01-05-2025, 04:50 PM
"రేయ్!.... ఈశ్వర్!...." కోటేసుపైకి దూకి అతని గొంతును గట్టిగా పట్టుకొని పిసకబోయాడు ప్రజాపతి.
మంచి దేహధారుడ్యం గల కోటేసు ప్రజాపతికి పిచ్చిపట్టిందనుకొని.... అతన్ని ప్రక్కకు నెట్టి... గది నుండి వేగంగా బయటికి వచ్చాడు. హాల్లో వున్న ప్రణవి.... సీతాపతులను చూచాడు.
"బాబూ!... మీ అయ్యకు పిచ్చిపట్టింది. పిచ్చి హాస్పిటల్లో చేర్చండి" చెప్పి వేగంగా వీధివైపుకు వెళ్ళిపోయాడు కోటేసు.
కొన్నిక్షణాల తర్వాత.... సీతాపతి మెల్లగా, ప్రజాపతి వేగంగా ఒకరినొకరు సమీపించారు. సీతాపతి అతని కళ్ళకు ఈశ్వర్లా కనిపించాడు.
"రేయ్!... ఈశ్వర్!... నీవు ఇంకా బ్రతికే వున్నావా!.... చావలేదా!.... చావలేదా!" ఆవేశంగా తన రెండు చేతులతో సీతాపతి గొంతును పట్టుకొని నులిపి చంపబోయాడు.
సీతాపతి అతని చేతులను తన చేతులతో పట్టుకొని బలంగా లాగి తన మెడను వెనక్కు తీసుకున్నాడు. వేగంగా గది బయటికి వచ్చి తలుపు మూసి గడియ బిగించాడు.
గదిలో జరుగుతున్న సన్నివేశాన్ని ఆశ్చర్యాందోళనల్తో చూస్తూ వున్న తల్లి ప్రణవిని సమీపించిన సీతాపతి....
"అమ్మా!.... ఆయనకు పిచ్చి పట్టింది. పిచ్చి హాప్సిటల్లో చేర్చక తప్పదు"
విచార వదనంతో ప్రణవి సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకొంది. కన్నీరు కార్చింది. సీతాపతి పిచ్చి ఆసుపత్రికి ఫోన్ చేశాడు. అంబులెన్స్ లో ప్రజాపతి పిచ్చివాళ్ళ హాస్పిటల్కు చేర్చబడ్డాడు.
విష్ణుకు.... ఈశ్వర్ నేత్రాలతో చూపు వచ్చింది. అతనికి ఒకవైపు ఆనందం... మరోవైపు ఈశ్వర్ లేనందున ఆవేదన. హరికృష్ణ ఇచ్చిన మూడు లక్షలను శివరామకృష్ణ హాస్పిటల్లో కట్టాడు.
హరికృష్ణ.... ఈశ్వర్ ఖర్మ క్రతువులను కన్నీటితో సక్రమంగా నెరవేర్చాడు. అది దైవ నిర్ణయం... తండ్రికి తనయుడు చేయవలసిన దానికి మారుగా తండ్రి తనయుడికి చేయవలసి వచ్చింది.
దివాకర్ తల్లిదండ్రులను తనతో అమెరికా రమ్మన్నారు. వారు నిరాకరించారు. అతను తన భార్యా బిడ్డలతో అమెరికా వెళ్ళిపోయాడు.
దీప్తి తన కర్తవ్యాన్ని గుర్తించింది. ఎదలో ఎంతో వేదన వున్నా... పైకి నవ్వుతూ అత్తామామలను జాగ్రత్తగా చూచుకోసాగింది.
శార్వరి పరీక్షలు ముగిశాయి. ఇంటికొచ్చేసింది. తన వదిన..... దీప్తికి అన్ని విషయాల్లో సాయంగా వుంటూ తల్లిదండ్రులను ప్రేమాభిమానాలతో చూచుకోసాగింది. వాణి ఆమె భర్త కళ్యాణ్ ఈశ్వర్ అంత్యక్రియలు ముగిశాక ఢిల్లీకి వెళ్ళిపోయారు.
ప్రజాపతి చేసిన పాపాల ఫలితంగా... పిచ్చిఆసుపత్రి పాలయ్యాడు.
వారంరోజుల తర్వాత గూడూరుకు వచ్చిన విష్ణు.... దీప్తికి సీతామాతకు ఆంజనేయ స్వామిలా నమ్మిన బంటులా వర్తించసాగాడు. అతని కళ్ళను చూచినప్పుడు దీప్తికి ఈశ్వర్ గుర్తుకు వచ్చేవాడు. తలను ప్రక్కకు త్రిప్పుకొని కన్నీరు కార్చేది.
ఈశ్వర్ గతించి ఆరువారాలు పూర్తయినాయి. దీప్తి డాక్టర్ కాబట్టి తన శరీర తత్త్వాన్ని గమనించి... తాను నెల తప్పానని లావణ్యకు తెలియజేసింది.
ఆ వార్త విన్న లావణ్యకు ఒక కంట కన్నీరు.... మరో కంట ఆనందభాష్పాలు. ప్రణవి లావణ్య ప్రక్కనే ఉండేది.
