Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
కేశిన్ వెంట్రుకలు వంటి తెలుపు నలుపు కిరణ బాణాలతో పురూరవుని తో యుద్దం చేయసాగాడు. అది గమనించిన పురూరవుడు యూక( పేను మరియు స్వేదం వలన పుట్టిన క్రిములు) కిరణ బాణాలతో కేశిన్ ని ఎదుర్కొన్నాడు. కేశిన్ శరీరం నిండా యూక బాణాలు చుట్టుముట్టాయి. కేశిన్ భయంకర ఆర్తనాదాలతో ప్రాణాలను విడిచాడు. 



పురూరవుడు ఊర్వశిని పరిశీలనగ చూసాడు. సనత్ కుమారుని శాప ప్రభావం చేత అతని మనసులో
కేవలం ఊర్వశి యే నిలిచింది. అంతకు ముందే పురూరవుని చూచి ఉండటంతో ఊర్వశి పురూరవుని కౌగిలిలో ఒదిగి పోయింది. ఇరువురు ప్రేమ లోకం లో విహరించ సాగారు. 



ఊర్వశి కౌగిలి లోనే కాలం గడుపుతున్న పురూరవుని ప్రవర్తనను గమనించిన వశిష్ట మహర్షి ఇదంతా తన వలనే జరిగింది అని అనుకున్నాడు. కొందరు అవకాశవాద బ్రాహ్మణుల మాటలకు అగ్ర పీఠం వేసి పురూరవుని ఈ పరిస్థితికి తెచ్చి తప్పు చేసానని వశిష్ట మహర్షి అనుకున్నాడు. 



అంత వశిష్ట మహర్షి పురూరవుడంటే ప్రాణమిచ్చే క్షాత్ర ధర్మం ఉన్నవారికి పరిపాలనా బాధ్యతలను అప్పగించాడు. వారికి వశిష్ట మహర్షి పురూరవుని శాప విషయం చెప్పకుండా మీ పరిపాలనా దక్షతను పరిక్షీంచుకోండి అని చెప్పాడు.
 
ఋషులు, మహర్షులు యజుర్వేద క్షీణత గురించి, పిచ్చి వారవుతున్న గణిత పండితుల గురించి, తగ్గిపోతున్న మేకల సంపద గురించి దేవేంద్రుని కి చెప్పారు. 



అప్పుడు దేవేంద్రుడు తన దివ్యదృష్టితో సమస్తం తెలుసుకుని "మహర్షులారా! చంద్రవంశానికి చెందిన పురూరవుని లో యజుర్వేద అంశ ఉంది. అతను సనత్ కుమారుని శాపాన్ని వినయంగా స్వీకరించాడు. ప్రస్తుతం సనత్ కుమారుని శాప ప్రభావం నాలుగింట ఒక వంతు పురూరవుని మీద ఉంది. అందువలన యజుర్వేదం చదవాలని ప్రయత్నించే వారి నాలుకలు తడబడి అప శబ్దాలు ఉత్పన్నమవుతాయి. 



యజుర్వేదం లో అనేకానేక గణిత అంశాలు ఉంటాయి. అందులో వధూ పీఠం ( పరిపూర్ణ పైథాగరస్ సిద్దాంతం) వంటి గణిత అంశాలు ఉంటాయి. శాప ప్రభావాన యజుర్వేద గణితాంశాలను ఔపాసన పట్టిన వారు పిచ్చివాళ్ళు అవుతున్నారు. యజుర్వేద పురుషుడు మేక ముఖం తో పసుపు రంగు తో ఒక చేత కర్ర పట్టి ఉంటాడు. సమస్త సృష్టికి సంపదలు, శుభములు ప్రసాదిస్తుంటాడు. 



 సృష్టిలో మేకల సంపద తరిగి పోవడానికి ప్రధాన కారణం సనత్ కుమారుని శాపం. ప్రస్తుతం మూడింట ఒక వంతు మాత్రమే పురూరవుని సనత్ కుమారుని శాప ప్రభావం ఆవరించింది. మొత్తం శాప ప్రభావం పురూరవుని ఆవహిస్తే సృష్టిలో యజుర్వేద ఛాయలు లేకుండా పోతాయి. పురూరవుని శపించడం అంటే యజుర్వేదం ను శపించటమే. గణిత తేజం ను శపించటమే " అని మహర్షులతో అన్నాడు. 



