03-09-2025, 09:50 PM
వెనక వ్యక్తి కాళ్ళూ ...ముందు వ్యక్తి మెడకు కట్టిన కన్నీ బలంగా లాగుతూ నిలబడే సరికి ఎటూ కదలలేకుండా ..కదల్లేకుండా శిలలా నిలబడిపోయింది బొకడపోతు అనబడే మేకపోతు.
మూడో వ్యక్తి ఏటకత్తి ఎత్తి మూడుసార్లు క్రిందకూ మీదకూ ఎత్తి ఒకే ఒక్క బలమైనా దెబ్బ మెడమీద వేశాడు.
ఆ కత్తిదెబ్బకు మొండెం నుండి తల వేరయ్యింది. ఓ రెండు నిముషాల పాటు కాళ్ళు కొట్టుకొని ప్రాణం వదిలింది బొకడపోతు.
దాని తలమీద కత్తివేటు పడ్డప్పుడు..అప్పటికే తన చావు దానికి అర్థమయ్యేసరికి ఒకసారి బేలగా అప్పన్న కళ్ళల్లోకి చూసింది..దాని కళ్ళల్లో నీళ్ళు సుల్లు తిరిగాయి
.
ఆదృశ్యం చూసిన అప్పన్నకి మనసు ముక్కలైపోయింది.
దాని స్థానంలో తనే ఉంటే ఎలా ఉండేదో ఊహించుకొనేసరికి శరీరం గగుర్పొడిచింది అప్పన్నకి.
తనమీద విశ్వాసంతో ..భక్తితో దాని ప్రాణం తన చేతుల్లో పెట్టి కళ్ళు మూసుకుందా మూగజీవి.
అదే దుస్థితి మనిషికీ సంభవిస్తే...?
ఆ మరునాడు-
పంచాయితీ అఫీసులోని మీటింగ్ కు సమితి అఫీసర్లు, ఆర్ధిక సహాయం చేసిన బ్యాంక్ ఆఫీసర్లు, ఇతర ప్రముఖులూ అందరూ హాజరయ్యారు.
రైతులందరూ కూడా హజరై మీటింగ్ హాల్లో ఆశీనులై ఉన్నారు.
ఆ మహాసభ రైతులంద్ర్నీ ఉద్దేశించి పెట్టిన సభ కావటం చేత అంతా వాళ్ళ కష్టసుఖాలు గురించి మాట్లాడుతూ ముగించారు. ఆ సభ ముగిసే ముందు బ్యాంకు ఆఫీసర్లు చేసిన హెచ్చరిక మాత్రం అప్పన్న మనసులో నాటుకుపోయింది.
" మీకు భూమినిస్తూ..అప్పులిచ్చింది ఎందుకు? ,ఈరు బాగుపడి..దేశాన్ని బాగు చేస్తారని. మీరు బాగుపడితే దేశం ఆర్థికంగా మెరుగు పడ్డట్టే కదా.!
"ఆ దగ్గర ఏదో సొమ్ము మూల మూలుగుతుందని కానీ, మీరిచ్చే వడ్డీల మీదే బ్యాంకు ఆధారపడి ఇచ్చిందని గానీ అపోహ పడకండి. మీకు అప్పులిచ్చి అన్ని సౌకర్యాలూ సమకూర్చింది ..కేవలం దేశానికి వెన్నముకలైన మీరు బాగుపడాలని.
మీరు కూడా మీ మీ బాధ్యతలు నెరిగి పంట చేతికందిన వెంటనే పంటనమ్మిన మొత్తం లో సగం మాత్రం అప్పుక్రింద జమ చేయండి. మిగిలినది మీ ఇంటి ఖర్చుల క్రింద వాడుకోండి. కనీ, అసలు పైసా కట్టకుండా ఎగ వెయ్యడానికి, గవనమెంటు సొమ్మే కదా అడిగే నాధుడు లేడని భ్రమపడి జమ చేయడం మానకండి. ఆ అప్పుల విషయాలలో మీ ఇల్లు..ఆస్థులు సమస్తం జప్తు చేసే వరకూ వస్తుంది. దయచేసి మమ్మల్ని మీ ఇంటి వరకూ రానివ్వకండి. !"
