04-09-2025, 06:07 PM
అమలిన జ్ఞాన చక్రాన ప్రకాశిస్తూ బ్రహ్మ భారతుల మెప్పును పొందే పురూరవుని ఊర్వశి రెండవ సారి చూచింది. అప్పుడు పురూరవుడు ఊర్వశి హృదయంలో సుస్థిరంగా నిలిచి పోయాడు. ఊర్వశి తన అంతఃపురంలో శయనించినప్పుడు ఆమె హృదయం లోని పురూరవుడు ఆమె శయనం మీదకు వచ్చాడు. ఆమె అధరాలను నిమిరి అమృతం కురిపించాడు.
ఊర్వశి పురూరవునే తలచుకుంటూ ఇంద్ర సభకు సహితం వెళ్ళడం మానేసింది. అది తెలిసిన ఇంద్రుడు ఊర్వశి మందిరం నకు వచ్చి పురుషోత్తమ నృత్యం చేయమన్నాడు.
ఊర్వశి పురుషోత్తమ అని ప్రారంభించి పురూరవ అంటూ శతప్రశంస పురూరవ నృత్యం చేసింది. దేవేంద్రుడు ఊర్వశి మనసును గ్రహించాడు. ఊర్వశి పురూరవుని మనసులో నిలుపుకోవడానికి విధాత రాత లో ఏదో ప్రత్యేకత ఉంది అనుకున్నాడు. కడకు కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది అనుకున్నాడు.
ఒకనాడు ఊర్వశి, రంభ, మేనక, త్రిలోత్తమాదులతో కూడి ఉద్యానవనం లో ఉంది. ఊర్వశి రంభ కు పురూరువుని రూపం గురించి పలు విధాలుగా వర్ణించి చెప్పసాగింది. అప్పుడు అందమైన యువతుల వెంట్రుకల కోసం వచ్చిన కేశిన్ అనే మాంత్రిక రాక్షసుడు ఊర్వశిని చూసాడు.
సృష్టి లో యజుర్వేదం లేకుండా చేయాలని కేశిన్ అనే మాంత్రికుడు అనేక మేకలను క్షుద్ర దేవతలకు బలి ఇచ్చాడు. యజుర్వేద పురుషుడి బొమ్మను అప్సరసల వెంట్రుకలతో కట్టాలని క్షుద్ర దేవత అనడంతో కేశిన్ అక్కడకు వచ్చాడు. అప్సరసల వెంట్రుకలను అపహరించాలని అనుకున్నాడు.
ఊర్వశిని చూడగానే కేశిన్. ఆలోచనా సరళి మారింది. కేశిన్ క్షుద్ర పూజకు మంగళం పాడి ఊర్వశి ప్రేమలో మునిగి పోయాడు. ‘ఊర్వశి నా ప్రేయసి నువ్వే నా ప్రాణం, నేనే నీ హృదయ రూపం’ అంటూ ఊర్వశి నామం జపియించ సాగాడు.
పురూరవుని పక్షపాత రాహిత్యానికి, అతని నిజాయితీకి మిక్కిలి సంతసించిన కొందరు రాక్షసులు కూడా అతని అనుచరులు అయ్యారు. యుగ ధర్మం తప్పని రాక్షసులకు సహితం పురూరవుడు తన సహాయ సహకారాలను అందించాడు.
అప్పుడప్పుడు దేవతలు రాక్షస సంహారం నిమిత్తం పురూరవుని సహాయం కోరేవారు. పురూరవుడు యుగ ధర్మం తప్పిన రాక్షస సంహారం నిమిత్తమే దేవతలకు సహకరించేవాడు. యుగ ధర్మం తప్పిన రాక్షసులనైన సరే దేవతలనైన సరే పురూరవుడు కఠినంగా శిక్షించేవాడు.
ప్రజలను కన్న బిడ్డల కన్నా మిన్నగా చూసుకునే పురూరవుడు నిరుపేదల పాలిట దేవుడు అయ్యాడు. పురూరవుడు నిరుపేదలు తప్పు చేసిన ఊరుకునేవాడు కాదు. "ప్రతి మనిషి తన శక్తి మేర ఏదో ఒక పని చేయాలనేవాడు. మనిషికి నిద్రలేమి మంచిది కాదనే వాడు.. ఓంకార జపము లో ఔషద గుణం ఉందనే వాడు. అందరితో కలిసి జీవించాలి అనేవాడు.
