21-10-2025, 01:44 PM
నగరంలో వంటావిడ
[url]
[/url]
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
“నాన్నా! దేశాంతరాలు వెళ్ళిపోతారు కానీ నా దగ్గరికి రమ్మంటే బద్ధకం మీకు. మాకు కూడా మీతో గడపాలని ఉండదా, అమ్మని అడిగితే ‘నన్ను అడిగి లాభం ఏముంది ఆ మొండి మనిషి ని అడుగు’ అంటుంది.. మీరు మాత్రం హైదరాబాద్ పట్టుకుని వుంటారు. అక్కడైనా, నా దగ్గరైనా మీరు చేసే పని ఏముంటుంది.. గంటల తరబడి యూట్యూబ్ చూడటం, ఫోన్లో మాట్లాడుకోవడం” అన్నాడు తండ్రి శ్రీకాంత్ తో కొడుకు వినయ్.
“నాకు రాకూడదు అనికాదు రా, ప్రయాణాలు చెయ్యలేకపోతున్నాను అంతే. మీ మొగుడు పెళ్ళాలు యిద్దరు జాబ్ కి వెళ్ళిపోతారు, మనవడు కాలేజీకి. అమ్మకి వంటా, నాకు ఫోన్, పెద్ద మార్పు ఏమి వుంటుంది?” అన్నాడు కొడుకు తో శ్రీకాంత్.
“అదేమిటి డాడీ, వంట కి వంటమనిషి వుంది అని చెప్పానుగా, అప్పుడే మర్చిపోయారా” అన్నాడు కొడుకు వినయ్.
“వంటమనిషి వుంటే మంచిదే, అమ్మకూడా యిక్కడ నాకు వంట చేసి బాగా అలిసిపోయింది, అక్కడ కి వస్తే కొద్దిగా రెస్ట్ తీసుకుంటుంది లే. నాకు కూడా కాళ్ళు నొప్పి, అక్కడకి వస్తే మనవడు, నువ్వు కొద్దిగా కాళ్ళమీద కూర్చుంటారు, హాయిగా వుంటుంది, వచ్చే వారం కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చెయ్యి, ట్రైన్ లో అంతసేపు కూర్చోలేను” అన్నాడు శ్రీకాంత్.
“అవును.. వంటమనిషి మనవాళ్లేనా, ముంబయిలో మన వాళ్ళు దొరుకుతారా?” అని ఆడిగాడు కొడుకుని.
“ఆ.. మనవాళ్లే! జానకమ్మ పేరు, అయితే మరాఠి తప్పా ఏమి రాదు, యిప్పుడే కొద్దిగా హింది నేర్చుకుంటోంది” అన్నాడు వినయ్.
“వంటకి బాష తో పని ఏముంది, మీ అమ్మ వచ్చి ఆవిడకి అన్ని వంటలు నేర్పుతుందిలే” అన్నాడు.
అమ్మయ్య, మొత్తానికి రావడానికి ఒప్పుకున్నారు నాన్న, వచ్చిన తరువాత తను పంపితే గాని వెళ్లారు మనవడిని వదిలి అనుకున్నాడు వినయ్.
ఉదయం ఫ్లైట్ లో బయలుదేరి ముంబై చేరుకున్నారు అదిదంపతులు. ఎయిర్పోర్ట్ కి కొడుకు వినయ్ వచ్చి తల్లిదండ్రులని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చాడు. పేరు కి ముంబై కానీ ఎన్ని పెద్ద బిల్డింగ్స్ వున్నాయో వాటికి మించి గుడిసెలు వున్నాయి. విపరీతంగా ట్రాఫిక్.
ఉదయం టిఫిన్ తినకుండా బయలుదేరటం తో 12 గంటలకే శ్రీకాంత్ కి నీరసంగా అనిపించింది. “అమ్మాయి.. నాకు అన్నం పెట్టేసేయ్, షుగర్ పడేడట్లు వుంది” అన్నాడు కోడలితో.
