16-10-2025, 06:29 PM
(This post was last modified: 16-10-2025, 06:31 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
కట్నం తీసుకున్నారా?
[/url]
[font="var(--ricos-font-family,unset)", serif] [/font]
(అత్తగారి కథలు - పార్ట్ 5)
రచన: L. V. జయ
జాగృతి, ఇంజనీరింగ్ చదివి, IT కంపెనీ లో ఉద్యోగం చేస్తోంది. కట్నాలు తీసుకోడాన్ని, ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తుంది. పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు, కట్నం తీసుకోను అన్న అబ్బాయినే చేసుకుంటాను అని వాళ్ళ అమ్మ లతతో చెప్పింది. లత కూడా అందుకు సమ్మతించింది.
సమర్థ్ తో జరిగిన పెళ్ళిచూపుల్లో, సమర్థ్ కానీ, వాళ్ళ అమ్మ రాధ కానీ, కట్నం ప్రస్తావన తేనందుకు ఆనందపడ్డారు లత, జాగృతి. సమర్థ్ కి, జాగృతి నచ్చి, పెళ్లి నిశ్చయం చేసుకున్నారు.
పెళ్లి మాటల కోసం ఇరువైపుల బంధువులు లత ఇంట్లో కలిశారు. అందరి పరిచయాలు అయ్యాక, "అమ్మాయి, అమ్మాయి తరుపు కుటుంబం ఎలా ఉందొ చూసి చెప్తారని మా వాళ్ళని కూడా రమ్మన్నాను" అంది రాధ నవ్వుతూ.
"పెళ్లి నిశ్చయం అయ్యి, పెళ్లి మాటలకి కదా వచ్చాము. ఇప్పుడు ఇంకా ఏం చూసి చెప్తారు?" అన్నాడు మాణిక్యాలరావు. మాణిక్యాలరావుని ఆగమని సౌంజ్ఞ చేసింది రాధ.
"మీ వాళ్ళందరిని కలవడం మాకు చాలా సంతోషంగా ఉందండి. " అంది లత.
"అందరం కలిసాం కాబట్టి, పెళ్లి ఎప్పుడు, ఎక్కడ చెయ్యాలి అన్న విషయాలు మాట్లాడుకోవచ్చు. మీ పద్ధతులు గురించి చెప్పండి బావగారు" అని మాణిక్యాలరావుని అడిగాడు లత మరిది పార్థసారథి.
"ఆయనకేమి తెలియదు. మా తమ్ముడు దామోదరం, పురోహితుడు కదా. మా పద్ధతులు, లాంఛనాలు గురించి, బాగా తెలుసు. చెప్పరా దామోదరం" అంటూ దామోదరం వైపు చూసింది రాధ.
దామోదరం, తన లాల్చీ జేబులోంచి, ముక్కపొడి డబ్బాని తీసి, "లాంఛనాలు, పద్ధతులు గురించే కదా. మాట్లాడుకుందాం" అని, నషాళానికి తగిలేలా ముక్కిపోడిని పీల్చి, పిలక ముడి వేస్తూ, "మా వాడ్ని, MBA వరకూ చదివించింది మా అక్క. దాని కోసం ఎంతోకొంత ఖర్చు అయ్యి ఉంటుంది కదా. ఏమంటారు పార్థసారథిగారు?" అన్నాడు దామోదరం, పార్థసారథిని సూటిగా చూస్తూ.
'కట్నం అడుగుతున్నారా వీళ్ళు?' అన్న అనుమానం వచ్చి, ఏం సమాధానం చెప్పాలో తెలియక, లత వైపు చూసాడు పార్థసారథి.
లత, తన చేతిలో ఉన్న పర్సులోంచి, కొంత డబ్బు తీసి, మాణిక్యాలరావుకి ఇవ్వమని, పార్థసారథి చేతిలో పెట్టింది. "మాకేమి వద్దండి. ఇలాంటివి ఇప్పుడేం పెట్టుకోకండి. " అన్నాడు మాణిక్యాలరావు.
"అబ్బాయికి, గిఫ్టుగా ఇస్తున్నాం అన్నయ్యగారు. తీసుకోండి. " అంది లత.
