీపించాడు.
"దీదీజీ అప్ తోడ్ సమై ఆరాంకీజియే!..." ఎత్తుకొని మంచాన్ని సమీపించాడు. పడుకోబెట్టాడు. లక్ష్మికి సైగచేసి పాప చేతులను పట్టుకొమ్మని సూచించారు డాక్టర్ లక్ష్మణ్ జీ.
లక్ష్మి పాప తలవైపున విచారంగా కూర్చుంది. మెల్లగా ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకొంది.
డాక్టర్ లక్ష్మణ్ జీ పావనికి ఇంజక్షన్ చేశాడు.
"అమ్మా!....." అరిచింది పావని.
అందరూ బెదిరిపోయి పావని ముఖంలోనికి చూచారు. లక్ష్మి పావనిని తన హృదయానికి గట్టిగా హత్తుకొంది.
పావనీ కళ్ళు మూసింది.
"మీరెవరూ భయపడకండి.... బాధపడకండి... ఏమీకాదు. మత్తు ఇంజక్షన్ ఇచ్చాను. కొంతసేపు ప్రశాంతంగా నిద్రపోతుంది.. రెండు గంటల తర్వాత నేను మళ్లా వచ్చి చూస్తాను" లక్ష్మణ్జీ వెళ్ళిపోయాడు.
అందరూ పావని ముఖంలోకి కన్నీటితో దీనంగా చూస్తున్నారు.
పావని ప్రశాంతంగా నిద్రపోయింది.
జరిగిన సంఘటన వలన వారందరికీ అర్థం అయ్యింది. మరుజన్మ ఉన్నదని. ఆ చిన్నారి పావని రామ్లాల్ ఇంట (త్రిపురాంతక్లో) పాప.... (అక్కడ) రఘునందన్ ఇంట (కింబర్లో) అమ్మ (ఇక్కడ) అని....
*
సమాప్తి
కానీ.... రఘునందన వారి మాటలను వినిపించుకోలేదు. ఆ పిల్లలను సవతి తల్లి సరిగ్గా చూడదని అతని భయం. ఆ కారణం మరో వివాహాన్ని అతను చేసుకోలేదు. తల్లీ, తండ్రి తానే అయ్యి వారిని పెంచి పెద్ద చేశాడు రఘునంద.
జానకి బ్రతికి వుండగ పుట్టిన కవల పిల్లల వయస్సు పన్నెండు సంవత్సరాలు, లక్ష్మి వయస్సు పదునెనిమిది సంవత్సరాల ప్రాయంలో, ఆ దంపతులు తమ మేనల్లుడు రామ్లాల్తో లక్ష్మి వివాహాన్ని జరిపించారు. అది ఆ ఇంట్లో జరిగిన గొప్ప శుభకార్యం.
ప్రస్తుతంలో అహల్యా సుమతీల వయస్సు పదహారు సంవత్సరాలు. వారు ప్లస్ టు చదువుతున్నారు.
*
ప్రతి సంవత్సరం తాను జరిపించే శ్రీరామనవమి ఉత్సవానికి రఘునందన్ తన అల్లుడు రామ్లాల్, కూతురు లక్ష్మి, మనుమరాలు పావని ఆహ్వానించారు. అప్పటికి వారు ఆ వూరికి వచ్చి ఒక సంవత్సరం గడిచింది.
ఇంటికి వచ్చిన బావ అక్కలను అహల్య, సుమతిలు ఎంతో ఆదరంగా ఆహ్వానించారు. చిన్నారి పావనిని ఎత్తుకొని ముద్దులాడారు.
పావని అహల్య చేతుల నుండి క్రిందికి జారింది. ఆమె కళ్ళల్లో కన్నీరు. అహల్యా, సుమతిలు భయపడ్డారు. పావనీ ఏడుపుకు కారణం తెలియనివారు ఆశ్చర్యపోయారు. తమ అక్క లక్ష్మిని పిలిచారు. లక్ష్మి వారిని సమీపించింది.
పావని.... వేగంగా ఆ ఇంటిని, వెనుక పెరటి భాగాన్ని కన్నీటితో వేగంగా తిరిగింది. పొంగి వచ్చిన ఏడుపుతో బోరున ఏడుస్తూ వుంది పావని.
అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగింది. బిడ్డకు ఏమైందనే ఆవేదన....
పావనీ!... రఘునందనను సమీపించింది ఏడుస్తూ....
"ఏమయ్యా!... నన్ను మరిచిపోయావా! ఎలా వున్నావు? నేను... నేను... నీ జానకినీ.... నీ జానకినీ...."
రఘునందన చేతులు పట్టుకొని భోరున ఏడ్చింది పావని.
అందరి పరిస్థితి అయోమయం....
"జానకి.... జానకి..." రఘునందన పెదాలు అప్రయత్నంగా పలికాయి.
పావనీ, అహల్యా సుమతీలను సమీపించింది. వారి చేతులను తన చేతుల్లోకి తీసుకొంది.
"ఏమ్మా!....అహల్యా, సుమతీ ఎలా వున్నార్రా!..... మీ నాన్న మిమ్మల్ని బాగా చూసుకొంటున్నాడా!" దీనంగా కన్నీటితో అడిగింది.
