05-06-2025, 02:01 PM
"ఆ తర్వాత 'ఠపీ'మని పెద్ద శబ్దంతో ఆ గ్రహాంతరవాసి మాయమైపోయింది. పత్రికలకోసం సమాచారం సేకరించేందుకు వచ్చిన ఇద్దరు యువకులు ఇప్పుడే మీ ఇంటి ప్రహరీ గోడ దూకి, డాబాపైకి వెళ్ళారు ఆనందరావుగారూ!", చెప్పాడు రంగనాథం.
"అమ్మబాబోయ్! మీరు చెప్పేది వింటూ ఉంటే నాక్కూడా గుండె దడొచ్చేస్తోంది!! మేడ మీద నాకెంతో విలువైన వస్తువులున్నాయ్. బహుశా వాటికోసమే ఆ గ్రహాంతరవాసులు వచ్చి ఉంటారు!", అంది పార్వతి.
అంతలో డాబాపైకి వెళ్ళిన ఇద్దరు యువకులు పరిగెత్తుక్కుంటూ ఆనందరావు దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఆనందరావు ఇంటివైపు బెదురు చూపులు చూస్తూ, "ఆ ఇంటి యజమాని మీరే కదండీ?", అని అడిగారు.
"అవును నేనే. ఇంతకూ డాబాపైన ఏముందీ?", ఆతృతగా అడిగాడు ఆనందరావు.
"అమ్మో! చాలా భయంకరంగా ఉందండీ!", అన్నాడు ఆ యువకుల్లో ఒకడు.
"అంతా నల్లటి మసి! ఏవో కొన్ని మట్టి బొమ్మల్లాంటివి ఉన్నాయి. వాటి ఆకారాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. గుండె కాస్త బలహీనంగా ఉన్నవాళ్ళు ఆ బొమ్మల్ని చూడకుండా ఉంటే మంచిదండీ", చెప్పాడు యువకుల్లో మరొకడు.
"భగవంతుడా! ఏమిటీపరీక్ష?! నా ఇంటిని నువ్వే కాపాడాలి!", భయంతో వణుకుతూ కళ్ళు గట్టిగా మూసుకుని దేవుణ్ణి ప్రార్థించాడు ఆనందరావు.
యువకులు చెప్పిన సంగతులు విన్న పార్వతికి మాత్రం మనసులో ఏవేవో సందేహాలు కలుగుతున్నాయి.
రమేష్ ని పక్కకు పిలిచి, "ఒరేయ్ రమేషూ! నాకేదో అనుమానంగా ఉందిరా. నువ్వు ఒక్కసారి మన ఇంటి డాబా పైకి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో నీ కళ్ళతో చూసి రా!", అంది పార్వతి.
రమేష్ కొంచెం ఆలోచించి, "సరేనమ్మా! చూసొస్తా", అంటూ ఇంటి వైపుకు ధైర్యంగా వెళ్ళాడు.
"ఆగరా! నేను కూడా నీకు తోడుగా వస్తా!", అంటూ రమేష్ వెంట వెళ్ళాడు ఆనందరావు.
గ్రామస్థులంతా ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా ఎదురు చూడసాగారు.
ఒక పావుగంట గడిచాక రమేష్ తో కలిసి ఆనందరావు ఆయాసపడుతూ జనం దగ్గరకు వచ్చి, "కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు. అందరూ ప్రశాంతగా మీ మీ ఇళ్లకు వెళ్ళచ్చు", అని అన్నాడు.
"అసలేం జరిగింది ఆనందరావుగారూ? ఆ వచ్చినది గ్రహాంతరవాసులు కాదా??", అసహనంగా అడిగాడు రంగనాథం.
"గ్రహాంతరవాసులూ కాదూ! ఇంకేదో అనుకోని ఉపద్రవమూ కాదు! మా ఆవిడ డాబాపైన రాత్రిళ్ళు కాసేపు పని చేసుకోవాలని చెప్పి లైటు పెట్టమని అడిగింది. దానికోసం ఒక పైపు పెట్టి దాని చివర బల్బు పెట్టాను. వైరింగులో ఏదో తప్పు చేసినట్లున్నాను. షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వచ్చాయి", అన్నాడు ఆనందరావు.
"వైరింగులో పొరపాటు కాదేమోనండీ! నిన్న గాలి దుమారం వచ్చింది. ఆ గాలికి చెట్లన్నీ ఊగిపోయి, తేలికపాటి వస్తువులన్నీ గాల్లోకి ఎగిరిపోయాయ్. అక్కడక్కడా కరెంటు తీగలు మండిపడ్డాయ్. అలా ఏదో జరిగి మంట వచ్చుంటుంది", అన్నాడు మల్లేశం.
"మసి ఎందుకుందో విషయం తెలిసింది. మరి ఆ భయంకరమైన ఆకృతులు ఏమిటి సార్? కచ్చితంగా అవి మన భూమి మీద చేసిన బొమ్మలైతే కావు. మరవి ఎక్కడినుంచీ వచ్చుంటాయ్?”, ఆనందరావుని అడిగాడు ఒక పత్రికా విలేకరి.