ఎవరైనా సరే తమ శక్తి మేర ఆరోగ్య నిమిత్తం యాగం చేయించాలి అనేవాడు. పౌర్ణమి నాడు చేసే పూర్ణ యాగం, అమావాస్య రాత్రి చేసే దర్శ యాగం ఇంకా తదితర యాగాల గురించి తనకు తెలిసింది ప్రజలందరికి చెప్పేవాడు. యజుర్వేద పఠనం ద్వారా గణిత జ్ఞానం వికసిస్తుందనేవాడు. చీకటి వెలుగుల జీవన గమనాన్ని విధాత రాతకు అనుకూలంగా చూపించేవి కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అనేవాడు.
ఒకసారి పురూరవుడు వైకుంఠం లో కలిసిన సమస్త దేవ బృందం ను దర్శించుకుని తిరిగి వస్తుండగా, ఊర్వశి అతని కంటపడింది. అప్పుడు అతని మనసులో నారాయణుని ఊరువులు మెదిలాయి. మహోన్నత ఉషస్ లో కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అతని మనసులో కదలాడాయి. అప్రయత్నంగా అతని పెదవుల నుండి ఓం కేశవాయ స్వాహ అంటూ మంత్ర శ్లోకాలు ఉద్భవించాయి. అటు పిమ్మట ఊర్వశి రూపం అతని మనసులో నిలిచిపోయింది.
పదే పదే మనసులో కదలాడే ఊర్వశి రూపం మళ్ళీ మళ్ళీ తలచుకుంటూ, ఊర్వశీ ఊర్వశీ అంటూ పురూరవుడు అంతఃపురంలో అనేక నిద్రలేని రాత్రులు గడిపాడు. ఈ విషయం అవకాశవాదులైన కొందరు బ్రాహ్మణ పండితులకు తెలిసింది. వారు పురూరవుని మనసుని, అతని మనసులోని ఊర్వశి రూపాన్ని రకరకాలుగా వక్రీకరించి వర్ణించారు. ఈ విషయం కుల గురువు వశిష్ట మహర్షి ద్వారా పురూరవునికి తెలిసింది.
అప్పుడు పురూరవుడు కుల గురువు వశిష్ట మహర్షి తో, "దేవ వశిష్ట మహర్షి.. ఊర్వశి నా మనసున కేవలం అప్సరస గా కాకుండా యజుర్వేద తేజంతో నారాయణ ఊరు తేజంతో నిలిచింది అన్నది ముమ్మాటికీ నిజం. అయితే కేవలం ఒక స్త్రీ వ్యామోహ తేజం లో పడి నేను రాజ్య పరిపాలనా బాధ్యతను విస్మరించేటంతటి అవివేకిని కాదు" అని అన్నాడు.
ఒకనాడు ఒక నిరుపేద పురూరవుని అంతఃపురంలో పురూరవుని కలిసాడు. నిరుపేదను విషయం ఏమిటని పురూరవుడు అడిగాడు. అప్పుడు ఆ నిరుపేద, "రాజా! బ్రాహ్మణులకు మీరు పంచమని ఇచ్చిన సంపదను పూజలు, వ్రతాల పేర్లతో వారే ఉంచి వేసుకుని, మా ముఖాన ఎంగిలి మెతుకులు వేస్తున్నారు. అదేమంటే ఇది అంతే అంటున్నారు. మా నిరుపేదలకు మీరే న్యాయం చెయ్యాలి. " అని అన్నాడు.
నిరుపేద మాటలను విన్న పురూరవుడు మంత్రులనూ, ఊరి పెద్దలను పిలిపించి నిరుపేద మాటలలో నూటికి నూరు శాతం నిజం ఉందన్న విషయాన్ని తెలుసుకున్నాడు. అంత కత్తి పట్టి బ్రాహ్మణుల దగ్గరున్న ధనాన్నంత తెప్పించి నిరుపేదలందరికి పంచి పెట్టాడు.