"గిఫ్ట్ అన్నారు కాబట్టి తీసుకుంటాం. మన అబ్బాయిలో ఎదో వెలితి ఉంది. అందుకే ఏమీ తీసుకోకుండా పెళ్ళికి ఒప్పుకున్నారు అని అనుకుంటారు అందరూ. " అంటూ పార్థసారథి చేతిలోని డబ్బు తీసుకుని, బ్యాగ్ లో పెట్టుకుంది రాధ. తరువాత, అక్క కొడుకు నాగేశ్వరరావు వైపు చూసింది.
నాగేశ్వరరావు, వక్కపొడి నములుతూ, "అబ్బాయికేనా గిఫ్టులు? కష్టపడి కన్న తల్లికి, తోడబుట్టినదానికి లేవా? ఎక్కడో లెక్క సరిపోవటం లేదే పిన్నీ. " అన్నాడు రాధని చూస్తూ.
రాధ నవ్వుతూ, "మా నాగేశం, లెక్కల మాస్టారు కదా. వాడికి అన్నిటికీ లెక్క సరిపోవాలి. " అంది లతతో.
లత ఇంర్కొంటా డబ్బు తీసి, "ఇవి మీకు, మీ అమ్మాయికి. మీకు నచ్చినవి ఏమైనా తీసుకోండి వదినగారు. " అంటూ కొంత డబ్బు తీసి, రాధ చేతిలో పెట్టింది లత.
"కట్నం తీసుకున్నాన్న చెడ్డపేరు నాకు వద్దు. ఇది నా కూతురుకి ఇచ్చేస్తాను" అని తీసుకున్న డబ్బుని బ్యాగ్ లో పెట్టుకుంది రాధ.
"అబ్బాయి, అత్తగారు, ఆడపడుచు, కానుకలు అయ్యాయి మరి. పెళ్ళిలో, అబ్బాయికి పెట్టేవాటి సంగతి ఏమిటి?" అన్నాడు నాగేశ్వరరావు.
"వాళ్ళు ఇవ్వాల్సిన ఉంగరం, గొలుసు, వెండి కంచం, గ్లాసు, వెండి జంధ్యం ఇవన్నీ ఎలాగూ ఇస్తారు. వాళ్ళ అల్లుడుకి, ఇంకా ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఇష్టం. మనమేమి అడగం. ఇస్తే, కాదనం. " వెటకారంగా నవ్వుతూ అన్నాడు దామోదరం.
"అబ్బాయికి మీరు అడిగినవన్నీ పెళ్ళిలో పెడతాం వదినగారు. " అంది లత.
"బాబోయ్. మేమేమీ అడగలేదు. మీరే, మీకు కాబోయే అల్లుడికి పెట్టుకుంటున్నారు. చెప్పడం మర్చిపోయాం. పెళ్ళిలో బిందెలు ఆడపడుచుకి వెళ్తాయి. మంచివి పెట్టండి. ఇంకా, మాకు పెట్టే బట్టలు, కంచి కానీ, ధర్మవరం గాని వెళ్లి కొందాం. " అంది రాధ నవ్వుతూ.
అంతవరకూ అందరి మాటలు వింటూ, సోఫా లో చారబడి కూర్చున్న మరదలు అనసూయని చూసింది రాధ. అనసూయ, వెంటనే, నిటారుగా కూర్చుని, "అమ్మాయికి పెద్దగా బంగారం ఏమీ చేయించినట్టులేరు. చెవులకి, మెడకి అంత చిన్నవి పెట్టుకుంది. " అని అడిగింది లతని.
"చేయించామండి. ఎప్పుడూ, ఇలా చిన్నవే పెట్టుకోవడానికి ఇష్టపడుతుంది మా అమ్మాయి. " అంది లత.
అనసూయని మళ్ళీ చూసింది రాధ. "ఏమున్నాయో ఏమో? చూస్తేనే కదా తెలిసేది. " అంది అనసూయ.