ఆ వారం తర్వాత...
అనాస తోటలో మొదటి పంట దిగినపుడు ఇంటికి ఆరుకాయలు తెస్తూ సూరమ్మకి ఒకటి ఇచ్చి మిగిలిన అయిదు పళ్ళూ యజమానురాలికి అందించాడు అప్పన్న.
బజార్లో మొదటిపంటలో దిగిన అనాస పళ్ళు అన్నీ వందల ప్రకారం తట్టలకెక్కించి అమ్మేసి ఇంటికి చేరుకున్నాడు నూకరాజు.
"ఏమేవ్?? ఇప్పుడు అప్పన్నగాడు తెచ్చిన అనాస పళ్ళు ఆరూ మనకనుకొని కోసెయ్యకు. పంచాయితీ ప్రెసిడెంటు గారింటికి పంపాల!" ఆయాసంతో కూర్చుంటూ అన్నాడు నూకరాజు.
" ఆరేటి?..? అయిదు. అదిగో అక్కడ పెట్టాను తీసుకుపోండి?" మూతి మూడు వంకర్లు త్రిప్పుతూ అంది
అతని భార్య.
"అయిదా? ఆరు కదా పంపించాను" గొణుక్కున్నాడు నూకరజు.
" ఆ ఒకటీ తన ముద్దుల పెళ్ళానికి ఇచ్చాడు.. వెళ్ళి అడగండి"
" అమ్మడియమ్మా! ఎంతకైనా తెగిస్తాడే!" కోపం పట్టలేకపోయాడు నూకరాజు.
అప్పుడే అక్కడకు వస్తున్న సూరమ్మ భార్యాభర్తలిద్దరూ అనుకున్న మాటలన్నీ వింది. తిన్నగా వెళ్ళి గుడిసెలో ఉన్న అనాస పండు తీసుకువచ్చి అయిదు పళ్ళున్న దగ్గరపెట్టి వెళ్ళ్బోయింది. అదంతా బల్లమీద కూర్చుని చూస్తున్న నూకరాజు కళ్ళు ఎర్రబడ్డాయి. కానీ ఏవీ అన్లేదు.
ఆ సాయంత్రం మంద నుండి వస్తూనే యజమాన్ని కలిసాడు అప్పన్న.
" ఎందుకైనా మంచిది! ఆ గవర్నమెంటోళ్ళ బాకీకి కొంత సొమ్ము కట్టెయ్యండయ్యా!" అన్నాడు.
" నీకెందుకురా వెధవ బోడి సలహాలూ నువ్వూనూ" అని కొట్టిపారేసి బజార్లోకి వెళ్ళిపోయాడు నూకరాజు.
ఆ అనాసతోట పంట సీజను అయిన మరుసటి వారమే జప్తుకు వచ్చారు బ్యాంకు వాళ్ళు. ముందుగా నూకరాజును కలిసి అప్పన్న గుడెసె దగ్గరకు వచ్చారు.
" ఈ జాగా నాదండీ. గుడెసె ఏసుకుంటానంటే దయతలిచి ఇచ్చాను.ఇంక ఈ ఇంట్లో ఏ వస్తువుతోటీ నాకు సంబంధం లేదు"అంటూ తన ఆస్థి వివరాలు చెప్తున్నాడు నూకరాజు.
ఈ హడావుడికి సూరమ్మ పని చేసుకుంటున్నదల్లా గుడెసె దగ్గరకు వచ్చింది. అప్పుడే మందతో బయలుదేరడానికి సిద్ధమౌతున్న అప్పన్నకి నోట మాట రాలేదు. శిలా ప్రతిమలా నిలబడిపోయాడు.
గుడెసెలో ఉన్న సమస్త వస్తువులు జాబితా వ్రాసుకొని తీసుకువెళ్ళి పోయారు బ్యాంకు వాళ్ళు. పూచికపుల్ల కూడా విడవకుండా తీసుకుపోతూ అప్పన్న చేతిలో ఒక నోటీసు కాగితం పెట్టి మరీ వెళ్ళిపోయారు.
