11-06-2025, 12:28 AM
భానుమతి - అహంయాతి
![[Image: image-2025-06-10-194733360.png]](https://i.ibb.co/gFr0zk8C/image-2025-06-10-194733360.png)
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
యాదవ వంశంలో ఒక శాఖ హైహయ వంశం.
హైహయ వంశం అనగానే హయగ్రీవ స్వామి గుర్తుకు వస్తాడు.
"జ్ఞానానంద మయం దేవం నిర్మల స్పటికాకృతిం !
ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మహే!!"
అన్న మంత్రం మెదడును పదును పెడుతుంది. ఆలోచనలను విజ్ఞానవంతం చేస్తుంది. పవిత్ర సూర్య కిరణాల తేజస్సున హయగ్రీవ తేజస్సు వేద సంరక్షక తేజస్సులా దర్శనం ఇస్తుంది. సదాలోచనలు హయంలా పరుగులు తీస్తాయి. అలాంటి మహోన్నతమైన సూర్య తేజం హైహయ వంశానికి బీజం అయ్యింది.
ఒకనాడు నక్షత్రాలు అన్నీ శుభ ఫలితాలను ఇచ్చే ప్రదేశంలో ఉన్న వేళ సూర్య నారాయణుడు ప్రకాశ వంతమైన రేవంతుని రూపంలో వైకుంఠానికి పయన మయ్యాడు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న రేవంతుని చూసిన దేవతలందరూ రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నారు. రేవంతుని నుండి ఉదయించే తేజోవంతమైన కిరణాలు ఏడు తలలతో ఎగిరే గుర్రం ఉచ్చైశ్రవం లా ఉన్నాయి.
గాయత్రి, బృహతి, ఉష్టిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి అనే పేర్లుగల సప్తాశ్వాల కిరణాలు సప్త చంధస్సులు గా మారి శృతిలయలతో రాగయుక్తంగా సంచరిస్తున్నాయి. పవిత్రమైన నవ భావ జాలాన్ని గణ బద్దం చేసి వేద మంత్రాలు గ మలుస్తున్నాయి.
వికుంఠ అనే మాతృమూర్తికి జన్మించిన పుత్రుడు దేవతల కోసం, తన కోసం వైకుంఠాన్ని నిర్మించాడు. పాల సంద్ర వైకుంఠ గోడలు ఇంకా గట్టి పడలేదు. వాటిని గట్టి పరచడానికే శ్రీ సూర్య నారాయణుడు రేవంత తేజంతో అక్కడకు వచ్చాడు.
శ్రీ సూర్య నారాయణ కిరణ తేజస్సు తో వైకుంఠ గోడలు తదితరాలు బాగా ఎండి బంగారు వర్ణం తో కళకళలాడ సాగాయి. బంగారు గోడల వైకుంఠం లో పాల సంద్రం. ఆ సంద్రంలో ఆది శేషుని శయన స్వరూపం. భాను తేజం. నూతన వైకుంఠం. వర్ణనలకు అందని వైకుంఠ నారాయణ తేజో స్వరూపం.
వికుంఠ కుమారుడు వైకుంఠుడనే పేర వైకుంఠం లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. దేవతలందరూ వైకుంఠ నారాయణుని పలు రీతులలో స్తుతించారు. వైకుంఠ నారాయణుని వైకుంఠం చూసి నానా విధ స్తుతులతో వైకుంఠం ను ప్రశంసించారు. అది చూసిన శ్రీ సూర్య నారాయణుడు తాను వచ్చిన పని పూర్తయ్యిందని సంతోషించాడు.
వైకుంఠుని ధర్మపత్ని శ్రీ మహా లక్ష్మీదేవి. శ్రీ సూర్య నారాయణ తేజస్సు లో మరికొంత కాలం ఉంటే తన లక్ష్మీ కళ మరింత యశసిస్తుంది అని అనుకుంది. అది గమనించిన వైకుంఠ నారాయణుడు శ్రీమహాలక్ష్మి ని కొంత కాలం భూమి మీద నివసించి, శ్రీ సూర్య నారాయణ తేజస్సు లో తపస్సు చేయమని సలహా ఇచ్చాడు. వైకుంఠ నారాయణుని సలహా శ్రీ మహా లక్ష్మి కి బాగా నచ్చింది.
"ఆహా! భూలోక వాసులు ఎంత అదృష్టవంతులు. శ్రీ సూర్య నారాయణ తేజస్సున సమస్త రోగాలను పోగొట్టుకుంటూ ఆరోగ్యవంతంగా ఉంటున్నారు. చక్కని కళలతో ప్రకాశిస్తున్నారు." అని శ్రీ మహా లక్ష్మి మనసులో అనుకుంది.
శ్రీ మహాలక్ష్మి, వైకుంఠ నారాయణుడు అయిన విష్ణుమూర్తి సలహా తో భూలోకానికి వచ్చింది. తమసా కాళిందీ నదుల సంగమ స్థలంలో నిలబడింది. ఆమెకు తన తండ్రి సాగరుడు గుర్తుకు వచ్చాడు. అలాగే సమద్రంలో ఉన్న బడబానలం గుర్తుకు వచ్చింది. అంత బడబ అనే పేరు గల ఆడ గుర్రం రూపంలో తపస్సు చేయసాగింది.
