03-08-2025, 08:57 PM
సప్త చిరంజీవులు
![[Image: image-2025-08-03-162518474.png]](https://i.ibb.co/GQgDxH52/image-2025-08-03-162518474.png)
రచన: సిహెచ్. సీఎస్. రావు
మన హైందవ పురాణ ఇతిహాసాల ప్రకారం ఏడుగురు మహనీయులు కృత త్రేతాయుగ ద్వాపర యుగాలకు చెందినవారు. వారు ఈ కలియుగమునందున చిరంజీవులు.
సప్త - ఏడు అను సంఖ్య చాలా ప్రభావితమైనది.
1. సప్త ఋషులు:- శతపద బ్రాహ్మణము, బృహదారణ్య కోపనిషత్తులలో కశ్యపుడు, భరద్వాజుడు, గౌతముడు, అత్రి, జమదగ్ని, వశిష్టుడు, విశ్వామిత్రుడు సప్త ఋషులని వివరించబడియున్నది.
2. సప్త సాగరములు: లవణ (ఉప్పు) సముద్రము, ఇక్ష (చెరకు) సముద్రము, సురా (మద్యం, కల్లు) సముద్రము, సర్పి (ఘతం / నెయ్యి) సముద్రము, క్షీర (పాల) సముద్రము, దధి (పెరుగు) సముద్రము, నీరు (మంచినీటి) సముద్రము.
3. సప్త వర్ణములు :- తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, వక్కఛాయ.
4. సప్త ద్వీపములు :- జంబూ ద్వీపము, ప్లక్ష ద్వీపము, శాల్మనీ ద్వీపము, కుశ ద్వీపము, క్రౌంచ ద్వీపము, శాక ద్వీపము, (ఇవి బ్రహ్మాండ పురాణంలో, మహాభారతంలో భాగవతంలోని వివరణ)
5. సప్త స్వరములు :- స,రి,గ,మ,ప,ద,ని....స షడ్బమం (నెమలి క్రేం కారం) రి - రిషభం(ఎద్దురంకె) గ - గాంధర్వం (మేక అరుపు), మే - మధ్యమం (క్రౌంచ పక్షి కూత), ప - పంచమం (కోయిల కూత), ద - దైవతం / గుర్రం సకిలింపు), ని- నిషాదం (ఏనుగు ఘీంకారం)
6. సప్త వారములు : ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని
7. సప్త చిరంజీవులు : బలి చక్రవర్తి, శ్రీవ్యాసుడు, పరశురాముడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యులు, ఆశ్వత్దామ.
దిగువన సప్త చిరంజీవుల చరిత్ర, ఘనత వివరాలు :
1. బలి చక్రవర్తి వారు:- వీరు భక్త ప్రహ్లాదుల మనుమడు. వీరికి బాలి, ఇంద్రసేనన్, మావేలి అను మారుపేర్లు కలవు. వీరు కశ్వప ఋషి వంశస్థులు. వీరి తండ్రిగారి పేరు వీరోచనుడు. వీరి తల్లి దేవాంబ. భార్య ఆశన. వీరు దాననిరతిలో శిబి చక్రవర్తి అంతటివాడు. వీరి గురువు శుక్రాచార్యులు. ముల్లోకాలను జయించిన మహా పరాక్రమశాలి. గొప్పదాత.
శ్రీ మహావిష్ణుమూర్తి వీరి దానగుణమును పరీక్షించదలచి వామరూపము వటువుగా వారి వద్దకు వచ్చి మూడు అడుగుల నేలను అర్థించాడు. ఇస్తానన్నాడు బలి. గురువు శుక్రాచారుయులు వారించాడు. కానీ బలి చక్రవర్తి గురువు వాక్కును వినిపించుకోలేదు. కమండల జలంలో మూడు అడుగులు, శ్రీ మహావిష్ణువుకు ధారపోయబోయాడు.
