20-09-2025, 04:28 PM
ఆ రోజు సాయంత్రం మా అత్త పెట్టిపోయిన కాఫీ కొన్ని గుక్కలు తాగి, దొడ్లోకని చెప్పి బయటకొచ్చి, మా ఇంటికి నాలుగిళ్ళ అవతల వాళ్ళింట్లో ఫోనుందని మా అత్త ఒకసారి ఎవరికో చెప్తుంటే ఇన్నా, దొడ్డిదారిన వాళ్ళింటికి పోయి ఒకసారి ఫోన్ చేసుకోవచ్చా అని అడిగా. నా అవతారం చూసి ఏమనుకున్నారో చేసుకోమ్మా అన్నారు.
అవతల మా నాయన ఫోన్ ఎత్తాడు. నాకు ఇంకా ఏడుపు ఆగలే. ఒకటే ఏడుపు, ఒకటే ఎక్కిళ్ళు. ఆ ఎక్కిళ్ళ మధ్యే అంతా చెప్పా. అవతల మా నాయన గొంతు వజవజా వణికిపోతుంది. "ఇదిగో నాయనా ఈ బస్సుకే బయల్దేరతావుండా, బయపడబాక, ఆ పెళ్ళీ వద్దు, పెటాకులూ వద్దు. ఇంక ఆ ఇంటికి పోబాక ఊర్లో ఏదన్నా గుడో, బడో వుంటే కూర్చో తల్లా మా అమ్మా... వొచ్చేస్తా వుండా," అన్నాడు మా నాయన. నేను మా నాయన చెప్పినట్టే ముత్యాలమ్మ గుడిలో కూర్చున్నా. మా ఊరి నుండి ఈ ఊరికి రావడానికి సమయానికి బస్సు చిక్కితే సరిగ్గ నాలుగంటల ప్రయాణం. కానీ మా నాయన బస్సులో రాలే. కారు బాడుక్కి తీసుకుని వచ్చాడు. గుడి కాడ ఆగాడు. కార్లో మా నాయన, మా చిన్నాయన, మా అత్త వచ్చినారు. కార్ లో నెను మా నాయన పక్కన కూర్చుని, మా అత్త ఒళ్ళో తల పెట్టుకున్నా, ఒకరొంత దూరం లోనే కారాగితే తలెత్తి చూసా మా అత్తోళ్ళిళ్ళు. నాకేం అర్ధం కాలే. అందరూ కార్లోంచి దిగారు. నేను మాత్రం దిగలే. పెద్దపెద్దగా అరుపులు, అంతా గోలగోలగా వుంది. రొంత సేపటికి అందరూ కారెక్కారు. మేం మా ఊరికి బయలుదేరినాం.
ఏమైనా మా ఊరికి ఒస్తావుండే నాకు సంతోషంగా వుంది. పోంగానే మా యమ్మ నా మహితే అంటా ఏడవడం మొదలెట్టింది. మా ఇళ్ళు చూసే సరికి నాకు చానా ధైర్యమొచ్చింది. అందుకని. మా యమ్మని యాడవబాకుమా, అని మా అమ్మని నేనే ఓదార్చా. ఇంకేముందిలే. అబ్బా ఒచ్చేసాం. అని నా ప్రాణానికి హాయిగా అనిపించింది. మా అమ్మా, నాయన నన్ను ఆ ఇంటికి పంపనని, అదే మాట మీద నిలబడ్డారు. రెండేళ్ళు గడిచిపోయినాయి.
