25-09-2025, 01:56 PM
అమ్మమ్మకి పెరాలసిస్ వచ్చిందని తాతయ్య ఫోన్ చేస్తే నేను, అమ్మ వెళ్ళాం. అమ్మమ్మ పరిస్థితి చూసి చాలా బాధపడ్డాం. లేవలేని పరిస్థితిలో ఉంది. మనిషిని పెట్టారు. పెద్ద డాక్టర్లకి చూపిస్తే వయస్సు రీత్యా రికవరీ కావడం కష్టం అన్నారు.
అమ్మమ్మ చివరి మజిలీ వరకు నేను, అమ్మ అక్కడే ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు అమ్మ వద్దని తాతయ్య దగ్గర మాట తీసుకుంది అమ్మమ్మ.
అమ్మమ్మ లేని ఇంటిలో తాతయ్య ఒక్కరిని ఉంచడం ఇష్టం లేక మాతో పాటే హైదరాబాద్ తీసుకు వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ తాతయ్య ఒప్పుకోలేదు. ‘అమ్మమ్మ భౌతికంగా లేకపోయినా ఆ జ్ఞాపకాలన్నీ ఇక్కడ పదిలంగా ఉన్నాయి. నేను రాను’ అన్నారు తాతయ్య.
అమ్మ, పిన్నులు వంతులు వేసుకుని ఒకరి తర్వాత ఒకరు తాతయ్య దగ్గర ఉంటున్నారు. మధ్య మధ్యలో నేను కూడా వెళ్లే దాన్ని. అమ్మమ్మ పోయిన రెండు మూడు సంవత్సరాలకే తాతయ్య కూడా అమ్మమ్మ దగ్గరకు వెళ్ళిపోయారు.
తాతయ్య మాట ప్రకారం మామయ్య ఇల్లు అమ్మకుండా ఉంచేసాడు. ఇల్లు శుభ్రం చేయడం అంతా మా పాలేరు చూసుకునేవాడు. వాడే పొలాలు కూడా చూసేవాడు. ప్రతి సంవత్సరం అమ్మ, పిన్నులు అక్కడికి వెళ్లేవారు. అమ్మతో నేను, చెల్లి కూడా వెళ్లేవాళ్ళం. అందుకే ఆ ఇంటితో నా అనుబంధం పెనవేసుకుపోయింది.
******
సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నా పెళ్లి, పిల్లలు, నాన్నగారు పోవడం అన్ని ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి. అమ్మని నా దగ్గరే ఉంచేసుకున్నాను. ఇన్ని జరుగుతున్నా, అమ్మమ్మ గారి ఊరు వెళ్లడం మాత్రం మానలేదు. నా పిల్లలకి కూడా అలవాటు చేశాను నా అమ్మమ్మగారిల్లు.
అటువంటిది ఇప్పుడు ఇల్లు అమ్మకం విషయం చెప్పేటప్పటికి తట్టుకోలేకపోయాను. మావయ్యకి ఫోన్ చేశాను. డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చాను నాకు కోపం వచ్చిందని, అర్థమైంది.
"లేదు మీనా! ఇల్లు అమ్మడానికి కారణం ఇల్లు పాతబడిపోయింది. చుట్టుపక్కల పెద్ద పెద్ద భవంతులు లేచాయి. దాని మధ్యలో మన ఇల్లు చిన్నగా ఉంది. అది కాక ఆ పక్క బిల్డింగ్ వాళ్లు ఈ ఇల్లు కావాలని ఎంతైనా ఇస్తామని నాకు ఫోన్ చేశారు" అన్నాడు మావయ్య.
"ఓహో! అందుకేనా! డబ్బుకు ఆశపడి ఇల్లు అమ్మేస్తానంటున్నావ్ మావయ్యా ! పాడి గేదె వట్టిపోయిందని కసాయి వాడికి అమ్ముతామా! ఇది అంతే! పాత పడిపోయిన, ఆ ఇంటితో ఉన్న అనుబంధం, ఆ జ్ఞాపకాలు మమ్మల్ని ఆ ఇంటి నుంచి దూరం చేయలేవు. నీకు డబ్బు కావాలంటే ఆ ఇల్లు నాకు అమ్మెయి. అంతె తప్ప బయట వాళ్లకు అమ్మకు మామయ్య" అని ఫోన్ పెట్టేసాను.
