21-10-2025, 01:50 PM
అక్కడ పాప!!..ఇక్కడ అమ్మ!!..
రచన: సిహెచ్. సీఎస్. రావు
మన పవిత్ర భారతదేశం సనాతనులు దైవజ్ఞులు పండితోత్తములు అయిన మహాఋషులకు నిలయం. అస్తికతకు ప్రత్యక్ష సాక్ష్యం మన పూర్వీకులందరూ... ఋషి సంతతి. కృత ద్వాపర త్రేతాయుగాల్లో దేవ దానవులు వసించారు. ఎప్పుడూ దైవత్వానికి, దానవత్వానికి వైరం. మనం ఖర్మ సిద్ధాంతపు.... ’పునరపి జననం.... పునరపి మరణం, (పుట్టుట గిట్టుటా... గిట్టుటా (మరణం) పుట్టుటా... పై వేదవాక్కు అర్థం. జన్మరాహిత్యమో...మోక్షం అది సిద్ధించాలంటే ఎన్నో జన్మలు ఎత్తాలి. గిట్టాలి. పుట్టాలి. మంచిని అదే పుణ్యాన్ని మన ఆచరణలతో దైవ భక్తితో సాధించుకోవాలి. మనం చూచే గొప్పవారు గతించిన కీర్తిశేషులు కాలచక్ర భ్రమణంలో మరణ జనన మూలంగా ఆయా స్థితిలను పొందినవారే!.... కొందరికి వారి గత జన్మ జ్ఞాపకాలు ఈ జన్మలో కలిగిన వారు వున్నారు. ఆ మాటలు వినేటందుకు చోద్యంగా వుంటాయి కాని అది నిజం... మరు జన్మకు అది సాక్షి....
అది రాజస్థాన్ భూభాగం...
త్రిపురాంతక్ అనే చిన్న గ్రామం.
అక్కడికి కింజర్ అనే మరో గ్రామం ముఫ్ఫై కిలోమీటర్లు.
పేదకుటుంబీకులు, రామ్లాల్, లక్ష్మి భార్యా భర్తలు. కొద్దిపాటి భూమిలో వ్యవసాయం. ఆ ఫలింపు వారి జీవనాధారం.... రామ్లాల్, లక్ష్మి దంపతులది మంచి అన్యోన్యమైన సంసారం. వారి వివాహం జరిగిన మూడు సంవత్సరాలు సంతతి లేదు.
ఆ వూరి పెద్ద ఆనంద్ బాబు సంపన్నుడు. ఆంజనేయస్వాముల వారి భక్తుడు. ఆయనకు ఆ వూరిలో ఒక '' సోదరుడు పేరు ఫకీరా. ఆయన కన్నా వయస్సులో పెద్దవాడు. ఇరువురూ మంచి స్నేహితులు.
ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట చేయాలనే సంకల్పం రామ్లాల్కు కలిగింది.
వూర్లోని వారికందరికీ తన అభిప్రాయాన్ని చెప్పి సాయం కోరాడు. వారివారికి తోచిన ధన సాయం చేశారు గ్రామస్థులు. '' వర్గీయులు పది ఇళ్ళవారు ఉన్నారు. వారికి పెద్ద ఫకీరా. గొప్ప భక్తిపరుడు. "ఈశ్వర్ అల్ల తేరే నామ్" అని పాడేవాడు. గుడ్డల వ్యాపారి.
రామ్ తన నిర్ణయాన్ని మిత్రునికి తెలియజేశాడు కానీ సాయం కోరలేదు. చందాగా వచ్చిన ధనం శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహ నిర్మాణానికి సరిపోయేలా లేదు. తనకున్న భూమిలో కొంత భాగాన్ని అమ్మి స్వామి వారి విగ్రహాన్ని నిర్మింప నిర్ణయించుకొన్నాడు రామ్లాల్.
ఆ విషయాన్ని విన్న ఫకీరా రామ్లాల్ను కలిశాడు.
"అరే భాయ్! ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించాలనుకొన్నవటగా!.... వూరంతా చందా దండావట! మరి నన్ను అడగలేదేం!....." చిరునవ్వుతో అడిగాడు ఫకీరా.
"అన్నా!.... తప్పుగా అనుకోకు. నేను నాకు నమ్మకం లేని పనిని చేయను. మీకు విగ్రహారాధనపై నమ్మకం లేదుగా.... అందుకే అడగలేదు" వినయంగా జవాబు చెప్పాడు రామ్లాల్.
ఫకీరా నవ్వాడు.
"ఎందుకన్నా నవ్వుతున్నావ్?"
"సాయం వేరు, నమ్మకం వేరు కదా!...."
"అవును...."
"నేను ఇస్తే తీసుకోవా!"