రెండేళ్ళకి ముందు నాకు పెళ్ళయ్యింది అన్న మాట గుర్తు తెచ్చుకోవాలన్నా నాకు భయంగా ఉంటది. ఇంకొక నాలుగు రోజులు పోతే సంక్రాంతి. ఏకోజామునే లేసి మా ఇంటిముందర ముగ్గేసి రంగులద్దతావుండా, నేను ముగ్గు పూర్తి చేసి,మా నాయన ముఖం కడిగి కాఫీ తాగాక నిదానంగా.. నాయనా ఎంకురెడ్డి సచ్చిపోయినాడంట అన్నా.. మా నాయనకి మొదట ఏ ఎంకురెడ్డో గవనానికి రాలే. 'ఏఎంకురెడ్డి పాపా" అన్నాడు. నాకు మా మావ అని చెప్పడానికి మనసు రాలే. అందుకే వాళ్ళే నాయనా అరెంపాలెపు ఎంకురెడ్డి అన్నా అప్పుడే మళ్ళ ఫోనొచ్చింది. ఈ సారి మాట్లాడలేదు. మా అమ్మకి విషయం చెప్పాడు. మా అమ్మ కూడా ఏం పట్టించుకోలేదు. మానాయన మా అమ్మని పిలిచి, "ఒకసారి పావనిని తీసుకుపొయ్యి నీళ్ళు చల్లిచుకుని వద్దాం. సావు కాడ పగలెందుకే. పోయినోడెట్ట పోయే.." అన్నాడు మా నాయన.
పదకొండు గంటల ట్రిప్పుకు ముగ్గురం బయలుదేరినాము. ఆ ఇల్లు, ఆ మొహాలు చూడ్డం నాకు ఒక్క రవ్వంత కూడా ఇష్టమనిపించలే. మా నాయన వస్తా వస్తా ఓ పూల మాల కొన్నాడు. దాన్ని తీసుకుని పోయి నన్ను వేయమన్నాడు, కానీ నేను పోను నాయనా అని నువ్వే వేసిరా అన్నాను, మా నాయనే పోయి పూలమాల వేసొచ్చాడు. మా ఆయన ఎక్కడా కనిపించలే. నేను ఆ తతంగాలంతా చూస్తూ షామియానా కింద ఏసిన కుర్చీలో కూర్చున్నా, వాళ్ళ ఏదుపుల్ని చూస్తా వున్ననే గాని, అదే అరుగుపైన ఇంకో రెండు వారాల్లో నేను శవమై పడుంటానని మా అమ్మ నాయన నా మీద పడి యాడస్తా వుంటారని నాకు ఒక్క రొంత ఆలోచన కూడా లేదు.
అన్ని తతంగాలు అయిపోయాకా. మా నడిపి ఆడపడుచు మా నాయంతో, అయ్యిందేదో అయ్యింది మావా, ఈ సారి అట్ట జరక్కుండా మేం జూస్తాం. అమ్మిని ఈడే వుండిచ్చండి. అని ఒకటే బతిమిలాడింది. మానాయన నా వైపు చూసి "ఏం నాయనా మహితా ఉంటావా" అన్నాడు. నేనేం మాట్లాడలే. "అక్కోల్లు అందరూ వున్నారు గదమ్మా, ఇంకో పదేను రోజులుండురోజులు చూడు. నీకంత వుండలేననిపిస్తే వచ్చేద్దువుగాన్లే. నా ఫోను కూడా నువ్వే పెట్టుకో అమ్మ, ఏ కష్టమొచ్చిన చిన్నాయనకి ఫోన్ చెయ్యి నిముషంలో లగెత్తుకొచ్చేస్తాం." అన్నాడు
అందుకు మా చిన్నాడపడుచు "ఈ సారి అంత కష్టం రానీములే మావా" అన్నది. నాకేం చెప్పాలో తోచలే. మనసులో చాలా భయంగా వుంది. అయినా సరే సరే అని తలూపాను. ఎందుకంటే... మా నాయనంటే నాకు ప్రాణం. మా నాయన మాటకు ఎదురాడ్డం నాకు ఇష్టముండదు.
అలా కొన్ని రోజులు గడిచిపోయినాయి. ఇంటినిండా మనుషులుండడంతో మా ఆయనతో మాట్లాడడం కుదరలేదు. కానీ చిన్నగా ఎవరికి వాళ్ళు ఎళ్ళిపోవడం మొదలెట్టారు.
