14-05-2025, 01:54 PM
పాచిక
![[Image: image-2025-05-14-135330766.png]](https://i.ibb.co/Kc7PXFHx/image-2025-05-14-135330766.png)
రచన: డా: కిరణ్ జమ్మలమడక
11 ఏళ్ళ ఇషా "అమ్మా కాటన్ ఇవ్వు "అని అడిగింది వాళ్ళ అమ్మ సుభద్రని.
వద్దన్నా తన భర్త అశోక్ ఈ బంగ్లా కొని తాను మాత్రం ఢిల్లీ లో కూర్చున్నాడు అని, చిరాకుతో వుంది సుభద్ర.
"కాటనా? ఎందుకు దెబ్బ తగిలిందా? " అని అడిగింది ఆ చిరాకుతోనే.
"లేదు, చెవుల్లో ఏవేవో విష్పర్స్ లాగ సౌండ్స్ వొస్తున్నాయి "
అప్పుడు సుభద్ర అంతగా పట్టించుకోలేదు, "సరే బాత్రూం లో అల్మారాలో వుంది చూడు, అలానే ఆ గీజర్ కూడా ఆఫ్ చెయ్యి " అంది.
ఇది జరిగిన రెండు రోజులకి, సుభద్రకి కూడా లీలగా యేవో గుసగుసలు వినపడటం మొదలుపెట్టాయి, మొదట తన భ్రమ అని కొట్టిపారేసింది కానీ రోజులు గడిచేకొద్దీ, గుసగుసలు సంభాషణల వలె పెద్దవిగా మారాయి. అప్పడప్పుడు ఇషా కూడా అదే కంప్లైంట్ చేయటంతో ఒకేసారి ఇద్దరికీ ఎందుకు ఒకేలాంటి భ్రమ కలుగుతుందని కొంత సందేహపడినా పెద్దగా పట్టించుకోలేదు సుభద్ర.
ఒక సాయంత్రం, సుభద్ర చదువుకుంటున్నప్పుడు, ఆమె తన కంటి మూలలో నుండి నీడలను చూసింది. తల తిప్పి చూస్తే ఫర్నీచర్ మరియు షెల్ఫ్లు తప్ప మరేమీ కనిపించలేదు. అయినప్పటికీ, ఆ నీడలు కొనసాగుతూనే ఉన్నాయి, ఆమె దృష్టి అంచున నృత్యం చేస్తూ, అనిర్దిష్ఠమైన అశాంతి భావాన్ని పెంపొందిస్తున్నాయి.
ఆ మర్నాడు, ఇషా కి, విపరీతమైన తలనొప్పి రావటం మొదలు పెట్టింది. అది తగ్గక పోయేసరికి ఆమె పని మనిషి సాయంతో డాక్టర్ ని కలవడానికి వెళ్ళింది. ఆ డాక్టర్ కొన్ని కంటి పరీక్షలు చేసి, టీవీ తగ్గించమని, ఎక్కువ వెలుగులో ఉండమని సలహా ఇచ్చి, కొన్ని విటమిన్ మాత్రలు, బలం టానిక్కు ఇచ్చాడు.
ఇంటికి తిరిగి ఒస్తుండగా ఆ పనిమనిషి "నా మాట విని దిష్టి తియ్యండమ్మా! " అని చెప్పింది.
ఆ మాట కొంత ఆశ్చర్యాన్ని కలిగించినా, మనిషి, భయపడినప్పుడు శారీరకంగా, మానసికంగా బలహీనపడతాడు, తనకి పెద్దగా నమ్మకం లేకపోయినా, తప్పు ఐతే కాదు కదా ప్రయత్నిద్దామని తన సాయంతో ఆ దిష్టి కార్యక్రమం కూడా పూర్తి చేసింది. మర్నాడు తాను మామూలుగానే కాలేజ్ కి వెళ్ళటం తో సుభద్ర ఊపిరి తీసుకుంది, తనకి కూడా ఆ తలనొప్పి రావటం గమనించింది కానీ పెద్దగా పట్టించుకోలేదు.