"ఓ! అదా?! అదీ... మీకెలా చెప్పాలో తెలియట్లేదయ్యా! మా ఆవిడ గతంలో పట్నం వెళ్ళినప్పుడు కుండలూ, మట్టి బొమ్మలూ తయారు చేసే పాటరీ క్యాంపులో చేరింది. అక్కడ నేర్చుకున్న విద్యనుపయోగించి కొన్ని కళాకృతులు చేసే ప్రయత్నం చేసింది. మిమ్మల్ని భయపెట్టిన ఆ అర్థంకాని బొమ్మలు అవే!", మొహమాటపడుతూ అసలు సంగతి చెప్పాడు ఆనందరావు. అక్కడున్నవారంతా ఒకరి చెవులొకరు కొరుక్కోవడం మొదలుపెట్టారు.
అంతలో రమేష్, "కానీ ఒక్క విషయం ఆశ్చర్యంగా ఉంది! అక్కడ కొన్ని కుండ ముక్కలున్నాయి. మా అమ్మకు కుండ చెయ్యడం రాదు. అవేంటో, అసలు అవి ఎక్కడినుంచీ వచ్చాయో అర్థం కావట్లేదు", అన్నాడు దీర్ఘంగా ఆలోచిస్తూ.
"నువ్వుండరా రమేషూ! ఆ కుండ గురించి నేను చెప్తా! మీ నాన్న లైటు పెట్టారు కానీ దాన్ని ఆర్పడానికి స్విచ్ పెట్టలేదు. మేము ఊళ్ళో లేనప్పుడు డాబామీద లైటు వెలుగుతూ ఉంటే అందరికీ లేనిపోని అనుమానాలొస్తాయని నేనే ఆ బల్బుమీద పాత కుండొకటి బోర్లించిపెట్టా. ఇలా జరుగుతుందని అస్సలూహించలేదు", అంది పార్వతి.
ఆనందరావు, రమేష్ లు పార్వతి అన్నది విని అవాక్కయ్యారు. జరిగినదంతా గ్రహాంతరవాసుల పని కాదని తెలుసుకున్న గ్రామస్థులు ఊపిరి పీల్చుకుని ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
ఇంతవరకూ ఎవ్వరూ కనీవినీ ఎరుగని వార్తలు సేకరిద్దామని వచ్చిన పత్రికా విలేకరులు నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోయారు. డాబా శుభ్రం చేసుకునే పనిలో ఆనందంగా పడిపోయింది ఆనందరావు కుటుంబం.
అప్పుడొచ్చింది ఒక నిజమైన గ్రహాంతరవాసి! ఆనందరావు పడేసిన మట్టి బొమ్మలను రహస్యంగా తన గ్రహానికి పట్టుకెళ్ళడానికి.
*****
"అమ్మబాబోయ్! మీరు చెప్పేది వింటూ ఉంటే నాక్కూడా గుండె దడొచ్చేస్తోంది!! మేడ మీద నాకెంతో విలువైన వస్తువులున్నాయ్. బహుశా వాటికోసమే ఆ గ్రహాంతరవాసులు వచ్చి ఉంటారు!", అంది పార్వతి.
అంతలో డాబాపైకి వెళ్ళిన ఇద్దరు యువకులు పరిగెత్తుక్కుంటూ ఆనందరావు దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఆనందరావు ఇంటివైపు బెదురు చూపులు చూస్తూ, "ఆ ఇంటి యజమాని మీరే కదండీ?", అని అడిగారు.
"అవును నేనే. ఇంతకూ డాబాపైన ఏముందీ?", ఆతృతగా అడిగాడు ఆనందరావు.
"అమ్మో! చాలా భయంకరంగా ఉందండీ!", అన్నాడు ఆ యువకుల్లో ఒకడు.
"అంతా నల్లటి మసి! ఏవో కొన్ని మట్టి బొమ్మల్లాంటివి ఉన్నాయి. వాటి ఆకారాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. గుండె కాస్త బలహీనంగా ఉన్నవాళ్ళు ఆ బొమ్మల్ని చూడకుండా ఉంటే మంచిదండీ", చెప్పాడు యువకుల్లో మరొకడు.
"భగవంతుడా! ఏమిటీపరీక్ష?! నా ఇంటిని నువ్వే కాపాడాలి!", భయంతో వణుకుతూ కళ్ళు గట్టిగా మూసుకుని దేవుణ్ణి ప్రార్థించాడు ఆనందరావు.
యువకులు చెప్పిన సంగతులు విన్న పార్వతికి మాత్రం మనసులో ఏవేవో సందేహాలు కలుగుతున్నాయి.
రమేష్ ని పక్కకు పిలిచి, "ఒరేయ్ రమేషూ! నాకేదో అనుమానంగా ఉందిరా. నువ్వు ఒక్కసారి మన ఇంటి డాబా పైకి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో నీ కళ్ళతో చూసి రా!", అంది పార్వతి.
రమేష్ కొంచెం ఆలోచించి, "సరేనమ్మా! చూసొస్తా", అంటూ ఇంటి వైపుకు ధైర్యంగా వెళ్ళాడు.
