Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వంశీ మెచ్చిన కథలు, వ్యాఖ్యానంతో - అసతోమా సద్గమయ
#85
ముఖర్జీ తల్లినీ, తండ్రినీ దౌర్జన్యకారులు చంపేసారు. పోతపోసిన దుఃఖమూర్తిలా చీకటి నిండిన ఇంట్లో ఒక్కడే ఉన్నాడు ముఖర్జీ, నేను వెళ్లి అతని ముందు మోకాళ్ల మీద కూర్చున్నాను. ఎవరో వచ్చి దీపం వెలిగించి వెళ్లేరు. ఒక్క నిముషం నమ్మలేనట్టు చూసాడు. నా భుజంమీద తలవాల్చేసి వెక్కివెక్కి ఏడ్చాడు. అతని దుఃఖం తీరేవరకూ ఏడ్వనిచ్చాను. అతని బంధువులెవరో తెచ్చిపెట్టిన రొట్టె, పళ్ళు తిని కడుపు నింపుకొన్నాం.

ఒక నిర్లప్త మానసిక స్థితిలో దేశం వదిలి వెళ్లాలని ఒక నిర్ణయానికి వచ్చాం. రాత్రికి రాత్రే కలకత్తా చేరుకున్నాం. చాలామంది విదేశీయులు దేశాన్ని వదిలివెళ్తున్న రష్, ఎలాగో టిక్కెట్టు సంపాదించుకుని ఓడ ఎక్కి దేశాన్ని వదిలేసాం.

ఆ రోజుల్లో చిత్రకారులందరిలాగే ముఖర్జీ కూడా పేరిస్ నే ఇష్టపడ్డారు. నా వెంట తెచ్చిన డబ్బు మా ప్రయాణానికి, పేరిస్ లో మేం సెటిలవ్వడానికి ఉపయోగపడింది. మా వాళ్లు మమ్మల్ని వెంటాడి వేదిస్తారేమోనని మేం భయపడినంతగా ఏమీ జరగలేదు. భారతదేశంలో జాగీర్లన్నిటికీ ప్రభుత్వం రద్దుచేసిందని తెలిసింది. పేరిస్ లో గొప్ప ఆర్టిస్ట్ గా పేరుతెచ్చుకోడానికి ముఖర్జీ కి ఎక్కువకాలం పట్టలేదు. పల్లెలోనే మేమిద్దరం ఒకరికొకరం అని ప్రామిస్ చేసుకున్నాం. పేరిస్ లో ముఖర్జీ ఎక్కడో రెండు పూలమాలలు సంపాదించుకొచ్చాడు. పది మంది మిత్రుల ఎదుట దండలు మార్చుకొని ఇద్దరం ఒక్కటయ్యాం, మాది గొప్ప ఆత్మీయబంధం అని నా భావన.

ఆర్ట్ తర్వాతి స్థానం ముఖర్జీ పేరిస్ లోని కింగ్స్ లైబ్రరీకిచ్చేవాడు. ఆ లైబ్రరీ మా మనసులు వికసించడానికీ, జ్ఞాన సముపార్జనకీ ఎంతగానో తోడ్పడింది. 1730 లో ఫాదర్ లీగేక్ అనంతపురం నుంచి కింగ్స్ లైబ్రరీ కి పంపించిన వేమన పద్యాల ప్రతిమీద నా చేత ఇంగ్లీష్ లో వర్క్ చేయించాడు. యూరప్ మొత్తం తిరుగుతూ ఆర్ట్ గురించి ఉపన్యాసాలిచ్చాడు. ఎన్నో సెమినార్స్ లో పాల్గొన్నాడు. ఎక్కడికెళ్ళినా తన బెటర్ హాఫ్ గా నన్ను పరిచయం చేసి ఉన్నతి వెనక నేనున్నానని చెప్పేవాడు.

ముఫ్ఫయేళ్ళ తర్వాత ఉన్నట్టుండి విదేశీ జీవితం మొహం మొత్తిపోయిందన్నాడు. 'దేవికారాణి - రోరిచ్ లాగా మనం కూడా ఇండియాలో ఎక్కడైనా సెటిలవుదాం' అన్నాడు.

అప్పటికి ఇద్దరం యాభయ్యవ పడిలో ఉన్నాం.