శివరామకృష్ణ, ఊర్మిళా ఆ ఇంటి వారికందరికీ కావలసిన వాటిని సమకూర్చేవారు.
విష్ణుకు చూపు వచ్చినందుకు వారికి ఆనందమే!.... కానీ ఈశ్వర్ మరణం అందరికీ బాధాకరం అయింది.
దీప్తి హాస్పిటల్ను ప్రారంభించింది. నెల రోజుల్లో గ్రామస్థుల ఆదరాభిమానాలను సంపాదించింది. ఆమె హస్తవాసిని గురించి ప్రక్క గ్రామాలకు తెలిసి.... వ్యాధిగ్రస్తులు అక్కడికి వచ్చేవారు. ఆ వూరు నుండి వెళ్ళి చెన్నై శ్రీరామచంద్రా మెడికల్ కాలేజీలో చదివిన శాంతి... దీప్తిని కలిసి ’అక్కా!..... నేను మీతో కలిసి పనిచేసే దానికి సమ్మతిస్తారా!’ అడిగింది దీప్తి.
దీప్తి సమ్మతించడంతో శాంతి ఆ హాస్పిటల్లోనే పనిచేయడం ప్రారంభించింది.
సీతాపతి ఎంటెక్ చేయడానికి వైజాగ్ బయలుదేర నిశ్చయించుకొన్నాడు. శార్వరి.... తనూ వైజాగ్ వెళతానని ఎంటెక్ చేస్తానని లావణ్యతో చెప్పింది. లావణ్య, హరికృష్ణలు సమ్మతించారు.
వాణికి నెలలు నిండాయి. కాన్పుకు సాయంగా లావణ్య, హరికృష్ణలు ఢిల్లీకి వెళ్ళారు. పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది వాణి. ఆ బిడ్డ నామకరణ మహోత్సవానికి అందరూ ఢిల్లీ వెళ్ళారు. ఆ కార్యక్రమాన్ని కళ్యాణ్ ఎంతో గొప్పగా నిర్వహించాడు. అతను వాణి బాబు పెద్దలందరి ఆశీస్సులను అందుకొన్నాడు. ఆ బాబు పేరు భరత్.
దీప్తికి కూడా నెలలు నిండాయి.
శ్రీ మహాశివరాత్రి నాడు... దీప్తి ప్రసవించింది. మగబిడ్డ.
’దీపూ!.... నేను వెళ్ళిపోయాననుకోకు.... నీలోనే వున్నాను. తొమ్మిదినెలల తర్వాత నీ చేతుల్లో వుంటాను. నా జీవితాంతం నీ బిడ్డగా నీకు తోడుగా నీతోనే వుంటాను.’
తొమ్మిది నెలల క్రిందట ఈశ్వర్ తనకు చెప్పిన మాటలు దీప్తికి గుర్తుకువచ్చాయి. బోసినవ్వులతో తన ప్రక్కనే పడుకొని వున్న బాబుని చూచిన దీప్తి కళ్ళల్లో కన్నీరు... పెదవులపై చిరునవ్వు.
దీప్తి మనోవేదనను ఎరిగిన తల్లి ప్రణవి తన పవిటతో ఆమె కన్నీళ్ళను తుడిచింది. ప్రీతిగా బాబు తలను నిమిరింది దీప్తి.
ఆ దృశ్యాన్ని చూచిన లావణ్య.
"ఏమండీ!... మన ఈశ్వర్ మరలా పుట్టాడండీ!...." ఆనందభాష్పాలతో బిగ్గరగా చెప్పింది. ’అవును’ అన్నట్లు తలడించాడు హరికృష్ణ.
విష్ణు.... శాంతి, సీతాపతి, శార్వరీలు లోనికి వచ్చారు. దీప్తిని బాబును చూచారు. ఆ రెండు జంటలు ప్రక్కప్రక్కన నిలబడ్డ తీరు.... వారి చూపులను చూచిన దీప్తి తృప్తిగా నవ్వుకొంది.
శివరామకృష్ణ, ఊర్మిళ, విష్ణు బాబును చూచి ఆనందంగా నవ్వుకొన్నారు. దీప్తి విష్ణు కళ్ళల్లోకి చూచింది. ’బావా!.... నీవు నీ మాటను నిలబెట్టుకొన్నావు’ అనుకొంది.
====================================================================
సమాప్తం
మంచి దేహధారుడ్యం గల కోటేసు ప్రజాపతికి పిచ్చిపట్టిందనుకొని.... అతన్ని ప్రక్కకు నెట్టి... గది నుండి వేగంగా బయటికి వచ్చాడు. హాల్లో వున్న ప్రణవి.... సీతాపతులను చూచాడు.
"బాబూ!... మీ అయ్యకు పిచ్చిపట్టింది. పిచ్చి హాస్పిటల్లో చేర్చండి" చెప్పి వేగంగా వీధివైపుకు వెళ్ళిపోయాడు కోటేసు.
