30-08-2025, 03:14 PM
సుపుష్ట
![[Image: s.jpg]](https://i.ibb.co/ycHYv0yt/s.jpg)
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
రాజా ప్రసేన జిత్ రాజ్యంలో గో సంపద సంవృద్దిగా ఉండేది. ప్రసేన జిత్ రాజ్యంలోని నిరు పేదలందరికి గోదానం చేసి, వారికి బతుకు తెరువు కల్పించాడు. ప్రసేన జిత్ భార్య మహా భామ కూడా గోపూజ చేయడం అంటే మిక్కిలి మక్కువ చూపించేది.
సంతానం కోసం ఆ పుణ్య దంపతులు అనేక నోములు నోచారు. క్రమం తప్పకుండా గో పూజలు జరిపించారు. అన్నదానాలు చేసారు. ధన కనక వస్త్ర దానాలు చేసారు. యజ్ఞ యాగాదులను చేయించారు. మహర్షుల సభలను, సుకవుల సభలను, కళాకారుల సభలను ఏర్పాటు చేసి వారిని తగిన విధంగా సత్కరించారు. వారి సత్కార్యాల ఫలంగా వారికి శ్రీవాణీగిరిజల తేజం తో ఒక ఆడ శిశువు పుట్టింది. ఆడ శిశువు ను చూసి ఆ పుణ్య దంపతులు మహా మురిసి పోయారు. జ్యోతిష్య పండితులను పిలిచి శిశువు జాతకం చూపించారు. జ్యోతిష్య పండితుల సూచన మేర శిశువుకు సుపుష్ట అని నామ ధేయం చేసారు.
మహా భామ, ప్రసేన జిత్ పుణ్య దంపతులు సుపుష్టను అల్లారు ముద్దుగా పెంచసాగారు. సుపుష్ట గురువుల దగ్గర వేదవేదాంగాది సమస్త విద్యలను అభ్యసించింది. ఆరోగ్యమే మహాభాగ్యము అన్న ధర్మాన్ని అనుసరించి తను ఆరోగ్యం గా ఉంటూ, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండటానికి తన వంతు సహాయం నిరంతరం అందించసాగింది. తన రాజ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా చూసింది. యుద్ద విద్యలందుకూడ మంచి నైపుణ్యాన్ని సంపాదించింది.
సుపుష్ట అశ్వగజరథాదుల మీద నిలబడి శత్రువులను చీల్చి చెండాడటం లో ఆమెకు ఆమే సాటి అనిపించుకుంది. అశ్వం మీద, గజం మీద నిలబడి యుద్దం చేసే విద్యలో ఆ రోజుల్లో సుపుష్ట ఒక్కతే మహా నైపుణ్యం గల వీరనారి అని సుపుష్ట శత్రువులు సహితం అనుకునేవారు.
సుపుష్ట అనేక రకాల గోపూజలు చేసింది. గోలోకం సందర్శించి వచ్చింది.
సుపుష్ట పరుల శక్తి సామర్థ్యాలను, మంచి చెడులను ధృవీకరించడంలో ఎప్పుడూ తప్పటడుగు వేసేది కాదు. ఆమెను మంచి మాటలతో మోసం చేయాలని ప్రయత్నించే వారే కడకు మోసపోయేవారు.
ఒకసారి నిగమ కంఠుడు అనేవాడు సుపుష్ట దగ్గరకు వచ్చి, "అమ్మా సుపుష్ట, నేను వేదాలన్నిటిని ఔపాసన పట్టాను. ఉదరవ్యాది తో బాధ పడుతున్నాను. నిరుపేదను. నన్ను ఆదుకుని నా ప్రాణాలను రక్షించు. " అని అన్నాడు.
నిగమ కంఠుని వాలకం గమనించిన సుపుష్ట నిగమ కంఠుడు పని దొంగ అని గమనించింది. అంత నిగమ కంఠుని వేద పాఠశాల లో ఉండమంది. నిగమ కంఠుడు అలాగేనని వేద పాఠశాల లో ఉన్నాడు.