జాగృతికి ఉన్న బంగారాన్ని తెచ్చింది లత. బంగారాన్ని, కళ్ళార్పకుండా చూస్తూ, "అమ్మాయికి ఏం నగలు ఉన్నాయో చూసి దాన్ని బట్టి మేము పెట్టాల్సినవి పెడదామని అనుకున్నారు మా వదినగారు. అందుకే అడిగాను. ఏమీ అనుకోకండి అక్కయ్యగారు. " అంది అనసూయ లతతో.
మాట మధ్యలో తన పేరుని తెచ్చిన అనసూయని కోపంగా చూస్తూ, "ఏమీ అనుకోరులే. అమ్మాయికి ఉన్న బంగారం సరిపోతుంది. మేమేమీ పెట్టక్కరలేదన్నమాట అయితే. " అంది రాధ నవ్వుతూ.
రాధ మాట తీరుకి, ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు లత చెల్లెలు రుక్మిణి, లత తోటికోడలు లలిత.
'వచ్చినవాళ్ళందరూ మాట్లాడారు, నేనూ ఎదో ఒకటి అడగకపోతే బాగుండదేమో' అనుకున్న రాధ అక్క కోడలు సరిత, "మీరందరూ జాగృతిని ఏమని పిలుస్తారు ఇంట్లో. నా చెల్లెల్ని మేము ఏమని పిలవాలి?" అంటూ జాగృతి దగ్గరికి వచ్చి, కూర్చుంది.
"రాణి అని పిలుస్తాము. మా ఇంట్లో పుట్టిన మొదటి అమ్మాయి. మీరు కూడా అలానే పిలవచ్చు. " అన్నాడు పార్థసారథి.
ప్రశ్న అడిగిన సరితని కోపంగా చూస్తూ, "మా ఇంటికి వచ్చాక, ఇంక రాణి ఏంటి?" అంది రాధ.
"పోనీ, లక్ష్మి అని పిలవండి. ఇంకనుండి, మా అమ్మాయి, మీ ఇంటి లక్ష్మి కదా. మా రుక్మిణి ని కూడా మేము లక్ష్మి అనే పిలుస్తాం. " అన్నాడు రుక్మిణి భర్త కృష్ణమూర్తి.
[/url][font="var(--ricos-font-family,unset)", serif] [/font]
(అత్తగారి కథలు - పార్ట్ 5)
రచన: L. V. జయ
జాగృతి, ఇంజనీరింగ్ చదివి, IT కంపెనీ లో ఉద్యోగం చేస్తోంది. కట్నాలు తీసుకోడాన్ని, ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తుంది. పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు, కట్నం తీసుకోను అన్న అబ్బాయినే చేసుకుంటాను అని వాళ్ళ అమ్మ లతతో చెప్పింది. లత కూడా అందుకు సమ్మతించింది.
సమర్థ్ తో జరిగిన పెళ్ళిచూపుల్లో, సమర్థ్ కానీ, వాళ్ళ అమ్మ రాధ కానీ, కట్నం ప్రస్తావన తేనందుకు ఆనందపడ్డారు లత, జాగృతి. సమర్థ్ కి, జాగృతి నచ్చి, పెళ్లి నిశ్చయం చేసుకున్నారు.
పెళ్లి మాటల కోసం ఇరువైపుల బంధువులు లత ఇంట్లో కలిశారు. అందరి పరిచయాలు అయ్యాక, "అమ్మాయి, అమ్మాయి తరుపు కుటుంబం ఎలా ఉందొ చూసి చెప్తారని మా వాళ్ళని కూడా రమ్మన్నాను" అంది రాధ నవ్వుతూ.
"పెళ్లి నిశ్చయం అయ్యి, పెళ్లి మాటలకి కదా వచ్చాము. ఇప్పుడు ఇంకా ఏం చూసి చెప్తారు?" అన్నాడు మాణిక్యాలరావు. మాణిక్యాలరావుని ఆగమని సౌంజ్ఞ చేసింది రాధ.
"మీ వాళ్ళందరిని కలవడం మాకు చాలా సంతోషంగా ఉందండి. " అంది లత.
