16-10-2025, 06:32 PM
"మా అమ్మాయే, మా ఇంటి లక్ష్మి. ఇంటికి వచ్చేది, కోడలు. అంతే. " అంది రాధ.
జరుగుతున్నదంతా చూస్తున్న జాగృతికి కోపం, చిరాకు పెరిగిపోయాయి. కానీ, అంతమంది పెద్దవాళ్ళ ఎదురుగా ఏమీ మాట్లాడలేక, మౌనంగా ఉండిపోయింది. 'సమర్థ్ అయినా ఏమైనా మాట్లాడచ్చు కదా' అనుకుని, సమర్థ్ ని చూసింది. జరుగుతున్నదాంతో తనకేమి సంబంధంలేనట్టు, మౌనంగా, తలదించుకుని కూర్చున్నాడు సమర్థ్.
జాగృతి, ఇక అక్కడ ఉండలేక, లేచి, లతని లోపలకి తీసుకు వెళ్లి, "నన్ను కట్నం తీసుకోనివాళ్ళకి ఇచ్చి చేస్తానన్నారు. దీన్నేనా కట్నం ఇవ్వకపోవడం, తీసుకోకపోవడం అంటారు?" అని అడిగింది.
"గట్టిగా మాట్లాడకు. వాళ్ళందరూ వింటారు. మనం దీని గురించి, వాళ్ళు వెళ్ళాక, మాట్లాడుకుందాం. " అంది లత.
"వాళ్ళు వెళ్ళాక, ఇంక మాట్లాడుకోవడానికి ఏముంటుంది? నేను చదువుకున్నాను, సంపాదిస్తున్నాను. అయినా కట్నం ఎందుకు ఇవ్వాలి? చదువుకోకపోయినా, సంపాదించక పోయినా ఇవ్వక్కరలేదు. ఏమీ చేతకానివాళ్ళలాగా, మీరే అమ్మాయిని, కట్నాన్ని ఇచ్చి చెయ్యాలా? ఏం వాళ్ళ అబ్బాయికి, అమ్మాయి అక్కరలేదా?" అంది జాగృతి కోపంగా.
"ష్.. మనం తరువాత మాట్లాడుకుందాం అన్నానుకదా. " అని చెప్పి బయటకి వెళ్ళిపోయింది లత.
దామోదరం, పెళ్లి రోజుని, నిశ్చయించాక, తీసుకున్న కానుకలతో, సంతోషంగా వెళ్లారు సమర్థ్ తరపువాళ్ళు.
"జాగృతికి కాబోయే అత్తగారు, ఎవరు ఎంత మాట్లాడాలో, ముందే నిర్ణయించినట్టుంది. ఎవరి పాత్రలు వాళ్ళు చక్కగా పోషించారు. కొడుకుకి ఈ రోజు ఏ పోర్షన్ లేదేమో. జరుగుతున్నదంతా, మౌనంగా, చూస్తూ కూర్చున్నాడు. " అన్నాడు కృష్ణమూర్తి.
"భర్త మాట్లాడడానికి ప్రయత్నించినా, ఆవిడ మాట్లాడనివ్వలేదు. " అంది లలిత.
"రాణి అని, లక్ష్మి అని పిలవటం ఇష్టంలేదుట వాళ్ళకి. మన రాణి ఎలా భరిస్తుందో ఏమిటో ఆవిడని?" అంది రుక్మిణి బాధగా.
"వాళ్ళు కట్నం అడిగారని మీరు నాకు ముందే ఎందుకు చెప్పలేదు వదినా " అని లతని అడిగాడు పార్థసారథి.
"నేను, ముందే కొంత డబ్బు తెచ్చిపెట్టుకున్నాను. వాళ్ళు ఏమీ అడగకపోయినా, నేను సంతోషంగా ఇచ్చి ఉండేదాన్ని. " అంది లత.
"కానుకల పేరుతొ, కట్నం తీసుకున్నారు. మనకి నచ్చి, ఇచ్చామంటే అర్ధం ఉంది. కానీ వాళ్ళు అడిగి తీసుకున్నారు. ఆ అబ్బాయిని మీరు చదివించినట్టు అయ్యింది. అమ్మా, వీళ్ళు నాకు నచ్చలేదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పెయ్యండి వాళ్ళకి. " అంది జాగృతి కోపంగా.
"ఇంతవరకూ వచ్చాక, పెళ్లి వద్దంటే ఎలా? పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. " అంది లత.
"అమ్మా, ఆవిడ, మాట తీరు, ప్రవర్తన చూసారా ఎలా ఉన్నాయో? వచ్చిన చుట్టాలు అందరూ ఆవిడవైపు వాళ్లే. ఇవన్నీ చూస్తూ కూడా మీకేమి అర్ధం కాలేదా?" అంది జాగృతి.
