Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
అమృత వర్షం
[Image: A.jpg]
ఊర్వశీపురూరవుల కథ
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు



త్రేతాయుగం అనగానే మనకు శ్రీరామ చంద్రుడు గుర్తుకు వస్తాడు. శ్రీరామ చంద్రుడు అనగానే ‘శ్రీరాముడు చెట్టు చాటునుండి వాలిని చంపాడు. సీతను అగ్ని ప్రవేశం చేయమన్నాడు. నిండు గర్భవతిగా అయిన సీతమ్మ ను అడవికి పంపాడు. అమానుషం గా శంబూకుని సంహరించాడు. ఆడదైన యక్ష రాక్షసిని చంపాడు. శూర్పణఖ ముక్కూ చెవులూ కోయించాడు’ వంటి విషయాలు గుర్తుకు వస్తాయి. 



అయితే త్రేతాయుగంలో ధర్మం మూడు కాళ్ళ మీద నడుస్తుంది. మూడు కాళ్ళ ధర్మం లో జన్మించిన శ్రీరామ చంద్రుడు యుగ ధర్మం ప్రకారం సంచరించాడు అనే విషయం మాత్రం గుర్తుకు రాదు. అలాగే వన వాసం పూర్తి చేసుకుని సకాలంలో అయోధ్య కు రాకపోతే అగ్ని ప్రవేశం చేస్తాను అని భరతుడు శ్రీరామ చంద్రుని తో అన్నాడు. 



అలాగే శరంబంగ మహర్షి వంటి మహర్షులు అగ్ని ప్రవేశం చేసారు. అసలు ఆ కాలంలో అగ్ని ప్రవేశం అంటే ఏమిటి అనే విషయాలు కూడా గుర్తుకు రావు. 



త్రేతాయుగం ధర్మం నాలుగు పాదాల మీద నడిచిన సత్య యుగం కాదు అనే విషయం కూడా గుర్తుకు రాదు. ఏదేమైనా ధర్మం మూడు పాదాల నడిచిన త్రేతాయుగంలో జరిగిన కథ ఊర్వశీపురూరవులు. 
 త్రేతాయుగం లో ప్రతిష్టాన పురాన్ని రాజధాని గా చేసుకుని పురూరవుడు అనే రాజు పరిపాలించేవాడు. సమస్త లోకాలలో అతనిని మించిన అందగాడు లేడని అందరితో పాటు దేవతలు కూడా అనుకునేవారు. అతని పరాక్రమానికి అతని పరాక్రమమే సాటి అని సుర నర యక్ష కిన్నెర రాక్షసాది వీరులు ధీరులు అనుకునేవారు. అతని అందాన్ని ఉన్నది ఉన్నట్లుగా చిత్ర పటం లో చిత్రించాలని నరసురాది 
చిత్రకారులు అందరూ ప్రయత్నించారు. కానీ అది ఎవరికీ సాధ్యం కాలేదు. 



అతడు యుగ ధర్మాన్ని అనుసరించి లెక్క లేనన్ని అశ్వమేధ యాగాలను చేసాడు. అహంకారం ప్రదర్శించే రాజుల అహాన్ని మట్టి కరిపించాడు. మంచి మానవత్వం ఉండి, ప్రజలను కన్న బిడ్డల వలే చూసుకునే రాజులను సోదరుల కంటే మిన్నగా చూసుకున్నాడు. వారు "మేం పేరుకు సామంత రాజులమే గానీ నిజానికి మేం పురూరవుని ఆరవ ప్రాణం" అనుకునేటట్లు ప్రవర్తించాడు. 



ఇలా పురూరవుడు భూమండలం మొత్తాన్ని తన హస్తగతం చేసుకున్నాడు. భూమండలం తో పాటు పదమూడు ద్వీపాలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. తన ఆధీనంలో ఉన్న ప్రాంతాలలో నివసించే నిరుపేదల కష్టసుఖాలను తెలుసుకుని వారికి తగిన సహాయ సహకారాలు అందించాడు. తను పుట్టిన పురు పర్వతం మీద వేద పాఠశాలను, లౌకిక విద్యలను నేర్పించే పాఠశాలలను, వైద్య శాలలను, మనుషుల మనో గతాలను అనుసరించి వారి సామర్థ్యాలను పెంచే విద్యాలయాలను నిర్మించాడు. 
పురూరవుడు తన అవక్ర పరాక్రమంతో సంపాదించిన సంపాదన సమస్తాన్ని తన రాజ్యంలోని వారందరు సమానంగా పంచుకోండి అని అన్నాడు. సంపదను సమానంగా పంచవలసిన బాధ్యతను తన రాజ్యంలోని కొందరు బ్రాహ్మణులకు అప్పగించాడు. నిరు పేదలకు, నిర్భాగ్యులకు యుగ ధర్మానుసారం కొంచెం ఎక్కువ ధనం ఇవ్వమనీ బ్రాహ్మణులకు చెప్పాడు. 