వేద పాఠశాల లోని విద్యార్థులు నిగమ కంఠుని వేద మంత్రాల గురించి అడగసాగారు. అప్పుడు నిగమ కంఠుడు "వేద మంత్రాలన్నీ చచ్చు మంత్రాలు. వాటిని చదివితే అనారోగ్యం మెండుగా దండిగా వస్తుంది. ఫలితం ఇసుమంతైనా రాదు. దేవుడు లేడు. గీముడు లేడు. నాలాంటి వారిని దేవునిగా కొలిచేవారికే మేలు జరుగుతుంది. ఇవి దొంగ మాటలు కావు. జ్యోతిష్య శాస్త్ర మాటలు. ఈ లోకంలో ఎవరిని నమ్మకూడదు. ముందు జాగ్రత్త తో మెలగాలి. రేపటిని తలచుకుని భయంతో మరింత అధికంగా సంపాదించాలి " అని అన్నాడు.
నిగమ కంఠుని గురించి విద్యార్థులు చెప్పిన మాటలను విన్న సుపుష్ట తను ఊహించినట్లుగానే నిగమ కంఠుడు వేదం కూడా చదవలేదని గ్రహించింది. అనంతరం సుపుష్ట నిగమ కంఠుని గోశాలలో ఉండమంది. అలాగే అని నిగమ కంఠుడు గోశాల కు వెళ్ళాడు. అక్కడ నిగమ కంఠుడు గోవులను కాసే గోపాలుర వృత్తిని కించపరిచాడు..
అప్పుడు గోపాలురు నిగమ కంఠుని చేతికి ముల్లుకర్రను ఇచ్చి, “మీకు ఇష్టమైన వృత్తిని నీతి తప్పకుండా మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా చేయండి” అని అన్నారు.
నిగమ కంఠుడు “నాకు ఉదర సంబంధ వ్యాధి ఉంది. నేను ఏ పనీ చేయలేను” అన్నాడు.
అప్పుడు గోపాలురు "అయ్యా! ఎన్ని చిన్న చిన్న వ్యాధులు తన శరీరానికి సోకినా గోమాత గడ్డి మేసి పాలు ఇస్తుంది. ఆ పాలను మనం తాగుతున్నాము. యజ్ఞ యాగాదులలో ఉపయోగిస్తున్నాము. ఇంకా రకరకాలుగా గో క్షీరాన్ని ఉపయోగించుకుంటున్నాము. ఇలా గోమాత మనకు ఉపయోగపడుతుంది. మరి నేను ఎలా ఎవరికి ఉపయోగ పడతాను? అని మీరు ఆలోచించరా? మన యువరాణి సుపుష్టమ్మ గారు మీకు ఏ వ్యాధీ లేదు. మీరు పనిదొంగ అని ఏనాడో ధృవీకరించారు. మీలో మార్పు కోసం వారు మిమ్మల్ని ఇక్కడకు పంపారు. మీరు ఇక్కడ కూడా మారకుంటే, తదుపరి మీకు వరాహ సంరక్షణ బాధ్యతను అప్పగిస్తారు. "అని అన్నారు.
గోపాలుర మాటలను విన్న నిగమ కంఠుడు భయపడ్డాడు. సుపుష్ట గోపాలురను కలిసి నిగమ కంఠుని మాటల గురించి తెలుసుకుంది. అలాగే నిగమ కంఠుని తో గోపాలురు అన్న మాటలను కూడా తెలుసుకుంది. అనంతరం నిగమ కంఠుని కలిసింది.
"నిగమ కంఠ, నీలో అనుమానం, భయం అధికం. కారణం నువ్వు పని దొంగవు కావడం. తన శక్తి మేర ఏదో ఒక పని చేసేవానికి అనుమానం, భయం ఉండవు.
తన మీద తనకు నమ్మకం, ధైర్యం పెరుగుతాయి. శ్రమకు తగిన ఫలం దక్కలేదని అసంతృప్తి ఉంటే ఉండవచ్చు. అసలు పని చేయకుండా అసంతృప్తి తో సమాజాన్ని నిందించేవారి వలననే సమాజంలో హింస, మోసం, దుర్మార్గం, కపటత్వం, నయవంచన, దైవనింద వంటి జాడ్యాలు పెరుగుతాయి. నువ్వు ఆ మార్గాన సంచరించకు" అని నిగమ కంఠుని తో సుపుష్ట అంది.