"అందరం కలిసాం కాబట్టి, పెళ్లి ఎప్పుడు, ఎక్కడ చెయ్యాలి అన్న విషయాలు మాట్లాడుకోవచ్చు. మీ పద్ధతులు గురించి చెప్పండి బావగారు" అని మాణిక్యాలరావుని అడిగాడు లత మరిది పార్థసారథి.
"ఆయనకేమి తెలియదు. మా తమ్ముడు దామోదరం, పురోహితుడు కదా. మా పద్ధతులు, లాంఛనాలు గురించి, బాగా తెలుసు. చెప్పరా దామోదరం" అంటూ దామోదరం వైపు చూసింది రాధ.
దామోదరం, తన లాల్చీ జేబులోంచి, ముక్కపొడి డబ్బాని తీసి, "లాంఛనాలు, పద్ధతులు గురించే కదా. మాట్లాడుకుందాం" అని, నషాళానికి తగిలేలా ముక్కిపోడిని పీల్చి, పిలక ముడి వేస్తూ, "మా వాడ్ని, MBA వరకూ చదివించింది మా అక్క. దాని కోసం ఎంతోకొంత ఖర్చు అయ్యి ఉంటుంది కదా. ఏమంటారు పార్థసారథిగారు?" అన్నాడు దామోదరం, పార్థసారథిని సూటిగా చూస్తూ.
'కట్నం అడుగుతున్నారా వీళ్ళు?' అన్న అనుమానం వచ్చి, ఏం సమాధానం చెప్పాలో తెలియక, లత వైపు చూసాడు పార్థసారథి.
లత, తన చేతిలో ఉన్న పర్సులోంచి, కొంత డబ్బు తీసి, మాణిక్యాలరావుకి ఇవ్వమని, పార్థసారథి చేతిలో పెట్టింది. "మాకేమి వద్దండి. ఇలాంటివి ఇప్పుడేం పెట్టుకోకండి. " అన్నాడు మాణిక్యాలరావు.
"అబ్బాయికి, గిఫ్టుగా ఇస్తున్నాం అన్నయ్యగారు. తీసుకోండి. " అంది లత.
"గిఫ్ట్ అన్నారు కాబట్టి తీసుకుంటాం. మన అబ్బాయిలో ఎదో వెలితి ఉంది. అందుకే ఏమీ తీసుకోకుండా పెళ్ళికి ఒప్పుకున్నారు అని అనుకుంటారు అందరూ. " అంటూ పార్థసారథి చేతిలోని డబ్బు తీసుకుని, బ్యాగ్ లో పెట్టుకుంది రాధ. తరువాత, అక్క కొడుకు నాగేశ్వరరావు వైపు చూసింది.
నాగేశ్వరరావు, వక్కపొడి నములుతూ, "అబ్బాయికేనా గిఫ్టులు? కష్టపడి కన్న తల్లికి, తోడబుట్టినదానికి లేవా? ఎక్కడో లెక్క సరిపోవటం లేదే పిన్నీ. " అన్నాడు రాధని చూస్తూ.
రాధ నవ్వుతూ, "మా నాగేశం, లెక్కల మాస్టారు కదా. వాడికి అన్నిటికీ లెక్క సరిపోవాలి. " అంది లతతో.
లత ఇంర్కొంటా డబ్బు తీసి, "ఇవి మీకు, మీ అమ్మాయికి. మీకు నచ్చినవి ఏమైనా తీసుకోండి వదినగారు. " అంటూ కొంత డబ్బు తీసి, రాధ చేతిలో పెట్టింది లత.
"కట్నం తీసుకున్నాన్న చెడ్డపేరు నాకు వద్దు. ఇది నా కూతురుకి ఇచ్చేస్తాను" అని తీసుకున్న డబ్బుని బ్యాగ్ లో పెట్టుకుంది రాధ.
"అబ్బాయి, అత్తగారు, ఆడపడుచు, కానుకలు అయ్యాయి మరి. పెళ్ళిలో, అబ్బాయికి పెట్టేవాటి సంగతి ఏమిటి?" అన్నాడు నాగేశ్వరరావు.
