12-10-2025, 04:24 PM
హస్తి మహారాజు సప్త మహర్షులను పెళ్ళి పెద్దలుగా చేసి దశార్హ మహారాజు దగ్గరకు పంపాడు. హస్తినాపురం నుండి సప్త మహర్షులు పెళ్ళి పెద్దలుగా వస్తున్నారన్న విషయం దశార్హ మహారాజు కు వేగుల ద్వారా తెలిసింది. అంత దశార్హ మహారాజు సప్త మహర్షులను శాస్త్రోక్తంగా, మంత్రోక్తంగా ఘనంగా సన్మానించండి అని పుర పురోహితులను ప్రార్థించాడు.
రాజు మాటలను అనుసరించి, పుర పురోహితులు "కశ్యపోత్రి భరద్వాజాః విశ్వామిత్రోథ గౌతమః జమదగ్నిర్వశిష్టశ్చ సప్తైతే ఋషయః స్మృతాః ఓం సప్త ఋషిభ్యో నమః. ఓం కశ్యపో నమః ఓం అత్రో నమః ఓం భరద్వాజో నమః ఓం విశ్వామిత్రో నమః ఓం గౌతమో నమః ఓం జమదగ్నో నమః ఓం వశిష్టో నమః" అంటూ ధర్మ పత్నీ సమేతులైన సప్త మహర్షులను పలు విధాలుగా స్తుతిస్తూ రాజు గారి అంతఃపురానికి ఆహ్వానించారు.
దశార్హ మహారాజు సప్త మహర్షులకు సాష్టాంగ పడి నమస్కారం చేసి వారి ఆశీర్వాదాలను తీసుకున్నాడు. అనంతరం రాజు గారి భార్య, రాజు గారి కుమార్తె వసుదేవా తదితరులందరూ సప్త మహర్షుల ఆశీర్వాదాలను తీసుకున్నారు.
"బ్రహ్మ మనసునుండి జనించిన సప్త మహర్షులను వసుదేవా నయనానందంతో తనివితీరా చూస్తూ, వారి జ్ఞాన తేజాన్ని గమనించింది. వసుదేవా లోని శ్రీ మహాలక్ష్మీ అంశను గమనించిన సప్త మహర్షులు ఆ అంశకు పరిపూర్ణ హృదయంతో భార్యా సమేతంగా నమస్కరించారు.
అనంతరం దశార్హ మహారాజు "ధర్మపత్నీ సమేతులై వచ్చిన సప్త మహర్షుల రాకకు కారణం తెలుసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాను. సంస్కృతీ సంప్రదాయ సంరక్షణ నిమిత్తం బ్రహ్మ చే నియమించబడిన మహానుభావులారా! బ్రహ్మ తత్వాన్ని అర్థం చేసుకున్న బ్రహ్మర్షులారా! మహా శివుని నుండి అనేక విద్యలను పొందిన మహానుభావులారా!
సుర జ్ఞాన సంరక్షకులారా! మా రాకకు కారణం ఇది అని ఆజ్ఞాపించండి. మీ ఆజ్ఞ ను శిరసావహిస్తాను. " అని సప్త మహర్షులతో అన్నాడు.
దశార్హ మహారాజు మాటలను విన్న సప్త మహర్షులు దశార్హ మహారాజు ను ఆశీర్వదిస్తు తాము వచ్చిన కారణాన్ని చెప్పారు. అనంతరం ఒక్కొక్క మహర్షి వికుంఠునునిలో ఉన్న ఒక మంచి గుణాన్ని, చిన్నప్పటి అతని ఒక చెడు గుణాన్ని వివరించి చెప్పారు. వికుంఠునుడు చెడు నుంచి మంచి కి వచ్చిన విధానాన్ని అందలి దైవ తత్వాన్ని కూలంకషంగా వివరించారు.
సప్త మహర్షుల మాటలను విన్న దశార్హ మహారాజు మరో ఆలోచన చేయకుండా తన కుమార్తె వసుదేవాను వికుంఠునుకి ఇచ్చి వివాహం చేయడానికి తన సమ్మతిని తెలిపాడు. ఆపై భార్య కుమార్తె ల ముఖం చూసాడు. వారు కూడా కనులతోనే తమ సమ్మతిని తెలిపారు. అందరి వదనాలు ఆనంద సంద్రంలో తేలియాడాయి. అది గమనించిన సప్త మహర్షులు తాము వచ్చిన పని శీఘ్రంగా శుభమయమైంది అని అనుకున్నారు. దశార్హ మహారాజు వద్ద సెలవు తీసుకున్నారు.
సప్త మహర్షులు హస్తినాపురానికి వచ్చి, హస్తి మహారాజు కు యశోధర కు దశార్హ మహారాజు హృదయాన్ని కాబోయే పెళ్లి కూతురు వసుదేవా హృదయాన్ని తదితరుల హృదయాలను
తెలియ చేసారు.
హస్తి మహారాజు, యశోధర, దశార్హ మహారాజు ల అభ్యర్థన మేరకు సప్త మహర్షులు వసుదేవా వికుంఠునుల వివాహానికి మంచి శుభ ముహూర్తాన్ని చూసారు.
వసుదేవా వికుంఠునుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వసుదేవా వికుంఠునులు శ్రీమహాలక్ష్మి శ్రీమహావిష్ణువు ల అంశయే అని రాజర్షులు, బ్రహ్మర్షులు, యోగులు వంటివారు అనుకున్నారు. వికుంఠునుడు తన ధర్మపత్ని వసుదేవా సలహాలను కూడా స్వీకరించి హస్తినాపురం ను మరింత అందంగా తీర్చిదిద్దాడు. వికుంఠుని పరిపాలన లో భూలోక వైకుంఠం లా హస్తినాపురం ప్రకాశిస్తుంది అని నాటి వారందరూ అనుకున్నారు ఆ పుణ్య దంపతుల సుపుత్రుని పేరు అజమీఢుడు.
