30-07-2025, 04:52 PM
కలి పురుషుడు సుశ్రవసను జాగ్రత్తగ గమనిస్తూ, ఆమెను అనుసరించాడు. అయితే కలి పురుషుడు సుశ్రవస అంతఃపురానికి ప్రవేశించ లేకపోయాడు. సుశ్రవస అంతఃపురానికి ప్రవేశించలేక పోవడానికి కారణం సుశ్రవస అంతఃపురం కృత త్రేతా ద్వాపర యుగ ధర్మాలతో కూడి ఉన్నదన్న యదార్థం కలి పురుషునికి తెలిసింది. సుశ్రవస తనువును ఎలా ఆక్రమించాలా? అని కలి పురుషుడు ఆలోచించాడు.
"మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా ఒక మహర్షి చేసే తపస్సు లో ఆరవ వంతు తపో ఫలం రాజుకు లేదా రాజ్య పరిపాలన చేసే యువరాణి మొదలైన వారికి చెందుతుంది. తమ తఫో ఫలాన్ని రాజుకు ధారపోయని మహర్షులు సంచరించే చోట కలి యుగ ధర్మం విచ్చలవిడిగా సంచరిస్తుంది. కాబట్టి అలాంటి మునుల చేత తపస్సు చేయించాలి. "అని కలి పురుషుడు అనుకున్నాడు.
మారు వేషంలో ఉన్న జయత్సేనుడు సుశ్రవస అంతఃపురంలోనికి ప్రవేశించాలని ప్రయత్నించాడు. జయత్సేనుని ప్రయత్నం చాలా సులభం అయ్యింది. అంతఃపురంలో మహర్షుల తపో తేజం జయత్సేనునికి శిరసు వంచి నమస్కరించింది. జయత్సేనుడు విషయాన్ని గమనించాడు. జయత్సేనుడు మారు మాట్లాడకుండా కరవాలాన్ని పక్కన పడేసి మహర్షుల తపో తేజానికి సాష్టాంగ పడి నమస్కారం చేసాడు.
అప్పుడే అక్కడకు వచ్చిన సుశ్రవస మారువేషంలో ఉన్న జయత్సేనుని చూసింది. అంతకు ముందే సుశ్రవస జయత్సేనుని చిత్ర పటంలో చూసి ఉండటం చేత జయత్సేనుడు మారు వేషంలో ఉన్నప్పటికీ అతని స్వస్వరూపమును పోల్చుకోగలిగింది.
"జయత్సేన మహారాజ! స్వాగతం సుస్వాగతం. మీరు మహా గొప్ప పరిపాలకులన్న వాస్తవాన్ని ఇంతకు ముందే తెలుసుకున్నాం. మీ రాజ ధర్మం అజరామరం. అనిర్వచనీయం.. అమోఘం.
‘బలం లేనివానికి రాజు బలం, రక్ష కావాలి. బలం ఉందని చెలరేగేవానికి రాజు బలం శిక్ష కావాలి. రాజే అహంకార బలం తో చెలరేగి పోతే ఆ రాజు వంశానికి చెందిన వారు ముఖ్యంగా అలాంటి రాజును ఆ రాజు భార్య శిక్షించాలి. అలాంటి భార్యలే పతివ్రతల కోవకు వస్తారు..’ వంటి మీ రాజ ధర్మాలు అందరూ అనుసరించదగినవి.
మీరు యుగ ధర్మ మూలాలు తెలుసుకోవడానికి వచ్చారన్న నిజం మా మహర్షుల తపో తేజం మాకు ఇంతకు ముందే తెలియచేసింది. ఇక్కడ మీ ఇష్టం ఉన్నంత కాలం ఉండవచ్చు. మమ్మల్ని ఆజ్ఞాపించండి. మీరు కోరిన సేవలు అందిస్తాం." అని జయత్సేనుడితో అంది సుశ్రవస.