ఆ రోజు రాత్రి అవే ఆలోచనలతో సుభద్ర, ఆమె కూతురు, ఇషా పడుకున్నారు.
సుభద్రకు, ఆ గుసగుసలు మరింత గట్టిగా వినపడసాగాయి. మరలా ఆ నీడలు తనకు కనపడుతున్నాయి. తనకు ఏమి చెయ్యాలో అర్థంకావటంలేదు. ఇంక తప్పక, పనిమనిషికి ఫోన్ చేసి రమ్మని అడిగింది ధైర్యం కోసం. పనిమనిషి వెంటనే వొచ్చింది. అందరూ కలిసి హల్లో పడుకున్నారు. ఇందాకటంత తీవ్రంగా లేకపోయినా ఇంకా ఆ అలోచనలు, ఆ గుసగుసలు వీడిపోలేదు సుభద్రను.
రోజులు వారాలుగా మారేకొద్దీ సుభద్ర ఆలోచనలు విచ్చలవిడిగా మారాయి. ఆమె చూపు మందగించింది. సుభద్ర చాలా చిన్న పనిని కూడా గుర్తుంచుకోవడానికి కష్టపడుతోంది. మనస్సు అంతా, గందరగోళంతో నిండిపోయింది. ఒకప్పుడు కేవలం భ్రమలుగా ఉన్న నీడలు ఇప్పుడు తన చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇంక తప్పేటట్టులేదని, తన తమ్ముడు, అతీత్ కి ఫోన్ చేసి విషయాలు ఏమి చెప్పకుండా ఊరికే ఒంటరిగా బోర్ కొడుతోందని, ఇషా అడుగుతోంది అనే మిషతో రమ్మనిచెప్పింది.
***
"హాయ్ అక్కా !" అని అంటూనే, అతీత్ ఇషా ని ఎత్తుకున్నాడు.
ఒక చిన్న నవ్వు నవ్వింది సుభద్ర.
"అదేంటి అక్కా! ఇలా అయిపోయావు, అన్నం తినటంలేదా ? మొహం అంతా అలా నల్లగా అయిపోయింది " అన్నాడు కంగారుగా..
"ఏంలేదు చెపుతా పద" అని ముందు ఇంటికి పద భోజనం చేద్దువుగాని అని తొందరపెట్టింది.
అందరూ కార్ లో బయలుదేరారు.
"కుశల ప్రశ్నలు అయ్యాక, చెప్పు అక్కా ఏమైంది " అని అడిగాడు అతీత్.
దానికి ఇషా "మా ఇంటిలో దెయ్యం వుంది, అది మాతో మాట్లాడుతుంది కూడా.. ఇంకా అమ్మకి అప్పుడప్పుడు కనపడుతుంది " అని ఇషా అనగానే, సుభద్ర ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసింది.
"ఇషా ! " అని గట్టిగా అరిచింది, ఎవరు చెప్పారు నీకివన్నీ అని అడిగింది.
దానికి అతీత్ "ఇషా జోక్ చేస్తోంది, మనల్ని భయపెట్టటానికి అవునా ఇషా ?" అని అన్నాడు.
ఇషా, “లేదు అతీత్ మామ!, నిజంగానే, నాకు రోజు మాటలు వినపడతాయి. అమ్మకి, కనపడతాయని, మా పనిమనిషి చెప్పింది " అనగానే ఇషా కి ఈ విషయాలు ఎలా తెలిసియో తెలిసింది సుభద్రకు. అతీత్ కి, విషయం పూర్తిగా అర్థం కాలేదు, ఇంకా ఏవోవో ప్రశ్నలు అడగబోయాడు అతీత్ ఇషా ని, ఇంటికెళ్లి మాట్లాడుకుందాం అని సుభద్ర టాపిక్ డైవర్ట్ చేసింది.