చాన్రోజులకి తలారా స్నానం చేసి అరుగు మీద కూర్చున్నా. ఏదేదో ఆలోచిస్తావుంటే గేటు శబ్ధం అయ్యింది. చూద్దును కదా... మా అమ్మ, తాత. నన్ను చూసిపోదామని వచ్చారు. మా అమ్మా, తాత నాకు జాగ్రత్తలు చెప్పి ఆయంత్రం కల్లా వెళ్ళిపోయారు. ఈ రోజు మా ఆయన వస్తాడు అని మా యత్త చెప్పింది. అందుకని మా అమ్మ తెచ్చిన ఎండు చేపల్లో వంకాయేసి కూరొండా. మా అమ్మ పోయిన రెండు గంటలకు మా ఆయనొచ్చాడు రావడం రావడమే ధుమధుమలాడతా వొచ్చేడు. మా అత్తని బూతూ బొండూ తిట్టేడు. నాకు భయమేసింది. నేనేం తల దూర్చలా. సక్కా పోయి పడుకున్నా... ఒక రాత్రికాడ గట్టిగా తన్నినట్టనిపిస్తే దడుసుకుని లేసా. చూస్తే ఎదురుగా మా ఆయన. ఈసారి నాకు కోపమొచ్చింది. ' ఎందుకు తంతా వుండావు? మీరంతా ఉండమని పీకులాడితేనే ఇక్కడుండా. రేపే ఎళిపోతా... కొట్టడం గిట్టడం కుదరదు. అని ధైర్యంగా అన్నాను. మా ఆయంకి కోపం పెరిగిపొయ్యింది. దిండు తీసుకుని నా మొహం మీద పెట్టి అదమడం మొదలు పెట్టేడూ. నేను చేత్ల్తోటి గిచ్చడం మొదలుపెట్టా. మా ఆయన ఎక్కి నా గుండెల మీద కూర్చున్నాడు. మోకాళ్ళు నా చేతుల మీదేసి అదిమేసాడు. నాయ్నా..నాయ్నా అని అరుద్దామనిపిచ్చింది. గింజుకుని గింజుకుని నాకు పూర్తిగా ఊపిరాడ్డం మానేసింది.
పదకొండు గంటలకి మా ఊరి నుండి బంధువులందరూ దిగిపొయ్యారు. మా నాయన కారు కాడ్నించి పరిగెత్తతా వొచ్చేడు. రాంగానే నన్ను, నాశవాన్ని జూసి నా కాళ్ళ దగ్గర కూలబడిపొయ్యి నాయినా మహితా... మహితా... మహిలూ లెయ్ నాయనా.. నాయనా సచ్చిపోబాకమ్మా... నా బంగారు తల్లీ.... మహిలూ...' అని యాడవడం మొదలుబెట్టాడు. మా అమ్మ వచ్చి నా పక్కన పడిపోయింది. ఏడుపూ లేదు, ఏం లేదు. ఒకటే ఎర్రి చూపు. మా అత్తలు గుండెలు బాదుకుని యాడస్తా ఉండారు. నాకు మళ్ళా ఏడుపొచ్చింది. ' నాయనా నేనేం జేసేది నాయనా, యాడవకు నాయనా' అని చెప్పాలనిపించింది.
మా మావలు, చిన్నాయన్లు, ఇంకా ఊర్లో పెద్ద మనుషులు జరగాల్సిన తతంగం గురించి మాట్లాడుకుంటూ ఉండారు. ఎవరో సెక్యూరిటీ ఆఫీసర్లకి ఫోన్ చేశారు. సెక్యూరిటీ ఆఫీసర్లు ఫోన్ జేసిన ప్రెతీ తడవా ' ఇదిగో వస్తా వుండాం, అదిగో వస్తా ఉండాం' అంటా ఉండారు. ఎవరెవరో ఎవరెవరికో ఫోన్లు జేసుకుంటా వుండారు.
చివరికి ఆ మూలుండే పెద్ద మనుషులు మా నాయన్ని నా దగ్గర్నుండి లేపి అవతలికి తీసుకపొయ్యి ' ఏణు రెడ్డా! ఏడిసిన పాట పోయిన అమ్మిగాన తిరిగొస్తదా? మొగోడివి జరగాల్సినవి చూడొద్దా? ' అన్నారు. మా నాయన ఆ మాటిని ' అనా! నేను మొగోడ్ని కాదనా...నేను మొగోడ్ని కాను. నాకు నా బిడ్డ కావాలనా! నా బిడ్డ కావాల...నా బిడ్డని నాకు దెచ్చియన్నా అని నేల మీద కూలబడ్డడు. పెద్ద మనిషి మా నాయన్ని లేపి కుర్చీలో కూచోబెట్టి ' ఏణు రెడ్డా! చెప్పేదిను. కేసులు గీసులంటే పోయిన బిడ్డ తిరిగొస్తదా.మీరు పెట్టినయ్యంతా రాబట్టుకుందాం. రెండెకరాలమ్మి గదా బిడ్డ పెళ్ళి జేస్నావు. ఆ రెండెకరాలకి ఇంకో రెండెకరాలు కలిపి కొనుక్కునేట్టు డబ్బులడుగుదాం. లేకపోతే కేసు పెడతామని బెదిరిద్దాం. ' అన్నాడు.