కొందరు ఛాందస బ్రాహ్మణులు పురూరవుని కుల గురువు వశిష్ట మహర్షి దగ్గరకు వెళ్ళి ‘పురూరవుడు ఊర్వశి మైకం లో పడి చెయ్యకూడని పనులను చేస్తున్నాడు మా ధనాన్నంత అతగాడు అపహరించాడు. అంతేగాక పురూరవుడు బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యతను ఇచ్చి ధర్మానికి కొరివి పెడుతున్నాడు’ అని చెప్పడమే గాక కొందరు పండితుల చేత పురూరవుడు బాహ్య సౌందర్యానికే అధిక ప్రాధాన్యత ఇస్తాడు అని ప్రచారం చేయించారు. అలా కొన్ని తాళ పత్ర గ్రంథాలు కూడా వ్రాయించారు.
బ్రాహ్మణుల మాటలను విన్న వశిష్ట మహర్షి పురూరవుని కలిసి బ్రాహ్మణ ధనం బ్రాహ్మణులకు ఇచ్చివేయమన్నాడు. అందుకు పురూరవుడు నిరాకరించి, అది బ్రాహ్మణ ధనం కాదు. నిరుపేదల ధనం అన్నాడు.
వశిష్ట మహర్షి కోపంతో బ్రహ్మ దేవుని దగ్గరకు వెళ్ళి పురూరవుడు బ్రాహ్మణ ధనం తీసుకున్న విధానం చెప్పాడు. బ్రహ్మ సనత్ కుమారుని పిలిచి పురూరవుని కలిసి బ్రాహ్మణ ధనం బ్రాహ్మణులకు ఇప్పించి రమ్మని పలికాడు. సనత్ కుమారుడు పురూరవుని కలిసి బ్రాహ్మణ ధనం బ్రాహ్మణులకు ఇచ్చివేయమన్నాడు. అందుకు పురూరవుడు "సనత్ కుమార! బ్రహ్మ జ్ఞానం తెలిసిన బ్రాహ్మణులు ధర్మం మూడు పాదాల మీద నడిచే త్రేతాయుగంలో కూడా ధర్మం నాలుగు పాదాల మీద నడిచే సత్య యుగం బ్రాహ్మణునిగా బతికి బ్రహ్మ తేజం తో యశసించాలి. అలాంటి వారే నిజమైన బ్రాహ్మణులు. బ్రాహ్మణుడు ముందుగా బ్రహ్మ జ్ఞానం ను తాను అనుసరించి చూపించాలి.
అది చెయ్యని వారు పుట్టుకతో బ్రాహ్మణులైన అసలు సిసలు బ్రాహ్మణులు మాత్రం కాదు. అలాంటి వారికి ఎలాంటి సహాయం చేయనవసరం లేదు. నేను సమస్త ప్రజలకు, నిరుపేదలకు, నిర్భాగ్యులకు సమానంగా పంచమని ఇచ్చిన సంపదను కొందరు బ్రాహ్మణులు తమ స్వార్థం కోసం వినియోగించుకున్నారు. అలాంటి వారికి ధనం ఇవ్వవలసిన పనిలేదు. "అని అన్నాడు.
పురూరవుని మాటలకు ఆగ్రహోదగ్రుడైన సనత్ కుమారుడు, "హే పురూరవ! నువ్వు సూర్యోదయం లతో అనుసంధానించబడిన చంద్ర వంశ సంజాతుడవు.. నీలో సూర్య చంద్ర కళలు సమ స్థాయిలో ఉన్నాయి. నీకు కొందరు దేవతలనే శాసించగలిగిన సామర్థ్యం ఉంది అని నాకు తెలుసు. త్రేతాగ్నులు, యజుర్వేద పురుషుడు నిన్ను విశ్వ సుర కవచం తో కాపాడుతున్నారు. అలాంటి నీ మీద నా శాపం పని చేయదు. అయినా నా సుర శక్తినంత ధారపోసి నువ్వు కొంత కాలం వెర్రివాడిగ తిరగాలని శపిస్తున్నాను. " అని పురూరవుని శపించాడు.
