19-08-2025, 04:20 PM
ఆనందానికి ఆరు సూత్రాలు
రచన: సిహెచ్. సీఎస్. రావు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"రంగయ్య బావా!..... నమస్కారం...." చేతులు జోడించాడు నవ్వుతూ నారాయణమూర్తి.
చేతిలోని దినపత్రికను క్రిందికి దించి నేరుగా చూచాడు రంగయ్య. వారికి ఒక ఆడ, మగ పిల్లలు. సిటీలోని హాస్టల్లో వుంటూ చదువుతున్నారు. అమ్మాయి శాంతి పదవతరగతి. అబ్బాయి రఘు ఎనిమిదవ క్లాసు. శలవు రోజుల్లో ఇంటికి వస్తారు. తల్లితండ్రి మాటలను జవదాటరు. ఎదురుగా తన బావమరిది అమెరికా వాసి, సైంటిస్ట్ నారాయణమూర్తి. అతని చెల్లెలు గౌతమి రంగయ్య గారి అర్థాంగి.
"రారా నారాయణా!... ఎప్పుడు వచ్చావు అమెరికా నుండి?" సింహద్వారం వైపు చూచి....
"గౌతమీ!.... మీ సోదరులు వేం చేశారు. రా!..." బిగ్గరగా పిలిచాడు రంగయ్య.
రంగయ్య భూస్వామి. తాతతండ్రులు అర్జించిన ఆస్తిపాస్థులు గొప్పగానే వున్నాయి. అతను పంచను ఎగ్గట్టి కండువాను తలకు చుట్టి అరకపట్టి (నాగలితో) చేలను దున్నుతాడు. వ్యవసాయానికి సంబంధించి అన్నిపనులూ ఇద్దరు పాలేర్లు వున్నా తనూ శ్రమిస్తాడు. కారణం ’ఆరోగ్యమే మహాభాగ్య’ అని నమ్మిన మహామనిషి. వయస్సు యాభై సంవత్సరాలు. అర్థాంగి గౌతమికి వారికి ఎనిమిది సంవత్సరాలు వ్యత్యాసం. జీవితాన్ని చాలా క్రమబద్ధంగా నడిపే మనిషి రంగయ్య.
నారాయణ వారి ముందున్న కుర్చీలో కూర్చున్నాడు. అతని వయస్సు నలభై ఐదు.
గౌతమి వరండాలోనికి వచ్చింది.
తమ్ముణ్ణి చూచి......
"ఏరా నారాయణా!... అంతా కుశలమే కదా!.... ఊర్లో అమ్మా నాన్నా, ఆ దేశంలో నీ భార్య పిల్లలూ క్షేమమే కదా!....." ఆప్యాయంగా పలకరించింది గౌతమి.
"గౌతమీ!.... అంతా కుశలమే అమ్మా!" జవాబు.
"అవును ఏం అన్నా!..... చాలా తగ్గిపోయావు? ఏమిటి కారణం?" నారాయణను పరిశీలనగా చూస్తూ అడిగింది గౌతమి.
విరక్తిగా నవ్వాడు నారాయణ.
"వయస్సు అవుతూ వుంది కదమ్మా!" విరక్తిగా చెప్పాడు నారాయణ.
"అమెరికాలో వున్నావు. సైంటిస్ట్ వి. డాలర్ల రూపంలో మంచి జీతం. సొంత ఇల్లుని కట్టుకొన్నానని ఫోన్ చేశావు. అన్నీ గొప్పగా వుండి నీవు ఎందుకురా ఇలా తగ్గిపోయావు. నా ఊహలో, నీవు ఏదో సమస్యలో బాధపడుతున్నట్లుగా అనిపిస్తూ వుందిరా!" సాలోచనగా అన్నాడు రంగయ్య.
"బావా!.... మీ ఊహ సరైనదే. మీ సోదరి శ్యామలకు పాశ్చాత్య నాగరీకత వ్యామోహం. మరి నాకు మన ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలంటే ఎంతో అభిమానం, గౌరవం. దానికి తాను పూర్తి వ్యతిరేకం. ఆమె ఆ తత్త్వం నాకు ఎంతో ఆవేదనను కలిగిస్తూ వుంది బావా!" విచారంగా చెప్పాడు నారాయణ.
