24-06-2025, 01:40 PM
సునంద
![[Image: image-2025-06-24-090725897.png]](https://i.ibb.co/rKWVXJW4/image-2025-06-24-090725897.png)
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
కేకయ మహారాజు సునందకుని ముద్దుల కుమార్తె సునంద. చదువు సంధ్యలలో, అందచందములలో సునందకు సాటి సునందయే అని ఆమెను చూసిన వారంతా అనుకుంటారు. ఆమె అందాన్ని చూసి అప్సరసలు కుళ్ళు కుంటారు. దేవతలు సునంద అందంలో సుర కళ దాగి ఉంది అనుకుంటారు. సునంద ఎక్కడ ఉంటే అక్కడ అందమైన ఆహ్లాదం సుందరంగా నర్తిస్తుందని కొందరు అంటారు.
అందం ఉన్నచోట మానవత్వం ఉండదు. మానవత్వం ఉన్నచోట అందం ఉండదు. అందం అహంభావాన్ని తెచ్చి పెడుతుంది అని అనుకునేవారు సునందను చూసాక వారి అభిప్రాయాలను మార్చుకుంటారు. అందం మానవత్వం సశాస్త్రీయ విజ్ఞానం కలబోసిన సురసుమకళిక సునంద అని ఆమె గురించి తెలిసినవారంతా అనుకుంటారు.
కేకయ రాజు, సునందకు వేద పురాణేతిహాసాల తో పాటు క్షత్రియోచిత విద్యలను కూడ నేర్పాడు. రాజుల వలే కత్తి తిప్పడం, ధనుస్సు ను ప్రయోగించడం, గదను పట్టడం, సుదర్శన చక్రాల్లాంటి చక్రాలను ప్రయోగించడం, త్రిశూల ప్రయోగం వంటి విద్యలలోనూ, అశ్వం మీదన ఉండి యుద్దం చేయడం, గజం మీదన ఉండి యుద్దం చేయడం, రథం మీదన ఉండి యుద్దం చేయడం, భూమి మీదన ఉండి యుద్దం చేయడం వంటి వివిధ యుద్దాలలో సునంద మంచి ప్రావీణ్యం పొందింది. ముఖ్యంగా సునంద ఎగిరే ఏడు తలల గుర్రం మీదన ఉండి, గరుత్మంతుని మీదన ఉండి యుద్దం చేసిందంటే విజయ లక్ష్మి ఆమెను వరించినట్లే అని ఆనాటి వీరులు అనుకునేవారు.
కేకయ రాజ వంశంలో పుట్టిన కైక లా అనేకానేక దేవాసురుల సమరంలో సునంద దేవతల తరుపున తండ్రితో కలిసి పోరాడటానికి సమర రంగంలో కాలు పెట్టింది. పలు అస్త్ర శస్త్రాలతో యుద్దం చేసింది. ఎగిరే ఏడు తలల గుర్రం మీదన, ఎగిరే రథం మీదన ఉండి యుద్దం చేసి, విజయ పతాకం ఎగర వేసింది. రారాజు లలో తన తండ్రిని ఉన్నత పథాన నిలబెట్టింది. కేకయ రాజ్యం మీదకు యుద్ధం అంటే తన శత్రువులు భయపడేటట్లు చేసింది.
కేకేయ రాజు, కుమార్తె సునంద సహాయ సహకారాలతో గాంధార రాజ్యాన్ని జయించాడు. ఇంకా అనేకమంది దుర్మార్గ భావనలు ఉన్న రాజులను ఓడించాడు.
సునంద కేకయ రాజ్యాన్ని ఆనుకుని ప్రవహించే సుధామ నదిని పరిశుభ్రం చేయించింది. సుధామ నది నీళ్ళు కేకయ రాజ్యంలోని పల్లెటూర్లకు ప్రవహించేటట్లు చేసింది. ప్రతి పల్లెటూరు కు పుష్కలంగా మంచి నీళ్ళు అందేలా చూసింది.