"పురూరవుని కబళిస్తున్న శాప ప్రభావం మొత్తం తగ్గిపోవాలంటే తక్షణ కర్తవ్యం ఏమి”టని మహర్షులు దేవేంద్రుని అడిగారు. 



"పురూరవుడు ఇలా బుధుల సంతానం. బుధుడు చంద్రుని కుమారుడు. పురు పర్వతం మీద ఇలా బుధులకు పుట్టిన సంతానమే పురూరవుడు. అతడే యజుర్వేద సంరక్షణ చెయ్యాలి. పురూరవుడు అంటే యజుర్వేదం. యజుర్వేదం అంటే పురూరవుడు. అందుకే అతను భూమండలం తో పాటు పదమూడు ద్వీపాలను జయించ గలిగాడు. త్రేతాగ్నులను తన గుప్పిట ఉంచుకో గలిగాడు. 



ఇక యజుర్వేద సంరక్షణ నిమిత్తం పురూరవుడు దిగంబరంగా మారాలి. అప్పుడు చంద్రుడు పురూరవుని మీద అమృత వర్షం కురిపిస్తే పురూరవుని శాపం తక్షణం అతన్ని వదిలిపోతుంది." అని మహర్షులతో దేవేంద్రుడు అన్నాడు. 



"పురూరవుని దిగంబరునిగా ఎలా చేయాలి? అప్పుడు అతను యజుర్వేద సంరక్షణ ఎలా చేస్తుంటాడు? " అని మహర్షులు దేవేంద్రుని అడిగారు. 



"ఈ ప్రశ్నకు సమాధానం బ్రహ్మ భారతులే చెప్పాలి " అని మహర్షులతో అన్నాడు దేవేంద్రుడు. 
దేవేంద్రుడు మహర్షులు అందరినీ తీసుకుని బ్రహ్మ భారతుల దగ్గరకు వెళ్ళాడు. తన వంతు కర్తవ్యం గా పురూరవుని గురించి చెప్పాడు.. 



దేవేంద్రుడు చెప్పిన మాటలన్నిటిని విన్న బ్రహ్మ" ఈ సమస్యకు పరిష్కారం చెప్పు " అన్నట్లు సరస్వతీ దేవి ముఖం చూసాడు. అప్పుడు సరస్వతీ దేవి, " దేవేంద్ర! మహర్షులారా! యుగ ధర్మాన్ని చక్కగా పాటించే వారి ముందు దేవతలు సహితం తల వంచాల్సిందే. లేకుంటే ఇలాంటి ఉపద్రవాలే వస్తాయి. ఛాందస భావ జాలం అధికంగా ఉన్నవారు సత్య యుగ ధర్మం సత్య యుగ ధర్మం అని ఎదుటివారిని తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలని చూస్తారు తప్పించి వారు సహితం సత్య యుగ ధర్మం పాటించరు. 



అలాంటి వారి మీద సురనరయక్షకిన్నెరరాక్షసాది జాతులు వారు ఎవరూ జాలి దయ చూపించకూడదు. యుగ ధర్మం పాటించని బలి చక్రవర్తి వంటి వారి వలన సృష్టి కి మేలు కంటే కీడే ఎక్కువ జరిగింది. 



ఇక యుగ ధర్మం గురించి ఆలోచించకుండా కొందరు బ్రాహ్మణుల మీద అధిక జాలి చూపించడం వలననే ఇదంతా జరిగింది. ప్రస్తుతం పురూరవుడు ఊర్వశీ ప్రేమ సాగరం లో మునిగి తేలుతున్నాడు.. మీరు ఊర్వశిని కలిసి శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం అనే రెండు మేకలను ఆమెకు ఇవ్వండి. ఆ రెండు మేకలను పురూరవుడు అతి జాగ్రత్తగా సంరక్షించాలి. అలాగే పురూరవుడు ఎప్పుడూ ఊర్వశి ముందు దిగంబరంగా ఉండరాదు. అప్పుడే తనని పెళ్ళి చేసుకుంటానని ఊర్వశి తో పురూరవునికి చెప్పించండి. ఆపై యుగ ధర్మ కాలమే చూసుకుంటుంది." అని సరస్వతీ దేవి దేవేంద్రుని తోనూ మహర్షుల తోనూ అంది. 