"మీరుగా ఇస్తే తీసుకొంటాను"
"అయితే నన్ను అడగవన్నమాట!"
"ఉహూ!" తల ఆడిస్తూ చెప్పాడు రామ్లాల్.
రెండు క్షణల తర్వాత "తప్పుగా అనుకోకండి" అనునయంగా చెప్పాడు.
"రామూ! నీ సంకల్పం చాలా మంచిది. నాకు రామాయణ కథ పూర్తిగా తెలుసు. పవనసుత హనుమాన్ జీ, బల్వావ్ గ్రేట్ గ్రేట్ వారు... చిరంజీవి భయ్యా!..." నవ్వుతూ చెప్పాడు ఫకీరా.
జేబులోనుంచి కొంత సొమ్ము తీసి రామ్ లాల్ చేతిలో వుంచి, చిరునవ్వుతో ముందుకు వెళ్ళిపోయాడు. లెక్కపెడితే అది పాతిక వేలు.
మూడు మాసాలలో నలభై అడుగుల శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహం ఆకర్షణీయమైన రంగులతో సర్వాంగ సుందరంగా ఊరి గవిడిలో (Entrance) వెలసింది. మంచి రోజున వేదమంత్రాలతో ఘనంగా స్వామి వారి సంప్రోక్షణ పూజ, నైవేద్యాదులు జరిగాయి. రామ్లాల్ అర్థాంగి లక్ష్మి నెల తప్పింది. నవమాసాలు నిండాయి. పాప పుట్టింది. పావని అనే పేరు పెట్టారు.
*
పావనీ ఎంతో అందంగా వుండేది. ఆనోట ఈనోట ఆ మాట (అందం) పడి ఊర్లోని అమ్మలక్కలు రామ్లాల్ ఇంటికి వచ్చి పావనిని చూచి సంతోషించి, మనసరా దీవించి వెళ్ళేవారు. ప్రతి సాయంత్రం లక్ష్మి పాపకు దిష్టి తీసేది.
"హే పవసూత! తండ్రి న బిడ్డకి నీవే రక్ష," ఆ వీరాంజనేయ స్వామిని మనసారా వేడుకొనేది లక్ష్మి.
పావని ఆరోగ్యంగా వుండేది. అల్లరి, ఏడుపు ఎప్పుడూ లేదు. బోర్లా పడడం..... బోసి నవ్వులు నవ్వడం, అమ్మా నాన్నలను గుర్తుపట్టి కేరింతలు కొట్టడం చేసేది. ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు. అంతా శ్రీ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం అని ఆ స్వామిని మనసారా కొలిచేవారు.
పావనికి మూడు సంవత్సరాలు నిండాయి. ఎప్పుడు ఆమె అంజనేయ స్వామి వారి విగ్రపు అరుగుమీదనే వుండేది. ఆ చిరంజీవితో ఈ పాప మాట్లాడేది. ఆయన తనకు జవాబు చెప్పిన అనుభూతిని పొందేది.
కొందరికి పావని ఆ చర్య ఆశ్చర్యాన్ని కలిగించేది. ప్రధమంలో లక్ష్మి రామ్లాల్ కూడ ’ఏదిరా ఇది!’ అని అయోమయ స్థితిలో వుండేవారు. రోజులు గడిచేకొద్ది ’పాప చిన్నవయస్సులోనే మంచి భక్తురాలు’ అనుకొని సంతోషించేవారు.
కింజర్ గ్రామం లక్ష్మి అమ్మగారి వూరు. ఆ ఊరిలో రామాలయం ఉంది. లక్ష్మి తండ్రి రఘునాథన్. ఆ ఆలయ అజమాయిషి కర్త. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి సీతామాత శ్రీరాముల పూజలను ఉత్సవాన్ని ఘనంగా జరిపించేవాడు. ఆ ఉదయం నుండి సాయంత్రం శ్రీరామచంద్రుని ఊరేగింపు ముగిసి, ఆ మాతాపతిలు ఆలయానికి చేరేవరకూ మంచినీళ్ళను కూడా త్రాగకుండా ఉపవాసం ఉండేవాడు రఘునందన్. వారి సతీమణి జానకి కూడ అలాగే వుండేది.
రఘునందన్కు లక్ష్మి పెద్దకూతురు. ఆమె కాక వారికి మరో ఇరువురు ఆడసంతానం. అహల్య, సుమతి. వారిరువురూ కవల పిల్లలు. లక్ష్మి పుట్టిన ఆరు సంవత్సరాలలో వారిరువురూ జన్మించారు. పావనీ పుట్టుక ముందు సంవత్సరం క్రిందట రఘునందన్ అర్థాంగి జానకి విష జ్వరంతో సరైన వైద్య సదుపాయాలు లేక మరణించింది. అహల్య, సుమతీ తల్లిలేని పిల్లలైనారు.