సునంద కృషి ఫలితంగా కేకయ రాజ్యం పాడిపంటలతో కళకళలాడ సాగింది. వ్యవససాయ దారులకు నీరు పుష్కలంగా లభించడంతో ఆయా కాలాల్లో వేయవలసిన పంటలను వేసారు. అన్ని రకాల పంటలను పుష్కలంగా పండించసాగారు. మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా సునంద కాలంలో కేకయ రాజ్యం నిత్య కళ్యాణం పచ్చ తోరణాలతో ప్రకాశించింది.
సునంద సరోవర తీరాన చక్కని పర్ణ శాలను నిర్మించుకుని అంతఃపురంలో కంటే అక్కడే ఎక్కువ గా ఉండసాగింది. భానుమతి అహంయాతి ల పుత్రుడు సార్వ భౌముడు తన పట్టాభిషేకం జరిగిన అనంతరం వివిధ రాజ్యాల రాజుల ఆహ్వానాల మేర ఆయా రాజ్యాలకు వెళ్ళాడు. ఆయా ప్రాంతాల రాజులు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించాడు.
సార్వ భౌముడు ఆతిథ్యాన్ని స్వీకరించే ముందు, రాజు స్వీకరించే ప్రతి పదార్థమును అతని అనుచరులు నలుగురు స్వీకరించేవారు. కుల గురువు వశిష్ట మహర్షి ఆదేశానుసారం ఈ పని జరుగుతుంది అని సార్వ భౌముడు ఆయా రాజులకు చెప్పేవాడు.
సార్వ భౌముని మాటలను విన్న ఆయా రాజులు కుల గురువు వశిష్ట మహర్షి ముందు చూపు అమోఘం అని అనుకునేవారు. అలా సార్వ భౌముడు అనేక మిత్ర రాజ్యాల ఆతిథ్యాన్ని స్వీకరించాడు.
అలా సార్వ భౌముడు కేకయ రాజ్యానికి వచ్చాడు. కేకయ రాజు, సార్వ భౌముని తగిన రీతిలో సత్కరించాడు. సార్వ భౌమునికి పెట్టిన ఆహారం ముందుగా అతని అనుచరులు రుచి చూసారు.
దానికి గల కారణాలను సార్వ భౌముడు కేకయ రాజుకి వివరించాడు. సునందకు సార్వ భౌముడు చెప్పిన కారణాలు నచ్చలేదు. అయినప్పటికి యింటికి వచ్చిన అతిథిని గౌరవించాలని మౌనంగా ఉండి పోయింది. సార్వ భౌముని తో ముక్త సరిగా మాట్లాడిన సునంద తన పర్ణశాలకు వెళ్ళిపోయింది.
పది రోజుల పాటు తమ ఆతిథ్యం స్వీకరించమని కేకయ రాజు సార్వ భౌముని ప్రార్థించాడు. సార్వ భౌముడు అందుకు అంగీకరించాడు.
సార్వ భౌముడు కేకయ రాజ్యాన్ని పరిశీలించాడు. అక్కడి సిరిసంపదలను చూసి కేకయ రాజును ప్రశంసించాడు. అక్కడి వ్యవసాయాభివృద్ధి గురించి రైతులను అడిగి తెలుసుకున్నాడు. వ్యవసాయం లో తాము అంత అభివృద్ధి చెందడానికి తమ యువరాణి సునందయే కారణమని రైతులందరూ సార్వ భౌమునికి ముక్త కంఠంతో చెప్పారు. సార్వ భౌముడు అక్కడి చిరు ధాన్యాలు అన్నిటినీ పరిశీలిస్తూ, సునంద పర్ణశాలకు వెళ్ళాడు. అక్కడి వాతావరణం సార్వ భౌమునికి బాగా నచ్చింది. సునంద సార్వ భౌమునికి స్వాగతం పలికింది.
