30-08-2025, 03:16 PM
నిగమ కంఠుడు బుద్ది తెచ్చుకుని గోసంరక్షణ చేస్తూ సుపుష్ట మన్ననలను అందుకున్నాడు. సుపుష్ట కీర్తి ప్రతిష్టల గురించి ఆంగి అరిహుల కుమారుడు మహా భౌమునికి తెలిసింది. మహా భౌముడు సుపుష్ట చిత్ర పటమును తెప్పించి చూసాడు.
మహా భౌముని కి సుపుష్ట నచ్చింది. చిత్ర పటమును తలిదండ్రుల కు చూపించాడు. సుపుష్ట రూపం అందరికి నచ్చింది.
అరిహుడు మహా భౌముని చిత్ర పటమును ప్రసేన జిత్ కు పంపాడు. మా కుమారుడు మీకు నచ్చితే మీతో వియ్యమందడానికి సంసిద్ధంగా ఉన్నామని వర్తమానం పంపాడు. ప్రసేన జిత్ వర్త మానం తీసుకు వచ్చినవానికి వివిధ రకాల వంటకాలతో కడుపు నిండా భోజనం పెట్టి నూతన వస్త్రాదులతో సన్మానించాడు. త్వరలోనే శుభ సందేశం పంపుతామని అరిహ మహా రాజు కు చెప్పండి అని అన్నాడు. అనంతరం ప్రసేన జిత్ ముద్దుల కుమార్తె సుపుష్టకు, తన భార్యకు మహా భౌముని చిత్ర పటం చూపించాడు.
సుపుష్ట మహా భౌముని చిత్ర పటం చూసింది. మహా భౌమునిలోని సాత్విక రాజసం ఆమెకు నచ్చింది. ఆ రాజసంలోని మంచి చెడులన్నిటి గురించి చెలికత్తెలతో చర్చించింది.
సుపుష్ట తండ్రి ప్రసేన జిత్ తో, "తండ్రీ.. కాబోయే మహా భౌమ రాజు నాకు తెలిసి అన్ని విషయాలలో నాకు తగిన వాడే అని అనిపిస్తుంది. అయితే మహా భౌమునిలో కించిత్ యాగ తేజం స్వల్పం గా ఉందని నాకు అనిపిస్తుంది. వారిని ముందుగా సుపుష్ట యాగం చేయమని వర్తమానం పంపండి" అని అంది.
ప్రసేన జిత్ సుపుష్ట అభిప్రాయాన్ని అరిహునికి తెలియ చేసాడు. అరిహుడు సుపుష్ట యాగం గురించి సంపూర్ణ సమాచారం తెలుసుకు రమ్మని కుల గురువు వశిష్ట మహర్షిని సుపుష్ట దగ్గరకు పంపాడు.
వశిష్ట మహర్షి ప్రసేన జిత్ ను సుపుష్టను కలి సాడు. వశిష్ట మహర్షి ని ప్రసేన జిత్ తగిన రీతిలో సత్కరించాడు. అనంతరం సుపుష్ట, వశిష్ట మహర్షి సుపుష్ట యాగం గురించి చర్చించుకున్నారు. సుపుష్ట యాగం వలన రాజ్యానికి, రాజుకు జరిగే పుష్టి ఫలితాల గురించి కూడా ముచ్చటించు కున్నారు. వారి ముచ్చట్ల లో గోలోక ప్రస్తావన వచ్చింది. వివిధ రకాల గోవులిచ్చే క్షీర ప్రస్తావన కూడా వచ్చింది.
కుల గురువు వశిష్ట మహర్షి ఆధ్వర్యంలో అరిహ మహారాజు సుపుష్ట యాగం జరిపించాడు. ఆ యాగానికి ప్రసేన జిత్ మహారాజు, అతని భార్య, సుపుష్ట, ప్రసేన జిత్ బంధువులు, తదితరులందరూ వచ్చారు.. ఆ యాగంలో గోవులు కూడా ప్రధాన పాత్ర వహించాయి.
యాగ అనంతరం అరిహ మహారాజు తన కుమారుడు మహా భౌమునికి పట్టాభిషేక మహోత్సవం కూడా జరిపించాడు. ఆ రెండు శుభ కార్యాల్లో సుపుష్ట ప్రధాన పాత్ర వహించింది. శుభ కార్య సమయంలో సుపుష్ట మహా భౌముని తో గోవులను పరిశుభ్రం చేయించింది. సురభి మార్తాండ సంతానమైన గోవుల సంరక్షణలో మెలకువలు గురించి. ముచ్చటించింది. శాస్త్రోక్తంగా గో పూజ చేయించింది.
మహా భౌముడు సుపుష్ట చేయించిన గో పూజ ప్రభావాన, గోవుల ముఖంలో, కొమ్ములలో, నాలుకలో ఇంద్రుని, మూపురం లో శివుని, పాదాలలో దేవతలను, కడుపులో అగ్ని దేవుని, పాల పొదుగు లో సరస్వతీ దేవినీ, పాలలో బ్రహ్మ దేవుని, కన్నులలో సూర్య నారాయణుని గోవు తదితర అవయవాలలో లక్ష్మీ దేవిని, పార్వతీ దేవుని, భృగుని, సిద్దులను, యమ ధర్మరాజు ను, మహా విష్ణువు ను తదితర దేవతలందరిని చూసాడు.
మహా భౌముని రాజ్యంలోని ప్రజలందరూ సుపుష్టను సుపుష్ట అని కాకుండా. సుయజ్ఞ అని పిలవ సాగారు. మంచి శుభ ముహూర్తాన సుపుష్ట మహా భౌముల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మహా భౌముని రాజ్యంలోని ప్రజలు మాత్రం సుపుష్టను సుయజ్ఞ మహారాణి అనే పిలవ సాగారు.