రచన: సిహెచ్. సీఎస్. రావు
మన పవిత్ర భారతదేశం సనాతనులు దైవజ్ఞులు పండితోత్తములు అయిన మహాఋషులకు నిలయం. అస్తికతకు ప్రత్యక్ష సాక్ష్యం మన పూర్వీకులందరూ... ఋషి సంతతి. కృత ద్వాపర త్రేతాయుగాల్లో దేవ దానవులు వసించారు. ఎప్పుడూ దైవత్వానికి, దానవత్వానికి వైరం. మనం ఖర్మ సిద్ధాంతపు.... ’పునరపి జననం.... పునరపి మరణం, (పుట్టుట గిట్టుటా... గిట్టుటా (మరణం) పుట్టుటా... పై వేదవాక్కు అర్థం. జన్మరాహిత్యమో...మోక్షం అది సిద్ధించాలంటే ఎన్నో జన్మలు ఎత్తాలి. గిట్టాలి. పుట్టాలి. మంచిని అదే పుణ్యాన్ని మన ఆచరణలతో దైవ భక్తితో సాధించుకోవాలి. మనం చూచే గొప్పవారు గతించిన కీర్తిశేషులు కాలచక్ర భ్రమణంలో మరణ జనన మూలంగా ఆయా స్థితిలను పొందినవారే!.... కొందరికి వారి గత జన్మ జ్ఞాపకాలు ఈ జన్మలో కలిగిన వారు వున్నారు. ఆ మాటలు వినేటందుకు చోద్యంగా వుంటాయి కాని అది నిజం... మరు జన్మకు అది సాక్షి....
అది రాజస్థాన్ భూభాగం...
త్రిపురాంతక్ అనే చిన్న గ్రామం.
అక్కడికి కింజర్ అనే మరో గ్రామం ముఫ్ఫై కిలోమీటర్లు.
పేదకుటుంబీకులు, రామ్లాల్, లక్ష్మి భార్యా భర్తలు. కొద్దిపాటి భూమిలో వ్యవసాయం. ఆ ఫలింపు వారి జీవనాధారం.... రామ్లాల్, లక్ష్మి దంపతులది మంచి అన్యోన్యమైన సంసారం. వారి వివాహం జరిగిన మూడు సంవత్సరాలు సంతతి లేదు.
ఆ వూరి పెద్ద ఆనంద్ బాబు సంపన్నుడు. ఆంజనేయస్వాముల వారి భక్తుడు. ఆయనకు ఆ వూరిలో ఒక '' సోదరుడు పేరు ఫకీరా. ఆయన కన్నా వయస్సులో పెద్దవాడు. ఇరువురూ మంచి స్నేహితులు.
ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట చేయాలనే సంకల్పం రామ్లాల్కు కలిగింది.
వూర్లోని వారికందరికీ తన అభిప్రాయాన్ని చెప్పి సాయం కోరాడు. వారివారికి తోచిన ధన సాయం చేశారు గ్రామస్థులు. '' వర్గీయులు పది ఇళ్ళవారు ఉన్నారు. వారికి పెద్ద ఫకీరా. గొప్ప భక్తిపరుడు. "ఈశ్వర్ అల్ల తేరే నామ్" అని పాడేవాడు. గుడ్డల వ్యాపారి.
రామ్ తన నిర్ణయాన్ని మిత్రునికి తెలియజేశాడు కానీ సాయం కోరలేదు. చందాగా వచ్చిన ధనం శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహ నిర్మాణానికి సరిపోయేలా లేదు. తనకున్న భూమిలో కొంత భాగాన్ని అమ్మి స్వామి వారి విగ్రహాన్ని నిర్మింప నిర్ణయించుకొన్నాడు రామ్లాల్.
ఆ విషయాన్ని విన్న ఫకీరా రామ్లాల్ను కలిశాడు.
"అరే భాయ్! ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించాలనుకొన్నవటగా!.... వూరంతా చందా దండావట! మరి నన్ను అడగలేదేం!....." చిరునవ్వుతో అడిగాడు ఫకీరా.
"అన్నా!.... తప్పుగా అనుకోకు. నేను నాకు నమ్మకం లేని పనిని చేయను. మీకు విగ్రహారాధనపై నమ్మకం లేదుగా.... అందుకే అడగలేదు" వినయంగా జవాబు చెప్పాడు రామ్లాల్.
ఫకీరా నవ్వాడు.
"ఎందుకన్నా నవ్వుతున్నావ్?"
"సాయం వేరు, నమ్మకం వేరు కదా!...."
"అవును...."
"నేను ఇస్తే తీసుకోవా!"
"మీరుగా ఇస్తే తీసుకొంటాను"
"అయితే నన్ను అడగవన్నమాట!"