అహల్యా, సుమతీలకు అయోమయ పరిస్థితి..... వారి నయనాల్లో కన్నీరు. అప్పటికి పెద్దవారైన రఘునందన్కు, రామ్లాల్ లక్ష్మీలకూ విషయం అర్థం అయ్యింది.
’ఈ పావని ఎవరో కాదు!.... ఎవరో కాదు!..... చనిపోయిన నా భార్య లక్ష్మి....’ అనుకొన్నాడు రఘునందన్.
"నా కూతురు పావని ఎవరో కాదు నా లక్ష్మి తల్లి.... మా అత్తయ్యా!’ అనుకొన్నాడు రామ్లాల్.
"నా కూతురు పావని నాకు జన్మనిచ్చిన తల్లి...’ అనుకొంది లక్ష్మి.
రఘునందన వేగంగా ఇంటినుండి బయటికి నడిచాడు. తన ప్రక్క ఇంట్లో వున్న డాక్టర్ లక్ష్మణ్ జీకి విషయాన్ని చెప్పాడు. లక్ష్మణ్జీ ఆశ్చర్యపోయాడు.
తన మందుల సంచిని చేతికి తీసుకొని....
"పదండి. నేను పాపను చూస్తాను" అన్నాడు అయోమయ స్థితిలో.
ఇరువురూ రఘునందన ఇంట్లోకి వచ్చారు.
పావనీ తన ఇరువురు కూతుళ్ళను ఏం చదువుతున్నారని అడిగింది.
"అమ్మా!....అమ్మా!.... మీరువురువూ బాగా చదువుకోవాలి. పెద్ద చదువులు చదవాలి. గొప్పవారు కావాలి. మీ నాన్నను బాగా చూసుకోవాలి" దీనంగా కన్నీటితో చెప్పింది.
ఇంట్లోకి వచ్చిన డాక్టర్ లక్ష్మణ్ జీ ఆ మాటలను విన్నాడు ఆశ్చర్యపోయాడు.
అతన్ని చూచిన (పావని) లక్ష్మి!.....
"ప్యారా భయ్యా! లక్ష్మణ్ జీ ఆప్ కైసే హో.... పత్నీ బచ్చే సభీ కుశల్ మంగళ్ హోనా!"
చిరునవ్వుతో అడిగింది పావని.
లక్ష్మణ్జీకి విషయం అర్థం అయ్యింది.
"పూర్వజన్మ జ్ఞాపకాలు" అతని పెదవులు అప్రయత్నంగా పలికాయి.
"డాక్టర్ సాబ్! నా బిడ్డ!...." ఆ తరువాత మాట్లాడలేకపోయాడు రామ్లాల్ ఆవేదనతో....
"లక్ష్మణ్ మామా! మేర బేటీ.... మేర బేటీ....! బొంగురు పోయిన కంఠంతో కన్నీటితో ఆ తరువాత ఏమీ చెప్పలేకపోయింది లక్ష్మి.
అహల్యా, సుమతీలు కన్నీటితో ఆశ్చర్యంగా చూస్తున్నారు.
లక్ష్మణ్ జీ కొన్ని క్షణాలు ఆలోచించాడు.
పావనిని సమీపించాడు.
"దీదీజీ అప్ తోడ్ సమై ఆరాంకీజియే!..." ఎత్తుకొని మంచాన్ని సమీపించాడు. పడుకోబెట్టాడు. లక్ష్మికి సైగచేసి పాప చేతులను పట్టుకొమ్మని సూచించారు డాక్టర్ లక్ష్మణ్ జీ.
లక్ష్మి పాప తలవైపున విచారంగా కూర్చుంది. మెల్లగా ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకొంది.
డాక్టర్ లక్ష్మణ్ జీ పావనికి ఇంజక్షన్ చేశాడు.
"అమ్మా!....." అరిచింది పావని.
అందరూ బెదిరిపోయి పావని ముఖంలోనికి చూచారు. లక్ష్మి పావనిని తన హృదయానికి గట్టిగా హత్తుకొంది.
పావనీ కళ్ళు మూసింది.
"మీరెవరూ భయపడకండి.... బాధపడకండి... ఏమీకాదు. మత్తు ఇంజక్షన్ ఇచ్చాను. కొంతసేపు ప్రశాంతంగా నిద్రపోతుంది.. రెండు గంటల తర్వాత నేను మళ్లా వచ్చి చూస్తాను" లక్ష్మణ్జీ వెళ్ళిపోయాడు.
అందరూ పావని ముఖంలోకి కన్నీటితో దీనంగా చూస్తున్నారు.
పావని ప్రశాంతంగా నిద్రపోయింది.
జరిగిన సంఘటన వలన వారందరికీ అర్థం అయ్యింది. మరుజన్మ ఉన్నదని. ఆ చిన్నారి పావని రామ్లాల్ ఇంట (త్రిపురాంతక్లో) పాప.... (అక్కడ) రఘునందన్ ఇంట (కింబర్లో) అమ్మ (ఇక్కడ) అని....
*
సమాప్తి
ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)