"నీకు గుర్తుందా, గోదావరి మీద మన పడవ ప్రయాణం? దారిలో మనం ఆగిన గిరిజన గూడెం, అక్కడికెళ్ళిపోదామా? రోరిచ్ హిమాలయాల్ని ఎంచుకున్నట్టు నేను తూర్పుకనుమల్ని ఎంచుకుంటున్నాను. ఒక్క పాపి కొండల అందాల్ని చిత్రించడానికే సగం జీవితకాలం పడుతుంది" అన్నాడు.

అతను మాట్లాడిన పదాలేవైనా అర్ధం మాత్రం 'నీ వూరికి, నీ గోదావరికి దగ్గర్లో నన్ను చేరుస్తాను' అనే స్ఫురించింది నాకు. ఇండియాకి వచ్చాక తెల్సింది - దూరంలో ఉండి మేం విన్నదానికన్నా ఇక్కడి జాగీర్లు ఎంతగా చితికి పోయామో! గొప్ప భేషజంతో జీవించడం తమ జన్మహక్కుగా భావించిన జాగీర్దార్ల కుటుంబాలు క్రమక్రమంగా ఆర్ధిక ఇబ్బందులో చిక్కుకుపోయాయి.

రాజాకోట అన్పించుకున్న మా హవేలీ మూడొంతులు కూలిపోయింది. చాలావరకూ ఆక్రమణలకు గురైపోయింది. కూలకుండా మిగిలిన ఒక గది, హాలులో సగభాగంలో దాసీ పుత్రుడొకాయన వండుకుతింటూ బతుకు వెళ్లమారుస్తున్నాడు. ఎవరూ తీసుకెళ్ళకుండా వదిలేసిన అంచులు పగిలిపోయిన పింగాణీ సామాను, నేలలో స్థాపితం చేసేసిన పాదాల్తో ఒక పాత సైనికుడి ఇనుప విగ్రహం, చెదలు సగం తినేసిన పుస్తకాలు మధ్య జీవచ్చవంలా కన్పించాడతను. ఎప్పటిదో మాసిపోయిన ఫోటో ఆల్బమ్ ఒకటి పదిలంగా దాచుకున్నాడు. నన్ను అతను గుర్తుపట్టలేదు. మా నాన్నగారు, అన్నయ్యలు అంటూ నాన్నగారివి, అన్నయ్యలవి ఫోటోలు చూపించాడు.

నాన్నగారు, అమ్మ నా తోడబుట్టినవాళ్లు ఎవరూ మిగిలిలేరు. నా అన్నదమ్ముల పిల్లలు మద్రాసులో కొందరు, హైదరాబాదులో కొందరు ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారని తెల్సింది.

రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ప్రాంతానికొచ్చినప్పుడు ఆయన బసచేయడానికి మేడపైన నాన్నగారు ప్రత్యేకంగా నిలిచి ఉంది. వెనకవైపు బూజుల్తో నిండిపోయిన మ్యూజిక్ హాల్లో రెండు వీణపెట్టెలు చూసి వాటిని తెరిపించాను. నేను చిన్నప్పుడు గురుముఖంగా సంగీత సాధన చేసిన చిన్నవీణ మరో పెట్టెలో అమ్మ వాయించిన తంజావూరు వీణ - నేను ఆప్యాయంగా వాటిని నిమరడం చూసి "అమ్మగారూ! వీటిని మీరు కొంటారా" అన్నాడతను ఆశగా.

అతను చెప్పిన ధరకన్నా కొంత ఎక్కువే ఇచ్చి ముఖీ ఆ వీణల్ని నా కోసం కొన్నాడు.

ఆ వ్యక్తి కర్రల పొయ్యి పెట్టి వంట చేసుకుంటున్న ఆ విశాలమైన వరండాలో సింహాసం మీద కూర్చుని ఉదయాన్నే అమ్మ అందరికీ పాలు, పెరుగు పంచిన రోజులు; రోజంతా వండించి వార్పించి ఆకలని వచ్చినవారికి లేదనకుండా కడుపునింపి; ఆర్ధించిన వాళ్లకి ఆర్ధికసాయం చేసి పంపించిన ఆ రోజుల వైభవం గుర్తొచ్చి నా కళ్ళలో ఒక సన్నని నీటి పొర నిండింది. ఓడలు బళ్లుకావడం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూసినట్లైంది.

కాలం ఎంత బలీయమైంది!