![[Image: image-2025-06-24-090725897.png]](https://i.ibb.co/rKWVXJW4/image-2025-06-24-090725897.png)
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
కేకయ మహారాజు సునందకుని ముద్దుల కుమార్తె సునంద. చదువు సంధ్యలలో, అందచందములలో సునందకు సాటి సునందయే అని ఆమెను చూసిన వారంతా అనుకుంటారు. ఆమె అందాన్ని చూసి అప్సరసలు కుళ్ళు కుంటారు. దేవతలు సునంద అందంలో సుర కళ దాగి ఉంది అనుకుంటారు. సునంద ఎక్కడ ఉంటే అక్కడ అందమైన ఆహ్లాదం సుందరంగా నర్తిస్తుందని కొందరు అంటారు.
అందం ఉన్నచోట మానవత్వం ఉండదు. మానవత్వం ఉన్నచోట అందం ఉండదు. అందం అహంభావాన్ని తెచ్చి పెడుతుంది అని అనుకునేవారు సునందను చూసాక వారి అభిప్రాయాలను మార్చుకుంటారు. అందం మానవత్వం సశాస్త్రీయ విజ్ఞానం కలబోసిన సురసుమకళిక సునంద అని ఆమె గురించి తెలిసినవారంతా అనుకుంటారు.
కేకయ రాజు, సునందకు వేద పురాణేతిహాసాల తో పాటు క్షత్రియోచిత విద్యలను కూడ నేర్పాడు. రాజుల వలే కత్తి తిప్పడం, ధనుస్సు ను ప్రయోగించడం, గదను పట్టడం, సుదర్శన చక్రాల్లాంటి చక్రాలను ప్రయోగించడం, త్రిశూల ప్రయోగం వంటి విద్యలలోనూ, అశ్వం మీదన ఉండి యుద్దం చేయడం, గజం మీదన ఉండి యుద్దం చేయడం, రథం మీదన ఉండి యుద్దం చేయడం, భూమి మీదన ఉండి యుద్దం చేయడం వంటి వివిధ యుద్దాలలో సునంద మంచి ప్రావీణ్యం పొందింది. ముఖ్యంగా సునంద ఎగిరే ఏడు తలల గుర్రం మీదన ఉండి, గరుత్మంతుని మీదన ఉండి యుద్దం చేసిందంటే విజయ లక్ష్మి ఆమెను వరించినట్లే అని ఆనాటి వీరులు అనుకునేవారు.
కేకయ రాజ వంశంలో పుట్టిన కైక లా అనేకానేక దేవాసురుల సమరంలో సునంద దేవతల తరుపున తండ్రితో కలిసి పోరాడటానికి సమర రంగంలో కాలు పెట్టింది. పలు అస్త్ర శస్త్రాలతో యుద్దం చేసింది. ఎగిరే ఏడు తలల గుర్రం మీదన, ఎగిరే రథం మీదన ఉండి యుద్దం చేసి, విజయ పతాకం ఎగర వేసింది. రారాజు లలో తన తండ్రిని ఉన్నత పథాన నిలబెట్టింది. కేకయ రాజ్యం మీదకు యుద్ధం అంటే తన శత్రువులు భయపడేటట్లు చేసింది.
కేకేయ రాజు, కుమార్తె సునంద సహాయ సహకారాలతో గాంధార రాజ్యాన్ని జయించాడు. ఇంకా అనేకమంది దుర్మార్గ భావనలు ఉన్న రాజులను ఓడించాడు.
సునంద కేకయ రాజ్యాన్ని ఆనుకుని ప్రవహించే సుధామ నదిని పరిశుభ్రం చేయించింది. సుధామ నది నీళ్ళు కేకయ రాజ్యంలోని పల్లెటూర్లకు ప్రవహించేటట్లు చేసింది. ప్రతి పల్లెటూరు కు పుష్కలంగా మంచి నీళ్ళు అందేలా చూసింది.