ఆ నోటీసులో బ్యాంకు చట్టం ప్రకారం చేస్తామనీ ....వాటి తాలూకా నియమ నిబంధనలకు మీరు బద్ధులు కావాలని హెచ్చరిస్తూ తెలియజేయబడింది.
గుడెసె నూకరాజు ఆస్థి కావడం మూలాన దాన్ని వాళ్ళు సీజ్ చేయలేదు.
ఆ రాత్రంతా భార్యా భర్తలిద్దరూ నిద్ర లేకుండా గడిపారు.
'ఎంతో ముద్దుగా ...ముచ్చట తీరా తమ సంసారం కోసం సరంజామా అంతా సర్దుకుంది ఇన్నాళ్ళూ. దాన్ని ఈ రోజు వీళ్ళు గద్దలా తన్నుకు పోయారు. అది వాళ్ళ తప్పు కాదు. మరెవరిది? ఆ తప్పెవరిదో వాళ్ళకు తెలుసు. కానీ, సంఘం దృష్టిలో ...చట్టం దృష్టిలో తామే దోషులు.గవర్నమెంటు వారు ఇచ్చిన ౠణాన్ని జల్సా చేసి జబర్దస్తీగా తిరగేస్తున్న కుండాకోర్లు.
అందుకే అప్పన్న శిలా ప్రతిమలా నిలబడిపోయాడా క్షణం.
ఆ రాత్రంతా అప్పన్నని నానా దుర్భాషలాడింది సూరమ్మ అతని చేతకానితనాన్ని, అమాయకత్వాన్ని పొడిచి..పొడిచి చంపేసింది.
ఆ మరునాడు తూర్పు నెమ్మదిగా ఎర్రబారుతోంది.
అప్పన్న లేస్తూనే భార్యతో చెప్పల్సిందంతా చెప్పి మందతో బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే నూకరాజు నుండి కబురు వచ్చేసరికి వెళ్ళ్క తప్పదని వెళ్ళాడు అప్పన్న.
" ఒరేయ్ అప్పన్నా! అయిందేదో అయిపోయింది. వెధవ సామాన్లు పోతేపోనీ..మళ్ళా సంపాదించుకోవచ్చు."
అన్నాడు నూకరాజు.
అతనిముందు అప్పన్న చేతులు కట్టుకుని నిలబడలేదు. చేతులు నులుముకుని నిలబడలేదు. నిర్వికారంగా ఏదో ఆలోచిస్తూ నిటారుగా నిలబడ్డాడు. అప్పన్న కళ్ళల్లోకి తేరిపార చూసాడు నూకరాజు.
ఎర్రగా మండుతున్నాయి. కానీ బాధ గుండెని పిండుతుందేమో ఆ ఎర్రబడ్డ కళ్ళెంబడి నీళ్ళు ధారాపాతంగా జాలువారుతున్నాయి.
" నా పెళ్ళాం వస్తుంది దానికో పదిసేర్లు బియ్యం ఇప్పించండి అని వేడుకో లేదు. మామూలుగానే అన్నాడు అప్పన్న.
" అమ్మగార్ని అడిగి తీసుకుపొమ్మను. నువ్వు మందతో పో!"
నూకరాజు మాటవిని వెనుదిరగలేదు అప్పన్న. తన మానాన తను వెనక్కి తిరిగి వచ్చేసి మందని తోలుకుని బయలుదేరాడు.
భర్త చెప్పిన ప్రకారం తొమ్మిదయ్యేసరికి చాకిరేవు కొపండదగ్గరకు చేరుకుంది సూరమ్మ. ఆమె చేతిలో పదిసేర్ల బియ్యం....ఒక తపేలా.. చిన్న మూట ఉన్నాయి.
భార్య భర్తలిద్దరూ మందని తోలుకుంటూ చాకిరేవు కొండని దాటిపోయారు. అలా కొండల్ని దాటుకుంటూ అడవి మార్గాన్నే ప్రయాణం సాగిస్తున్నారు.
" ఆ నూకరాజు గాడికి .. ఆడి మనుషులకి అందనంత దూరంగా పారిపోవాలి" అదే భార్యా భర్తలిద్దరి ఆలోచన.