కంచంలో టొమోటో పప్పు, బెండకాయ వేపుడు వడ్డించింది కోడలు. నోట్లో పెట్టుకుని “బాగానే వండింది వంటావిడ” అన్నాడు శ్రీకాంత్.
అన్నం తిని, సోఫాలో కూర్చుని టాబ్లెట్స్ వేసుకుంటో, “ఏమో అనుకున్నాను కానీ, జానకమ్మ గారు బాగానే వండింది” అన్నాడు చదువుకుంటున్న మనవడితో
“జానకమ్మ ఎవ్వరు తాత, ఎప్పుడు పేర్లు తప్పే చెప్తావు, ఆవిడ పేరు మంగమ్మ, మన పనిమనిషి” అన్నాడు. మనవడి మాటకి శ్రీకాంత్ గుండెల్లో రాయి పడింది.
సాయంత్రం కొడుకు రాగానే ఆడిగాడు, “నిత్యం త్రికాల సంధ్యవంధానం చేసే నాకు పనిమనిషి ని తీసుకుని వచ్చి జానకమ్మ అని చెప్పి ఆ వంట తినిపిస్తావా, యింత ఘాతకం కి ఒడికట్టావ్ ఎందుకు” అన్నాడు.
“డాడీ హైదరాబాద్ లో మీరు తిన్న హోటల్ లో వంటవాడు అవధాని గాని, రావు గాని అనుకుంటున్నారా, అక్కడ తినగా లేనిది, యిప్పుడు మంగమ్మ అనగానే యిబ్బంది కలిగింది. చూడండి డాడీ ఈ నగరం లో మనిషి దొరకడమే కష్టం, సద్దుకోవాలి” అన్నాడు నవ్వుతు.
“రేపటి నుంచి ఆవిడ చేసిన వంట నేను తినను, నాకు అమ్మ వండుతుంది సెపరేట్ గా” అనేసి వేరే రూంలోకి వెళ్ళిపోయాడు శ్రీకాంత్.
‘నాన్నకి నిజంగానే కోపం వచ్చింది అనుకుంట’ అనుకుంటూ, “అసలు ఆవిడ విషయం నాన్నకి ఎవ్వరు చెప్పారు?” అన్నాడు భార్య తో.
“యింకెవ్వరు.. మన నారదుడు మీ అబ్బాయి వున్నాడు గా..” అంది.
మర్నాడు మంగమ్మ వచ్చి యిల్లు, అంట్లు తోమేసి, రాజమ్మ గా మారిపోయి చేతులు శుభ్రం గా కడుక్కుని వంట మొదలుపెట్టింది.
శ్రీకాంత్ భార్య ని పిలిచి “నేను ఆ వంట తినను, నువ్వు నాకు సెపరేట్ గా అన్నం కూర పప్పు వండు, కొద్దిగా ఆలస్యం అయినా పరవాలేదు” అన్నాడు.
“మీ చాదస్తం తో నా ప్రాణం మీదకి వచ్చింది, వంటావిడ చేసిన వంట వదిలేసి, మళ్ళీ నేను వండుతాను అంటే కోడలు ఏమనుకుంటుంది ఆండి, వడ్డన నేను చేస్తాను, కొద్దిగా యిక్కడ వున్ననాళ్ళు గొడవ పెట్టకండి, వచ్చే నెల వెళ్ళిపోదాం” అంది శ్రీకాంత్ భార్య.
“అయితే నేను శబరి లా పళ్లు తిని బతుకుతాను, అంతే తప్పా ఆ వంట నేను తినను” అన్నాడు. దానితో వంటావిడ వంట అయిన తరువాత, శ్రీకాంత్ కి వండి పెట్టడం చేస్తోంది.