రంగయ్య నిట్టూర్చాడు.
"అంగట్లో అన్నీ వున్నాయి. కానీ అల్లుడి నోట్లో శని వుంది’ అన్న సామెతలా ఉంది నీ జీవితం" విచారంగా చెప్పాడు రంగయ్య.
"మీ మాట యదార్థమే బావా!.... ఇద్దరు పిల్లలు గౌతమ్, అమ్మాయి పరిమళ. తల్లిని గౌరవించినట్లు నన్ను గౌరవించరు. నా మాటలను లెక్క చేయరు. తల్లి మాట వారికి వేదవాక్కు బావా!..." దీనంగా చెప్పాడు నారాయణ.
-"అన్నయ్యా!.... అమెరికాను వదలి మన దేశానికి తిరిగి రాకూడదా!.... ఇక్కడికి వచ్చారంటే వారి తత్త్వంలో మన ఈ పరిసరాల ప్రభావంతో మార్పు కలుగవచ్చుగా!... అందరం ఒకే ప్రాంతంలో వున్నట్లు వుంటుందిగా!... అది నీకు ఆనందమేగా!..." అభిమానపూర్వకంగా అడిగింది గౌతమి.
"అమ్మా!.... ఆ ప్రయత్నాన్ని చేశాను. ఆ తల్లి బిడ్డలకు భారత్కు రావడం ఇష్టం లేదు. వారికి ఆ దేశం, వుంటున్న ప్రాంతం, బాగా నచ్చింది. కానీ నాకు మన ఈ దేశం అన్నా, మన ప్రాంతం అన్నా, మన మనుషులు తీరు అంటే ఎంతో ఇష్టం. ఆ దేశంలో వారి మధ్య నా పరిస్థితి ’వడ్లతోటే తట్ట ఎండాల్సినట్లుగా వుంది. దేవుడు అన్నీ ఇచ్చాడు. కానీ మనశ్శాంతి లేకుండా చేశాడు" విచారంగా చెప్పాడు నారాయణమూర్తి.
"కొందరికి మన స్వదేశం కన్నా అమెరికా, బ్రిటన్ అంటే ఎంతో మోజు. నీవారి పరిస్థితీ అలాగే వుంది. నీ మాటలను బట్టి!...." సాలోచనగా చెప్పాడు రంగయ్య. కొన్ని క్షణాల తర్వాత.... "సరే!..... విచారించకురా!.... ప్రతి సమస్యకూ కాలం పరిష్కారాన్ని చూపుతుంది. విచారంతో కృంగిపోయి శరీర ఆరోగ్యాన్ని నాశనం చేసికోకుండా, దైవాన్ని నమ్మి నీ కష్టాలను ఆ పరంధాయునికి విన్నవించుకొంటే.... వారు తప్పక పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. లేచి రండి, టిఫిన్ చేద్దురుగాని" అనునయంగా చెప్పింది గౌతమి.
రంగయ్య నారాయణమూర్తి కుర్చీలనుండి లేచి ఇంట్లోకి నడిచారు. డైనింగ్ టేబుల్ను సమీపించారు.
గౌతమి, వేడివేడి ఇడ్లీలు, అల్లంచెట్ని (పచ్చడి), కొబ్బరి చట్నీలను రెండు ప్లేట్లలో వుంచి, భర్త, అన్నగార్ల ముందు వుంచింది.
ఇరువురూ ఆనందంగా ఆరగించారు.
"బావా!...."
"ఏంటి నారాయణ!"
"టిఫిన్ అయిన తరువాత మీ ప్రోగ్రాం ఏమిటి?..."
"అలా చేలల్లోకి వెళ్ళి పైరుకు సరిపడా నీళ్లు వున్నాయా లేక నీరు నింపాలా, కలుపు మొక్కలు ఏమైనా ఎదిగాయా చూచుకొనేదానికి వెళతాను. నీవూ నాతో వస్తావా?...." అడిగాడు రంగయ్య.
"అది ఎంతో ప్రశాంతమైన వాతావరణం కదా బావా!....తప్పకుండా వస్తాను." ఆనందంగా చెప్పాడు నారాయణమూర్తి.