అందుకు ఆ బ్రాహ్మణులు, "రాజా పురూరవ! అవసరమైతే నిరుపేదలకు మా ధనం కూడా ఇచ్చేస్తాం" అన్నారు.



బ్రాహ్మణుల మాటలను విన్న పురూరవుడు మిక్కిలి సంతోషించాడు. నిత్య కళ్యాణం పచ్చ తోరణం లా పురూరవుని రాజ్యం లో ప్రతి రోజూ ఏదో ఒక వేడుక జరుగుతుండేది. అతని రాజ్యం లో యజ్ఞ యాగాదులు విస్తృతంగా జరిగేవి. శాస్త్రోక్తంగా యజ్ఞ యాగాదులను జరిపించిన ఋషులు, వేద పండితులు సంతృప్తి గా జీవించడానికి కావలసిన ధనకనకవస్తు వాహనాలను పురూరవుడు వారికి పుష్కలంగా సమకూర్చాడు. యజ్ఞ యాగాదులకు కావలసిన సరకులను, గజతురగాదులను, గోవులను సమకూర్చిన వారికి సహితం పెద్ద ఎత్తున సకల సంపదలను సమ కూర్చాడు. 



నిరుపేదలను ఆదుకున్న ఋషులను వేద పండితులను పురూరవుడు తానే స్వయంగా పెద్ద ఎత్తున సన్మానించాడు. యజుర్వేద పురుష వదన రూపమైన మేకలను సంరక్షించే వారిని ప్రత్యేకంగా గౌరవించాడు. వారికి కావలసిన సకల సదుపాయాలను సమకూర్చాడు. " సా విశ్వాయుః.. సా విశ్వ కర్మా.. సా విశ్వధాయాః" అంటూ శుక్ల యజుర్వేద మంత్రముల లోని వర్ణాలను ఉదాత్తానుదాత్తాది స్వరాలతో గణిత బద్దంగా ఉచ్చరించే వారికి ప్రత్యేక ప్రయోగ శాలలను నిర్మించి ఇచ్చాడు. అప్పుడప్పుడు తను కూడా ప్రయోగ శాల లకు వెళ్ళి కొత్త విషయాలను నేర్చుకో సాగాడు. 



పురూరవుడు తన రాజ్యంలో ఆహవనీయం, దక్షిణాగ్ని, గార్హ్యపత్యం అనే త్రేతాగ్నులు పరిపూర్ణ తేజస్సు తో లేవని గమనించాడు. త్యాగ గుణం నిమిత్తం అవి తప్పక ఉండాలనుకున్నాడు. పవిత్ర తేత్రాగ్నులను తీసుకు రావడానికి పురూరవుడు గంధర్వ లోకం బయలు దేరాడు. మార్గ మధ్యంలో పురూరవునికి కొందరు సాధువులు కనపడ్డారు. 



వారు ఒక్కొక్కరు ఒక బంగారు పాత్రను పురూరవునికి ఇస్తూ, "రాజా ! ఇవి అక్షయ బంగారు పాత్రలు. వీటిని స్వీకరించి సుఖంగా ఉండు. నీ గంధర్వ లోక పయనం ఆపు. "అని అన్నారు. 



పురూరవుడు వారు సాధువులు కాదని, త్యాగ గుణ కంటకులు అని గ్రహించాడు. వెంటనే వారు ఇచ్చిన బంగారు పాత్రలను వారి ముఖం వైపుకే విసిరి కొట్టాడు.. బంగారు పాత్రలు మండుతున్న మంటలు గా మారి సాధువుల ముఖాలను మాడ్చి వేసాయి. పురూరవుడు, సాధు రూపంలో వచ్చినవారు తన ప్రయత్నానికి అడ్డుపడే దుష్ట శక్తులు అని గ్రహించాడు.