"కొంతమంది ఆడవాళ్లు అలా ఉంటారు. అయినా, నువ్వు కలిసి ఉండాల్సింది అబ్బాయితో. అబ్బాయి మంచివాడిలాగా ఉన్నాడు. నిన్ను బాగా చూసుకుంటాడు. నన్ను నమ్ము. ఇంతవరకూ వచ్చాక, పెళ్లి ఆగిపోయింది అని చెడ్డపేరు తెచ్చుకోవద్దు మనం. " అని జాగృతిని బతిమాలుకుంది లత.
జాగృతి, సమర్థ్ ల పెళ్లి జరిగింది.
"సమర్థ్ ని MBA చదివించడానికి అయిన ఖర్చు, జాగృతి అత్తగారి నడుముపై తళతళలాడుతోంది. చూసావా" అంది లలిత, రుక్మిణి తో.
"అవును. అత్తగారు, ఆడపడచు లాంఛనాలు, జాగృతి ఆడపడుచు మేడలో మెరుస్తున్నాయి. " అంది రుక్మిణి.
"అత్తగారు, ఆడపడుచు ఆర్భాటమే ఎక్కువ ఉంది ఈ పెళ్ళిలో. పాపం పెళ్ళికొడుకుని ఎవరూ పట్టించుకుంటున్నట్టు లేరు. " అన్నాడు కృష్ణమూర్తి.
మాణిక్యాలరావు, రాధకి కనపడకుండా, పార్థసారథి, కృష్ణమూర్తిల దగ్గరకి వచ్చి, "మీరు చేస్తున్న మర్యాదలు చాలా బాగున్నాయి. మావాళ్లు అందరూ కూడా అదే అనుకుంటున్నారు. మా అందరికీ, ఏమీ చెయ్యకపోయినా, మేమెవ్వరం ఏమీ అనుకోము. కానీ, మా ఆవిడకి, కూతురికి మాత్రం ఏమీ తగ్గకుండా చూసుకోండి. " అని చెప్పి వెళ్ళాడు. అది ముందే మాకు అర్ధం అయ్యింది అన్నట్టు మొహాలు చూసుకున్నారు ఇద్దరూ.
"కట్నం ఎంత తీసుకున్నావేంటి?" అని రాధ చుట్టం అడిగిన ప్రశ్నకు, "కట్నం ఏమీ లేదు. తండ్రిలేని పిల్ల కదా, జాలి పడి, కట్నం తీసుకోకుండానే పెళ్ళికి ఒప్పుకున్నాం. " అంది రాధ, తన కూతురి మెడలో హారాన్ని సర్ది, తన వడ్డాణాన్ని కూడా సర్దుకుంటూ.
జాగృతి, కట్నం తీసుకోని అబ్బాయినే పెళ్లి చేసుకుందా? ఏమో మరి.
***
జరుగుతున్నదంతా చూస్తున్న జాగృతికి కోపం, చిరాకు పెరిగిపోయాయి. కానీ, అంతమంది పెద్దవాళ్ళ ఎదురుగా ఏమీ మాట్లాడలేక, మౌనంగా ఉండిపోయింది. 'సమర్థ్ అయినా ఏమైనా మాట్లాడచ్చు కదా' అనుకుని, సమర్థ్ ని చూసింది. జరుగుతున్నదాంతో తనకేమి సంబంధంలేనట్టు, మౌనంగా, తలదించుకుని కూర్చున్నాడు సమర్థ్.
జాగృతి, ఇక అక్కడ ఉండలేక, లేచి, లతని లోపలకి తీసుకు వెళ్లి, "నన్ను కట్నం తీసుకోనివాళ్ళకి ఇచ్చి చేస్తానన్నారు. దీన్నేనా కట్నం ఇవ్వకపోవడం, తీసుకోకపోవడం అంటారు?" అని అడిగింది.
"గట్టిగా మాట్లాడకు. వాళ్ళందరూ వింటారు. మనం దీని గురించి, వాళ్ళు వెళ్ళాక, మాట్లాడుకుందాం. " అంది లత.
"వాళ్ళు వెళ్ళాక, ఇంక మాట్లాడుకోవడానికి ఏముంటుంది? నేను చదువుకున్నాను, సంపాదిస్తున్నాను. అయినా కట్నం ఎందుకు ఇవ్వాలి? చదువుకోకపోయినా, సంపాదించక పోయినా ఇవ్వక్కరలేదు. ఏమీ చేతకానివాళ్ళలాగా, మీరే అమ్మాయిని, కట్నాన్ని ఇచ్చి చెయ్యాలా? ఏం వాళ్ళ అబ్బాయికి, అమ్మాయి అక్కరలేదా?" అంది జాగృతి కోపంగా.
"ష్.. మనం తరువాత మాట్లాడుకుందాం అన్నానుకదా. " అని చెప్పి బయటకి వెళ్ళిపోయింది లత.
దామోదరం, పెళ్లి రోజుని, నిశ్చయించాక, తీసుకున్న కానుకలతో, సంతోషంగా వెళ్లారు సమర్థ్ తరపువాళ్ళు.