ఆలోచిస్తూ నడుస్తున్న అప్పన్నకు ఒకానొకప్పుడు బొకడపోతు తన యజమాన్ని పొడిచిన సంఘటన గుర్తుకొచ్చేసరికి నవ్వు పుట్టుకొచ్చింది.
మూడో వ్యక్తి ఏటకత్తి ఎత్తి మూడుసార్లు క్రిందకూ మీదకూ ఎత్తి ఒకే ఒక్క బలమైనా దెబ్బ మెడమీద వేశాడు.
ఆ కత్తిదెబ్బకు మొండెం నుండి తల వేరయ్యింది. ఓ రెండు నిముషాల పాటు కాళ్ళు కొట్టుకొని ప్రాణం వదిలింది బొకడపోతు.
దాని తలమీద కత్తివేటు పడ్డప్పుడు..అప్పటికే తన చావు దానికి అర్థమయ్యేసరికి ఒకసారి బేలగా అప్పన్న కళ్ళల్లోకి చూసింది..దాని కళ్ళల్లో నీళ్ళు సుల్లు తిరిగాయి
.
ఆదృశ్యం చూసిన అప్పన్నకి మనసు ముక్కలైపోయింది.
దాని స్థానంలో తనే ఉంటే ఎలా ఉండేదో ఊహించుకొనేసరికి శరీరం గగుర్పొడిచింది అప్పన్నకి.
తనమీద విశ్వాసంతో ..భక్తితో దాని ప్రాణం తన చేతుల్లో పెట్టి కళ్ళు మూసుకుందా మూగజీవి.
అదే దుస్థితి మనిషికీ సంభవిస్తే...?
ఆ మరునాడు-
పంచాయితీ అఫీసులోని మీటింగ్ కు సమితి అఫీసర్లు, ఆర్ధిక సహాయం చేసిన బ్యాంక్ ఆఫీసర్లు, ఇతర ప్రముఖులూ అందరూ హాజరయ్యారు.
రైతులందరూ కూడా హజరై మీటింగ్ హాల్లో ఆశీనులై ఉన్నారు.
ఆ మహాసభ రైతులంద్ర్నీ ఉద్దేశించి పెట్టిన సభ కావటం చేత అంతా వాళ్ళ కష్టసుఖాలు గురించి మాట్లాడుతూ ముగించారు. ఆ సభ ముగిసే ముందు బ్యాంకు ఆఫీసర్లు చేసిన హెచ్చరిక మాత్రం అప్పన్న మనసులో నాటుకుపోయింది.
" మీకు భూమినిస్తూ..అప్పులిచ్చింది ఎందుకు? ,ఈరు బాగుపడి..దేశాన్ని బాగు చేస్తారని. మీరు బాగుపడితే దేశం ఆర్థికంగా మెరుగు పడ్డట్టే కదా.!
"ఆ దగ్గర ఏదో సొమ్ము మూల మూలుగుతుందని కానీ, మీరిచ్చే వడ్డీల మీదే బ్యాంకు ఆధారపడి ఇచ్చిందని గానీ అపోహ పడకండి. మీకు అప్పులిచ్చి అన్ని సౌకర్యాలూ సమకూర్చింది ..కేవలం దేశానికి వెన్నముకలైన మీరు బాగుపడాలని.
మీరు కూడా మీ మీ బాధ్యతలు నెరిగి పంట చేతికందిన వెంటనే పంటనమ్మిన మొత్తం లో సగం మాత్రం అప్పుక్రింద జమ చేయండి. మిగిలినది మీ ఇంటి ఖర్చుల క్రింద వాడుకోండి. కనీ, అసలు పైసా కట్టకుండా ఎగ వెయ్యడానికి, గవనమెంటు సొమ్మే కదా అడిగే నాధుడు లేడని భ్రమపడి జమ చేయడం మానకండి. ఆ అప్పుల విషయాలలో మీ ఇల్లు..ఆస్థులు సమస్తం జప్తు చేసే వరకూ వస్తుంది. దయచేసి మమ్మల్ని మీ ఇంటి వరకూ రానివ్వకండి. !"
ఆ వారం తర్వాత...