"ఆగరా! నేను కూడా నీకు తోడుగా వస్తా!", అంటూ రమేష్ వెంట వెళ్ళాడు ఆనందరావు.
గ్రామస్థులంతా ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా ఎదురు చూడసాగారు.
ఒక పావుగంట గడిచాక రమేష్ తో కలిసి ఆనందరావు ఆయాసపడుతూ జనం దగ్గరకు వచ్చి, "కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు. అందరూ ప్రశాంతగా మీ మీ ఇళ్లకు వెళ్ళచ్చు", అని అన్నాడు.
"అసలేం జరిగింది ఆనందరావుగారూ? ఆ వచ్చినది గ్రహాంతరవాసులు కాదా??", అసహనంగా అడిగాడు రంగనాథం.
"గ్రహాంతరవాసులూ కాదూ! ఇంకేదో అనుకోని ఉపద్రవమూ కాదు! మా ఆవిడ డాబాపైన రాత్రిళ్ళు కాసేపు పని చేసుకోవాలని చెప్పి లైటు పెట్టమని అడిగింది. దానికోసం ఒక పైపు పెట్టి దాని చివర బల్బు పెట్టాను. వైరింగులో ఏదో తప్పు చేసినట్లున్నాను. షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వచ్చాయి", అన్నాడు ఆనందరావు.
"వైరింగులో పొరపాటు కాదేమోనండీ! నిన్న గాలి దుమారం వచ్చింది. ఆ గాలికి చెట్లన్నీ ఊగిపోయి, తేలికపాటి వస్తువులన్నీ గాల్లోకి ఎగిరిపోయాయ్. అక్కడక్కడా కరెంటు తీగలు మండిపడ్డాయ్. అలా ఏదో జరిగి మంట వచ్చుంటుంది", అన్నాడు మల్లేశం.
"మసి ఎందుకుందో విషయం తెలిసింది. మరి ఆ భయంకరమైన ఆకృతులు ఏమిటి సార్? కచ్చితంగా అవి మన భూమి మీద చేసిన బొమ్మలైతే కావు. మరవి ఎక్కడినుంచీ వచ్చుంటాయ్?”, ఆనందరావుని అడిగాడు ఒక పత్రికా విలేకరి.
"ఓ! అదా?! అదీ... మీకెలా చెప్పాలో తెలియట్లేదయ్యా! మా ఆవిడ గతంలో పట్నం వెళ్ళినప్పుడు కుండలూ, మట్టి బొమ్మలూ తయారు చేసే పాటరీ క్యాంపులో చేరింది. అక్కడ నేర్చుకున్న విద్యనుపయోగించి కొన్ని కళాకృతులు చేసే ప్రయత్నం చేసింది. మిమ్మల్ని భయపెట్టిన ఆ అర్థంకాని బొమ్మలు అవే!", మొహమాటపడుతూ అసలు సంగతి చెప్పాడు ఆనందరావు. అక్కడున్నవారంతా ఒకరి చెవులొకరు కొరుక్కోవడం మొదలుపెట్టారు.
అంతలో రమేష్, "కానీ ఒక్క విషయం ఆశ్చర్యంగా ఉంది! అక్కడ కొన్ని కుండ ముక్కలున్నాయి. మా అమ్మకు కుండ చెయ్యడం రాదు. అవేంటో, అసలు అవి ఎక్కడినుంచీ వచ్చాయో అర్థం కావట్లేదు", అన్నాడు దీర్ఘంగా ఆలోచిస్తూ.
"నువ్వుండరా రమేషూ! ఆ కుండ గురించి నేను చెప్తా! మీ నాన్న లైటు పెట్టారు కానీ దాన్ని ఆర్పడానికి స్విచ్ పెట్టలేదు. మేము ఊళ్ళో లేనప్పుడు డాబామీద లైటు వెలుగుతూ ఉంటే అందరికీ లేనిపోని అనుమానాలొస్తాయని నేనే ఆ బల్బుమీద పాత కుండొకటి బోర్లించిపెట్టా. ఇలా జరుగుతుందని అస్సలూహించలేదు", అంది పార్వతి.
ఆనందరావు, రమేష్ లు పార్వతి అన్నది విని అవాక్కయ్యారు. జరిగినదంతా గ్రహాంతరవాసుల పని కాదని తెలుసుకున్న గ్రామస్థులు ఊపిరి పీల్చుకుని ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
ఇంతవరకూ ఎవ్వరూ కనీవినీ ఎరుగని వార్తలు సేకరిద్దామని వచ్చిన పత్రికా విలేకరులు నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోయారు. డాబా శుభ్రం చేసుకునే పనిలో ఆనందంగా పడిపోయింది ఆనందరావు కుటుంబం.
అప్పుడొచ్చింది ఒక నిజమైన గ్రహాంతరవాసి! ఆనందరావు పడేసిన మట్టి బొమ్మలను రహస్యంగా తన గ్రహానికి పట్టుకెళ్ళడానికి.
*****
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