రచన: సిహెచ్. సీఎస్. రావు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"రంగయ్య బావా!..... నమస్కారం...." చేతులు జోడించాడు నవ్వుతూ నారాయణమూర్తి.
చేతిలోని దినపత్రికను క్రిందికి దించి నేరుగా చూచాడు రంగయ్య. వారికి ఒక ఆడ, మగ పిల్లలు. సిటీలోని హాస్టల్లో వుంటూ చదువుతున్నారు. అమ్మాయి శాంతి పదవతరగతి. అబ్బాయి రఘు ఎనిమిదవ క్లాసు. శలవు రోజుల్లో ఇంటికి వస్తారు. తల్లితండ్రి మాటలను జవదాటరు. ఎదురుగా తన బావమరిది అమెరికా వాసి, సైంటిస్ట్ నారాయణమూర్తి. అతని చెల్లెలు గౌతమి రంగయ్య గారి అర్థాంగి.
"రారా నారాయణా!... ఎప్పుడు వచ్చావు అమెరికా నుండి?" సింహద్వారం వైపు చూచి....
"గౌతమీ!.... మీ సోదరులు వేం చేశారు. రా!..." బిగ్గరగా పిలిచాడు రంగయ్య.
రంగయ్య భూస్వామి. తాతతండ్రులు అర్జించిన ఆస్తిపాస్థులు గొప్పగానే వున్నాయి. అతను పంచను ఎగ్గట్టి కండువాను తలకు చుట్టి అరకపట్టి (నాగలితో) చేలను దున్నుతాడు. వ్యవసాయానికి సంబంధించి అన్నిపనులూ ఇద్దరు పాలేర్లు వున్నా తనూ శ్రమిస్తాడు. కారణం ’ఆరోగ్యమే మహాభాగ్య’ అని నమ్మిన మహామనిషి. వయస్సు యాభై సంవత్సరాలు. అర్థాంగి గౌతమికి వారికి ఎనిమిది సంవత్సరాలు వ్యత్యాసం. జీవితాన్ని చాలా క్రమబద్ధంగా నడిపే మనిషి రంగయ్య.
నారాయణ వారి ముందున్న కుర్చీలో కూర్చున్నాడు. అతని వయస్సు నలభై ఐదు.
గౌతమి వరండాలోనికి వచ్చింది.
తమ్ముణ్ణి చూచి......
"ఏరా నారాయణా!... అంతా కుశలమే కదా!.... ఊర్లో అమ్మా నాన్నా, ఆ దేశంలో నీ భార్య పిల్లలూ క్షేమమే కదా!....." ఆప్యాయంగా పలకరించింది గౌతమి.
"గౌతమీ!.... అంతా కుశలమే అమ్మా!" జవాబు.
"అవును ఏం అన్నా!..... చాలా తగ్గిపోయావు? ఏమిటి కారణం?" నారాయణను పరిశీలనగా చూస్తూ అడిగింది గౌతమి.
విరక్తిగా నవ్వాడు నారాయణ.
"వయస్సు అవుతూ వుంది కదమ్మా!" విరక్తిగా చెప్పాడు నారాయణ.
"అమెరికాలో వున్నావు. సైంటిస్ట్ వి. డాలర్ల రూపంలో మంచి జీతం. సొంత ఇల్లుని కట్టుకొన్నానని ఫోన్ చేశావు. అన్నీ గొప్పగా వుండి నీవు ఎందుకురా ఇలా తగ్గిపోయావు. నా ఊహలో, నీవు ఏదో సమస్యలో బాధపడుతున్నట్లుగా అనిపిస్తూ వుందిరా!" సాలోచనగా అన్నాడు రంగయ్య.
"బావా!.... మీ ఊహ సరైనదే. మీ సోదరి శ్యామలకు పాశ్చాత్య నాగరీకత వ్యామోహం. మరి నాకు మన ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలంటే ఎంతో అభిమానం, గౌరవం. దానికి తాను పూర్తి వ్యతిరేకం. ఆమె ఆ తత్త్వం నాకు ఎంతో ఆవేదనను కలిగిస్తూ వుంది బావా!" విచారంగా చెప్పాడు నారాయణ.