శుక్రాచార్యులు కమండల ద్వారానికి తన నేత్రాన్ని అడ్డుగా పెట్టాడు. ఆవటువు కమండ జల ప్రవాహ మార్గమును దర్భంతో పొడిచాడు. అడ్డుగా వున్న శుక్రాచార్యుల నేత్రం పోయింది. నీరును వటువు చేతిలో పోసి బలి దాన విధిని ముగించాడు. శ్రీహరి త్రివిక్రమ రూపధారియై ఒక పాదమును యావత్ భూమిమీదను, రెండవ పాదమును గగనతలముననూ వుంచి... అడిగాడు.. ’బలీ!... మూడవ పాదము ఎక్కడ మోపవలె!"
దాన గ్రహీత శ్రీ మహావిష్ణుమూర్తి అని గ్రహించి, మహా జ్ఞాని బలి చక్రవర్తి.... తన శిరమును చూపి.... ’ప్రభూ!.... మూడవ పాదమును ఇచ్చట మోపండి’ అన్నాడు పరమానందంగా.
జగత్ రక్షకుడు శ్రీమన్నారాయణులు బలిచక్రవర్తి దాన గుణానికి సంతసించి, వారికి ప్రసన్నుడై భార్యా పిల్లలతో పాతాళ లోకవాసిగా, చిరంజీవిగా వర్ధిల్లమని శ్రీ మహావిష్ణుమూర్తి, బలిచక్రవర్తిని ఆశీర్వదించారు, వరం ఇచ్చారు.
2. వేదవ్యాసుల వారు:- బెస్త స్త్రీ సత్యవతికి, పరాశర మునీంద్రులకు జన్మించినవారు వ్యాసమహర్షి. మన పూర్వులు పంచమవేదమని పిలవబడు ఇతిహస మహాకావ్యము శ్రీ మహాభారము. అది పదునెనిమిది పర్వములు. అది కౌరవ పాండవుల కథ. వీరు చంద్ర వంశస్థులు. పరీక్షిత్తు మహారాజు వారి భార్య మద్రావతి. తండ్రి అభిమన్యుడు, తల్లి ఉత్తర, కుమారుడు జనమేజయుడు. వీరికి ముగ్గురు సోదరులు. భీమసేనుడు, ఉగ్రసేనుడు, శ్రుతిసేనుడు. జనమేజయుడు అర్జునునికి ముని మనుమడు.
వ్యాసులు ప్రియ శిష్యులు వైశంపాయనుడు. వీరు మహా భారత కథను జనమేజయులకు వివరించినారు.. జనమేజయులకు ఇరువురు కుమారులు. జనమేజయుల తండ్రి పరీక్షిత్ మహారాజు పాముకాటు వలన మరణించు శాపము కలిగినది. అది ఎట్లనిన శమీక అను ఋషి తపమునందుండగా అడవికి వేటకు వెళ్ళిన పరీక్షిత్తు ఆ ఋషిని చూచి దాహము తీర్చుకొనుటకు నీటికి అడిగినాడు. జపమునందున్న ఋషి పలుకలేదు. అవేశంలో పరీక్షిత్తు చనిపోయిన ఒక పాము కళేబరమును శమీక ఋషి మెడలో వేసి వెళ్ళిపోయాడు.
శమీక ఋషి తనయుడు శృంగి, ఏడవరోజున పాము తక్షకుడు నిన్ను కాటువేసి చంపుగాక, అని శపించినాడు. అదే రీతిగా పాముల రాజు తక్షకుడు పరీక్షిత్తును కరచి చంపినాడు. ఆ కారణముగా జనమేజయునికి పాములు అంటే ద్వేషం. వారిని సర్ప యాగమును చేసి చాలా పాములను చంపినారు. ఈ పంచమ వేద రచయిత శ్రీ వ్యాస మహర్షుల వారు. శ్రీ మహా విష్ణువు చిరంజీవిగా వరం ఇచ్చినారు..