ఆ మాటింగనే మా నాయిన ఆమన్నే లేసి నిలబడి ' అన్నా! అమ్మి పోయిందన్నా...ఆస్తి నేనేం జేసుకొనేదన్నా? బంగారు తల్లి గదంటన్న పిల్ల..కాపరం జెయ్యాలని మేమనుకోలేదే.... అదిగో తా తల్లి , మావా పూచీ నాదీ అని అంటే గదాబిడ్డనీడ వదిలిపెట్టిపోయింది. అమ్మ ప్రవీణమ్మ తల్లీ ఏమమ్మా ఆరోజు నాదీ పూచీ అంటివే? ఇదేనా తల్లీ పూచీ అంటే? అని యాడవడం మొదలుపెట్టాడు.
పెద్దమనుషులు ' ఏణయా మేం జెప్పేది ఇను ఆడదానికంటే ఘోరంగా ఉండావే, కేసులు గీసులని ఏమొస్తది. అయిందేదో అయింది. మన డబ్బైనా మనం రాబట్టొద్దా అన్నారు. తాటి చెట్టంత పొడుగు కదా నేను, అందుకని డిక్కీలో పట్టలా. నాకాళ్ళూ చేతులూ వంచి, వంచి డిక్కీలో కూర్చి డిక్కీ ఏసేసినారు. ఇప్పుడు నేను మహితను కాను. మహిత శవాన్ని. అందుకని డిక్కీలో కూడా ఉండొచ్చు. ఊపిరాడదనే భయం లేదు. మా ఆయన ఎప్పుడో నిన్న రాత్రే నా ఊపిరి తీసేసాడు కదా అందుకు. మా పెద్దమ్మ ఒకామే టౌన్ లో ఉండేది. హాస్పిటల్ ఎంక వీధుల్లో వాళ్ళిల్లు ఉండేది. వాళ్ళింటికి పోవాలంటే రోడ్లో బస్సు దిగి హాస్పిటల్ గుండా పోతే దగ్గర దారి తొందరగా ఎల్లిపోవచ్చు. అందుకని మా నాయ్న ఆ దార్లో తీసుకపొయ్యేవాడు. ఆ దార్లో పాడుబడినట్టు ఒక చిన్న బిల్డింగ్ ఉండేది. ఒకసారి మా నాయన్ని ' అదేంది నాయనా' అనడిగితే అక్కడ శవాల్ని కోస్తారని దాని మార్చురీ అంటారని చెప్పి అదిప్పుడు వేరే బిల్డింగ్ కీ మారిందిలే భయమేం ళెడూ ఆణీ ఛేప్పేడు. అయినా సరే ఆ బిల్డింగు వచ్చిందంటే నాకు భయమేసిపోయేది. ఆ పక్క తల తిప్పకుండా పోయేదాన్ని.
నన్ను మార్చురీకి తీసుకొచ్చేసరికి రాత్రి ఏడున్నరయింది. మా ఆయన తరపనోళ్ళు గూడా ఎవరో వొచ్చేరు. డాక్టర్లు ముగ్గురు నన్ను కోయడం మొదలుపెట్టారు. వాళ్ళలో మగ డాక్టరు నా జడ, మొహము జూసి, ఎంత చిన్నపిల్లో, ఎంత పెద్ద జడో! పాపం ఆ జడ పెరిగినన్ని రోజులు కూడా పట్టలా సచ్చిపోవడానికి.' అన్నాడు.మా ఆయన తరపువోళ్ళు డాక్టరుతో ఏవో మంతనాలాడారు. డాక్టరు అది విని ' ఏమయ్య, అంత పసిబిడ్డ, అన్యాయంగా చంపి పారేస్నారు. పొమ్మంటే పొయ్యి, ఎట్నో ఒకట్ట బతుక్కోబోయిందా, ఇప్పుడు తప్పుడు రిపోర్టు రాసి మీ దగ్గర డబ్బు తీసుకుంటే జీసస్ నన్నెప్పటికీ క్షమించడు, పొండి అవతలబడ...!'అన్నాడు.