మేం అనుకున్న గిరిజన గూడెం చేరడానికి ముందుగా రాజమండ్రి వెళ్ళాం. అక్కడ గోదావరిలో ఇదివరకటిలా గూటి పడవలు లేవు. ఆయిల్ తో నడిచే మోటార్ లాంచీలున్నాయి. గోదావరి మధ్యలో ఉండగా ముఖర్జీ తను టాప్ పైకెక్కి నాకు చెయ్యందిచేడు. ఆ అద్భుతమైన ప్రకృతి సౌందర్యం మధ్య ముఖర్జీమీద ప్రేమ పొంగి పొరలింది నాలో.

"ముఖీ! నువ్వు ముఫ్ఫై ఏళ్ల క్రితం ఎలా ఉన్నావో ఇప్పుడూ అలాగే ఉన్నావు తెలుసా" అన్నాను అతని దగ్గరకు జరిగి. "నువ్వూ అంతేలే, మనమిద్దరం ఒకరినొకరం పాపాయిలం కదా!" అన్నాడు నవ్వుతూ.

మాకు సంతానం కలగలేదు, ఎవరిలో లోపమో తెలుసుకోదల్చుకోక టెస్టులు చేయించుకోలేదు.

గూడెంలో ఉండడానికి గిరిజనుల అనుమతి కోరినప్పుడు మేం మత మార్పిడి కోసం వచ్చామనుకుని రెండు రోజులు వాళ్ళు మాతో మాట్లాడలేదు. గిరిజనులు వాళ్ళ మూల సంస్కృతిని కోల్పోడానికి ఇష్టపడరు. నేను వాళ్లకి అర్ధమయ్యేలా వివరించి చెప్పేసరికి వాళ్లే గూడేనికి ఎగువన కొండవాలు శుభ్రం చేసి ఇంత పెద్ద బేంబూహట్ నిర్మించి ఇచ్చారు. అప్పట్నుంచీ మేమూ వాళ్లలో ఒక కుటుంబం అయిపోయాం. నెలకొకసారి ముఖర్జీ అటు భద్రాచలానికో, ఇటు రాజమండ్రికో వెళ్లి అందరికీ కావాల్సిన సరుకులు కొనుక్కొచ్చేవాడు. అడవి దిగుబడులు కొనే దళారులొచ్చినప్పుడు దగ్గరుండి తూకాలు, లెక్కలు సరిచూసి గిరిజనులు మోసపోకుండా చూసేవాడు.

నేను పేరిస్ లో తోచక నేర్చుకున్న వైద్యం కొన్నిసార్లు గిరిజనుల ప్రాణాల్ని కాపాడింది. నేనూ వాళ్లనుంచి అమూల్యమైన మూలికా వైద్యం తెలుసుకున్నాను. చుట్టుపక్కల గూడేల ప్రజలకి వైద్యం చెయ్యడం, చదువు నేర్పించడం నేను చేసేదాన్ని. వెదురును పల్చని రేకులుగా చీల్చి, అడవి కలపను చెక్కీ అందమైన కళాకృతుల్ని తయారుచెయ్యడం బెనర్జీ నేర్పించేవాడు. పని నేర్చుకోవడంలో షార్ప్ గా ఉండే గిరిజనులకది కొంత ఆర్ధిక వనరు కల్పించడానికి తోడ్పడింది. గిరిజనులు నమ్మితే ప్రాణం పెడతారు. అందుకే ఎన్ని రోజులు దేశంలో ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా ఇదే మా స్థిర నివాసమైపోయింది.

మేం బైట నగరాలకు వెళ్ళినప్పుడల్లా తెలిసేది దేశంలో ఎన్నెన్ని మార్పులు సంభవిస్తున్నాయో! సౌకర్యాలతోబాటు అసౌకర్యాలెన్నో! నాగరికత పేరుతో వస్త్రధారణలోనూ, జీవన విధానాల్లోనూ వచ్చిన మార్పుల్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎందరెందరు కొత్త దేవుళ్ళ సృజన జరుగుతోంది! నేనలా అంటే 'మనం ఆగిపోయాం. వాళ్ళు ప్రవాహంలో ఉన్నారు, అదే సహజం" అనేవాడు ముఖర్జీ.

నీళ్ల చల్లదనం క్రమంగా శరీరంలోకి పాకి గజగజ వణుకుపుట్టింది. గత స్మృతుల్లో పడి వయసు మరచిపోయి చటుక్కున లేవబోయాను. సహకరించని కాళ్లు నా ఎనభై ఏళ్ల వయస్సును గుర్తుకుతెచ్చాయి. సూర్యోదయం కాబోతున్న గుర్తుగా పాపికొండలకవతల సన్నని వెలుగు రేఖలు.

