10-08-2025, 02:09 AM
మర్యాద
[font="var(--ricos-font-family,unset)", serif]
[/font]
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
సుశ్రవస జయత్సేనుల కుమారుడు అవాచీనుడు తలిదండ్రుల సుపథాన్ని అనుసరిస్తూ, కుల గురువు వశిష్ట మహర్షి దగ్గర వేద పురాణేతిహాసాల మూలాలను అభ్యసించాడు. వేద పురాణేతిహాసాలను అనుసరించి రాజ ధర్మం ను ఎలా అనుసరించాలో కూడా తెలుసు కున్నాడు. కాల ధర్మం యుగ ధర్మం, పురాణ ధర్మం, మానవ ధర్మం, మానవీయతా ధర్మం, జ్ఞాన ధర్మం వంటి ధర్మాల నడుమ వ్యత్యాసాన్ని తెలుసుకున్నాడు.
అన్ని ధర్మాల కన్నా యుగ ధర్మం మిన్న. లలాట లిఖితం యుగ ధర్మాన్ని అనుసరించి ఉంటుంది అన్న సుశ్రవస మాటలను ప్రజలందరూ మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా నమ్ముతూ, యుగ ధర్మాన్నే అనుసరించేవారు.
మునులు, ఋషులు, మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, పండితులు, పంతుళ్లు, పంతులమ్మలు కూడా యుగ ధర్మ మూలాలనే ప్రజలకు నేర్పించడానికి ప్రయత్నించేవారు.
యుగ ధర్మ మూలాలను చక్కగా గ్రహించి, అనుసరించడానికి అందరూ సుశ్రవస దగ్గర కొంత కాలం శిక్షణ పొందాలనుకునేవారు.
తన తల్లి సుశ్రవసను సమస్త లోకం ఆదరించే విధానం చూసి అవాచీనుడు మిక్కిలి సంతోషించే వాడు. తన తల్లిని దర్శించుకునే ప్రజలందరు మహా అదృష్టవంతులు అనుకునేవాడు. తన తల్లి సుశ్రవస ప్రవచించే యుగ ధర్మ మార్గమే ఉత్తమ మార్గం అనుకునేవాడు.
ఒకనాడు సుశ్రవసను, జయత్సేనుని వారి కుల గురువు వశిష్ట మహర్షి కలిసాడు. ముగ్గురూ అవాచీనుని భవిష్యత్తు గురించి చర్చించసాగారు.
"అవాచీనుడు సమర్థవంతంగా రాజ్య పరిపాలన చేయగల స్థాయికి ఎదిగాడు. సమస్త యుద్ద విద్యల తో పాటు వేద విద్యలను కూడ బాగానే వంట పట్టించు కున్నాడు. అతనికి పట్టాభిషేకం చేసే శుభ ఘడియలు ఆసన్నమైనవి" అని వశిష్ఠ మహర్షి సుశ్రవస జయత్సేనుల తో అన్నాడు.
వశిష్ట మహర్షి మాటలను విన్న జయత్సేనుడు "దేవి.. మీ అభిప్రాయం ఏమిటి?" అని సుశ్రవసను అడిగాడు.
"నాథ! వశిష్ట మహర్షి వారు మన వంశ పురోభివృద్ధి కోరుకునేవారు. వారి దివ్య వాక్కులు సదా ఆచరణీయమైనవి. మన అవాచీనుడు చిరుత కన్నా వేగంగా పరిగెత్తగలడు. అతడు కొండల మీద వేగంగా పరిగెత్తిన సంఘటనలు అనేకం ఉన్నాయి. కొండలని కమ్మేసిన విష ధరుడనే రాక్షసుని సంహరించే నేపథ్యంలో అవాచీనుడు కొండల మీద వేగంగా పరుగులు తీసి విష ధరుని సంహరించాడు. అలాగే వనాల్లోని వృక్షముల మీద మన అవాచీనుడు వేగంగా పరుగులు తీసి అహంతుడనే అసురుని సంహరించాడు. ఇక భూమి మీద వేగంగా పరుగులు తీసి అనేకమంది శత్రువుల శిరములను మన రాజ్య దేవత అమ్మవారికి బలి ఇచ్చాడు.
మన అవాచీనుడు రాజ్య సంరక్షణ విషయంలో మహా వీరుడనే చెప్పాలి. అయితే ఎవరికి, ఎప్పుడు, ఎలా మర్యాదను ఇవ్వాలి అనే విషయం లో మన అవాచీనుడు నేర్చుకోవలసింది చాలా ఉంది" అని సుశ్రవస, భర్త జయత్సేనుడు తో అంది.
"అమ్మా సుశ్రవస! నిక్కము వక్కాణించావు. తల్లీ నిక్కము వక్కాణించావు. కుమారుని గుణగణాలను చక్కగా గుర్తించావు. పిల్లల గుణ గణాలను గుర్తించడంలో ఎవరైన తల్లి తర్వాతనే అనే వాస్తవాన్ని తెలియ చెప్పావు.