***
![[Image: image-2025-05-14-135330766.png]](https://i.ibb.co/Kc7PXFHx/image-2025-05-14-135330766.png)
రచన: డా: కిరణ్ జమ్మలమడక
11 ఏళ్ళ ఇషా "అమ్మా కాటన్ ఇవ్వు "అని అడిగింది వాళ్ళ అమ్మ సుభద్రని.
వద్దన్నా తన భర్త అశోక్ ఈ బంగ్లా కొని తాను మాత్రం ఢిల్లీ లో కూర్చున్నాడు అని, చిరాకుతో వుంది సుభద్ర.
"కాటనా? ఎందుకు దెబ్బ తగిలిందా? " అని అడిగింది ఆ చిరాకుతోనే.
"లేదు, చెవుల్లో ఏవేవో విష్పర్స్ లాగ సౌండ్స్ వొస్తున్నాయి "
అప్పుడు సుభద్ర అంతగా పట్టించుకోలేదు, "సరే బాత్రూం లో అల్మారాలో వుంది చూడు, అలానే ఆ గీజర్ కూడా ఆఫ్ చెయ్యి " అంది.
ఇది జరిగిన రెండు రోజులకి, సుభద్రకి కూడా లీలగా యేవో గుసగుసలు వినపడటం మొదలుపెట్టాయి, మొదట తన భ్రమ అని కొట్టిపారేసింది కానీ రోజులు గడిచేకొద్దీ, గుసగుసలు సంభాషణల వలె పెద్దవిగా మారాయి. అప్పడప్పుడు ఇషా కూడా అదే కంప్లైంట్ చేయటంతో ఒకేసారి ఇద్దరికీ ఎందుకు ఒకేలాంటి భ్రమ కలుగుతుందని కొంత సందేహపడినా పెద్దగా పట్టించుకోలేదు సుభద్ర.
ఒక సాయంత్రం, సుభద్ర చదువుకుంటున్నప్పుడు, ఆమె తన కంటి మూలలో నుండి నీడలను చూసింది. తల తిప్పి చూస్తే ఫర్నీచర్ మరియు షెల్ఫ్లు తప్ప మరేమీ కనిపించలేదు. అయినప్పటికీ, ఆ నీడలు కొనసాగుతూనే ఉన్నాయి, ఆమె దృష్టి అంచున నృత్యం చేస్తూ, అనిర్దిష్ఠమైన అశాంతి భావాన్ని పెంపొందిస్తున్నాయి.
ఆ మర్నాడు, ఇషా కి, విపరీతమైన తలనొప్పి రావటం మొదలు పెట్టింది. అది తగ్గక పోయేసరికి ఆమె పని మనిషి సాయంతో డాక్టర్ ని కలవడానికి వెళ్ళింది. ఆ డాక్టర్ కొన్ని కంటి పరీక్షలు చేసి, టీవీ తగ్గించమని, ఎక్కువ వెలుగులో ఉండమని సలహా ఇచ్చి, కొన్ని విటమిన్ మాత్రలు, బలం టానిక్కు ఇచ్చాడు.
ఇంటికి తిరిగి ఒస్తుండగా ఆ పనిమనిషి "నా మాట విని దిష్టి తియ్యండమ్మా! " అని చెప్పింది.
ఆ మాట కొంత ఆశ్చర్యాన్ని కలిగించినా, మనిషి, భయపడినప్పుడు శారీరకంగా, మానసికంగా బలహీనపడతాడు, తనకి పెద్దగా నమ్మకం లేకపోయినా, తప్పు ఐతే కాదు కదా ప్రయత్నిద్దామని తన సాయంతో ఆ దిష్టి కార్యక్రమం కూడా పూర్తి చేసింది. మర్నాడు తాను మామూలుగానే కాలేజ్ కి వెళ్ళటం తో సుభద్ర ఊపిరి తీసుకుంది, తనకి కూడా ఆ తలనొప్పి రావటం గమనించింది కానీ పెద్దగా పట్టించుకోలేదు.