అవతల మా నాయన ఫోన్ ఎత్తాడు. నాకు ఇంకా ఏడుపు ఆగలే. ఒకటే ఏడుపు, ఒకటే ఎక్కిళ్ళు. ఆ ఎక్కిళ్ళ మధ్యే అంతా చెప్పా. అవతల మా నాయన గొంతు వజవజా వణికిపోతుంది. "ఇదిగో నాయనా ఈ బస్సుకే బయల్దేరతావుండా, బయపడబాక, ఆ పెళ్ళీ వద్దు, పెటాకులూ వద్దు. ఇంక ఆ ఇంటికి పోబాక ఊర్లో ఏదన్నా గుడో, బడో వుంటే కూర్చో తల్లా మా అమ్మా... వొచ్చేస్తా వుండా," అన్నాడు మా నాయన. నేను మా నాయన చెప్పినట్టే ముత్యాలమ్మ గుడిలో కూర్చున్నా. మా ఊరి నుండి ఈ ఊరికి రావడానికి సమయానికి బస్సు చిక్కితే సరిగ్గ నాలుగంటల ప్రయాణం. కానీ మా నాయన బస్సులో రాలే. కారు బాడుక్కి తీసుకుని వచ్చాడు. గుడి కాడ ఆగాడు. కార్లో మా నాయన, మా చిన్నాయన, మా అత్త వచ్చినారు. కార్ లో నెను మా నాయన పక్కన కూర్చుని, మా అత్త ఒళ్ళో తల పెట్టుకున్నా, ఒకరొంత దూరం లోనే కారాగితే తలెత్తి చూసా మా అత్తోళ్ళిళ్ళు. నాకేం అర్ధం కాలే. అందరూ కార్లోంచి దిగారు. నేను మాత్రం దిగలే. పెద్దపెద్దగా అరుపులు, అంతా గోలగోలగా వుంది. రొంత సేపటికి అందరూ కారెక్కారు. మేం మా ఊరికి బయలుదేరినాం.
ఏమైనా మా ఊరికి ఒస్తావుండే నాకు సంతోషంగా వుంది. పోంగానే మా యమ్మ నా మహితే అంటా ఏడవడం మొదలెట్టింది. మా ఇళ్ళు చూసే సరికి నాకు చానా ధైర్యమొచ్చింది. అందుకని. మా యమ్మని యాడవబాకుమా, అని మా అమ్మని నేనే ఓదార్చా. ఇంకేముందిలే. అబ్బా ఒచ్చేసాం. అని నా ప్రాణానికి హాయిగా అనిపించింది. మా అమ్మా, నాయన నన్ను ఆ ఇంటికి పంపనని, అదే మాట మీద నిలబడ్డారు. రెండేళ్ళు గడిచిపోయినాయి.
రెండేళ్ళకి ముందు నాకు పెళ్ళయ్యింది అన్న మాట గుర్తు తెచ్చుకోవాలన్నా నాకు భయంగా ఉంటది. ఇంకొక నాలుగు రోజులు పోతే సంక్రాంతి. ఏకోజామునే లేసి మా ఇంటిముందర ముగ్గేసి రంగులద్దతావుండా, నేను ముగ్గు పూర్తి చేసి,మా నాయన ముఖం కడిగి కాఫీ తాగాక నిదానంగా.. నాయనా ఎంకురెడ్డి సచ్చిపోయినాడంట అన్నా.. మా నాయనకి మొదట ఏ ఎంకురెడ్డో గవనానికి రాలే. 'ఏఎంకురెడ్డి పాపా" అన్నాడు. నాకు మా మావ అని చెప్పడానికి మనసు రాలే. అందుకే వాళ్ళే నాయనా అరెంపాలెపు ఎంకురెడ్డి అన్నా అప్పుడే మళ్ళ ఫోనొచ్చింది. ఈ సారి మాట్లాడలేదు. మా అమ్మకి విషయం చెప్పాడు. మా అమ్మ కూడా ఏం పట్టించుకోలేదు. మానాయన మా అమ్మని పిలిచి, "ఒకసారి పావనిని తీసుకుపొయ్యి నీళ్ళు చల్లిచుకుని వద్దాం. సావు కాడ పగలెందుకే. పోయినోడెట్ట పోయే.." అన్నాడు మా నాయన.