"వాళ్ళు ఇవ్వాల్సిన ఉంగరం, గొలుసు, వెండి కంచం, గ్లాసు, వెండి జంధ్యం ఇవన్నీ ఎలాగూ ఇస్తారు. వాళ్ళ అల్లుడుకి, ఇంకా ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఇష్టం. మనమేమి అడగం. ఇస్తే, కాదనం. " వెటకారంగా నవ్వుతూ అన్నాడు దామోదరం.
"అబ్బాయికి మీరు అడిగినవన్నీ పెళ్ళిలో పెడతాం వదినగారు. " అంది లత.
"బాబోయ్. మేమేమీ అడగలేదు. మీరే, మీకు కాబోయే అల్లుడికి పెట్టుకుంటున్నారు. చెప్పడం మర్చిపోయాం. పెళ్ళిలో బిందెలు ఆడపడుచుకి వెళ్తాయి. మంచివి పెట్టండి. ఇంకా, మాకు పెట్టే బట్టలు, కంచి కానీ, ధర్మవరం గాని వెళ్లి కొందాం. " అంది రాధ నవ్వుతూ.
అంతవరకూ అందరి మాటలు వింటూ, సోఫా లో చారబడి కూర్చున్న మరదలు అనసూయని చూసింది రాధ. అనసూయ, వెంటనే, నిటారుగా కూర్చుని, "అమ్మాయికి పెద్దగా బంగారం ఏమీ చేయించినట్టులేరు. చెవులకి, మెడకి అంత చిన్నవి పెట్టుకుంది. " అని అడిగింది లతని.
"చేయించామండి. ఎప్పుడూ, ఇలా చిన్నవే పెట్టుకోవడానికి ఇష్టపడుతుంది మా అమ్మాయి. " అంది లత.
అనసూయని మళ్ళీ చూసింది రాధ. "ఏమున్నాయో ఏమో? చూస్తేనే కదా తెలిసేది. " అంది అనసూయ.
జాగృతికి ఉన్న బంగారాన్ని తెచ్చింది లత. బంగారాన్ని, కళ్ళార్పకుండా చూస్తూ, "అమ్మాయికి ఏం నగలు ఉన్నాయో చూసి దాన్ని బట్టి మేము పెట్టాల్సినవి పెడదామని అనుకున్నారు మా వదినగారు. అందుకే అడిగాను. ఏమీ అనుకోకండి అక్కయ్యగారు. " అంది అనసూయ లతతో.
మాట మధ్యలో తన పేరుని తెచ్చిన అనసూయని కోపంగా చూస్తూ, "ఏమీ అనుకోరులే. అమ్మాయికి ఉన్న బంగారం సరిపోతుంది. మేమేమీ పెట్టక్కరలేదన్నమాట అయితే. " అంది రాధ నవ్వుతూ.
రాధ మాట తీరుకి, ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు లత చెల్లెలు రుక్మిణి, లత తోటికోడలు లలిత.
'వచ్చినవాళ్ళందరూ మాట్లాడారు, నేనూ ఎదో ఒకటి అడగకపోతే బాగుండదేమో' అనుకున్న రాధ అక్క కోడలు సరిత, "మీరందరూ జాగృతిని ఏమని పిలుస్తారు ఇంట్లో. నా చెల్లెల్ని మేము ఏమని పిలవాలి?" అంటూ జాగృతి దగ్గరికి వచ్చి, కూర్చుంది.
"రాణి అని పిలుస్తాము. మా ఇంట్లో పుట్టిన మొదటి అమ్మాయి. మీరు కూడా అలానే పిలవచ్చు. " అన్నాడు పార్థసారథి.
ప్రశ్న అడిగిన సరితని కోపంగా చూస్తూ, "మా ఇంటికి వచ్చాక, ఇంక రాణి ఏంటి?" అంది రాధ.
"పోనీ, లక్ష్మి అని పిలవండి. ఇంకనుండి, మా అమ్మాయి, మీ ఇంటి లక్ష్మి కదా. మా రుక్మిణి ని కూడా మేము లక్ష్మి అనే పిలుస్తాం. " అన్నాడు రుక్మిణి భర్త కృష్ణమూర్తి.
ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)