శుభం భూయాత్
రాజు మాటలను అనుసరించి, పుర పురోహితులు "కశ్యపోత్రి భరద్వాజాః విశ్వామిత్రోథ గౌతమః జమదగ్నిర్వశిష్టశ్చ సప్తైతే ఋషయః స్మృతాః ఓం సప్త ఋషిభ్యో నమః. ఓం కశ్యపో నమః ఓం అత్రో నమః ఓం భరద్వాజో నమః ఓం విశ్వామిత్రో నమః ఓం గౌతమో నమః ఓం జమదగ్నో నమః ఓం వశిష్టో నమః" అంటూ ధర్మ పత్నీ సమేతులైన సప్త మహర్షులను పలు విధాలుగా స్తుతిస్తూ రాజు గారి అంతఃపురానికి ఆహ్వానించారు.
దశార్హ మహారాజు సప్త మహర్షులకు సాష్టాంగ పడి నమస్కారం చేసి వారి ఆశీర్వాదాలను తీసుకున్నాడు. అనంతరం రాజు గారి భార్య, రాజు గారి కుమార్తె వసుదేవా తదితరులందరూ సప్త మహర్షుల ఆశీర్వాదాలను తీసుకున్నారు.
"బ్రహ్మ మనసునుండి జనించిన సప్త మహర్షులను వసుదేవా నయనానందంతో తనివితీరా చూస్తూ, వారి జ్ఞాన తేజాన్ని గమనించింది. వసుదేవా లోని శ్రీ మహాలక్ష్మీ అంశను గమనించిన సప్త మహర్షులు ఆ అంశకు పరిపూర్ణ హృదయంతో భార్యా సమేతంగా నమస్కరించారు.
అనంతరం దశార్హ మహారాజు "ధర్మపత్నీ సమేతులై వచ్చిన సప్త మహర్షుల రాకకు కారణం తెలుసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాను. సంస్కృతీ సంప్రదాయ సంరక్షణ నిమిత్తం బ్రహ్మ చే నియమించబడిన మహానుభావులారా! బ్రహ్మ తత్వాన్ని అర్థం చేసుకున్న బ్రహ్మర్షులారా! మహా శివుని నుండి అనేక విద్యలను పొందిన మహానుభావులారా!
సుర జ్ఞాన సంరక్షకులారా! మా రాకకు కారణం ఇది అని ఆజ్ఞాపించండి. మీ ఆజ్ఞ ను శిరసావహిస్తాను. " అని సప్త మహర్షులతో అన్నాడు.
దశార్హ మహారాజు మాటలను విన్న సప్త మహర్షులు దశార్హ మహారాజు ను ఆశీర్వదిస్తు తాము వచ్చిన కారణాన్ని చెప్పారు. అనంతరం ఒక్కొక్క మహర్షి వికుంఠునునిలో ఉన్న ఒక మంచి గుణాన్ని, చిన్నప్పటి అతని ఒక చెడు గుణాన్ని వివరించి చెప్పారు. వికుంఠునుడు చెడు నుంచి మంచి కి వచ్చిన విధానాన్ని అందలి దైవ తత్వాన్ని కూలంకషంగా వివరించారు.
సప్త మహర్షుల మాటలను విన్న దశార్హ మహారాజు మరో ఆలోచన చేయకుండా తన కుమార్తె వసుదేవాను వికుంఠునుకి ఇచ్చి వివాహం చేయడానికి తన సమ్మతిని తెలిపాడు. ఆపై భార్య కుమార్తె ల ముఖం చూసాడు. వారు కూడా కనులతోనే తమ సమ్మతిని తెలిపారు. అందరి వదనాలు ఆనంద సంద్రంలో తేలియాడాయి. అది గమనించిన సప్త మహర్షులు తాము వచ్చిన పని శీఘ్రంగా శుభమయమైంది అని అనుకున్నారు. దశార్హ మహారాజు వద్ద సెలవు తీసుకున్నారు.
సప్త మహర్షులు హస్తినాపురానికి వచ్చి, హస్తి మహారాజు కు యశోధర కు దశార్హ మహారాజు హృదయాన్ని కాబోయే పెళ్లి కూతురు వసుదేవా హృదయాన్ని తదితరుల హృదయాలను
తెలియ చేసారు.
హస్తి మహారాజు, యశోధర, దశార్హ మహారాజు ల అభ్యర్థన మేరకు సప్త మహర్షులు వసుదేవా వికుంఠునుల వివాహానికి మంచి శుభ ముహూర్తాన్ని చూసారు.
వసుదేవా వికుంఠునుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వసుదేవా వికుంఠునులు శ్రీమహాలక్ష్మి శ్రీమహావిష్ణువు ల అంశయే అని రాజర్షులు, బ్రహ్మర్షులు, యోగులు వంటివారు అనుకున్నారు. వికుంఠునుడు తన ధర్మపత్ని వసుదేవా సలహాలను కూడా స్వీకరించి హస్తినాపురం ను మరింత అందంగా తీర్చిదిద్దాడు. వికుంఠుని పరిపాలన లో భూలోక వైకుంఠం లా హస్తినాపురం ప్రకాశిస్తుంది అని నాటి వారందరూ అనుకున్నారు ఆ పుణ్య దంపతుల సుపుత్రుని పేరు అజమీఢుడు.
శుభం భూయాత్
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