నాలుగు రోజులు గడిచిన తరువాత ఈ విషయం వంటావిడ కి తెలిసిపోయింది. “అమ్మా! నేను వండిన వంట సార్ కి నచ్చడం లేదని, మళ్ళీ సెపరేట్ గా సార్ కి వండుతున్నారు, యింతోటీ దానికి నేను ఎందుకు, రేపటి నుంచి నేను రాను, మీరే వండుకోండి” అని చెప్పి డబ్బు తీసుకుని వెళ్ళిపోయింది.
“చెడకోట్టేదాకా మీకు నిద్ర పట్టలేదు కదా డాడీ, యిప్పుడు పర్వాలేదు, అమ్మ చేస్తోంది. రేపు మీరు వెళ్ళిపోతే మా గతి ఏమిటి, ఈ ముంబైలో ఉదయం 7 గంటలకు బయలుదేరితే కాని ఆఫీస్ టైమ్ కి చేరం. ఇహ మీ మకాం యిక్కడే, మనవడిని చూసుకుంటో వుండిపోండి” అన్నాడు వినయ్.
“నేను ఎప్పుడు యిక్కడికి వచ్చి వుండిపోవాలో నాకు తెలుసు, ఉదయమే లేచి పిల్లాడికి నాలుగు మెతుకులు వండుకోండి, నేను యిక్కడ వుండిపోతే అక్కడ రైతు మనపోలం కాస్తా లాగేస్తాడు. ఓపిక తగ్గినప్పుడు అన్నీ అమ్మేసి నీ దగ్గరికి ఎల్లాగో రాకతప్పదు, యిప్పుడు మమ్మల్ని వెళ్ళని, కావాలంటే ఆ మంగమ్మ నీ పిలిచి వండించుకోండి మేము వెళ్లిపోయామని చెప్పి” అన్నాడు శ్రీకాంత్. అనుకున్న ప్లాన్ ప్రకారం మొగుడు పెళ్ళాం హైదరాబాద్ వెళ్లిపోయారు.
పదిరోజులు కొడుకు ఫోన్ కూడా చేయ్యలేదు, తండ్రి తన మాట వినలేదు అని.
[url]
[/url]రచన : జీడిగుంట శ్రీనివాసరావు
“నాన్నా! దేశాంతరాలు వెళ్ళిపోతారు కానీ నా దగ్గరికి రమ్మంటే బద్ధకం మీకు. మాకు కూడా మీతో గడపాలని ఉండదా, అమ్మని అడిగితే ‘నన్ను అడిగి లాభం ఏముంది ఆ మొండి మనిషి ని అడుగు’ అంటుంది.. మీరు మాత్రం హైదరాబాద్ పట్టుకుని వుంటారు. అక్కడైనా, నా దగ్గరైనా మీరు చేసే పని ఏముంటుంది.. గంటల తరబడి యూట్యూబ్ చూడటం, ఫోన్లో మాట్లాడుకోవడం” అన్నాడు తండ్రి శ్రీకాంత్ తో కొడుకు వినయ్.
“నాకు రాకూడదు అనికాదు రా, ప్రయాణాలు చెయ్యలేకపోతున్నాను అంతే. మీ మొగుడు పెళ్ళాలు యిద్దరు జాబ్ కి వెళ్ళిపోతారు, మనవడు కాలేజీకి. అమ్మకి వంటా, నాకు ఫోన్, పెద్ద మార్పు ఏమి వుంటుంది?” అన్నాడు కొడుకు తో శ్రీకాంత్.
“అదేమిటి డాడీ, వంట కి వంటమనిషి వుంది అని చెప్పానుగా, అప్పుడే మర్చిపోయారా” అన్నాడు కొడుకు వినయ్.
“వంటమనిషి వుంటే మంచిదే, అమ్మకూడా యిక్కడ నాకు వంట చేసి బాగా అలిసిపోయింది, అక్కడ కి వస్తే కొద్దిగా రెస్ట్ తీసుకుంటుంది లే. నాకు కూడా కాళ్ళు నొప్పి, అక్కడకి వస్తే మనవడు, నువ్వు కొద్దిగా కాళ్ళమీద కూర్చుంటారు, హాయిగా వుంటుంది, వచ్చే వారం కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చెయ్యి, ట్రైన్ లో అంతసేపు కూర్చోలేను” అన్నాడు శ్రీకాంత్.