![[Image: s.jpg]](https://i.ibb.co/ycHYv0yt/s.jpg)
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
రాజా ప్రసేన జిత్ రాజ్యంలో గో సంపద సంవృద్దిగా ఉండేది. ప్రసేన జిత్ రాజ్యంలోని నిరు పేదలందరికి గోదానం చేసి, వారికి బతుకు తెరువు కల్పించాడు. ప్రసేన జిత్ భార్య మహా భామ కూడా గోపూజ చేయడం అంటే మిక్కిలి మక్కువ చూపించేది.
సంతానం కోసం ఆ పుణ్య దంపతులు అనేక నోములు నోచారు. క్రమం తప్పకుండా గో పూజలు జరిపించారు. అన్నదానాలు చేసారు. ధన కనక వస్త్ర దానాలు చేసారు. యజ్ఞ యాగాదులను చేయించారు. మహర్షుల సభలను, సుకవుల సభలను, కళాకారుల సభలను ఏర్పాటు చేసి వారిని తగిన విధంగా సత్కరించారు. వారి సత్కార్యాల ఫలంగా వారికి శ్రీవాణీగిరిజల తేజం తో ఒక ఆడ శిశువు పుట్టింది. ఆడ శిశువు ను చూసి ఆ పుణ్య దంపతులు మహా మురిసి పోయారు. జ్యోతిష్య పండితులను పిలిచి శిశువు జాతకం చూపించారు. జ్యోతిష్య పండితుల సూచన మేర శిశువుకు సుపుష్ట అని నామ ధేయం చేసారు.
మహా భామ, ప్రసేన జిత్ పుణ్య దంపతులు సుపుష్టను అల్లారు ముద్దుగా పెంచసాగారు. సుపుష్ట గురువుల దగ్గర వేదవేదాంగాది సమస్త విద్యలను అభ్యసించింది. ఆరోగ్యమే మహాభాగ్యము అన్న ధర్మాన్ని అనుసరించి తను ఆరోగ్యం గా ఉంటూ, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండటానికి తన వంతు సహాయం నిరంతరం అందించసాగింది. తన రాజ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా చూసింది. యుద్ద విద్యలందుకూడ మంచి నైపుణ్యాన్ని సంపాదించింది.
సుపుష్ట అశ్వగజరథాదుల మీద నిలబడి శత్రువులను చీల్చి చెండాడటం లో ఆమెకు ఆమే సాటి అనిపించుకుంది. అశ్వం మీద, గజం మీద నిలబడి యుద్దం చేసే విద్యలో ఆ రోజుల్లో సుపుష్ట ఒక్కతే మహా నైపుణ్యం గల వీరనారి అని సుపుష్ట శత్రువులు సహితం అనుకునేవారు.
సుపుష్ట అనేక రకాల గోపూజలు చేసింది. గోలోకం సందర్శించి వచ్చింది.
సుపుష్ట పరుల శక్తి సామర్థ్యాలను, మంచి చెడులను ధృవీకరించడంలో ఎప్పుడూ తప్పటడుగు వేసేది కాదు. ఆమెను మంచి మాటలతో మోసం చేయాలని ప్రయత్నించే వారే కడకు మోసపోయేవారు.
ఒకసారి నిగమ కంఠుడు అనేవాడు సుపుష్ట దగ్గరకు వచ్చి, "అమ్మా సుపుష్ట, నేను వేదాలన్నిటిని ఔపాసన పట్టాను. ఉదరవ్యాది తో బాధ పడుతున్నాను. నిరుపేదను. నన్ను ఆదుకుని నా ప్రాణాలను రక్షించు. " అని అన్నాడు.
నిగమ కంఠుని వాలకం గమనించిన సుపుష్ట నిగమ కంఠుడు పని దొంగ అని గమనించింది. అంత నిగమ కంఠుని వేద పాఠశాల లో ఉండమంది. నిగమ కంఠుడు అలాగేనని వేద పాఠశాల లో ఉన్నాడు.
