Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
కృతవీర్యుని సోదరులు కొందరు పెద్దల సహాయంతో కృతవీర్యుని రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని చూసారు. అయితే రాజ్యంలోని ఎక్కువమంది పెద్దలు వారికి సహకరించ లేదు. కృతవీర్యుని రాజ్యం అతని సంతానానికి చెందడమే ధర్మం అన్నారు. 



 కొందరు మహర్షులు, పుర పెద్దలు అల్లుడు అహంయాతి ని రాజును చేయమన్నారు. కార్తవీర్యార్జునుడు అతని సోదరులు కూడా అహంయాతి నే రాజును చెయ్యమన్నారు. 






 అహంయాతి తన ధర్మపత్ని భానుమతి తో సంప్రదించి "విస్తృతమైన నా సామ్రాజ్య సంరక్షణా బాధ్యత నాకుంది. కాబట్టి మహిష్మతీ ని రాజధానిగా చేసుకుని కార్తవీర్యార్జునుడు పరిపాలన చేస్తేనే బాగుంటుంది " అని అన్నాడు. 



భానుమతి తన భర్త మాటలే తన మాటలు అని అంది. 
 గర్గ మహర్షి, వశిష్ట మహర్షులు భానుమతి మాటలకే తమ మద్దతును ప్రకటించారు. అయితే కార్తవీర్యార్జునుడు ముందుగ రాజ పదవిని నిరాకరించాడు. " ప్రజలందరికి మేలు చేయని రాజు అసలు రాజే కాదు. రాజ్యం లోని ప్రజలందరికి న్యాయం చేయగలను అనే నమ్మకం నాకు లేదు. " అని కార్తవీర్యార్జునుడు బంధువులతో, మహర్షులతో, పుర పెద్దలతో, భానుమతి తో అన్నాడు. 



సోదరుని మాటలను విన్న భానుమతి దత్తాత్రేయ స్వామి ని ప్రసన్నం చేసుకుంది. సోదరుడైన కార్తవీర్యార్జునుని ఆలోచనా సరళిని మార్చమని దత్తాత్రేయ స్వామి ని వేడుకుంది. 



 దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునుని మనసు మార్చి అతనికి సుపరిపాలన కు ఉపయోగ పడే ఎనిమిది వరాలను ఇచ్చాడు. 



 ఎనిమిది వరాలు లభించగానే కార్తవీర్యార్జునునికి తన మీద తనకు కొంచెం నమ్మకం కలిగింది. కార్తవీర్యార్జునుని నమ్మకాన్ని భానుమతి ద్విగుణీకృతం, త్రిగుణీకృతం చేసింది. 



 కార్తవీర్యార్జునుడు మహిష్మతి కి రాజయ్యాడు. 
గర్గ మహర్షి, భానుమతి సుపరిపాలనను ప్రజలకు అందించవలసిన తీరును కార్తవీర్యార్జునునికి తెలిపారు. కార్తవీర్యార్జునుడు గర్గ మహర్షి, భానుమతి లు చెప్పినట్లు కొంత కాలం నడుచుకున్నాడు. అటు పిమ్మట తన స్వంత నిర్ణయాల తో రాజ్య పరిపాలన చేయసాగాడు. 
 కార్తవీర్యార్జునుని సుపరిపాలన చూసి గర్గ మహర్షి, భానుమతి, అహంయాతులు మిక్కిలి సంతోషించారు. 
 భానుమతి మాటలను అనుసరించి అహంయాతి, కార్తవీర్యార్జునుడు దుర్మార్గులైన అనేకమంది రాజులను ఓడించారు. 



 తన భర్త, తన సోదరుడు చేసే యుద్ధాలకు భానుమతి అనేక సూర్య కిరణ అస్త్రాలను తయారు చేయించి ఇచ్చింది. 
 కార్తవీర్యార్జునుడు, అహంయాతి దురితులైన రాజులను సంహరించి, ఆయా రాజ్య ప్రజలను దుర్మార్గులైన రాజుల నుండి సంరక్షించారు. అందుకు రాజ్య ప్రజలు మిక్కిలి సంతోషించారు. ఆపై ఆయా రాజ్య ప్రజల నుండి వారికి వద్దన్నా సువర్ణం వచ్చి పడింది. 



 భానుమతి తమకు సంక్రమించిన సువర్ణం లో అధిక శాతం నిరుపేదలకు దానం చేసింది. ఆపై సువర్ణ యజ్ఞ శాలలను నిర్మింప చేసింది. సువర్ణ యజ్ఞ శాల ల్లో భానుమతి మాటలను అనుసరించి, అహంయాతి సహాయంతో కార్తవీర్యార్జునుడు 700 యజ్ఞాలు చేసాడు. 



 కార్తవీర్యార్జునుడు చేసిన ధర్మ బద్ధమైన యజ్ఞాలను చూసి మిక్కిలి సంతసించిన దత్తాత్రేయ స్వామి భానుమతి అహంయాతి కార్తవీర్యార్జునులకు ఎగిరే రథాన్ని బహుకరించాడు. రథంలో ముగ్గురు ఆనందంగా విహరించారు. 



 భానుమతి అహంయాతి సుపుత్రుడు సార్వ భౌముడు. 



శుభం భూయాత్ 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) కథలు - తులసీదాసు - by k3vv3 - 11-06-2025, 12:38 AM



Users browsing this thread: 1 Guest(s)