![[Image: image-2025-08-03-162518474.png]](https://i.ibb.co/GQgDxH52/image-2025-08-03-162518474.png)
రచన: సిహెచ్. సీఎస్. రావు
మన హైందవ పురాణ ఇతిహాసాల ప్రకారం ఏడుగురు మహనీయులు కృత త్రేతాయుగ ద్వాపర యుగాలకు చెందినవారు. వారు ఈ కలియుగమునందున చిరంజీవులు.
సప్త - ఏడు అను సంఖ్య చాలా ప్రభావితమైనది.
1. సప్త ఋషులు:- శతపద బ్రాహ్మణము, బృహదారణ్య కోపనిషత్తులలో కశ్యపుడు, భరద్వాజుడు, గౌతముడు, అత్రి, జమదగ్ని, వశిష్టుడు, విశ్వామిత్రుడు సప్త ఋషులని వివరించబడియున్నది.
2. సప్త సాగరములు: లవణ (ఉప్పు) సముద్రము, ఇక్ష (చెరకు) సముద్రము, సురా (మద్యం, కల్లు) సముద్రము, సర్పి (ఘతం / నెయ్యి) సముద్రము, క్షీర (పాల) సముద్రము, దధి (పెరుగు) సముద్రము, నీరు (మంచినీటి) సముద్రము.
3. సప్త వర్ణములు :- తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, వక్కఛాయ.
4. సప్త ద్వీపములు :- జంబూ ద్వీపము, ప్లక్ష ద్వీపము, శాల్మనీ ద్వీపము, కుశ ద్వీపము, క్రౌంచ ద్వీపము, శాక ద్వీపము, (ఇవి బ్రహ్మాండ పురాణంలో, మహాభారతంలో భాగవతంలోని వివరణ)
5. సప్త స్వరములు :- స,రి,గ,మ,ప,ద,ని....స షడ్బమం (నెమలి క్రేం కారం) రి - రిషభం(ఎద్దురంకె) గ - గాంధర్వం (మేక అరుపు), మే - మధ్యమం (క్రౌంచ పక్షి కూత), ప - పంచమం (కోయిల కూత), ద - దైవతం / గుర్రం సకిలింపు), ని- నిషాదం (ఏనుగు ఘీంకారం)
6. సప్త వారములు : ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని
7. సప్త చిరంజీవులు : బలి చక్రవర్తి, శ్రీవ్యాసుడు, పరశురాముడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యులు, ఆశ్వత్దామ.
దిగువన సప్త చిరంజీవుల చరిత్ర, ఘనత వివరాలు :
1. బలి చక్రవర్తి వారు:- వీరు భక్త ప్రహ్లాదుల మనుమడు. వీరికి బాలి, ఇంద్రసేనన్, మావేలి అను మారుపేర్లు కలవు. వీరు కశ్వప ఋషి వంశస్థులు. వీరి తండ్రిగారి పేరు వీరోచనుడు. వీరి తల్లి దేవాంబ. భార్య ఆశన. వీరు దాననిరతిలో శిబి చక్రవర్తి అంతటివాడు. వీరి గురువు శుక్రాచార్యులు. ముల్లోకాలను జయించిన మహా పరాక్రమశాలి. గొప్పదాత.
శ్రీ మహావిష్ణుమూర్తి వీరి దానగుణమును పరీక్షించదలచి వామరూపము వటువుగా వారి వద్దకు వచ్చి మూడు అడుగుల నేలను అర్థించాడు. ఇస్తానన్నాడు బలి. గురువు శుక్రాచారుయులు వారించాడు. కానీ బలి చక్రవర్తి గురువు వాక్కును వినిపించుకోలేదు. కమండల జలంలో మూడు అడుగులు, శ్రీ మహావిష్ణువుకు ధారపోయబోయాడు.