ఆ రోజు రాత్రి అవే ఆలోచనలతో సుభద్ర, ఆమె కూతురు, ఇషా పడుకున్నారు.
సుభద్రకు, ఆ గుసగుసలు మరింత గట్టిగా వినపడసాగాయి. మరలా ఆ నీడలు తనకు కనపడుతున్నాయి. తనకు ఏమి చెయ్యాలో అర్థంకావటంలేదు. ఇంక తప్పక, పనిమనిషికి ఫోన్ చేసి రమ్మని అడిగింది ధైర్యం కోసం. పనిమనిషి వెంటనే వొచ్చింది. అందరూ కలిసి హల్లో పడుకున్నారు. ఇందాకటంత తీవ్రంగా లేకపోయినా ఇంకా ఆ అలోచనలు, ఆ గుసగుసలు వీడిపోలేదు సుభద్రను.
రోజులు వారాలుగా మారేకొద్దీ సుభద్ర ఆలోచనలు విచ్చలవిడిగా మారాయి. ఆమె చూపు మందగించింది. సుభద్ర చాలా చిన్న పనిని కూడా గుర్తుంచుకోవడానికి కష్టపడుతోంది. మనస్సు అంతా, గందరగోళంతో నిండిపోయింది. ఒకప్పుడు కేవలం భ్రమలుగా ఉన్న నీడలు ఇప్పుడు తన చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇంక తప్పేటట్టులేదని, తన తమ్ముడు, అతీత్ కి ఫోన్ చేసి విషయాలు ఏమి చెప్పకుండా ఊరికే ఒంటరిగా బోర్ కొడుతోందని, ఇషా అడుగుతోంది అనే మిషతో రమ్మనిచెప్పింది.
***
"హాయ్ అక్కా !" అని అంటూనే, అతీత్ ఇషా ని ఎత్తుకున్నాడు.
ఒక చిన్న నవ్వు నవ్వింది సుభద్ర.
"అదేంటి అక్కా! ఇలా అయిపోయావు, అన్నం తినటంలేదా ? మొహం అంతా అలా నల్లగా అయిపోయింది " అన్నాడు కంగారుగా..
"ఏంలేదు చెపుతా పద" అని ముందు ఇంటికి పద భోజనం చేద్దువుగాని అని తొందరపెట్టింది.
అందరూ కార్ లో బయలుదేరారు.
"కుశల ప్రశ్నలు అయ్యాక, చెప్పు అక్కా ఏమైంది " అని అడిగాడు అతీత్.
దానికి ఇషా "మా ఇంటిలో దెయ్యం వుంది, అది మాతో మాట్లాడుతుంది కూడా.. ఇంకా అమ్మకి అప్పుడప్పుడు కనపడుతుంది " అని ఇషా అనగానే, సుభద్ర ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసింది.
"ఇషా ! " అని గట్టిగా అరిచింది, ఎవరు చెప్పారు నీకివన్నీ అని అడిగింది.
దానికి అతీత్ "ఇషా జోక్ చేస్తోంది, మనల్ని భయపెట్టటానికి అవునా ఇషా ?" అని అన్నాడు.
ఇషా, “లేదు అతీత్ మామ!, నిజంగానే, నాకు రోజు మాటలు వినపడతాయి. అమ్మకి, కనపడతాయని, మా పనిమనిషి చెప్పింది " అనగానే ఇషా కి ఈ విషయాలు ఎలా తెలిసియో తెలిసింది సుభద్రకు. అతీత్ కి, విషయం పూర్తిగా అర్థం కాలేదు, ఇంకా ఏవోవో ప్రశ్నలు అడగబోయాడు అతీత్ ఇషా ని, ఇంటికెళ్లి మాట్లాడుకుందాం అని సుభద్ర టాపిక్ డైవర్ట్ చేసింది.
***
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