దేవేంద్రుడు బ్రహ్మ భారతులకు నమస్కరించి మహర్షులతో ఊర్వశి దగ్గరకు పయనమయ్యాడు. ఊర్వశి ఒడిలో శయినించిన పురూరవుడు ఊర్వశి అధరాలను, ఆమె అందాలను సప్త ఛందో వృత్తాలతో ప్రశంసిస్తూ, తనని పెళ్ళి చేసుకోమని ఊర్వశిని అడిగాడు. అందుకు ఊర్వశి ధర్మ బద్ధంగా ఆలోచించి చెబుతాను అంది. 



అనంతరం పురూరవుడు ప్రేమ జలం తీసుకురావడానికి దగ్గరలో ఉన్న శృంగార శైలానికి వెళ్ళాడు. అప్పుడు దేవేంద్రుడు ఊర్వశిని కలిసి సరస్వతి చెప్పిన మాటలను చెప్పాడు. సరస్వతీ దేవి చెప్పిన పని చేసినప్పుడే నీకు ఇంద్ర లోక దర్శనం. ఇదే నీకు నా శాపం " అన్న దేవేంద్రుని తో ఊర్వశి అలాగే అంది. 



దేవేంద్రుడు, మహర్షులు సుర బలంతో, తపో బలంతో రెండు మేకలను సృష్టించి ఊర్వశి కి ఇచ్చారు. శుక్ల యజుర్వేదం తోనూ, కృష్ణ యజుర్వేదం తోనూ రెండు మేకలు ప్రకాశిస్తున్నాయి. 



పురూరవుడు తెచ్చిన ప్రేమ జలం తాగుతూ ఊర్వశి "నా ప్రేమ ప్రాణేశ్వర! శశాంక పౌత్ర! ఈ రెండు మేకలను నువ్వంతట నువ్వే జాగ్రత్తగ సంరక్షించాలి. ఇక నువ్వు నా కళ్ళ ముందెప్పుడూ దిగంబరంగా కనపడ కూడదు. ఇందుకు సరే అంటేనే నిన్ను నేను వివాహం చేసుకుంటాను. " అని ఊర్వశి పురూరవుని తో అంది. 



పురూరవుడు ఊర్వశి చెప్పినట్లు చేస్తాను అని చెప్పి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కొంత కాలం ప్రణయ సాగరంలో మునిగి తేలారు. 



ఒక నాడు పురూరవుడు రెండు మేకలను తీసుకుని నిగమ శిఖరం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ మేకలను మేతకు వదిలాడు. మేకల ముఖం లో పురూరవునికి శుక్ల యజుర్వేద పురుషుడు, కృష్ణ యజుర్వేద పురుషుడు కనపడ్డాడు. వెంటనే అప్రయత్నంగా అతని నోట యజుర్వేద మంత్రాలు వచ్చాయి. 



దేవేంద్రుడు పంపిన విశ్వావసువు మరియు మాయా గంధర్వ గొల్లలు రెండు మేకలను దొంగిలించాలని చూసారు. అప్పుడు పురూరవుడు వారితో పెనుగులాడి రెండు మేకలను సంరక్షించాడు. ఆ పెనుగులాటలో పురూరవుని కుడి చేతి వేళ్ళకు కొంచెం గాయాలయ్యాయి. 



పురూరవుడు మేకలను తీసుకుని యింటికి వచ్చాడు. తను నెల తప్పిన విషయం ఊర్వశి పురూరవునికి చెప్పింది. పురూరవుడు మిక్కిలి సంతోషించాడు. 



 మేకల దొంగలు ఎక్కువయ్యారని పురూరవుడు రెండు మేకలను తను శయనించే గది పక్క గదిలోనే వాటి నివాస స్థావరం ఏర్పాటు చేసాడు. 



పురూరవుడు రెండు మేకల దగ్గర కూర్చుని చదివే యజుర్వేద మంత్రాలను ఊర్వశి గర్భం లో ఉన్న శిశువు వినసాగాడు. 



ఒక శుభ ముహూర్తాన ఊర్వశి కి పండంటి మగ శిశువు పుట్టాడు. ఆ శిశువుకు పురూరవుడు ఆయువు అని పేరు పెట్టాడు. అటు పై ఊర్వశి పురూరవులకు మరో అయిదుగురు మగ శిశువులు పుట్టారు. వారికి వనాయువు, శతాయువు, ధీమంతుడు, ధృఢాయువు, అమావసువు అనే పేర్లను ఊర్వశి పురూరవులు పెట్టారు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) కథలు - ఆంగి - by k3vv3 - 04-09-2025, 06:08 PM



Users browsing this thread: 1 Guest(s)