పదకొండు గంటల ట్రిప్పుకు ముగ్గురం బయలుదేరినాము. ఆ ఇల్లు, ఆ మొహాలు చూడ్డం నాకు ఒక్క రవ్వంత కూడా ఇష్టమనిపించలే. మా నాయన వస్తా వస్తా ఓ పూల మాల కొన్నాడు. దాన్ని తీసుకుని పోయి నన్ను వేయమన్నాడు, కానీ నేను పోను నాయనా అని నువ్వే వేసిరా అన్నాను, మా నాయనే పోయి పూలమాల వేసొచ్చాడు. మా ఆయన ఎక్కడా కనిపించలే. నేను ఆ తతంగాలంతా చూస్తూ షామియానా కింద ఏసిన కుర్చీలో కూర్చున్నా, వాళ్ళ ఏదుపుల్ని చూస్తా వున్ననే గాని, అదే అరుగుపైన ఇంకో రెండు వారాల్లో నేను శవమై పడుంటానని మా అమ్మ నాయన నా మీద పడి యాడస్తా వుంటారని నాకు ఒక్క రొంత ఆలోచన కూడా లేదు.
అన్ని తతంగాలు అయిపోయాకా. మా నడిపి ఆడపడుచు మా నాయంతో, అయ్యిందేదో అయ్యింది మావా, ఈ సారి అట్ట జరక్కుండా మేం జూస్తాం. అమ్మిని ఈడే వుండిచ్చండి. అని ఒకటే బతిమిలాడింది. మానాయన నా వైపు చూసి "ఏం నాయనా మహితా ఉంటావా" అన్నాడు. నేనేం మాట్లాడలే. "అక్కోల్లు అందరూ వున్నారు గదమ్మా, ఇంకో పదేను రోజులుండురోజులు చూడు. నీకంత వుండలేననిపిస్తే వచ్చేద్దువుగాన్లే. నా ఫోను కూడా నువ్వే పెట్టుకో అమ్మ, ఏ కష్టమొచ్చిన చిన్నాయనకి ఫోన్ చెయ్యి నిముషంలో లగెత్తుకొచ్చేస్తాం." అన్నాడు
అందుకు మా చిన్నాడపడుచు "ఈ సారి అంత కష్టం రానీములే మావా" అన్నది. నాకేం చెప్పాలో తోచలే. మనసులో చాలా భయంగా వుంది. అయినా సరే సరే అని తలూపాను. ఎందుకంటే... మా నాయనంటే నాకు ప్రాణం. మా నాయన మాటకు ఎదురాడ్డం నాకు ఇష్టముండదు.
అలా కొన్ని రోజులు గడిచిపోయినాయి. ఇంటినిండా మనుషులుండడంతో మా ఆయనతో మాట్లాడడం కుదరలేదు. కానీ చిన్నగా ఎవరికి వాళ్ళు ఎళ్ళిపోవడం మొదలెట్టారు.