నిన్న సాయంకాలం సొరబ వాకిట్లో చేర్చిపెట్టిన ఎండుటాకులు, చితుకులు అగ్గిపుల్లతో ముట్టించాను. చిటపటలాడుతూ మంట ప్రారంభమైంది. ఆ మంట వెలుగులో పాతికేళ్ల క్రితం ముఖర్జీ అస్సాం నుంచి తెచ్చినాటిన టేకు వృక్షం, దాన్ని పెనవేసుకుని నేను నాటిన అడవి శంఖు పూలతీగ ఆకశాన్నంటుతున్నట్టు కన్పించాయి. ఆ తీగ ఎంత నమ్మకంగా అల్లుకుపోయింది!

ముఖర్జీ గీసిన ఎన్నో చిత్రాల ద్వారా ఈ అడవి, కొండలు, గోదావరి, గిరిజనులు దేశ విదేశాలకు పరిచయమయ్యారు.

కాలం గతించిపోయింది. వార్ధక్యం నన్నెప్పుడు ఈ లోకంనుంచి నిష్క్రమింపచేస్తుందో తెలీదు. మనిషి ఎలా మరణించాడనేదానికంటే ఎలా జీవించాడన్నదే ముఖ్య విషయం కదా!

బైట నాగరిక ప్రపంచంలో ఉన్న సదుపాయాలేవీ ఎరుగని ఈ అటవీ పుత్రుల్లో క్రమంగా మార్పురావచ్చు. నూనె దీపాల స్థానంలో కరెంటు దీపాలుండే చోటికి వీళ్లే తరలిపోవచ్చు. శాశ్వతమనుకున్న ఈ కొండలు, అడవులు మాయంకావచ్చు. ఒక నష్టం జరిగిన చోట ఒక లాభం కూడా సాధ్యంకావచ్చు. ఏ సంఘటనకైనా కార్యాకారణ సంబంధాలు తప్పవు -

నిన్న సాయంకాలం నేను తెలుసుకున్న సంఘటన అలాంటిదే - చివరి రోజుల్లో ముఖర్జీ గీసిన చిత్రాలు మళ్లీ ఒకసారి చూడాలన్పించి ఆ పెట్టె తెరిచాను. ఒక్కొక్క చిత్రాన్నీ చూసి పక్కన పెడుతున్నాను. పెట్టె అడుగున ఒక కవరు నన్నాకర్షించింది. ముఖర్జీ ఇంత పదిలంగా దాచిన ఆ కవరు ఏమై ఉంటుందా అని తెరచి చూసాను. ముఖర్జీ పోలికల్తో ఉన్న పదేళ్ల బాలుడి కార్డు సైజ్ ఫోటోతో బాటు ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన లెటరది. ముఖర్జీ కలకత్తా స్నేహితుడి కేరాఫ్ ఎడ్రస్ కి వచ్చింది.

నా దగ్గర ముఖర్జీకి దాపరికమా? పట్టలేని క్యూరియాసిటీతో ఉత్తరం కింది సంతకం చూసాను. ,ముఖర్జీ దగ్గర చిత్రకళ నేర్చుకున్న శిష్యురాలు మరియాలిండా వ్రాసిందది.

ముఖర్జీ!

ఈ ఫోటోలోని వీడు నీ కొడుకు. నీ జ్ఞాపకం కోసం వీడికి నీ పేరే పెట్టుకున్నాను. పెరిగి పెద్దవాడై నీ అంతటి చిత్రకారుడు కావాలని కోరుకుంటున్నాను. తండ్రివి కాబోతున్నావనే మాట విని ఎంతగానో మురిసిపోయిన నువ్వు వీడి పుట్టుకకు ముందే ఈ దేశాన్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయావో నాకెప్పటికీ అర్ధంకాని మిస్టరీ. మన బంధాన్ని స్కిప్ ఫర్ వైల్ , నాట్ ఫర్ పెర్మనెంట్ అనుకున్నావనుకుంటాను. అవునా?


- ప్రేమతో
నీ
మరియా
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: వంశీ మెచ్చిన కథలు, వ్యాఖ్యానంతో - సుఖం - by k3vv3 - 11-06-2025, 12:11 AM



Users browsing this thread: 1 Guest(s)