సునంద కృషి ఫలితంగా కేకయ రాజ్యం పాడిపంటలతో కళకళలాడ సాగింది. వ్యవససాయ దారులకు నీరు పుష్కలంగా లభించడంతో ఆయా కాలాల్లో వేయవలసిన పంటలను వేసారు. అన్ని రకాల పంటలను పుష్కలంగా పండించసాగారు. మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా సునంద కాలంలో కేకయ రాజ్యం నిత్య కళ్యాణం పచ్చ తోరణాలతో ప్రకాశించింది.
సునంద సరోవర తీరాన చక్కని పర్ణ శాలను నిర్మించుకుని అంతఃపురంలో కంటే అక్కడే ఎక్కువ గా ఉండసాగింది. భానుమతి అహంయాతి ల పుత్రుడు సార్వ భౌముడు తన పట్టాభిషేకం జరిగిన అనంతరం వివిధ రాజ్యాల రాజుల ఆహ్వానాల మేర ఆయా రాజ్యాలకు వెళ్ళాడు. ఆయా ప్రాంతాల రాజులు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించాడు.
సార్వ భౌముడు ఆతిథ్యాన్ని స్వీకరించే ముందు, రాజు స్వీకరించే ప్రతి పదార్థమును అతని అనుచరులు నలుగురు స్వీకరించేవారు. కుల గురువు వశిష్ట మహర్షి ఆదేశానుసారం ఈ పని జరుగుతుంది అని సార్వ భౌముడు ఆయా రాజులకు చెప్పేవాడు.
సార్వ భౌముని మాటలను విన్న ఆయా రాజులు కుల గురువు వశిష్ట మహర్షి ముందు చూపు అమోఘం అని అనుకునేవారు. అలా సార్వ భౌముడు అనేక మిత్ర రాజ్యాల ఆతిథ్యాన్ని స్వీకరించాడు.
అలా సార్వ భౌముడు కేకయ రాజ్యానికి వచ్చాడు. కేకయ రాజు, సార్వ భౌముని తగిన రీతిలో సత్కరించాడు. సార్వ భౌమునికి పెట్టిన ఆహారం ముందుగా అతని అనుచరులు రుచి చూసారు.
దానికి గల కారణాలను సార్వ భౌముడు కేకయ రాజుకి వివరించాడు. సునందకు సార్వ భౌముడు చెప్పిన కారణాలు నచ్చలేదు. అయినప్పటికి యింటికి వచ్చిన అతిథిని గౌరవించాలని మౌనంగా ఉండి పోయింది. సార్వ భౌముని తో ముక్త సరిగా మాట్లాడిన సునంద తన పర్ణశాలకు వెళ్ళిపోయింది.
పది రోజుల పాటు తమ ఆతిథ్యం స్వీకరించమని కేకయ రాజు సార్వ భౌముని ప్రార్థించాడు. సార్వ భౌముడు అందుకు అంగీకరించాడు.
సార్వ భౌముడు కేకయ రాజ్యాన్ని పరిశీలించాడు. అక్కడి సిరిసంపదలను చూసి కేకయ రాజును ప్రశంసించాడు. అక్కడి వ్యవసాయాభివృద్ధి గురించి రైతులను అడిగి తెలుసుకున్నాడు. వ్యవసాయం లో తాము అంత అభివృద్ధి చెందడానికి తమ యువరాణి సునందయే కారణమని రైతులందరూ సార్వ భౌమునికి ముక్త కంఠంతో చెప్పారు. సార్వ భౌముడు అక్కడి చిరు ధాన్యాలు అన్నిటినీ పరిశీలిస్తూ, సునంద పర్ణశాలకు వెళ్ళాడు. అక్కడి వాతావరణం సార్వ భౌమునికి బాగా నచ్చింది. సునంద సార్వ భౌమునికి స్వాగతం పలికింది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