అనాస తోటలో మొదటి పంట దిగినపుడు ఇంటికి ఆరుకాయలు తెస్తూ సూరమ్మకి ఒకటి ఇచ్చి మిగిలిన అయిదు పళ్ళూ యజమానురాలికి అందించాడు అప్పన్న.
బజార్లో మొదటిపంటలో దిగిన అనాస పళ్ళు అన్నీ వందల ప్రకారం తట్టలకెక్కించి అమ్మేసి ఇంటికి చేరుకున్నాడు నూకరాజు.
"ఏమేవ్?? ఇప్పుడు అప్పన్నగాడు తెచ్చిన అనాస పళ్ళు ఆరూ మనకనుకొని కోసెయ్యకు. పంచాయితీ ప్రెసిడెంటు గారింటికి పంపాల!" ఆయాసంతో కూర్చుంటూ అన్నాడు నూకరాజు.
" ఆరేటి?..? అయిదు. అదిగో అక్కడ పెట్టాను తీసుకుపోండి?" మూతి మూడు వంకర్లు త్రిప్పుతూ అంది
అతని భార్య.
"అయిదా? ఆరు కదా పంపించాను" గొణుక్కున్నాడు నూకరజు.
" ఆ ఒకటీ తన ముద్దుల పెళ్ళానికి ఇచ్చాడు.. వెళ్ళి అడగండి"
" అమ్మడియమ్మా! ఎంతకైనా తెగిస్తాడే!" కోపం పట్టలేకపోయాడు నూకరాజు.
అప్పుడే అక్కడకు వస్తున్న సూరమ్మ భార్యాభర్తలిద్దరూ అనుకున్న మాటలన్నీ వింది. తిన్నగా వెళ్ళి గుడిసెలో ఉన్న అనాస పండు తీసుకువచ్చి అయిదు పళ్ళున్న దగ్గరపెట్టి వెళ్ళ్బోయింది. అదంతా బల్లమీద కూర్చుని చూస్తున్న నూకరాజు కళ్ళు ఎర్రబడ్డాయి. కానీ ఏవీ అన్లేదు.
ఆ సాయంత్రం మంద నుండి వస్తూనే యజమాన్ని కలిసాడు అప్పన్న.
" ఎందుకైనా మంచిది! ఆ గవర్నమెంటోళ్ళ బాకీకి కొంత సొమ్ము కట్టెయ్యండయ్యా!" అన్నాడు.
" నీకెందుకురా వెధవ బోడి సలహాలూ నువ్వూనూ" అని కొట్టిపారేసి బజార్లోకి వెళ్ళిపోయాడు నూకరాజు.
ఆ అనాసతోట పంట సీజను అయిన మరుసటి వారమే జప్తుకు వచ్చారు బ్యాంకు వాళ్ళు. ముందుగా నూకరాజును కలిసి అప్పన్న గుడెసె దగ్గరకు వచ్చారు.
" ఈ జాగా నాదండీ. గుడెసె ఏసుకుంటానంటే దయతలిచి ఇచ్చాను.ఇంక ఈ ఇంట్లో ఏ వస్తువుతోటీ నాకు సంబంధం లేదు"అంటూ తన ఆస్థి వివరాలు చెప్తున్నాడు నూకరాజు.
ఈ హడావుడికి సూరమ్మ పని చేసుకుంటున్నదల్లా గుడెసె దగ్గరకు వచ్చింది. అప్పుడే మందతో బయలుదేరడానికి సిద్ధమౌతున్న అప్పన్నకి నోట మాట రాలేదు. శిలా ప్రతిమలా నిలబడిపోయాడు.
గుడెసెలో ఉన్న సమస్త వస్తువులు జాబితా వ్రాసుకొని తీసుకువెళ్ళి పోయారు బ్యాంకు వాళ్ళు. పూచికపుల్ల కూడా విడవకుండా తీసుకుపోతూ అప్పన్న చేతిలో ఒక నోటీసు కాగితం పెట్టి మరీ వెళ్ళిపోయారు.
ఆ నోటీసులో బ్యాంకు చట్టం ప్రకారం చేస్తామనీ ....వాటి తాలూకా నియమ నిబంధనలకు మీరు బద్ధులు కావాలని హెచ్చరిస్తూ తెలియజేయబడింది.