సనత్ కుమారుని శాపాన్ని విన్న పురూరవుడు
"హే దేవ! యుగ ధర్మం నిరుపేదల మానసిక ధర్మం దరిదాపు ఒకే రీతిన ఉంటుంది. నేను ఆ పథానే పయనిస్తున్నాను. ఆకలి దప్పిక లకు అల్లంత దూరంలో ఉండే మీలాంటి మహాత్ములు కృత యుగ ధర్మ భావనలతోనే సంచరిస్తుంటారు. ఆ ఆలోచనలతోనే ఒక్కొక్కసారి ఆవేశపడుతుంటారు. అదేమంటే మేము మీ మాటలను పెడ చెవిన పెట్టి గర్వంగా సంచరిస్తున్నాము అంటారు.
మీ శాపం నా మీద పని చేయదని మీరే అంటున్నారు. అయితే మీలాంటి మహాత్ముల వరాలను, శాపాలను యుగ ధర్మం తప్పకుండా సదా తలవంచి స్వీకరించాలనే సదాలోచనలు ఉన్నవాడిని నేను.. మీ శాపాన్ని నా తలరాత గా భావించి స్వీకరిస్తాను. మీ శాపం నాకు తగల వలెనని యుగ పురుషుని ప్రార్థిస్తాను" అని పురూరవుడు సనత్ కుమారుని తో అన్నాడు.
పురూరవుడు సనత్ కుమారుని శాపాన్ని స్వీకరించాడు. సనత్ కుమారుని శాప ప్రభావం నూరింట ఒక వంతు పురూరవుని తనువు ని ఆక్రమించింది. అప్పటినుండి సమస్త భూమండలంలో, విశ్వంలో ఉండే మేకలు అధికంగా చని పోసాగాయి. గణిత జ్ఞానం ఉన్న వారు అధిక శాతం పిచ్చి వాళ్ళు కాసాగారు. యజుర్వేదం లోని శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం చదివే వారిలో అప శబ్దాలు అధికం కాసాగాయి.
ఒకనాడు పురూరవుడు గంధర్వ లోకం నుండి భూమి మీదకు వస్తుండగా ఊర్వశి వెంట పడుతున్న మాంత్రిక రాక్షసుడు కేశిన్ అతని కంట పడ్డాడు. పురూరవుడు కేశిన్ తో యుద్దానికి సిద్ధపడ్డాడు.
ఊర్వశి పురూరవునే తలచుకుంటూ ఇంద్ర సభకు సహితం వెళ్ళడం మానేసింది. అది తెలిసిన ఇంద్రుడు ఊర్వశి మందిరం నకు వచ్చి పురుషోత్తమ నృత్యం చేయమన్నాడు.
ఊర్వశి పురుషోత్తమ అని ప్రారంభించి పురూరవ అంటూ శతప్రశంస పురూరవ నృత్యం చేసింది. దేవేంద్రుడు ఊర్వశి మనసును గ్రహించాడు. ఊర్వశి పురూరవుని మనసులో నిలుపుకోవడానికి విధాత రాత లో ఏదో ప్రత్యేకత ఉంది అనుకున్నాడు. కడకు కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది అనుకున్నాడు.
ఒకనాడు ఊర్వశి, రంభ, మేనక, త్రిలోత్తమాదులతో కూడి ఉద్యానవనం లో ఉంది. ఊర్వశి రంభ కు పురూరువుని రూపం గురించి పలు విధాలుగా వర్ణించి చెప్పసాగింది. అప్పుడు అందమైన యువతుల వెంట్రుకల కోసం వచ్చిన కేశిన్ అనే మాంత్రిక రాక్షసుడు ఊర్వశిని చూసాడు.
సృష్టి లో యజుర్వేదం లేకుండా చేయాలని కేశిన్ అనే మాంత్రికుడు అనేక మేకలను క్షుద్ర దేవతలకు బలి ఇచ్చాడు. యజుర్వేద పురుషుడి బొమ్మను అప్సరసల వెంట్రుకలతో కట్టాలని క్షుద్ర దేవత అనడంతో కేశిన్ అక్కడకు వచ్చాడు. అప్సరసల వెంట్రుకలను అపహరించాలని అనుకున్నాడు.