వేద పాఠశాల లోని విద్యార్థులు నిగమ కంఠుని వేద మంత్రాల గురించి అడగసాగారు. అప్పుడు నిగమ కంఠుడు "వేద మంత్రాలన్నీ చచ్చు మంత్రాలు. వాటిని చదివితే అనారోగ్యం మెండుగా దండిగా వస్తుంది. ఫలితం ఇసుమంతైనా రాదు. దేవుడు లేడు. గీముడు లేడు. నాలాంటి వారిని దేవునిగా కొలిచేవారికే మేలు జరుగుతుంది. ఇవి దొంగ మాటలు కావు. జ్యోతిష్య శాస్త్ర మాటలు. ఈ లోకంలో ఎవరిని నమ్మకూడదు. ముందు జాగ్రత్త తో మెలగాలి. రేపటిని తలచుకుని భయంతో మరింత అధికంగా సంపాదించాలి " అని అన్నాడు.
నిగమ కంఠుని గురించి విద్యార్థులు చెప్పిన మాటలను విన్న సుపుష్ట తను ఊహించినట్లుగానే నిగమ కంఠుడు వేదం కూడా చదవలేదని గ్రహించింది. అనంతరం సుపుష్ట నిగమ కంఠుని గోశాలలో ఉండమంది. అలాగే అని నిగమ కంఠుడు గోశాల కు వెళ్ళాడు. అక్కడ నిగమ కంఠుడు గోవులను కాసే గోపాలుర వృత్తిని కించపరిచాడు..
అప్పుడు గోపాలురు నిగమ కంఠుని చేతికి ముల్లుకర్రను ఇచ్చి, “మీకు ఇష్టమైన వృత్తిని నీతి తప్పకుండా మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా చేయండి” అని అన్నారు.
నిగమ కంఠుడు “నాకు ఉదర సంబంధ వ్యాధి ఉంది. నేను ఏ పనీ చేయలేను” అన్నాడు.
అప్పుడు గోపాలురు "అయ్యా! ఎన్ని చిన్న చిన్న వ్యాధులు తన శరీరానికి సోకినా గోమాత గడ్డి మేసి పాలు ఇస్తుంది. ఆ పాలను మనం తాగుతున్నాము. యజ్ఞ యాగాదులలో ఉపయోగిస్తున్నాము. ఇంకా రకరకాలుగా గో క్షీరాన్ని ఉపయోగించుకుంటున్నాము. ఇలా గోమాత మనకు ఉపయోగపడుతుంది. మరి నేను ఎలా ఎవరికి ఉపయోగ పడతాను? అని మీరు ఆలోచించరా? మన యువరాణి సుపుష్టమ్మ గారు మీకు ఏ వ్యాధీ లేదు. మీరు పనిదొంగ అని ఏనాడో ధృవీకరించారు. మీలో మార్పు కోసం వారు మిమ్మల్ని ఇక్కడకు పంపారు. మీరు ఇక్కడ కూడా మారకుంటే, తదుపరి మీకు వరాహ సంరక్షణ బాధ్యతను అప్పగిస్తారు. "అని అన్నారు.
గోపాలుర మాటలను విన్న నిగమ కంఠుడు భయపడ్డాడు. సుపుష్ట గోపాలురను కలిసి నిగమ కంఠుని మాటల గురించి తెలుసుకుంది. అలాగే నిగమ కంఠుని తో గోపాలురు అన్న మాటలను కూడా తెలుసుకుంది. అనంతరం నిగమ కంఠుని కలిసింది.
"నిగమ కంఠ, నీలో అనుమానం, భయం అధికం. కారణం నువ్వు పని దొంగవు కావడం. తన శక్తి మేర ఏదో ఒక పని చేసేవానికి అనుమానం, భయం ఉండవు.
తన మీద తనకు నమ్మకం, ధైర్యం పెరుగుతాయి. శ్రమకు తగిన ఫలం దక్కలేదని అసంతృప్తి ఉంటే ఉండవచ్చు. అసలు పని చేయకుండా అసంతృప్తి తో సమాజాన్ని నిందించేవారి వలననే సమాజంలో హింస, మోసం, దుర్మార్గం, కపటత్వం, నయవంచన, దైవనింద వంటి జాడ్యాలు పెరుగుతాయి. నువ్వు ఆ మార్గాన సంచరించకు" అని నిగమ కంఠుని తో సుపుష్ట అంది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