తరువాత మావయ్య ఏమనుకున్నాడో ఆ ఇంటిని నా పేరు మీద రాసేశాడు. నేను ఆరోజు ఆవేశంతో మావయ్యని అలా అన్నాను కానీ తర్వాత చాలా బాధపడి, "సారీ" చెప్పాను.
నాకు ఆ ఇంటిని ఎలా ఉపయోగించాలి? అని ఆలోచించాను. తరువాత నా ఆలోచనకి ఒక రూపం వచ్చింది. అమ్మని తీసుకుని ఊరు వెళ్లాను. ఊరి పెద్దలతో మాట్లాడి ఏమి చేయాలో చెప్పి, కావలసిన డబ్బు ఇచ్చి వచ్చేసాను.
పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఊరి ప్రెసిడెంట్ సదానందం నాకు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు జరుగుతున్న పనులు చెబుతున్నారు. నేను తగిన సూచనలు ఇస్తున్నాను.
పనులన్నీ కంప్లీట్ అయ్యాయని సదానందం గారు నాకు ఫోన్ చేసి చెప్తే, నేను మా పిన్ని లకి మామయ్యకి అన్ని విషయాలు చెప్పి అందర్నీ అమ్మమ్మ గారి ఊరు రమ్మని చెప్పాను.
ఆరోజు రానే వచ్చింది. మేమందరం కలిపి అమ్మమ్మ గారి ఊరు వెళ్ళాము. ఇంటిముందు పెద్ద బ్యానర్ "సీతారామ గ్రంథాలయం ప్రారంభోత్సవం" అని పెద్దపెద్ద అక్షరాలతో బ్యానర్ వేలాడుతోంది. ఇంటి రూపురేఖలే మారిపోయాయి. అది చూసి మావయ్య ఆశ్చర్యపోయాడు. సదానందం గారు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఊరి పెద్దలు అందరూ వచ్చారు.
యువతి యువకులు కూడా వచ్చారు. ప్రెసిడెంట్ సదానందం గారు వచ్చి రిబ్బన్ కట్ చేసి గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ "ఊరిలో ఉండి మనం ఎవరూ చేయలేకపోయిన పనిని అమ్మమ్మగారి ఊరు మర్చిపోకుండా ఈ ఊరికే ఏదో ఒకటి చెయ్యాలనే సంకల్పంతో శ్రీమతి మీనా రఘురాం గారు ఎంతో పెద్ద మనసుతో ఈ ఊరి యువతీ యువకులకు ఏదో ఒక ఉపాధి కల్పించాలనే ఉద్ధేశ్యం తో కంప్యూటర్ సెంటర్ ని, గ్రంథాలయాన్ని ప్రారంభించారు.
దీన్ని మనందరం ఇంకా ముందుకు తీసుకుపోవాలి. వారికి, వారి కుటుంబ సభ్యులకు నా అభినందనలు తెలియ జేసుకుంటున్నాను" అంటూ సదానందం గారు మాట్లాడారు. నేను చేసిన పనికి అందరూ ఎంతో మెచ్చుకున్నారు. మావయ్య నాకేసి అభినందన పూర్వకంగా చూశాడు.
అందరం లోపలికి వెళ్ళాం. షెల్ఫ ల్లో పిల్లలు పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవడానికి కావలసిన జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు, పెద్దవాళ్ళకి కావలసిన రామాయణ, భారతాలు, వివిధ రచయితల పుస్తకాలు అందంగా కనిపిస్తున్నాయి.
కుర్చీలు, టేబుల్స్ ఓ పక్కగా ఉన్నాయి. రెండో గదిలో టేబుల్స్, వాటి మీద కంప్యూటర్లు, కూర్చోవడానికి ఆఫీసు చైర్లు ఉన్నాయి. ఊరిలో పిల్లలు కంప్యూటర్ నేర్చుకోవడం కోసం బయటకు వెళ్ళనవసరం లేకుండా ఇవన్నీ ఏర్పాటు చేశాను. వాటిని అన్ని మేనేజ్ చేయడానికి ఒక ఇన్స్ట్రక్టర్ని పెట్టాను.