అవాచీనుడు అసలు మర్యాద తెలియని మనిషి అని అనలేం కానీ ఎవరికి ఎలాంటి మర్యాద ఇవ్వాలి అన్న విషయం లో నువ్వన్నట్లు కొంచెం తడబడుతుంటాడు.. ఈ విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో నువ్వే చెప్పు?" సుశ్రవస తో అన్నాడు వశిష్ట మహర్షి.
"మహర్షోత్తమ! మా విదర్భ దేశానికి చెందిన నా సోదరుని కుమార్తె మర్యాద అనే రాకుమార్తె ఉంది. ఆమె చిన్న తనం నుంచి మంచి వాతావరణం లో పెరిగి పెద్దదయ్యింది. తప్పు ఎవరు చేసిన వారిని ప్రశ్నించే ధైర్యం మర్యాదకు మెండుగ ఉంది. కొందరు ఆమెను ఆడ ప్రహ్లాదుడు అని అంటూ ఉంటారు.
మంచి చేసిన వారు చిన్నవారైన, పెద్ద వారైన వారిని తగిన విధంగా సత్కరిస్తుంది. మర్యాద పేరుకు తగిన విధంగా మంచి మర్యాద బాగా తెలిసిన మహిళామణి అని మా పుట్టింటివారి ద్వారా తెలుసుకున్నాను.
మర్యాద సూర్య వంశ రాజులకు, రాణులకు చంద్ర వంశ రాజులకు, రాణులకు యింకా వివిధ వంశాల రాజులకు, రాణులకు, తదితరవంశాల వారికి తగిన విధంగా మర్యాదలు చేసి వారి వారి మన్ననలను పొందిందట. అలాగే మునులు, ఋషులు, మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, సురులు, నరులు తదితరులందరికి తగిన విధంగా మర్యాదలు చేస్తూ వారివారి మన్ననలను పొందుతుందట.
ప్రతి సమాజానికి, సంస్కృతికి వాటి స్వంత మర్యాదలు అంటూ కొన్న ఉంటాయి. వాటిని గమనించి నడుచుకునే వారే చరిత్రలో నిజమైన మర్యాదస్తులుగా మిగిలిపోతారు. మర్యాద కు ఎక్కడ ఎలా మసలు కోవాలో బాగా తెలుసునట. అలాంటి యువతి అవాచీనునికి భార్య అయితే అతనిలో చాలా మార్పు వస్తుంది అని నా అభిప్రాయం. మర్యాద అవాచీనుల విషయం లో మీరే పెళ్లి పెద్ద కావాలి. '" అని సుశ్రవస వశిష్ట మహర్షి తో అంది.
[font="var(--ricos-font-family,unset)", serif]
![[Image: m.jpg]](https://i.ibb.co/7tTHym32/m.jpg)
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
సుశ్రవస జయత్సేనుల కుమారుడు అవాచీనుడు తలిదండ్రుల సుపథాన్ని అనుసరిస్తూ, కుల గురువు వశిష్ట మహర్షి దగ్గర వేద పురాణేతిహాసాల మూలాలను అభ్యసించాడు. వేద పురాణేతిహాసాలను అనుసరించి రాజ ధర్మం ను ఎలా అనుసరించాలో కూడా తెలుసు కున్నాడు. కాల ధర్మం యుగ ధర్మం, పురాణ ధర్మం, మానవ ధర్మం, మానవీయతా ధర్మం, జ్ఞాన ధర్మం వంటి ధర్మాల నడుమ వ్యత్యాసాన్ని తెలుసుకున్నాడు.
అన్ని ధర్మాల కన్నా యుగ ధర్మం మిన్న. లలాట లిఖితం యుగ ధర్మాన్ని అనుసరించి ఉంటుంది అన్న సుశ్రవస మాటలను ప్రజలందరూ మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా నమ్ముతూ, యుగ ధర్మాన్నే అనుసరించేవారు.
మునులు, ఋషులు, మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, పండితులు, పంతుళ్లు, పంతులమ్మలు కూడా యుగ ధర్మ మూలాలనే ప్రజలకు నేర్పించడానికి ప్రయత్నించేవారు.
యుగ ధర్మ మూలాలను చక్కగా గ్రహించి, అనుసరించడానికి అందరూ సుశ్రవస దగ్గర కొంత కాలం శిక్షణ పొందాలనుకునేవారు.
తన తల్లి సుశ్రవసను సమస్త లోకం ఆదరించే విధానం చూసి అవాచీనుడు మిక్కిలి సంతోషించే వాడు. తన తల్లిని దర్శించుకునే ప్రజలందరు మహా అదృష్టవంతులు అనుకునేవాడు. తన తల్లి సుశ్రవస ప్రవచించే యుగ ధర్మ మార్గమే ఉత్తమ మార్గం అనుకునేవాడు.
ఒకనాడు సుశ్రవసను, జయత్సేనుని వారి కుల గురువు వశిష్ట మహర్షి కలిసాడు. ముగ్గురూ అవాచీనుని భవిష్యత్తు గురించి చర్చించసాగారు.