ఆ పుణ్య దంపతుల కుమారుడు ఆయుతానీకుడు.
సర్వే జనాః సుఖినోభవంతు
మహా భౌముని కి సుపుష్ట నచ్చింది. చిత్ర పటమును తలిదండ్రుల కు చూపించాడు. సుపుష్ట రూపం అందరికి నచ్చింది.
అరిహుడు మహా భౌముని చిత్ర పటమును ప్రసేన జిత్ కు పంపాడు. మా కుమారుడు మీకు నచ్చితే మీతో వియ్యమందడానికి సంసిద్ధంగా ఉన్నామని వర్తమానం పంపాడు. ప్రసేన జిత్ వర్త మానం తీసుకు వచ్చినవానికి వివిధ రకాల వంటకాలతో కడుపు నిండా భోజనం పెట్టి నూతన వస్త్రాదులతో సన్మానించాడు. త్వరలోనే శుభ సందేశం పంపుతామని అరిహ మహా రాజు కు చెప్పండి అని అన్నాడు. అనంతరం ప్రసేన జిత్ ముద్దుల కుమార్తె సుపుష్టకు, తన భార్యకు మహా భౌముని చిత్ర పటం చూపించాడు.
సుపుష్ట మహా భౌముని చిత్ర పటం చూసింది. మహా భౌమునిలోని సాత్విక రాజసం ఆమెకు నచ్చింది. ఆ రాజసంలోని మంచి చెడులన్నిటి గురించి చెలికత్తెలతో చర్చించింది.
సుపుష్ట తండ్రి ప్రసేన జిత్ తో, "తండ్రీ.. కాబోయే మహా భౌమ రాజు నాకు తెలిసి అన్ని విషయాలలో నాకు తగిన వాడే అని అనిపిస్తుంది. అయితే మహా భౌమునిలో కించిత్ యాగ తేజం స్వల్పం గా ఉందని నాకు అనిపిస్తుంది. వారిని ముందుగా సుపుష్ట యాగం చేయమని వర్తమానం పంపండి" అని అంది.
ప్రసేన జిత్ సుపుష్ట అభిప్రాయాన్ని అరిహునికి తెలియ చేసాడు. అరిహుడు సుపుష్ట యాగం గురించి సంపూర్ణ సమాచారం తెలుసుకు రమ్మని కుల గురువు వశిష్ట మహర్షిని సుపుష్ట దగ్గరకు పంపాడు.
వశిష్ట మహర్షి ప్రసేన జిత్ ను సుపుష్టను కలి సాడు. వశిష్ట మహర్షి ని ప్రసేన జిత్ తగిన రీతిలో సత్కరించాడు. అనంతరం సుపుష్ట, వశిష్ట మహర్షి సుపుష్ట యాగం గురించి చర్చించుకున్నారు. సుపుష్ట యాగం వలన రాజ్యానికి, రాజుకు జరిగే పుష్టి ఫలితాల గురించి కూడా ముచ్చటించు కున్నారు. వారి ముచ్చట్ల లో గోలోక ప్రస్తావన వచ్చింది. వివిధ రకాల గోవులిచ్చే క్షీర ప్రస్తావన కూడా వచ్చింది.
కుల గురువు వశిష్ట మహర్షి ఆధ్వర్యంలో అరిహ మహారాజు సుపుష్ట యాగం జరిపించాడు. ఆ యాగానికి ప్రసేన జిత్ మహారాజు, అతని భార్య, సుపుష్ట, ప్రసేన జిత్ బంధువులు, తదితరులందరూ వచ్చారు.. ఆ యాగంలో గోవులు కూడా ప్రధాన పాత్ర వహించాయి.
యాగ అనంతరం అరిహ మహారాజు తన కుమారుడు మహా భౌమునికి పట్టాభిషేక మహోత్సవం కూడా జరిపించాడు. ఆ రెండు శుభ కార్యాల్లో సుపుష్ట ప్రధాన పాత్ర వహించింది. శుభ కార్య సమయంలో సుపుష్ట మహా భౌముని తో గోవులను పరిశుభ్రం చేయించింది. సురభి మార్తాండ సంతానమైన గోవుల సంరక్షణలో మెలకువలు గురించి. ముచ్చటించింది. శాస్త్రోక్తంగా గో పూజ చేయించింది.
మహా భౌముడు సుపుష్ట చేయించిన గో పూజ ప్రభావాన, గోవుల ముఖంలో, కొమ్ములలో, నాలుకలో ఇంద్రుని, మూపురం లో శివుని, పాదాలలో దేవతలను, కడుపులో అగ్ని దేవుని, పాల పొదుగు లో సరస్వతీ దేవినీ, పాలలో బ్రహ్మ దేవుని, కన్నులలో సూర్య నారాయణుని గోవు తదితర అవయవాలలో లక్ష్మీ దేవిని, పార్వతీ దేవుని, భృగుని, సిద్దులను, యమ ధర్మరాజు ను, మహా విష్ణువు ను తదితర దేవతలందరిని చూసాడు.
మహా భౌముని రాజ్యంలోని ప్రజలందరూ సుపుష్టను సుపుష్ట అని కాకుండా. సుయజ్ఞ అని పిలవ సాగారు. మంచి శుభ ముహూర్తాన సుపుష్ట మహా భౌముల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మహా భౌముని రాజ్యంలోని ప్రజలు మాత్రం సుపుష్టను సుయజ్ఞ మహారాణి అనే పిలవ సాగారు.
ఆ పుణ్య దంపతుల కుమారుడు ఆయుతానీకుడు.
సర్వే జనాః సుఖినోభవంతు
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