జయత్సేనుడు తన మారు వేషాన్ని తొలగిస్తూ, " యువరాణి సుశ్రవస.. నేడు అన్ని రాజ్యాలలో మీ యుగ ధర్మం గురించే మాట్లాడుతున్నారు. అదెలా ఉంటుందో చూడాలనిపించింది. మారు వేషంలో వచ్చి చూస్తే నిజం నూటికి నూరు శాతం బహిర్గతం అవుతుంది అనిపించింది. అందుకే మారు వేషంలో వచ్చాను. మీ అంతఃపురాన్ని మీ యుగ ధర్మమే కాపాడుతుంది అని తెలుసుకున్నాను. " అని సుశ్రవసతో అన్నాడు.
"మీరిక్కడ నాలుగు రోజుల పాటు ఉంటే మీకు మరిన్ని విషయాలు తెలుస్తాయి. " అని సుశ్రవస జయత్సేనుని తో అంది.
సుశ్రవస మాటలను అనుసరించి రాజ భటులు జయత్సేనుని కి ప్రత్యేక విడిది మందిరాన్ని ఏర్పాటు చేసారు.
"నాలుగు పాదాల ధర్మం నడిచే కృత యుగం లో భూమి మీద పుట్టిన మనిషి అసలు తప్పుడు ఆలోచనలు చేయవలసిన అవసరం లేదు. భౌగోళిక సంపద, జీవ ఉత్పత్తి అన్ని సమపాళ్ళలో ఉంటాయి కనుక కనీస అవసరాల నిమిత్తం ఎవరిని ఎవరూ దోచుకోవలసిన అవసరం ఉండదు. అలా దోచుకునే ఆలోచన ఎవరన్నా చేస్తే ప్రకృతే వారి ఆలోచనలను శిక్షిస్తుంది. కర్రే పామై కరుస్తుంది.
మూడు పాదాల ధర్మం నడిచే త్రేతా యుగంలో భూమి మీద పుట్టిన మనిషి యుగ ధర్మాన్ని అనుసరించే నేపథ్యంలో సామాన్య మానవునికి తప్పనిపించే కొన్ని పొరపాట్లను చేయవలసి ఉంటుంది.
అయితే పరుల మాటల గురించి కాక యుగ ధర్మం గురించి ఆలోచిస్తూ ముందడుగు వేసేవారే దైవాలు గా చరిత్రకు ఎక్కుతారు. ఇక ధర్మం రెండు పాదాల మీద నడిచే ద్వాపర యుగ ధర్మం తెలుసుకోవడం అంత తేలిక కాదు. ఇక ఒంటి కాలి మీద ధర్మం నడిచే కలియుగంలో అన్ని ధర్మాలు మిళితమైపోయి అసలు ధర్మం ఏమిటో తెలియకుండా పోతుంది. అది తెలుసుకున్నవారే పుణ్యాత్ములు. " అంటూ సుశ్రవస చెప్పే ధర్మాలను వంట పట్టించుకుని మసలే ప్రజలను చూసిన జయత్సేనుడు, " సర్వ కాల సర్వావస్తలయందు ప్రజలు యుగ ధర్మాన్ని పాటిస్తే ఎంత బాగుంటుంది?" అని అనుకున్నాడు.
కలి పురుషుడు మహా స్వార్థం గల వంద మంది మునులతో కపట యాగం చేయించసాగాడు. అది తెలిసిన సుశ్రవస యాగ శాల దగ్గరకు వచ్చింది. సుశ్రవసను జయత్సేనుడు అనుసరించాడు.
సుశ్రవస తన తపోశక్తి తో కపట యాగం చేస్తున్న వంద మంది మునుల నోట మంత్రాలు రాకుండా చేసింది. అది గమనించిన కలి పురుషుడు సుశ్రవసను ఆక్రమించాలని చూసాడు.
