Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - చిత్రాంగదుడు
ఋక్షకుని కి ఎలాంటి యువతితో వివాహం చేస్తే బాగుంటుంది అని సుదేవ ఋచీకులు కుల గురువు వశిష్ట మహర్షి ని అడిగారు. అప్పుడు వశిష్ట మహర్షి " ఋచీకుని లో చంద్ర తేజం కించిత్ అధికంగా ఉంది. అతనిని చూడగానే కన్యలే కాదు, వివాహమైన వనితలు సహితం ఏదో తెలియని మైకంలో పడిపోతారు. కాబట్టి అలాంటి వానికి యాగ జ్వాల లాంటి యువతి ధర్మపత్ని అయితే వారి దాంపత్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. " అని వశిష్ఠ మహర్షి అన్నాడు. 



కుల గురువు వశిష్ట మహర్షి మాటలను అనుసరించి ఋచీకుడు యాగ జ్వాల లాంటి యువతి కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. తక్షకుని కుమార్తె జ్వాల యాగ జ్వాల యే అని ఇంద్రాది దేవతలు ఋచీకుని తో అన్నారు. 



ఋచీకుడు ఇంద్ర వరుణాదుల తో కలిసి తక్షకుని వద్దకు వెళ్ళాడు. అక్కడ యాగ జ్వాల లా ప్రకాశిస్తున్న జ్వాలను చూసాడు. ఈమెయే తన కుమారునికి తగిన ధర్మపత్ని అని మనసులో అనుకున్నాడు. 



తక్షకునితో తాము వచ్చిన కారణాన్ని ఋచీకుడు సమయోచితంగా చెప్పాడు. తక్షకుడు లిప్త కాలం ఆలోచించాడు. అనంతరం తన కుమార్తె జ్వాల తో ప్రత్యేకంగా మాట్లాడాడు. అందరి సమ్మతితో జ్వాల ఋక్షకుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వారికి పుట్టిన సుసంతానమే మతినారుడు. 



మతినారుడు సరస్వతీ నదీ తీరాన మహోన్నతమైన తపస్సు చేసాడు. 



***
సర్వే జనాః సుఖినోభవంతు 
***
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) కథలు - మర్యాద - దేవతీతి - by k3vv3 - 27-09-2025, 02:47 PM



Users browsing this thread: 2 Guest(s)