![[Image: image-2025-06-10-194733360.png]](https://i.ibb.co/gFr0zk8C/image-2025-06-10-194733360.png)
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
యాదవ వంశంలో ఒక శాఖ హైహయ వంశం.
హైహయ వంశం అనగానే హయగ్రీవ స్వామి గుర్తుకు వస్తాడు.
"జ్ఞానానంద మయం దేవం నిర్మల స్పటికాకృతిం !
ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మహే!!"
అన్న మంత్రం మెదడును పదును పెడుతుంది. ఆలోచనలను విజ్ఞానవంతం చేస్తుంది. పవిత్ర సూర్య కిరణాల తేజస్సున హయగ్రీవ తేజస్సు వేద సంరక్షక తేజస్సులా దర్శనం ఇస్తుంది. సదాలోచనలు హయంలా పరుగులు తీస్తాయి. అలాంటి మహోన్నతమైన సూర్య తేజం హైహయ వంశానికి బీజం అయ్యింది.
ఒకనాడు నక్షత్రాలు అన్నీ శుభ ఫలితాలను ఇచ్చే ప్రదేశంలో ఉన్న వేళ సూర్య నారాయణుడు ప్రకాశ వంతమైన రేవంతుని రూపంలో వైకుంఠానికి పయన మయ్యాడు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న రేవంతుని చూసిన దేవతలందరూ రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నారు. రేవంతుని నుండి ఉదయించే తేజోవంతమైన కిరణాలు ఏడు తలలతో ఎగిరే గుర్రం ఉచ్చైశ్రవం లా ఉన్నాయి.
గాయత్రి, బృహతి, ఉష్టిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి అనే పేర్లుగల సప్తాశ్వాల కిరణాలు సప్త చంధస్సులు గా మారి శృతిలయలతో రాగయుక్తంగా సంచరిస్తున్నాయి. పవిత్రమైన నవ భావ జాలాన్ని గణ బద్దం చేసి వేద మంత్రాలు గ మలుస్తున్నాయి.
వికుంఠ అనే మాతృమూర్తికి జన్మించిన పుత్రుడు దేవతల కోసం, తన కోసం వైకుంఠాన్ని నిర్మించాడు. పాల సంద్ర వైకుంఠ గోడలు ఇంకా గట్టి పడలేదు. వాటిని గట్టి పరచడానికే శ్రీ సూర్య నారాయణుడు రేవంత తేజంతో అక్కడకు వచ్చాడు.
శ్రీ సూర్య నారాయణ కిరణ తేజస్సు తో వైకుంఠ గోడలు తదితరాలు బాగా ఎండి బంగారు వర్ణం తో కళకళలాడ సాగాయి. బంగారు గోడల వైకుంఠం లో పాల సంద్రం. ఆ సంద్రంలో ఆది శేషుని శయన స్వరూపం. భాను తేజం. నూతన వైకుంఠం. వర్ణనలకు అందని వైకుంఠ నారాయణ తేజో స్వరూపం.
వికుంఠ కుమారుడు వైకుంఠుడనే పేర వైకుంఠం లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. దేవతలందరూ వైకుంఠ నారాయణుని పలు రీతులలో స్తుతించారు. వైకుంఠ నారాయణుని వైకుంఠం చూసి నానా విధ స్తుతులతో వైకుంఠం ను ప్రశంసించారు. అది చూసిన శ్రీ సూర్య నారాయణుడు తాను వచ్చిన పని పూర్తయ్యిందని సంతోషించాడు.
వైకుంఠుని ధర్మపత్ని శ్రీ మహా లక్ష్మీదేవి. శ్రీ సూర్య నారాయణ తేజస్సు లో మరికొంత కాలం ఉంటే తన లక్ష్మీ కళ మరింత యశసిస్తుంది అని అనుకుంది. అది గమనించిన వైకుంఠ నారాయణుడు శ్రీమహాలక్ష్మి ని కొంత కాలం భూమి మీద నివసించి, శ్రీ సూర్య నారాయణ తేజస్సు లో తపస్సు చేయమని సలహా ఇచ్చాడు. వైకుంఠ నారాయణుని సలహా శ్రీ మహా లక్ష్మి కి బాగా నచ్చింది.
"ఆహా! భూలోక వాసులు ఎంత అదృష్టవంతులు. శ్రీ సూర్య నారాయణ తేజస్సున సమస్త రోగాలను పోగొట్టుకుంటూ ఆరోగ్యవంతంగా ఉంటున్నారు. చక్కని కళలతో ప్రకాశిస్తున్నారు." అని శ్రీ మహా లక్ష్మి మనసులో అనుకుంది.
శ్రీ మహాలక్ష్మి, వైకుంఠ నారాయణుడు అయిన విష్ణుమూర్తి సలహా తో భూలోకానికి వచ్చింది. తమసా కాళిందీ నదుల సంగమ స్థలంలో నిలబడింది. ఆమెకు తన తండ్రి సాగరుడు గుర్తుకు వచ్చాడు. అలాగే సమద్రంలో ఉన్న బడబానలం గుర్తుకు వచ్చింది. అంత బడబ అనే పేరు గల ఆడ గుర్రం రూపంలో తపస్సు చేయసాగింది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