ఊర్వశిని చూడగానే కేశిన్. ఆలోచనా సరళి మారింది. కేశిన్ క్షుద్ర పూజకు మంగళం పాడి ఊర్వశి ప్రేమలో మునిగి పోయాడు. ‘ఊర్వశి నా ప్రేయసి నువ్వే నా ప్రాణం, నేనే నీ హృదయ రూపం’ అంటూ ఊర్వశి నామం జపియించ సాగాడు.
పురూరవుని పక్షపాత రాహిత్యానికి, అతని నిజాయితీకి మిక్కిలి సంతసించిన కొందరు రాక్షసులు కూడా అతని అనుచరులు అయ్యారు. యుగ ధర్మం తప్పని రాక్షసులకు సహితం పురూరవుడు తన సహాయ సహకారాలను అందించాడు.
అప్పుడప్పుడు దేవతలు రాక్షస సంహారం నిమిత్తం పురూరవుని సహాయం కోరేవారు. పురూరవుడు యుగ ధర్మం తప్పిన రాక్షస సంహారం నిమిత్తమే దేవతలకు సహకరించేవాడు. యుగ ధర్మం తప్పిన రాక్షసులనైన సరే దేవతలనైన సరే పురూరవుడు కఠినంగా శిక్షించేవాడు.
ప్రజలను కన్న బిడ్డల కన్నా మిన్నగా చూసుకునే పురూరవుడు నిరుపేదల పాలిట దేవుడు అయ్యాడు. పురూరవుడు నిరుపేదలు తప్పు చేసిన ఊరుకునేవాడు కాదు. "ప్రతి మనిషి తన శక్తి మేర ఏదో ఒక పని చేయాలనేవాడు. మనిషికి నిద్రలేమి మంచిది కాదనే వాడు.. ఓంకార జపము లో ఔషద గుణం ఉందనే వాడు. అందరితో కలిసి జీవించాలి అనేవాడు.
ఎవరైనా సరే తమ శక్తి మేర ఆరోగ్య నిమిత్తం యాగం చేయించాలి అనేవాడు. పౌర్ణమి నాడు చేసే పూర్ణ యాగం, అమావాస్య రాత్రి చేసే దర్శ యాగం ఇంకా తదితర యాగాల గురించి తనకు తెలిసింది ప్రజలందరికి చెప్పేవాడు. యజుర్వేద పఠనం ద్వారా గణిత జ్ఞానం వికసిస్తుందనేవాడు. చీకటి వెలుగుల జీవన గమనాన్ని విధాత రాతకు అనుకూలంగా చూపించేవి కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అనేవాడు.
ఒకసారి పురూరవుడు వైకుంఠం లో కలిసిన సమస్త దేవ బృందం ను దర్శించుకుని తిరిగి వస్తుండగా, ఊర్వశి అతని కంటపడింది. అప్పుడు అతని మనసులో నారాయణుని ఊరువులు మెదిలాయి. మహోన్నత ఉషస్ లో కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అతని మనసులో కదలాడాయి. అప్రయత్నంగా అతని పెదవుల నుండి ఓం కేశవాయ స్వాహ అంటూ మంత్ర శ్లోకాలు ఉద్భవించాయి. అటు పిమ్మట ఊర్వశి రూపం అతని మనసులో నిలిచిపోయింది.
పదే పదే మనసులో కదలాడే ఊర్వశి రూపం మళ్ళీ మళ్ళీ తలచుకుంటూ, ఊర్వశీ ఊర్వశీ అంటూ పురూరవుడు అంతఃపురంలో అనేక నిద్రలేని రాత్రులు గడిపాడు. ఈ విషయం అవకాశవాదులైన కొందరు బ్రాహ్మణ పండితులకు తెలిసింది. వారు పురూరవుని మనసుని, అతని మనసులోని ఊర్వశి రూపాన్ని రకరకాలుగా వక్రీకరించి వర్ణించారు. ఈ విషయం కుల గురువు వశిష్ట మహర్షి ద్వారా పురూరవునికి తెలిసింది.