“అవును.. వంటమనిషి మనవాళ్లేనా, ముంబయిలో మన వాళ్ళు దొరుకుతారా?” అని ఆడిగాడు కొడుకుని.
“ఆ.. మనవాళ్లే! జానకమ్మ పేరు, అయితే మరాఠి తప్పా ఏమి రాదు, యిప్పుడే కొద్దిగా హింది నేర్చుకుంటోంది” అన్నాడు వినయ్.
“వంటకి బాష తో పని ఏముంది, మీ అమ్మ వచ్చి ఆవిడకి అన్ని వంటలు నేర్పుతుందిలే” అన్నాడు.
అమ్మయ్య, మొత్తానికి రావడానికి ఒప్పుకున్నారు నాన్న, వచ్చిన తరువాత తను పంపితే గాని వెళ్లారు మనవడిని వదిలి అనుకున్నాడు వినయ్.
ఉదయం ఫ్లైట్ లో బయలుదేరి ముంబై చేరుకున్నారు అదిదంపతులు. ఎయిర్పోర్ట్ కి కొడుకు వినయ్ వచ్చి తల్లిదండ్రులని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చాడు. పేరు కి ముంబై కానీ ఎన్ని పెద్ద బిల్డింగ్స్ వున్నాయో వాటికి మించి గుడిసెలు వున్నాయి. విపరీతంగా ట్రాఫిక్.
ఉదయం టిఫిన్ తినకుండా బయలుదేరటం తో 12 గంటలకే శ్రీకాంత్ కి నీరసంగా అనిపించింది. “అమ్మాయి.. నాకు అన్నం పెట్టేసేయ్, షుగర్ పడేడట్లు వుంది” అన్నాడు కోడలితో.
కంచంలో టొమోటో పప్పు, బెండకాయ వేపుడు వడ్డించింది కోడలు. నోట్లో పెట్టుకుని “బాగానే వండింది వంటావిడ” అన్నాడు శ్రీకాంత్.
అన్నం తిని, సోఫాలో కూర్చుని టాబ్లెట్స్ వేసుకుంటో, “ఏమో అనుకున్నాను కానీ, జానకమ్మ గారు బాగానే వండింది” అన్నాడు చదువుకుంటున్న మనవడితో
“జానకమ్మ ఎవ్వరు తాత, ఎప్పుడు పేర్లు తప్పే చెప్తావు, ఆవిడ పేరు మంగమ్మ, మన పనిమనిషి” అన్నాడు. మనవడి మాటకి శ్రీకాంత్ గుండెల్లో రాయి పడింది.
సాయంత్రం కొడుకు రాగానే ఆడిగాడు, “నిత్యం త్రికాల సంధ్యవంధానం చేసే నాకు పనిమనిషి ని తీసుకుని వచ్చి జానకమ్మ అని చెప్పి ఆ వంట తినిపిస్తావా, యింత ఘాతకం కి ఒడికట్టావ్ ఎందుకు” అన్నాడు.
“డాడీ హైదరాబాద్ లో మీరు తిన్న హోటల్ లో వంటవాడు అవధాని గాని, రావు గాని అనుకుంటున్నారా, అక్కడ తినగా లేనిది, యిప్పుడు మంగమ్మ అనగానే యిబ్బంది కలిగింది. చూడండి డాడీ ఈ నగరం లో మనిషి దొరకడమే కష్టం, సద్దుకోవాలి” అన్నాడు నవ్వుతు.
“రేపటి నుంచి ఆవిడ చేసిన వంట నేను తినను, నాకు అమ్మ వండుతుంది సెపరేట్ గా” అనేసి వేరే రూంలోకి వెళ్ళిపోయాడు శ్రీకాంత్.