గుడెసె నూకరాజు ఆస్థి కావడం మూలాన దాన్ని వాళ్ళు సీజ్ చేయలేదు.
ఆ రాత్రంతా భార్యా భర్తలిద్దరూ నిద్ర లేకుండా గడిపారు.
'ఎంతో ముద్దుగా ...ముచ్చట తీరా తమ సంసారం కోసం సరంజామా అంతా సర్దుకుంది ఇన్నాళ్ళూ. దాన్ని ఈ రోజు వీళ్ళు గద్దలా తన్నుకు పోయారు. అది వాళ్ళ తప్పు కాదు. మరెవరిది? ఆ తప్పెవరిదో వాళ్ళకు తెలుసు. కానీ, సంఘం దృష్టిలో ...చట్టం దృష్టిలో తామే దోషులు.గవర్నమెంటు వారు ఇచ్చిన ౠణాన్ని జల్సా చేసి జబర్దస్తీగా తిరగేస్తున్న కుండాకోర్లు.
అందుకే అప్పన్న శిలా ప్రతిమలా నిలబడిపోయాడా క్షణం.
ఆ రాత్రంతా అప్పన్నని నానా దుర్భాషలాడింది సూరమ్మ అతని చేతకానితనాన్ని, అమాయకత్వాన్ని పొడిచి..పొడిచి చంపేసింది.
ఆ మరునాడు తూర్పు నెమ్మదిగా ఎర్రబారుతోంది.
అప్పన్న లేస్తూనే భార్యతో చెప్పల్సిందంతా చెప్పి మందతో బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే నూకరాజు నుండి కబురు వచ్చేసరికి వెళ్ళ్క తప్పదని వెళ్ళాడు అప్పన్న.
" ఒరేయ్ అప్పన్నా! అయిందేదో అయిపోయింది. వెధవ సామాన్లు పోతేపోనీ..మళ్ళా సంపాదించుకోవచ్చు."
అన్నాడు నూకరాజు.
అతనిముందు అప్పన్న చేతులు కట్టుకుని నిలబడలేదు. చేతులు నులుముకుని నిలబడలేదు. నిర్వికారంగా ఏదో ఆలోచిస్తూ నిటారుగా నిలబడ్డాడు. అప్పన్న కళ్ళల్లోకి తేరిపార చూసాడు నూకరాజు.
ఎర్రగా మండుతున్నాయి. కానీ బాధ గుండెని పిండుతుందేమో ఆ ఎర్రబడ్డ కళ్ళెంబడి నీళ్ళు ధారాపాతంగా జాలువారుతున్నాయి.
" నా పెళ్ళాం వస్తుంది దానికో పదిసేర్లు బియ్యం ఇప్పించండి అని వేడుకో లేదు. మామూలుగానే అన్నాడు అప్పన్న.
" అమ్మగార్ని అడిగి తీసుకుపొమ్మను. నువ్వు మందతో పో!"
నూకరాజు మాటవిని వెనుదిరగలేదు అప్పన్న. తన మానాన తను వెనక్కి తిరిగి వచ్చేసి మందని తోలుకుని బయలుదేరాడు.
భర్త చెప్పిన ప్రకారం తొమ్మిదయ్యేసరికి చాకిరేవు కొపండదగ్గరకు చేరుకుంది సూరమ్మ. ఆమె చేతిలో పదిసేర్ల బియ్యం....ఒక తపేలా.. చిన్న మూట ఉన్నాయి.
భార్య భర్తలిద్దరూ మందని తోలుకుంటూ చాకిరేవు కొండని దాటిపోయారు. అలా కొండల్ని దాటుకుంటూ అడవి మార్గాన్నే ప్రయాణం సాగిస్తున్నారు.
" ఆ నూకరాజు గాడికి .. ఆడి మనుషులకి అందనంత దూరంగా పారిపోవాలి" అదే భార్యా భర్తలిద్దరి ఆలోచన.
ఆలోచిస్తూ నడుస్తున్న అప్పన్నకు ఒకానొకప్పుడు బొకడపోతు తన యజమాన్ని పొడిచిన సంఘటన గుర్తుకొచ్చేసరికి నవ్వు పుట్టుకొచ్చింది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