"ఉహూ!" తల ఆడిస్తూ చెప్పాడు రామ్లాల్.
రెండు క్షణల తర్వాత "తప్పుగా అనుకోకండి" అనునయంగా చెప్పాడు.
"రామూ! నీ సంకల్పం చాలా మంచిది. నాకు రామాయణ కథ పూర్తిగా తెలుసు. పవనసుత హనుమాన్ జీ, బల్వావ్ గ్రేట్ గ్రేట్ వారు... చిరంజీవి భయ్యా!..." నవ్వుతూ చెప్పాడు ఫకీరా.
జేబులోనుంచి కొంత సొమ్ము తీసి రామ్ లాల్ చేతిలో వుంచి, చిరునవ్వుతో ముందుకు వెళ్ళిపోయాడు. లెక్కపెడితే అది పాతిక వేలు.
మూడు మాసాలలో నలభై అడుగుల శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహం ఆకర్షణీయమైన రంగులతో సర్వాంగ సుందరంగా ఊరి గవిడిలో (Entrance) వెలసింది. మంచి రోజున వేదమంత్రాలతో ఘనంగా స్వామి వారి సంప్రోక్షణ పూజ, నైవేద్యాదులు జరిగాయి. రామ్లాల్ అర్థాంగి లక్ష్మి నెల తప్పింది. నవమాసాలు నిండాయి. పాప పుట్టింది. పావని అనే పేరు పెట్టారు.
*
పావనీ ఎంతో అందంగా వుండేది. ఆనోట ఈనోట ఆ మాట (అందం) పడి ఊర్లోని అమ్మలక్కలు రామ్లాల్ ఇంటికి వచ్చి పావనిని చూచి సంతోషించి, మనసరా దీవించి వెళ్ళేవారు. ప్రతి సాయంత్రం లక్ష్మి పాపకు దిష్టి తీసేది.
"హే పవసూత! తండ్రి న బిడ్డకి నీవే రక్ష," ఆ వీరాంజనేయ స్వామిని మనసారా వేడుకొనేది లక్ష్మి.
పావని ఆరోగ్యంగా వుండేది. అల్లరి, ఏడుపు ఎప్పుడూ లేదు. బోర్లా పడడం..... బోసి నవ్వులు నవ్వడం, అమ్మా నాన్నలను గుర్తుపట్టి కేరింతలు కొట్టడం చేసేది. ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు. అంతా శ్రీ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం అని ఆ స్వామిని మనసారా కొలిచేవారు.
పావనికి మూడు సంవత్సరాలు నిండాయి. ఎప్పుడు ఆమె అంజనేయ స్వామి వారి విగ్రపు అరుగుమీదనే వుండేది. ఆ చిరంజీవితో ఈ పాప మాట్లాడేది. ఆయన తనకు జవాబు చెప్పిన అనుభూతిని పొందేది.
కొందరికి పావని ఆ చర్య ఆశ్చర్యాన్ని కలిగించేది. ప్రధమంలో లక్ష్మి రామ్లాల్ కూడ ’ఏదిరా ఇది!’ అని అయోమయ స్థితిలో వుండేవారు. రోజులు గడిచేకొద్ది ’పాప చిన్నవయస్సులోనే మంచి భక్తురాలు’ అనుకొని సంతోషించేవారు.
కింజర్ గ్రామం లక్ష్మి అమ్మగారి వూరు. ఆ ఊరిలో రామాలయం ఉంది. లక్ష్మి తండ్రి రఘునాథన్. ఆ ఆలయ అజమాయిషి కర్త. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి సీతామాత శ్రీరాముల పూజలను ఉత్సవాన్ని ఘనంగా జరిపించేవాడు. ఆ ఉదయం నుండి సాయంత్రం శ్రీరామచంద్రుని ఊరేగింపు ముగిసి, ఆ మాతాపతిలు ఆలయానికి చేరేవరకూ మంచినీళ్ళను కూడా త్రాగకుండా ఉపవాసం ఉండేవాడు రఘునందన్. వారి సతీమణి జానకి కూడ అలాగే వుండేది.
రఘునందన్కు లక్ష్మి పెద్దకూతురు. ఆమె కాక వారికి మరో ఇరువురు ఆడసంతానం. అహల్య, సుమతి. వారిరువురూ కవల పిల్లలు. లక్ష్మి పుట్టిన ఆరు సంవత్సరాలలో వారిరువురూ జన్మించారు. పావనీ పుట్టుక ముందు సంవత్సరం క్రిందట రఘునందన్ అర్థాంగి జానకి విష జ్వరంతో సరైన వైద్య సదుపాయాలు లేక మరణించింది. అహల్య, సుమతీ తల్లిలేని పిల్లలైనారు.
ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)