 
మాడిన ముఖాలతో దుష్ట శక్తులు మాయమై పోయాయి. అంత పురూరవుడు గంధర్వ లోకము నుండి త్రేతాగ్నులను తీసుకుని వచ్చాడు. యజ్ఞ శాలకు తూర్పు వైపున ఉండే ఆహవనీయ గుండం విషయంలో అత్యంత శ్రద్ద తీసుకోమని ఋషులకు, వేద పండితులకు చెప్పాడు. తన రాజ్యంలో యజ్ఞ శేషము ను భుజించు అమృతాశులు అధికంగా ఉండాలని మహర్షులకు సూచించాడు. 



పురూరవుడు త్రేతాగ్నులను తీసుకువచ్చే సందర్భంలో రంభ మేనక త్రిలోత్తమాదులతో ఉద్యానవనం లో సంచరించే ఊర్వశి మొదటిసారి గా త్రేతాగ్నులలో ప్రకాశించే పురూరవుని చూసింది. పురూరవుని చూడగానే ఊర్వశి లోని అందం ద్విగుణీకృతం, త్రిగుణీకృతం అయ్యింది. ఆమె ఆలోచనల్లో ఇల్లాలి తనం, మాతృత్వం అధికం కాసాగాయి. ఆమె నర్తన లో అయిదవ తనం గల ఇల్లాళ్ళ హావభావాలు అధికం కాసాగాయి. 



ఆ హావభావాలను చూసిన దేవేంద్రుడు ఇంద్ర సభ లో ఆమెకు మహోన్నత స్థానాన్ని ఇచ్చాడు. ఊర్వశి తనకు మహోన్నత స్థానం సంక్రమించినప్పుడు "ఇదంతా పురూరవ దర్శన భాగ్యం" అని మనసులో అనుకుంది. 



నారాయణుని ఊరువుల నుండి జన్మించిన తన జన్మ మరింత పవిత్రమైనది అని అనుకుంది. 



 పురూరవుని చూసిన ఊర్వశి, "ఇతడు సామాన్యుడు కాదు. మహారాజు లను మించిన మహారాజు. ఘన రాజులను మించిన ఘన రాజు. సురులను మించిన సురుడు. " అని మనసులో అనుకుంది. 



క్రమం తప్పకుండా శాస్త్రోక్తంగా యజ్ఞ యాగాదులను విస్తృతంగా నిర్వహించే పురూరవుని తో అనేకమంది దేవతలు స్నేహ సంబంధాలను పెంచుకున్నారు. యజ్ఞ దేవతలందరూ సంతృప్తిగా హవిస్సులను అందుకున్నారు. 



వైకుంఠం లో, కైలాసం లో, బ్రహ్మ లోకం లో, తదితర లోకాలలో దేవతల నడుమ అప్సరసల నడుమ వచ్చిన చిన్న చిన్న సమస్యలకు పురూరవుడే తగిన పరిష్కారాన్ని చూపించి సమస్త లోకాల దేవతల మన్ననలను పొందాడు. 



ఒకసారి బ్రహ్మ లోకం లో బ్రహ్మాభారతులు, ‘సృష్టించడం గొప్ప విషయమా? సృష్టి లోని జీవరాశులకు జ్ఞానం ప్రసాదించడం గొప్ప విషయమా?’ అన్న విషయం మీద తగవులాడుకున్నారు. వారి తగాద చివరికి చిన్నపాటి యుద్దం అయ్యింది.. ఈ విషయం పురూరవునికి నారదుని ద్వారా తెలిసింది. 



అప్పుడు పురూరవుడు బ్రహ్మ లోకం వెళ్లి, "జ్ఞానం లేని సృష్టి అల్లకల్లోలమై అనుక్షణం రక్త సముద్రం అవుతుంది. సృష్టి శృతి మించకూడదు. జ్ఞానం వెర్రి తలలు వెయ్యకూడదు. " అని పురూరవుడు బ్రహ్మ భారతులకు చెప్పాడు. 
 26 కలియుగంలో శృతి మించిన సృష్టి చక్రం గురించి, వెర్రి తలలు వేసిన జ్ఞానం గురించి బ్రహ్మ భారతులకు పురూరవుడు చెప్పాడు. పురూరవుని మాటలను విన్న బ్రహ్మ భారతులు పురూరవుని పలు విధాలుగా మెచ్చుకున్నారు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) కథలు - ఆంగి - by k3vv3 - 04-09-2025, 06:06 PM



Users browsing this thread: 1 Guest(s)