అమ్మమ్మ చివరి మజిలీ వరకు నేను, అమ్మ అక్కడే ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు అమ్మ వద్దని తాతయ్య దగ్గర మాట తీసుకుంది అమ్మమ్మ.
అమ్మమ్మ లేని ఇంటిలో తాతయ్య ఒక్కరిని ఉంచడం ఇష్టం లేక మాతో పాటే హైదరాబాద్ తీసుకు వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ తాతయ్య ఒప్పుకోలేదు. ‘అమ్మమ్మ భౌతికంగా లేకపోయినా ఆ జ్ఞాపకాలన్నీ ఇక్కడ పదిలంగా ఉన్నాయి. నేను రాను’ అన్నారు తాతయ్య.
అమ్మ, పిన్నులు వంతులు వేసుకుని ఒకరి తర్వాత ఒకరు తాతయ్య దగ్గర ఉంటున్నారు. మధ్య మధ్యలో నేను కూడా వెళ్లే దాన్ని. అమ్మమ్మ పోయిన రెండు మూడు సంవత్సరాలకే తాతయ్య కూడా అమ్మమ్మ దగ్గరకు వెళ్ళిపోయారు.
తాతయ్య మాట ప్రకారం మామయ్య ఇల్లు అమ్మకుండా ఉంచేసాడు. ఇల్లు శుభ్రం చేయడం అంతా మా పాలేరు చూసుకునేవాడు. వాడే పొలాలు కూడా చూసేవాడు. ప్రతి సంవత్సరం అమ్మ, పిన్నులు అక్కడికి వెళ్లేవారు. అమ్మతో నేను, చెల్లి కూడా వెళ్లేవాళ్ళం. అందుకే ఆ ఇంటితో నా అనుబంధం పెనవేసుకుపోయింది.
******
సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నా పెళ్లి, పిల్లలు, నాన్నగారు పోవడం అన్ని ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి. అమ్మని నా దగ్గరే ఉంచేసుకున్నాను. ఇన్ని జరుగుతున్నా, అమ్మమ్మ గారి ఊరు వెళ్లడం మాత్రం మానలేదు. నా పిల్లలకి కూడా అలవాటు చేశాను నా అమ్మమ్మగారిల్లు.
అటువంటిది ఇప్పుడు ఇల్లు అమ్మకం విషయం చెప్పేటప్పటికి తట్టుకోలేకపోయాను. మావయ్యకి ఫోన్ చేశాను. డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చాను నాకు కోపం వచ్చిందని, అర్థమైంది.
"లేదు మీనా! ఇల్లు అమ్మడానికి కారణం ఇల్లు పాతబడిపోయింది. చుట్టుపక్కల పెద్ద పెద్ద భవంతులు లేచాయి. దాని మధ్యలో మన ఇల్లు చిన్నగా ఉంది. అది కాక ఆ పక్క బిల్డింగ్ వాళ్లు ఈ ఇల్లు కావాలని ఎంతైనా ఇస్తామని నాకు ఫోన్ చేశారు" అన్నాడు మావయ్య.
"ఓహో! అందుకేనా! డబ్బుకు ఆశపడి ఇల్లు అమ్మేస్తానంటున్నావ్ మావయ్యా ! పాడి గేదె వట్టిపోయిందని కసాయి వాడికి అమ్ముతామా! ఇది అంతే! పాత పడిపోయిన, ఆ ఇంటితో ఉన్న అనుబంధం, ఆ జ్ఞాపకాలు మమ్మల్ని ఆ ఇంటి నుంచి దూరం చేయలేవు. నీకు డబ్బు కావాలంటే ఆ ఇల్లు నాకు అమ్మెయి. అంతె తప్ప బయట వాళ్లకు అమ్మకు మామయ్య" అని ఫోన్ పెట్టేసాను.