"అవాచీనుడు సమర్థవంతంగా రాజ్య పరిపాలన చేయగల స్థాయికి ఎదిగాడు. సమస్త యుద్ద విద్యల తో పాటు వేద విద్యలను కూడ బాగానే వంట పట్టించు కున్నాడు. అతనికి పట్టాభిషేకం చేసే శుభ ఘడియలు ఆసన్నమైనవి" అని వశిష్ఠ మహర్షి సుశ్రవస జయత్సేనుల తో అన్నాడు.
వశిష్ట మహర్షి మాటలను విన్న జయత్సేనుడు "దేవి.. మీ అభిప్రాయం ఏమిటి?" అని సుశ్రవసను అడిగాడు.
"నాథ! వశిష్ట మహర్షి వారు మన వంశ పురోభివృద్ధి కోరుకునేవారు. వారి దివ్య వాక్కులు సదా ఆచరణీయమైనవి. మన అవాచీనుడు చిరుత కన్నా వేగంగా పరిగెత్తగలడు. అతడు కొండల మీద వేగంగా పరిగెత్తిన సంఘటనలు అనేకం ఉన్నాయి. కొండలని కమ్మేసిన విష ధరుడనే రాక్షసుని సంహరించే నేపథ్యంలో అవాచీనుడు కొండల మీద వేగంగా పరుగులు తీసి విష ధరుని సంహరించాడు. అలాగే వనాల్లోని వృక్షముల మీద మన అవాచీనుడు వేగంగా పరుగులు తీసి అహంతుడనే అసురుని సంహరించాడు. ఇక భూమి మీద వేగంగా పరుగులు తీసి అనేకమంది శత్రువుల శిరములను మన రాజ్య దేవత అమ్మవారికి బలి ఇచ్చాడు.
మన అవాచీనుడు రాజ్య సంరక్షణ విషయంలో మహా వీరుడనే చెప్పాలి. అయితే ఎవరికి, ఎప్పుడు, ఎలా మర్యాదను ఇవ్వాలి అనే విషయం లో మన అవాచీనుడు నేర్చుకోవలసింది చాలా ఉంది" అని సుశ్రవస, భర్త జయత్సేనుడు తో అంది.
"అమ్మా సుశ్రవస! నిక్కము వక్కాణించావు. తల్లీ నిక్కము వక్కాణించావు. కుమారుని గుణగణాలను చక్కగా గుర్తించావు. పిల్లల గుణ గణాలను గుర్తించడంలో ఎవరైన తల్లి తర్వాతనే అనే వాస్తవాన్ని తెలియ చెప్పావు.
అవాచీనుడు అసలు మర్యాద తెలియని మనిషి అని అనలేం కానీ ఎవరికి ఎలాంటి మర్యాద ఇవ్వాలి అన్న విషయం లో నువ్వన్నట్లు కొంచెం తడబడుతుంటాడు.. ఈ విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో నువ్వే చెప్పు?" సుశ్రవస తో అన్నాడు వశిష్ట మహర్షి.
"మహర్షోత్తమ! మా విదర్భ దేశానికి చెందిన నా సోదరుని కుమార్తె మర్యాద అనే రాకుమార్తె ఉంది. ఆమె చిన్న తనం నుంచి మంచి వాతావరణం లో పెరిగి పెద్దదయ్యింది. తప్పు ఎవరు చేసిన వారిని ప్రశ్నించే ధైర్యం మర్యాదకు మెండుగ ఉంది. కొందరు ఆమెను ఆడ ప్రహ్లాదుడు అని అంటూ ఉంటారు.
మంచి చేసిన వారు చిన్నవారైన, పెద్ద వారైన వారిని తగిన విధంగా సత్కరిస్తుంది. మర్యాద పేరుకు తగిన విధంగా మంచి మర్యాద బాగా తెలిసిన మహిళామణి అని మా పుట్టింటివారి ద్వారా తెలుసుకున్నాను.
మర్యాద సూర్య వంశ రాజులకు, రాణులకు చంద్ర వంశ రాజులకు, రాణులకు యింకా వివిధ వంశాల రాజులకు, రాణులకు, తదితరవంశాల వారికి తగిన విధంగా మర్యాదలు చేసి వారి వారి మన్ననలను పొందిందట. అలాగే మునులు, ఋషులు, మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, సురులు, నరులు తదితరులందరికి తగిన విధంగా మర్యాదలు చేస్తూ వారివారి మన్ననలను పొందుతుందట.
ప్రతి సమాజానికి, సంస్కృతికి వాటి స్వంత మర్యాదలు అంటూ కొన్న ఉంటాయి. వాటిని గమనించి నడుచుకునే వారే చరిత్రలో నిజమైన మర్యాదస్తులుగా మిగిలిపోతారు. మర్యాద కు ఎక్కడ ఎలా మసలు కోవాలో బాగా తెలుసునట. అలాంటి యువతి అవాచీనునికి భార్య అయితే అతనిలో చాలా మార్పు వస్తుంది అని నా అభిప్రాయం. మర్యాద అవాచీనుల విషయం లో మీరే పెళ్లి పెద్ద కావాలి. '" అని సుశ్రవస వశిష్ట మహర్షి తో అంది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