చాన్రోజులకి తలారా స్నానం చేసి అరుగు మీద కూర్చున్నా. ఏదేదో ఆలోచిస్తావుంటే గేటు శబ్ధం అయ్యింది. చూద్దును కదా... మా అమ్మ, తాత. నన్ను చూసిపోదామని వచ్చారు. మా అమ్మా, తాత నాకు జాగ్రత్తలు చెప్పి ఆయంత్రం కల్లా వెళ్ళిపోయారు. ఈ రోజు మా ఆయన వస్తాడు అని మా యత్త చెప్పింది. అందుకని మా అమ్మ తెచ్చిన ఎండు చేపల్లో వంకాయేసి కూరొండా. మా అమ్మ పోయిన రెండు గంటలకు మా ఆయనొచ్చాడు రావడం రావడమే ధుమధుమలాడతా వొచ్చేడు. మా అత్తని బూతూ బొండూ తిట్టేడు. నాకు భయమేసింది. నేనేం తల దూర్చలా. సక్కా పోయి పడుకున్నా... ఒక రాత్రికాడ గట్టిగా తన్నినట్టనిపిస్తే దడుసుకుని లేసా. చూస్తే ఎదురుగా మా ఆయన. ఈసారి నాకు కోపమొచ్చింది. ' ఎందుకు తంతా వుండావు? మీరంతా ఉండమని పీకులాడితేనే ఇక్కడుండా. రేపే ఎళిపోతా... కొట్టడం గిట్టడం కుదరదు. అని ధైర్యంగా అన్నాను. మా ఆయంకి కోపం పెరిగిపొయ్యింది. దిండు తీసుకుని నా మొహం మీద పెట్టి అదమడం మొదలు పెట్టేడూ. నేను చేత్ల్తోటి గిచ్చడం మొదలుపెట్టా. మా ఆయన ఎక్కి నా గుండెల మీద కూర్చున్నాడు. మోకాళ్ళు నా చేతుల మీదేసి అదిమేసాడు. నాయ్నా..నాయ్నా అని అరుద్దామనిపిచ్చింది. గింజుకుని గింజుకుని నాకు పూర్తిగా ఊపిరాడ్డం మానేసింది.
పదకొండు గంటలకి మా ఊరి నుండి బంధువులందరూ దిగిపొయ్యారు. మా నాయన కారు కాడ్నించి పరిగెత్తతా వొచ్చేడు. రాంగానే నన్ను, నాశవాన్ని జూసి నా కాళ్ళ దగ్గర కూలబడిపొయ్యి నాయినా మహితా... మహితా... మహిలూ లెయ్ నాయనా.. నాయనా సచ్చిపోబాకమ్మా... నా బంగారు తల్లీ.... మహిలూ...' అని యాడవడం మొదలుబెట్టాడు. మా అమ్మ వచ్చి నా పక్కన పడిపోయింది. ఏడుపూ లేదు, ఏం లేదు. ఒకటే ఎర్రి చూపు. మా అత్తలు గుండెలు బాదుకుని యాడస్తా ఉండారు. నాకు మళ్ళా ఏడుపొచ్చింది. ' నాయనా నేనేం జేసేది నాయనా, యాడవకు నాయనా' అని చెప్పాలనిపించింది.
మా మావలు, చిన్నాయన్లు, ఇంకా ఊర్లో పెద్ద మనుషులు జరగాల్సిన తతంగం గురించి మాట్లాడుకుంటూ ఉండారు. ఎవరో సెక్యూరిటీ ఆఫీసర్లకి ఫోన్ చేశారు. సెక్యూరిటీ ఆఫీసర్లు ఫోన్ జేసిన ప్రెతీ తడవా ' ఇదిగో వస్తా వుండాం, అదిగో వస్తా ఉండాం' అంటా ఉండారు. ఎవరెవరో ఎవరెవరికో ఫోన్లు జేసుకుంటా వుండారు.
చివరికి ఆ మూలుండే పెద్ద మనుషులు మా నాయన్ని నా దగ్గర్నుండి లేపి అవతలికి తీసుకపొయ్యి ' ఏణు రెడ్డా! ఏడిసిన పాట పోయిన అమ్మిగాన తిరిగొస్తదా? మొగోడివి జరగాల్సినవి చూడొద్దా? ' అన్నారు. మా నాయన ఆ మాటిని ' అనా! నేను మొగోడ్ని కాదనా...నేను మొగోడ్ని కాను. నాకు నా బిడ్డ కావాలనా! నా బిడ్డ కావాల...నా బిడ్డని నాకు దెచ్చియన్నా అని నేల మీద కూలబడ్డడు. పెద్ద మనిషి మా నాయన్ని లేపి కుర్చీలో కూచోబెట్టి ' ఏణు రెడ్డా! చెప్పేదిను. కేసులు గీసులంటే పోయిన బిడ్డ తిరిగొస్తదా.మీరు పెట్టినయ్యంతా రాబట్టుకుందాం. రెండెకరాలమ్మి గదా బిడ్డ పెళ్ళి జేస్నావు. ఆ రెండెకరాలకి ఇంకో రెండెకరాలు కలిపి కొనుక్కునేట్టు డబ్బులడుగుదాం. లేకపోతే కేసు పెడతామని బెదిరిద్దాం. ' అన్నాడు.