అప్పుడు పురూరవుడు కుల గురువు వశిష్ట మహర్షి తో, "దేవ వశిష్ట మహర్షి.. ఊర్వశి నా మనసున కేవలం అప్సరస గా కాకుండా యజుర్వేద తేజంతో నారాయణ ఊరు తేజంతో నిలిచింది అన్నది ముమ్మాటికీ నిజం. అయితే కేవలం ఒక స్త్రీ వ్యామోహ తేజం లో పడి నేను రాజ్య పరిపాలనా బాధ్యతను విస్మరించేటంతటి అవివేకిని కాదు" అని అన్నాడు.
ఒకనాడు ఒక నిరుపేద పురూరవుని అంతఃపురంలో పురూరవుని కలిసాడు. నిరుపేదను విషయం ఏమిటని పురూరవుడు అడిగాడు. అప్పుడు ఆ నిరుపేద, "రాజా! బ్రాహ్మణులకు మీరు పంచమని ఇచ్చిన సంపదను పూజలు, వ్రతాల పేర్లతో వారే ఉంచి వేసుకుని, మా ముఖాన ఎంగిలి మెతుకులు వేస్తున్నారు. అదేమంటే ఇది అంతే అంటున్నారు. మా నిరుపేదలకు మీరే న్యాయం చెయ్యాలి. " అని అన్నాడు.
నిరుపేద మాటలను విన్న పురూరవుడు మంత్రులనూ, ఊరి పెద్దలను పిలిపించి నిరుపేద మాటలలో నూటికి నూరు శాతం నిజం ఉందన్న విషయాన్ని తెలుసుకున్నాడు. అంత కత్తి పట్టి బ్రాహ్మణుల దగ్గరున్న ధనాన్నంత తెప్పించి నిరుపేదలందరికి పంచి పెట్టాడు.
కొందరు ఛాందస బ్రాహ్మణులు పురూరవుని కుల గురువు వశిష్ట మహర్షి దగ్గరకు వెళ్ళి ‘పురూరవుడు ఊర్వశి మైకం లో పడి చెయ్యకూడని పనులను చేస్తున్నాడు మా ధనాన్నంత అతగాడు అపహరించాడు. అంతేగాక పురూరవుడు బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యతను ఇచ్చి ధర్మానికి కొరివి పెడుతున్నాడు’ అని చెప్పడమే గాక కొందరు పండితుల చేత పురూరవుడు బాహ్య సౌందర్యానికే అధిక ప్రాధాన్యత ఇస్తాడు అని ప్రచారం చేయించారు. అలా కొన్ని తాళ పత్ర గ్రంథాలు కూడా వ్రాయించారు.
బ్రాహ్మణుల మాటలను విన్న వశిష్ట మహర్షి పురూరవుని కలిసి బ్రాహ్మణ ధనం బ్రాహ్మణులకు ఇచ్చివేయమన్నాడు. అందుకు పురూరవుడు నిరాకరించి, అది బ్రాహ్మణ ధనం కాదు. నిరుపేదల ధనం అన్నాడు.
వశిష్ట మహర్షి కోపంతో బ్రహ్మ దేవుని దగ్గరకు వెళ్ళి పురూరవుడు బ్రాహ్మణ ధనం తీసుకున్న విధానం చెప్పాడు. బ్రహ్మ సనత్ కుమారుని పిలిచి పురూరవుని కలిసి బ్రాహ్మణ ధనం బ్రాహ్మణులకు ఇప్పించి రమ్మని పలికాడు. సనత్ కుమారుడు పురూరవుని కలిసి బ్రాహ్మణ ధనం బ్రాహ్మణులకు ఇచ్చివేయమన్నాడు. అందుకు పురూరవుడు "సనత్ కుమార! బ్రహ్మ జ్ఞానం తెలిసిన బ్రాహ్మణులు ధర్మం మూడు పాదాల మీద నడిచే త్రేతాయుగంలో కూడా ధర్మం నాలుగు పాదాల మీద నడిచే సత్య యుగం బ్రాహ్మణునిగా బతికి బ్రహ్మ తేజం తో యశసించాలి. అలాంటి వారే నిజమైన బ్రాహ్మణులు. బ్రాహ్మణుడు ముందుగా బ్రహ్మ జ్ఞానం ను తాను అనుసరించి చూపించాలి.