రంగయ్య నిట్టూర్చాడు.
"అంగట్లో అన్నీ వున్నాయి. కానీ అల్లుడి నోట్లో శని వుంది’ అన్న సామెతలా ఉంది నీ జీవితం" విచారంగా చెప్పాడు రంగయ్య.
"మీ మాట యదార్థమే బావా!.... ఇద్దరు పిల్లలు గౌతమ్, అమ్మాయి పరిమళ. తల్లిని గౌరవించినట్లు నన్ను గౌరవించరు. నా మాటలను లెక్క చేయరు. తల్లి మాట వారికి వేదవాక్కు బావా!..." దీనంగా చెప్పాడు నారాయణ.
-"అన్నయ్యా!.... అమెరికాను వదలి మన దేశానికి తిరిగి రాకూడదా!.... ఇక్కడికి వచ్చారంటే వారి తత్త్వంలో మన ఈ పరిసరాల ప్రభావంతో మార్పు కలుగవచ్చుగా!... అందరం ఒకే ప్రాంతంలో వున్నట్లు వుంటుందిగా!... అది నీకు ఆనందమేగా!..." అభిమానపూర్వకంగా అడిగింది గౌతమి.
"అమ్మా!.... ఆ ప్రయత్నాన్ని చేశాను. ఆ తల్లి బిడ్డలకు భారత్కు రావడం ఇష్టం లేదు. వారికి ఆ దేశం, వుంటున్న ప్రాంతం, బాగా నచ్చింది. కానీ నాకు మన ఈ దేశం అన్నా, మన ప్రాంతం అన్నా, మన మనుషులు తీరు అంటే ఎంతో ఇష్టం. ఆ దేశంలో వారి మధ్య నా పరిస్థితి ’వడ్లతోటే తట్ట ఎండాల్సినట్లుగా వుంది. దేవుడు అన్నీ ఇచ్చాడు. కానీ మనశ్శాంతి లేకుండా చేశాడు" విచారంగా చెప్పాడు నారాయణమూర్తి.
"కొందరికి మన స్వదేశం కన్నా అమెరికా, బ్రిటన్ అంటే ఎంతో మోజు. నీవారి పరిస్థితీ అలాగే వుంది. నీ మాటలను బట్టి!...." సాలోచనగా చెప్పాడు రంగయ్య. కొన్ని క్షణాల తర్వాత.... "సరే!..... విచారించకురా!.... ప్రతి సమస్యకూ కాలం పరిష్కారాన్ని చూపుతుంది. విచారంతో కృంగిపోయి శరీర ఆరోగ్యాన్ని నాశనం చేసికోకుండా, దైవాన్ని నమ్మి నీ కష్టాలను ఆ పరంధాయునికి విన్నవించుకొంటే.... వారు తప్పక పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. లేచి రండి, టిఫిన్ చేద్దురుగాని" అనునయంగా చెప్పింది గౌతమి.
రంగయ్య నారాయణమూర్తి కుర్చీలనుండి లేచి ఇంట్లోకి నడిచారు. డైనింగ్ టేబుల్ను సమీపించారు.
గౌతమి, వేడివేడి ఇడ్లీలు, అల్లంచెట్ని (పచ్చడి), కొబ్బరి చట్నీలను రెండు ప్లేట్లలో వుంచి, భర్త, అన్నగార్ల ముందు వుంచింది.
ఇరువురూ ఆనందంగా ఆరగించారు.
"బావా!...."
"ఏంటి నారాయణ!"
"టిఫిన్ అయిన తరువాత మీ ప్రోగ్రాం ఏమిటి?..."
"అలా చేలల్లోకి వెళ్ళి పైరుకు సరిపడా నీళ్లు వున్నాయా లేక నీరు నింపాలా, కలుపు మొక్కలు ఏమైనా ఎదిగాయా చూచుకొనేదానికి వెళతాను. నీవూ నాతో వస్తావా?...." అడిగాడు రంగయ్య.
"అది ఎంతో ప్రశాంతమైన వాతావరణం కదా బావా!....తప్పకుండా వస్తాను." ఆనందంగా చెప్పాడు నారాయణమూర్తి.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