ఆ మాటింగనే మా నాయిన ఆమన్నే లేసి నిలబడి ' అన్నా! అమ్మి పోయిందన్నా...ఆస్తి నేనేం జేసుకొనేదన్నా? బంగారు తల్లి గదంటన్న పిల్ల..కాపరం జెయ్యాలని మేమనుకోలేదే.... అదిగో తా తల్లి , మావా పూచీ నాదీ అని అంటే గదాబిడ్డనీడ వదిలిపెట్టిపోయింది. అమ్మ ప్రవీణమ్మ తల్లీ ఏమమ్మా ఆరోజు నాదీ పూచీ అంటివే? ఇదేనా తల్లీ పూచీ అంటే? అని యాడవడం మొదలుపెట్టాడు.
పెద్దమనుషులు ' ఏణయా మేం జెప్పేది ఇను ఆడదానికంటే ఘోరంగా ఉండావే, కేసులు గీసులని ఏమొస్తది. అయిందేదో అయింది. మన డబ్బైనా మనం రాబట్టొద్దా అన్నారు. తాటి చెట్టంత పొడుగు కదా నేను, అందుకని డిక్కీలో పట్టలా. నాకాళ్ళూ చేతులూ వంచి, వంచి డిక్కీలో కూర్చి డిక్కీ ఏసేసినారు. ఇప్పుడు నేను మహితను కాను. మహిత శవాన్ని. అందుకని డిక్కీలో కూడా ఉండొచ్చు. ఊపిరాడదనే భయం లేదు. మా ఆయన ఎప్పుడో నిన్న రాత్రే నా ఊపిరి తీసేసాడు కదా అందుకు. మా పెద్దమ్మ ఒకామే టౌన్ లో ఉండేది. హాస్పిటల్ ఎంక వీధుల్లో వాళ్ళిల్లు ఉండేది. వాళ్ళింటికి పోవాలంటే రోడ్లో బస్సు దిగి హాస్పిటల్ గుండా పోతే దగ్గర దారి తొందరగా ఎల్లిపోవచ్చు. అందుకని మా నాయ్న ఆ దార్లో తీసుకపొయ్యేవాడు. ఆ దార్లో పాడుబడినట్టు ఒక చిన్న బిల్డింగ్ ఉండేది. ఒకసారి మా నాయన్ని ' అదేంది నాయనా' అనడిగితే అక్కడ శవాల్ని కోస్తారని దాని మార్చురీ అంటారని చెప్పి అదిప్పుడు వేరే బిల్డింగ్ కీ మారిందిలే భయమేం ళెడూ ఆణీ ఛేప్పేడు. అయినా సరే ఆ బిల్డింగు వచ్చిందంటే నాకు భయమేసిపోయేది. ఆ పక్క తల తిప్పకుండా పోయేదాన్ని.
నన్ను మార్చురీకి తీసుకొచ్చేసరికి రాత్రి ఏడున్నరయింది. మా ఆయన తరపనోళ్ళు గూడా ఎవరో వొచ్చేరు. డాక్టర్లు ముగ్గురు నన్ను కోయడం మొదలుపెట్టారు. వాళ్ళలో మగ డాక్టరు నా జడ, మొహము జూసి, ఎంత చిన్నపిల్లో, ఎంత పెద్ద జడో! పాపం ఆ జడ పెరిగినన్ని రోజులు కూడా పట్టలా సచ్చిపోవడానికి.' అన్నాడు.మా ఆయన తరపువోళ్ళు డాక్టరుతో ఏవో మంతనాలాడారు. డాక్టరు అది విని ' ఏమయ్య, అంత పసిబిడ్డ, అన్యాయంగా చంపి పారేస్నారు. పొమ్మంటే పొయ్యి, ఎట్నో ఒకట్ట బతుక్కోబోయిందా, ఇప్పుడు తప్పుడు రిపోర్టు రాసి మీ దగ్గర డబ్బు తీసుకుంటే జీసస్ నన్నెప్పటికీ క్షమించడు, పొండి అవతలబడ...!'అన్నాడు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