"జాగృతికి కాబోయే అత్తగారు, ఎవరు ఎంత మాట్లాడాలో, ముందే నిర్ణయించినట్టుంది. ఎవరి పాత్రలు వాళ్ళు చక్కగా పోషించారు. కొడుకుకి ఈ రోజు ఏ పోర్షన్ లేదేమో. జరుగుతున్నదంతా, మౌనంగా, చూస్తూ కూర్చున్నాడు. " అన్నాడు కృష్ణమూర్తి.
"భర్త మాట్లాడడానికి ప్రయత్నించినా, ఆవిడ మాట్లాడనివ్వలేదు. " అంది లలిత.
"రాణి అని, లక్ష్మి అని పిలవటం ఇష్టంలేదుట వాళ్ళకి. మన రాణి ఎలా భరిస్తుందో ఏమిటో ఆవిడని?" అంది రుక్మిణి బాధగా.
"వాళ్ళు కట్నం అడిగారని మీరు నాకు ముందే ఎందుకు చెప్పలేదు వదినా " అని లతని అడిగాడు పార్థసారథి.
"నేను, ముందే కొంత డబ్బు తెచ్చిపెట్టుకున్నాను. వాళ్ళు ఏమీ అడగకపోయినా, నేను సంతోషంగా ఇచ్చి ఉండేదాన్ని. " అంది లత.
"కానుకల పేరుతొ, కట్నం తీసుకున్నారు. మనకి నచ్చి, ఇచ్చామంటే అర్ధం ఉంది. కానీ వాళ్ళు అడిగి తీసుకున్నారు. ఆ అబ్బాయిని మీరు చదివించినట్టు అయ్యింది. అమ్మా, వీళ్ళు నాకు నచ్చలేదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పెయ్యండి వాళ్ళకి. " అంది జాగృతి కోపంగా.
"ఇంతవరకూ వచ్చాక, పెళ్లి వద్దంటే ఎలా? పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. " అంది లత.
"అమ్మా, ఆవిడ, మాట తీరు, ప్రవర్తన చూసారా ఎలా ఉన్నాయో? వచ్చిన చుట్టాలు అందరూ ఆవిడవైపు వాళ్లే. ఇవన్నీ చూస్తూ కూడా మీకేమి అర్ధం కాలేదా?" అంది జాగృతి.
"కొంతమంది ఆడవాళ్లు అలా ఉంటారు. అయినా, నువ్వు కలిసి ఉండాల్సింది అబ్బాయితో. అబ్బాయి మంచివాడిలాగా ఉన్నాడు. నిన్ను బాగా చూసుకుంటాడు. నన్ను నమ్ము. ఇంతవరకూ వచ్చాక, పెళ్లి ఆగిపోయింది అని చెడ్డపేరు తెచ్చుకోవద్దు మనం. " అని జాగృతిని బతిమాలుకుంది లత.
జాగృతి, సమర్థ్ ల పెళ్లి జరిగింది.
"సమర్థ్ ని MBA చదివించడానికి అయిన ఖర్చు, జాగృతి అత్తగారి నడుముపై తళతళలాడుతోంది. చూసావా" అంది లలిత, రుక్మిణి తో.
"అవును. అత్తగారు, ఆడపడచు లాంఛనాలు, జాగృతి ఆడపడుచు మేడలో మెరుస్తున్నాయి. " అంది రుక్మిణి.
"అత్తగారు, ఆడపడుచు ఆర్భాటమే ఎక్కువ ఉంది ఈ పెళ్ళిలో. పాపం పెళ్ళికొడుకుని ఎవరూ పట్టించుకుంటున్నట్టు లేరు. " అన్నాడు కృష్ణమూర్తి.
మాణిక్యాలరావు, రాధకి కనపడకుండా, పార్థసారథి, కృష్ణమూర్తిల దగ్గరకి వచ్చి, "మీరు చేస్తున్న మర్యాదలు చాలా బాగున్నాయి. మావాళ్లు అందరూ కూడా అదే అనుకుంటున్నారు. మా అందరికీ, ఏమీ చెయ్యకపోయినా, మేమెవ్వరం ఏమీ అనుకోము. కానీ, మా ఆవిడకి, కూతురికి మాత్రం ఏమీ తగ్గకుండా చూసుకోండి. " అని చెప్పి వెళ్ళాడు. అది ముందే మాకు అర్ధం అయ్యింది అన్నట్టు మొహాలు చూసుకున్నారు ఇద్దరూ.
"కట్నం ఎంత తీసుకున్నావేంటి?" అని రాధ చుట్టం అడిగిన ప్రశ్నకు, "కట్నం ఏమీ లేదు. తండ్రిలేని పిల్ల కదా, జాలి పడి, కట్నం తీసుకోకుండానే పెళ్ళికి ఒప్పుకున్నాం. " అంది రాధ, తన కూతురి మెడలో హారాన్ని సర్ది, తన వడ్డాణాన్ని కూడా సర్దుకుంటూ.
జాగృతి, కట్నం తీసుకోని అబ్బాయినే పెళ్లి చేసుకుందా? ఏమో మరి.
***
ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)