Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
వసుదేవా
[Image: v.jpg]
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు



దశార్హ మహారాజు కుమార్తె వసుదేవి. ఈమెను వసుదేవా అని కూడా పిలిచేవారు. వసుదేవా జన్మించ గానే దశార్హ రాజ్యం ఇబ్బడిముబ్బడిగా పాడిపంటలతో, సిరి సంపదలతో కళకళలాడసాగింది. దశార్హ రాజ్యంలోని ప్రజలు పట్టిందల్లా బంగారం అవ్వసాగింది. ఇదంతా వసుదేవా పుట్టిన వేళా విశేషం అని ప్రజలు మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా నమ్మారు. ప్రతి సంవత్సరం వసుదేవా జన్మ దినోత్సవ వేడుకలను ప్రజలే అంగరంగ వైభవంగా జరిపేవారు. 



వసుదేవా జన్మ దినోత్సవ వేడుకల సమయంలో ప్రజలు వసుదేవాకి బహుమతులుగా ఇచ్చిన బంగారు నగలు నిరుపేదలకు దానం చేయగా ఇంకా 5200 వారాల నగలకు రెట్టింపు నగలు వసుదేవా ప్రత్యేక మందిరాలలో కళకళలాడుతూ ఉన్నాయి. అయితే వసుదేవా కి నగల మీద అసలు వ్యామోహం ఉండేది కాదు. అందరి హృదయాలలో నివసించాలి అనేది వసుదేవా సదాలోచన. అందుకు తగ్గట్లుగా వసుదేవా ప్రజాసేవ చేసేది. 



రాజ్య పరిపాలన లో తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచేది. అలా ఆమె అందరి హృదయాలకు చేరువయ్యింది. తను రాజ కుమార్తె అయినప్పటికీ నేను రాజ కుమార్తెను అనే గర్వం వసుదేవా కు కించిత్ కూడా ఉండేది కాదు. వసుదేవా ప్రజలందరితో కలిసి మెలసి వారి కష్ట సుఖాలను సరిసమానంగా పంచుకునేది. వసుదేవా కు హాని తలపెట్టాలనుకునే కర్కోటకులు సహితం ఆమె ముఖం చూసిన వెంటనే ఆమె భక్తులైపోయేవారు. 



దీర్ఘ శిఖి, ఢంకా మురళి వంటివారు వసుదేవాకు ముందుగా హాని తలపెట్టాలనుకున్నారు. వారు వసుదేవా ముఖం చూసి చూడగానే వారి మనసులోని మాలిన్యమంతా కరిగిపోయింది. ఆపై వసుదేవా భక్తులై రాజ్యాలన్నీ తిరుగుతూ వసుదేవా ముఖ వర్చస్సు ను స్తుతిస్తూ కాలం గడపసాగారు. దైవాంశ సంభూతులైన మహర్షులు, మాన్యులు వసుదేవా ను చూచి శ్రీ మహాలక్ష్మీ 45 అంశలలో ఒక అంశ వసుదేవా అని అనుకునేవారు. 



 హస్తి మహారాజు పేరు మీద హస్తినాపురం ఏర్పడింది. హస్తి మహారాజు యశోధరల కుమారుడు వికుంఠునుడు. ఇతగాడు పెరిగి పెద్దయ్యాక తండ్రి ఖ్యాతి కి తీసిపోని విధంగా హస్తినాపురం ను రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలించసాగాడు. 



 తన తండ్రి హస్తి మహారాజు పేరు మీద ఏర్పడిన హస్తినాపురం ను భూలోక వైకుంఠం గా తీర్చి దిద్దాలనే సదుద్దేశంతో వికుంఠునుడు హస్తినాపురం లోని రోడ్లన్ని వెడల్పు చేయించాడు. గోసంపదను విస్తృతంగా పెంచిపోషించాడు. గోమాతలు ఇచ్చే పాలు ప్రజలు తాగినంత తాగి మిగతావి ఎవరూ వద్దనటంతో రోడ్ల మీద పారపోసేవారు. ఆ పాలతో హస్తినాపురం పాల సంద్రంలో వైకుంఠం లా ప్రకాసించేది. 



 వికుంఠునుడు హస్తినాపురం కు సప్త ప్రాకారాలు ఏర్పాటు చేసాడు. ఆ ప్రాకారాలు సహితం పాలరాతి తో కళకళలాడసాగాయి. హస్తినాపురం లోని చిన్న చిన్న నదులన్నీ పాలతో నిండిపోయాయి. వాటిని చూసి ప్రజలు ఇది నిజమా! కలా! అని అనుకునేవారు. 



తన కుమారుడు వికుంఠునుడు కి పెళ్ళి చేయాలని యశోధర అనుకుంది. అదే విషయాన్ని తన భర్త హస్తి మహారాజు కు చెప్పింది. 