ఒంటి కాలి ధర్మం తో ప్రకాశించే కలి పురుషుని సుశ్రవస తన ధర్మ బలంతో పాతాళానికి తొక్కేసింది. అది గమనించిన జయత్సేనుడు సుశ్రవసను పలు రీతుల్లో అభినందించాడు. ఆపై జయత్సేనుడు సుశ్రవస అనుమతితో, ఆమె పెద్దల అనుమతితో అందరి సమక్షంలో సుశ్రవసను వివాహం చేసుకున్నాడు. సుశ్రవస జయత్సేనుడుల సంతానమే
అవాచీనుడు.
సర్వే జనాః సుఖినోభవంతు
"మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా ఒక మహర్షి చేసే తపస్సు లో ఆరవ వంతు తపో ఫలం రాజుకు లేదా రాజ్య పరిపాలన చేసే యువరాణి మొదలైన వారికి చెందుతుంది. తమ తఫో ఫలాన్ని రాజుకు ధారపోయని మహర్షులు సంచరించే చోట కలి యుగ ధర్మం విచ్చలవిడిగా సంచరిస్తుంది. కాబట్టి అలాంటి మునుల చేత తపస్సు చేయించాలి. "అని కలి పురుషుడు అనుకున్నాడు.
మారు వేషంలో ఉన్న జయత్సేనుడు సుశ్రవస అంతఃపురంలోనికి ప్రవేశించాలని ప్రయత్నించాడు. జయత్సేనుని ప్రయత్నం చాలా సులభం అయ్యింది. అంతఃపురంలో మహర్షుల తపో తేజం జయత్సేనునికి శిరసు వంచి నమస్కరించింది. జయత్సేనుడు విషయాన్ని గమనించాడు. జయత్సేనుడు మారు మాట్లాడకుండా కరవాలాన్ని పక్కన పడేసి మహర్షుల తపో తేజానికి సాష్టాంగ పడి నమస్కారం చేసాడు.
అప్పుడే అక్కడకు వచ్చిన సుశ్రవస మారువేషంలో ఉన్న జయత్సేనుని చూసింది. అంతకు ముందే సుశ్రవస జయత్సేనుని చిత్ర పటంలో చూసి ఉండటం చేత జయత్సేనుడు మారు వేషంలో ఉన్నప్పటికీ అతని స్వస్వరూపమును పోల్చుకోగలిగింది.
"జయత్సేన మహారాజ! స్వాగతం సుస్వాగతం. మీరు మహా గొప్ప పరిపాలకులన్న వాస్తవాన్ని ఇంతకు ముందే తెలుసుకున్నాం. మీ రాజ ధర్మం అజరామరం. అనిర్వచనీయం.. అమోఘం.
‘బలం లేనివానికి రాజు బలం, రక్ష కావాలి. బలం ఉందని చెలరేగేవానికి రాజు బలం శిక్ష కావాలి. రాజే అహంకార బలం తో చెలరేగి పోతే ఆ రాజు వంశానికి చెందిన వారు ముఖ్యంగా అలాంటి రాజును ఆ రాజు భార్య శిక్షించాలి. అలాంటి భార్యలే పతివ్రతల కోవకు వస్తారు..’ వంటి మీ రాజ ధర్మాలు అందరూ అనుసరించదగినవి.
మీరు యుగ ధర్మ మూలాలు తెలుసుకోవడానికి వచ్చారన్న నిజం మా మహర్షుల తపో తేజం మాకు ఇంతకు ముందే తెలియచేసింది. ఇక్కడ మీ ఇష్టం ఉన్నంత కాలం ఉండవచ్చు. మమ్మల్ని ఆజ్ఞాపించండి. మీరు కోరిన సేవలు అందిస్తాం." అని జయత్సేనుడితో అంది సుశ్రవస.
జయత్సేనుడు తన మారు వేషాన్ని తొలగిస్తూ, " యువరాణి సుశ్రవస.. నేడు అన్ని రాజ్యాలలో మీ యుగ ధర్మం గురించే మాట్లాడుతున్నారు. అదెలా ఉంటుందో చూడాలనిపించింది. మారు వేషంలో వచ్చి చూస్తే నిజం నూటికి నూరు శాతం బహిర్గతం అవుతుంది అనిపించింది. అందుకే మారు వేషంలో వచ్చాను. మీ అంతఃపురాన్ని మీ యుగ ధర్మమే కాపాడుతుంది అని తెలుసుకున్నాను. " అని సుశ్రవసతో అన్నాడు.