శుక్రాచార్యులు కమండల ద్వారానికి తన నేత్రాన్ని అడ్డుగా పెట్టాడు. ఆవటువు కమండ జల ప్రవాహ మార్గమును దర్భంతో పొడిచాడు. అడ్డుగా వున్న శుక్రాచార్యుల నేత్రం పోయింది. నీరును వటువు చేతిలో పోసి బలి దాన విధిని ముగించాడు. శ్రీహరి త్రివిక్రమ రూపధారియై ఒక పాదమును యావత్ భూమిమీదను, రెండవ పాదమును గగనతలముననూ వుంచి... అడిగాడు.. ’బలీ!... మూడవ పాదము ఎక్కడ మోపవలె!"
దాన గ్రహీత శ్రీ మహావిష్ణుమూర్తి అని గ్రహించి, మహా జ్ఞాని బలి చక్రవర్తి.... తన శిరమును చూపి.... ’ప్రభూ!.... మూడవ పాదమును ఇచ్చట మోపండి’ అన్నాడు పరమానందంగా.
జగత్ రక్షకుడు శ్రీమన్నారాయణులు బలిచక్రవర్తి దాన గుణానికి సంతసించి, వారికి ప్రసన్నుడై భార్యా పిల్లలతో పాతాళ లోకవాసిగా, చిరంజీవిగా వర్ధిల్లమని శ్రీ మహావిష్ణుమూర్తి, బలిచక్రవర్తిని ఆశీర్వదించారు, వరం ఇచ్చారు.
2. వేదవ్యాసుల వారు:- బెస్త స్త్రీ సత్యవతికి, పరాశర మునీంద్రులకు జన్మించినవారు వ్యాసమహర్షి. మన పూర్వులు పంచమవేదమని పిలవబడు ఇతిహస మహాకావ్యము శ్రీ మహాభారము. అది పదునెనిమిది పర్వములు. అది కౌరవ పాండవుల కథ. వీరు చంద్ర వంశస్థులు. పరీక్షిత్తు మహారాజు వారి భార్య మద్రావతి. తండ్రి అభిమన్యుడు, తల్లి ఉత్తర, కుమారుడు జనమేజయుడు. వీరికి ముగ్గురు సోదరులు. భీమసేనుడు, ఉగ్రసేనుడు, శ్రుతిసేనుడు. జనమేజయుడు అర్జునునికి ముని మనుమడు.
వ్యాసులు ప్రియ శిష్యులు వైశంపాయనుడు. వీరు మహా భారత కథను జనమేజయులకు వివరించినారు.. జనమేజయులకు ఇరువురు కుమారులు. జనమేజయుల తండ్రి పరీక్షిత్ మహారాజు పాముకాటు వలన మరణించు శాపము కలిగినది. అది ఎట్లనిన శమీక అను ఋషి తపమునందుండగా అడవికి వేటకు వెళ్ళిన పరీక్షిత్తు ఆ ఋషిని చూచి దాహము తీర్చుకొనుటకు నీటికి అడిగినాడు. జపమునందున్న ఋషి పలుకలేదు. అవేశంలో పరీక్షిత్తు చనిపోయిన ఒక పాము కళేబరమును శమీక ఋషి మెడలో వేసి వెళ్ళిపోయాడు.
శమీక ఋషి తనయుడు శృంగి, ఏడవరోజున పాము తక్షకుడు నిన్ను కాటువేసి చంపుగాక, అని శపించినాడు. అదే రీతిగా పాముల రాజు తక్షకుడు పరీక్షిత్తును కరచి చంపినాడు. ఆ కారణముగా జనమేజయునికి పాములు అంటే ద్వేషం. వారిని సర్ప యాగమును చేసి చాలా పాములను చంపినారు. ఈ పంచమ వేద రచయిత శ్రీ వ్యాస మహర్షుల వారు. శ్రీ మహా విష్ణువు చిరంజీవిగా వరం ఇచ్చినారు..
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