‘నాన్నకి నిజంగానే కోపం వచ్చింది అనుకుంట’ అనుకుంటూ, “అసలు ఆవిడ విషయం నాన్నకి ఎవ్వరు చెప్పారు?” అన్నాడు భార్య తో.
“యింకెవ్వరు.. మన నారదుడు మీ అబ్బాయి వున్నాడు గా..” అంది.
మర్నాడు మంగమ్మ వచ్చి యిల్లు, అంట్లు తోమేసి, రాజమ్మ గా మారిపోయి చేతులు శుభ్రం గా కడుక్కుని వంట మొదలుపెట్టింది.
శ్రీకాంత్ భార్య ని పిలిచి “నేను ఆ వంట తినను, నువ్వు నాకు సెపరేట్ గా అన్నం కూర పప్పు వండు, కొద్దిగా ఆలస్యం అయినా పరవాలేదు” అన్నాడు.
“మీ చాదస్తం తో నా ప్రాణం మీదకి వచ్చింది, వంటావిడ చేసిన వంట వదిలేసి, మళ్ళీ నేను వండుతాను అంటే కోడలు ఏమనుకుంటుంది ఆండి, వడ్డన నేను చేస్తాను, కొద్దిగా యిక్కడ వున్ననాళ్ళు గొడవ పెట్టకండి, వచ్చే నెల వెళ్ళిపోదాం” అంది శ్రీకాంత్ భార్య.
“అయితే నేను శబరి లా పళ్లు తిని బతుకుతాను, అంతే తప్పా ఆ వంట నేను తినను” అన్నాడు. దానితో వంటావిడ వంట అయిన తరువాత, శ్రీకాంత్ కి వండి పెట్టడం చేస్తోంది.
నాలుగు రోజులు గడిచిన తరువాత ఈ విషయం వంటావిడ కి తెలిసిపోయింది. “అమ్మా! నేను వండిన వంట సార్ కి నచ్చడం లేదని, మళ్ళీ సెపరేట్ గా సార్ కి వండుతున్నారు, యింతోటీ దానికి నేను ఎందుకు, రేపటి నుంచి నేను రాను, మీరే వండుకోండి” అని చెప్పి డబ్బు తీసుకుని వెళ్ళిపోయింది.
“చెడకోట్టేదాకా మీకు నిద్ర పట్టలేదు కదా డాడీ, యిప్పుడు పర్వాలేదు, అమ్మ చేస్తోంది. రేపు మీరు వెళ్ళిపోతే మా గతి ఏమిటి, ఈ ముంబైలో ఉదయం 7 గంటలకు బయలుదేరితే కాని ఆఫీస్ టైమ్ కి చేరం. ఇహ మీ మకాం యిక్కడే, మనవడిని చూసుకుంటో వుండిపోండి” అన్నాడు వినయ్.
“నేను ఎప్పుడు యిక్కడికి వచ్చి వుండిపోవాలో నాకు తెలుసు, ఉదయమే లేచి పిల్లాడికి నాలుగు మెతుకులు వండుకోండి, నేను యిక్కడ వుండిపోతే అక్కడ రైతు మనపోలం కాస్తా లాగేస్తాడు. ఓపిక తగ్గినప్పుడు అన్నీ అమ్మేసి నీ దగ్గరికి ఎల్లాగో రాకతప్పదు, యిప్పుడు మమ్మల్ని వెళ్ళని, కావాలంటే ఆ మంగమ్మ నీ పిలిచి వండించుకోండి మేము వెళ్లిపోయామని చెప్పి” అన్నాడు శ్రీకాంత్. అనుకున్న ప్లాన్ ప్రకారం మొగుడు పెళ్ళాం హైదరాబాద్ వెళ్లిపోయారు.
పదిరోజులు కొడుకు ఫోన్ కూడా చేయ్యలేదు, తండ్రి తన మాట వినలేదు అని.
ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)