"మీరిక్కడ నాలుగు రోజుల పాటు ఉంటే మీకు మరిన్ని విషయాలు తెలుస్తాయి. " అని సుశ్రవస జయత్సేనుని తో అంది.
సుశ్రవస మాటలను అనుసరించి రాజ భటులు జయత్సేనుని కి ప్రత్యేక విడిది మందిరాన్ని ఏర్పాటు చేసారు.
"నాలుగు పాదాల ధర్మం నడిచే కృత యుగం లో భూమి మీద పుట్టిన మనిషి అసలు తప్పుడు ఆలోచనలు చేయవలసిన అవసరం లేదు. భౌగోళిక సంపద, జీవ ఉత్పత్తి అన్ని సమపాళ్ళలో ఉంటాయి కనుక కనీస అవసరాల నిమిత్తం ఎవరిని ఎవరూ దోచుకోవలసిన అవసరం ఉండదు. అలా దోచుకునే ఆలోచన ఎవరన్నా చేస్తే ప్రకృతే వారి ఆలోచనలను శిక్షిస్తుంది. కర్రే పామై కరుస్తుంది.
మూడు పాదాల ధర్మం నడిచే త్రేతా యుగంలో భూమి మీద పుట్టిన మనిషి యుగ ధర్మాన్ని అనుసరించే నేపథ్యంలో సామాన్య మానవునికి తప్పనిపించే కొన్ని పొరపాట్లను చేయవలసి ఉంటుంది.
అయితే పరుల మాటల గురించి కాక యుగ ధర్మం గురించి ఆలోచిస్తూ ముందడుగు వేసేవారే దైవాలు గా చరిత్రకు ఎక్కుతారు. ఇక ధర్మం రెండు పాదాల మీద నడిచే ద్వాపర యుగ ధర్మం తెలుసుకోవడం అంత తేలిక కాదు. ఇక ఒంటి కాలి మీద ధర్మం నడిచే కలియుగంలో అన్ని ధర్మాలు మిళితమైపోయి అసలు ధర్మం ఏమిటో తెలియకుండా పోతుంది. అది తెలుసుకున్నవారే పుణ్యాత్ములు. " అంటూ సుశ్రవస చెప్పే ధర్మాలను వంట పట్టించుకుని మసలే ప్రజలను చూసిన జయత్సేనుడు, " సర్వ కాల సర్వావస్తలయందు ప్రజలు యుగ ధర్మాన్ని పాటిస్తే ఎంత బాగుంటుంది?" అని అనుకున్నాడు.
కలి పురుషుడు మహా స్వార్థం గల వంద మంది మునులతో కపట యాగం చేయించసాగాడు. అది తెలిసిన సుశ్రవస యాగ శాల దగ్గరకు వచ్చింది. సుశ్రవసను జయత్సేనుడు అనుసరించాడు.
సుశ్రవస తన తపోశక్తి తో కపట యాగం చేస్తున్న వంద మంది మునుల నోట మంత్రాలు రాకుండా చేసింది. అది గమనించిన కలి పురుషుడు సుశ్రవసను ఆక్రమించాలని చూసాడు.
ఒంటి కాలి ధర్మం తో ప్రకాశించే కలి పురుషుని సుశ్రవస తన ధర్మ బలంతో పాతాళానికి తొక్కేసింది. అది గమనించిన జయత్సేనుడు సుశ్రవసను పలు రీతుల్లో అభినందించాడు. ఆపై జయత్సేనుడు సుశ్రవస అనుమతితో, ఆమె పెద్దల అనుమతితో అందరి సమక్షంలో సుశ్రవసను వివాహం చేసుకున్నాడు. సుశ్రవస జయత్సేనుడుల సంతానమే
అవాచీనుడు.
సర్వే జనాః సుఖినోభవంతు
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