అది చెయ్యని వారు పుట్టుకతో బ్రాహ్మణులైన అసలు సిసలు బ్రాహ్మణులు మాత్రం కాదు. అలాంటి వారికి ఎలాంటి సహాయం చేయనవసరం లేదు. నేను సమస్త ప్రజలకు, నిరుపేదలకు, నిర్భాగ్యులకు సమానంగా పంచమని ఇచ్చిన సంపదను కొందరు బ్రాహ్మణులు తమ స్వార్థం కోసం వినియోగించుకున్నారు. అలాంటి వారికి ధనం ఇవ్వవలసిన పనిలేదు. "అని అన్నాడు.
పురూరవుని మాటలకు ఆగ్రహోదగ్రుడైన సనత్ కుమారుడు, "హే పురూరవ! నువ్వు సూర్యోదయం లతో అనుసంధానించబడిన చంద్ర వంశ సంజాతుడవు.. నీలో సూర్య చంద్ర కళలు సమ స్థాయిలో ఉన్నాయి. నీకు కొందరు దేవతలనే శాసించగలిగిన సామర్థ్యం ఉంది అని నాకు తెలుసు. త్రేతాగ్నులు, యజుర్వేద పురుషుడు నిన్ను విశ్వ సుర కవచం తో కాపాడుతున్నారు. అలాంటి నీ మీద నా శాపం పని చేయదు. అయినా నా సుర శక్తినంత ధారపోసి నువ్వు కొంత కాలం వెర్రివాడిగ తిరగాలని శపిస్తున్నాను. " అని పురూరవుని శపించాడు.
సనత్ కుమారుని శాపాన్ని విన్న పురూరవుడు
"హే దేవ! యుగ ధర్మం నిరుపేదల మానసిక ధర్మం దరిదాపు ఒకే రీతిన ఉంటుంది. నేను ఆ పథానే పయనిస్తున్నాను. ఆకలి దప్పిక లకు అల్లంత దూరంలో ఉండే మీలాంటి మహాత్ములు కృత యుగ ధర్మ భావనలతోనే సంచరిస్తుంటారు. ఆ ఆలోచనలతోనే ఒక్కొక్కసారి ఆవేశపడుతుంటారు. అదేమంటే మేము మీ మాటలను పెడ చెవిన పెట్టి గర్వంగా సంచరిస్తున్నాము అంటారు.
మీ శాపం నా మీద పని చేయదని మీరే అంటున్నారు. అయితే మీలాంటి మహాత్ముల వరాలను, శాపాలను యుగ ధర్మం తప్పకుండా సదా తలవంచి స్వీకరించాలనే సదాలోచనలు ఉన్నవాడిని నేను.. మీ శాపాన్ని నా తలరాత గా భావించి స్వీకరిస్తాను. మీ శాపం నాకు తగల వలెనని యుగ పురుషుని ప్రార్థిస్తాను" అని పురూరవుడు సనత్ కుమారుని తో అన్నాడు.
పురూరవుడు సనత్ కుమారుని శాపాన్ని స్వీకరించాడు. సనత్ కుమారుని శాప ప్రభావం నూరింట ఒక వంతు పురూరవుని తనువు ని ఆక్రమించింది. అప్పటినుండి సమస్త భూమండలంలో, విశ్వంలో ఉండే మేకలు అధికంగా చని పోసాగాయి. గణిత జ్ఞానం ఉన్న వారు అధిక శాతం పిచ్చి వాళ్ళు కాసాగారు. యజుర్వేదం లోని శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం చదివే వారిలో అప శబ్దాలు అధికం కాసాగాయి.
ఒకనాడు పురూరవుడు గంధర్వ లోకం నుండి భూమి మీదకు వస్తుండగా ఊర్వశి వెంట పడుతున్న మాంత్రిక రాక్షసుడు కేశిన్ అతని కంట పడ్డాడు. పురూరవుడు కేశిన్ తో యుద్దానికి సిద్ధపడ్డాడు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