తరువాత మావయ్య ఏమనుకున్నాడో ఆ ఇంటిని నా పేరు మీద రాసేశాడు. నేను ఆరోజు ఆవేశంతో మావయ్యని అలా అన్నాను కానీ తర్వాత చాలా బాధపడి, "సారీ" చెప్పాను.
నాకు ఆ ఇంటిని ఎలా ఉపయోగించాలి? అని ఆలోచించాను. తరువాత నా ఆలోచనకి ఒక రూపం వచ్చింది. అమ్మని తీసుకుని ఊరు వెళ్లాను. ఊరి పెద్దలతో మాట్లాడి ఏమి చేయాలో చెప్పి, కావలసిన డబ్బు ఇచ్చి వచ్చేసాను.
పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఊరి ప్రెసిడెంట్ సదానందం నాకు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు జరుగుతున్న పనులు చెబుతున్నారు. నేను తగిన సూచనలు ఇస్తున్నాను.
పనులన్నీ కంప్లీట్ అయ్యాయని సదానందం గారు నాకు ఫోన్ చేసి చెప్తే, నేను మా పిన్ని లకి మామయ్యకి అన్ని విషయాలు చెప్పి అందర్నీ అమ్మమ్మ గారి ఊరు రమ్మని చెప్పాను.
ఆరోజు రానే వచ్చింది. మేమందరం కలిపి అమ్మమ్మ గారి ఊరు వెళ్ళాము. ఇంటిముందు పెద్ద బ్యానర్ "సీతారామ గ్రంథాలయం ప్రారంభోత్సవం" అని పెద్దపెద్ద అక్షరాలతో బ్యానర్ వేలాడుతోంది. ఇంటి రూపురేఖలే మారిపోయాయి. అది చూసి మావయ్య ఆశ్చర్యపోయాడు. సదానందం గారు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఊరి పెద్దలు అందరూ వచ్చారు.
యువతి యువకులు కూడా వచ్చారు. ప్రెసిడెంట్ సదానందం గారు వచ్చి రిబ్బన్ కట్ చేసి గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ "ఊరిలో ఉండి మనం ఎవరూ చేయలేకపోయిన పనిని అమ్మమ్మగారి ఊరు మర్చిపోకుండా ఈ ఊరికే ఏదో ఒకటి చెయ్యాలనే సంకల్పంతో శ్రీమతి మీనా రఘురాం గారు ఎంతో పెద్ద మనసుతో ఈ ఊరి యువతీ యువకులకు ఏదో ఒక ఉపాధి కల్పించాలనే ఉద్ధేశ్యం తో కంప్యూటర్ సెంటర్ ని, గ్రంథాలయాన్ని ప్రారంభించారు.
దీన్ని మనందరం ఇంకా ముందుకు తీసుకుపోవాలి. వారికి, వారి కుటుంబ సభ్యులకు నా అభినందనలు తెలియ జేసుకుంటున్నాను" అంటూ సదానందం గారు మాట్లాడారు. నేను చేసిన పనికి అందరూ ఎంతో మెచ్చుకున్నారు. మావయ్య నాకేసి అభినందన పూర్వకంగా చూశాడు.
అందరం లోపలికి వెళ్ళాం. షెల్ఫ ల్లో పిల్లలు పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవడానికి కావలసిన జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు, పెద్దవాళ్ళకి కావలసిన రామాయణ, భారతాలు, వివిధ రచయితల పుస్తకాలు అందంగా కనిపిస్తున్నాయి.
కుర్చీలు, టేబుల్స్ ఓ పక్కగా ఉన్నాయి. రెండో గదిలో టేబుల్స్, వాటి మీద కంప్యూటర్లు, కూర్చోవడానికి ఆఫీసు చైర్లు ఉన్నాయి. ఊరిలో పిల్లలు కంప్యూటర్ నేర్చుకోవడం కోసం బయటకు వెళ్ళనవసరం లేకుండా ఇవన్నీ ఏర్పాటు చేశాను. వాటిని అన్ని మేనేజ్ చేయడానికి ఒక ఇన్స్ట్రక్టర్ని పెట్టాను.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