 హస్తి మహారాజు వికుంఠునుని చిన్నతనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. 



 చిన్నతనం లో వికుంఠునుని ప్రవర్తనను చూసిన హస్తి మహారాజు వికుంఠునుడు, కుంఠుని"లా ప్రవర్తిస్తాడన్న మహర్షుల మాట నిజమైంది అని అనుకున్నాడు. 



"కుంఠం" అంటే చెడుకు లొంగి పోవడం అని అర్థం. వికుంఠునుడు చిన్నతనంలో మూర్ఖుల సహవాసం అంటే మహా ఇష్టపడేవాడు. కొందరు మూర్ఖులు వికుంఠునుని "వికంఠనుడు వికంఠనుడు" అని ఆట పట్టిస్తుంటే వారి మీద తిరగబడకుండ, వారి మాటలను విని మహదానంద పడేవాడు. పెద్దల మీద, గురువుల మీద తిరగబడటమంటే అతనికి మహా ఇష్టంగా ఉండేది. 



సత్యమేవ జయతే అన్నవారిని చావచితక బాదేవాడు. మాతృదేవోభవ అన్నవారికి మరణ శిక్ష విధించాలనేవాడు. పితృదేవోభవ అన్న వారి మీద పడి గొంతుపిసికేవాడు. ఆచార్య దేవోభవ అన్నవారిని అరణ్యాలకు తరిమేసేవాడు. అలాంటి వికుంఠునునికి తన పదహారవ యేట ముక్కోటి ఏకాదశి నాడు ఒక మహా యాగం చేయాలి అనే సత్సంకల్పం కలిగింది. తను చేయబోయే యాగానికి సప్త మహర్షులందరిని పిలిచి ముక్కోటి దేవతలందరి పేర్లను చెప్పమన్నాడు. వికుంఠునుని మాటలను విని వారంతా నోరు వెళ్ళబెట్టాడు. మహర్షులు ముక్కోటి దేవతలందరి పేర్లు చెప్పేటంత జ్ఞానం మాకు లేదన్నారు. 



అప్పుడు వికంఠునుడు, "దేవతలు మూడు కోట్ల మంది కాదు. 33 మందే అని నా అంతరాత్మ చెబుతుంది. వారు ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులుఆ, అష్ట వసువులు, ఇద్దరు అశ్వనీ దేవతలు. అంతే. వీరికి విష్ణువు అధిపతి. విష్ణువు వికుంఠ మాతకు పుట్టి వైకుంఠం నిర్మించాడు. వైకుంఠ నారాయణుడు అయ్యాడు ‌ ఈ లెక్క ప్రకారం యాగం చెయ్యండి. నేను వికుంఠునుడిని. " అని అన్నాడు. 



వికుంఠునుని మాటలను విన్న సప్త మహర్షులు అదే రీతిన యాగం చేసారు. అప్పటినుండి వికుంఠనునిలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పును చూసి ప్రజలు, మహర్షులు, మహానుభావులు, తలిదండ్రులు అంతా మహదానంద పడ్డారు. ఇదంతా ముక్కోటి ఏకాదశి మహిమ అని అనుకున్నారు. నాటి నుంచి వికుంఠునుడు ప్రజలకోసం ఆలోచిస్తూ, ప్రజోపయోగ పనులను చేస్తూ కాలం గడప సాగాడు. హస్తినాపురం ను క్షీరసాగరం చేసాడు. 



ముక్కోటి ఏకాదశి నాడు ప్రజలు హస్తినాపురం లో ఉన్న ఉత్తర ద్వారం నుండి వచ్చి వికుంఠన మహారాజు ను దర్శించుకునేవారు. హస్తి మహారాజు, యశోధర తమ కుమారుడు వికుంఠునికి దశార్హ మహారాజు కుమార్తె వసుదేవా ను ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు. వారు గతంలో ముక్కోటి ఏకాదశి వేడుకలకు దశార్హ మహారాజు, వసుదేవా వచ్చినప్పుడు వసుదేవా ను చూసారు. 



అప్పుడు వసుదేవా బంగారు వీణ ను మీటుతూ చక్కని పాట పాడింది. ఆ పాటలో వైకుంఠ నారాయణుని వివిధ నామాలు వర్ణనాత్మకంగా ఉన్నాయి. అప్పుడు వారు వసుదేవా లో శ్రీమహాలక్ష్మి తేజస్సును చూసారు. అంతేగాక దీర్ఘ శిఖి వంటి వారు వసుదేవా గురించి స్తుతించగా విన్నారు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) కథలు - కాళింది - by k3vv3 - Yesterday, 04:19 PM



Users browsing this thread: 1 Guest(s)