కొన్నిక్షణాల తర్వాత.... సీతాపతి మెల్లగా, ప్రజాపతి వేగంగా ఒకరినొకరు సమీపించారు. సీతాపతి అతని కళ్ళకు ఈశ్వర్లా కనిపించాడు.
"రేయ్!... ఈశ్వర్!... నీవు ఇంకా బ్రతికే వున్నావా!.... చావలేదా!.... చావలేదా!" ఆవేశంగా తన రెండు చేతులతో సీతాపతి గొంతును పట్టుకొని నులిపి చంపబోయాడు.
సీతాపతి అతని చేతులను తన చేతులతో పట్టుకొని బలంగా లాగి తన మెడను వెనక్కు తీసుకున్నాడు. వేగంగా గది బయటికి వచ్చి తలుపు మూసి గడియ బిగించాడు.
గదిలో జరుగుతున్న సన్నివేశాన్ని ఆశ్చర్యాందోళనల్తో చూస్తూ వున్న తల్లి ప్రణవిని సమీపించిన సీతాపతి....
"అమ్మా!.... ఆయనకు పిచ్చి పట్టింది. పిచ్చి హాప్సిటల్లో చేర్చక తప్పదు"
విచార వదనంతో ప్రణవి సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకొంది. కన్నీరు కార్చింది. సీతాపతి పిచ్చి ఆసుపత్రికి ఫోన్ చేశాడు. అంబులెన్స్ లో ప్రజాపతి పిచ్చివాళ్ళ హాస్పిటల్కు చేర్చబడ్డాడు.
విష్ణుకు.... ఈశ్వర్ నేత్రాలతో చూపు వచ్చింది. అతనికి ఒకవైపు ఆనందం... మరోవైపు ఈశ్వర్ లేనందున ఆవేదన. హరికృష్ణ ఇచ్చిన మూడు లక్షలను శివరామకృష్ణ హాస్పిటల్లో కట్టాడు.
హరికృష్ణ.... ఈశ్వర్ ఖర్మ క్రతువులను కన్నీటితో సక్రమంగా నెరవేర్చాడు. అది దైవ నిర్ణయం... తండ్రికి తనయుడు చేయవలసిన దానికి మారుగా తండ్రి తనయుడికి చేయవలసి వచ్చింది.
దివాకర్ తల్లిదండ్రులను తనతో అమెరికా రమ్మన్నారు. వారు నిరాకరించారు. అతను తన భార్యా బిడ్డలతో అమెరికా వెళ్ళిపోయాడు.
దీప్తి తన కర్తవ్యాన్ని గుర్తించింది. ఎదలో ఎంతో వేదన వున్నా... పైకి నవ్వుతూ అత్తామామలను జాగ్రత్తగా చూచుకోసాగింది.
శార్వరి పరీక్షలు ముగిశాయి. ఇంటికొచ్చేసింది. తన వదిన..... దీప్తికి అన్ని విషయాల్లో సాయంగా వుంటూ తల్లిదండ్రులను ప్రేమాభిమానాలతో చూచుకోసాగింది. వాణి ఆమె భర్త కళ్యాణ్ ఈశ్వర్ అంత్యక్రియలు ముగిశాక ఢిల్లీకి వెళ్ళిపోయారు.
ప్రజాపతి చేసిన పాపాల ఫలితంగా... పిచ్చిఆసుపత్రి పాలయ్యాడు.
వారంరోజుల తర్వాత గూడూరుకు వచ్చిన విష్ణు.... దీప్తికి సీతామాతకు ఆంజనేయ స్వామిలా నమ్మిన బంటులా వర్తించసాగాడు. అతని కళ్ళను చూచినప్పుడు దీప్తికి ఈశ్వర్ గుర్తుకు వచ్చేవాడు. తలను ప్రక్కకు త్రిప్పుకొని కన్నీరు కార్చేది.
ఈశ్వర్ గతించి ఆరువారాలు పూర్తయినాయి. దీప్తి డాక్టర్ కాబట్టి తన శరీర తత్త్వాన్ని గమనించి... తాను నెల తప్పానని లావణ్యకు తెలియజేసింది.
ఆ వార్త విన్న లావణ్యకు ఒక కంట కన్నీరు.... మరో కంట ఆనందభాష్పాలు. ప్రణవి లావణ్య ప్రక్కనే ఉండేది.
శివరామకృష్ణ, ఊర్మిళా ఆ ఇంటి వారికందరికీ కావలసిన వాటిని సమకూర్చేవారు.
విష్ణుకు చూపు వచ్చినందుకు వారికి ఆనందమే!.... కానీ ఈశ్వర్ మరణం అందరికీ బాధాకరం అయింది.
దీప్తి హాస్పిటల్ను ప్రారంభించింది. నెల రోజుల్లో గ్రామస్థుల ఆదరాభిమానాలను సంపాదించింది. ఆమె హస్తవాసిని గురించి ప్రక్క గ్రామాలకు తెలిసి.... వ్యాధిగ్రస్తులు అక్కడికి వచ్చేవారు. ఆ వూరు నుండి వెళ్ళి చెన్నై శ్రీరామచంద్రా మెడికల్ కాలేజీలో చదివిన శాంతి... దీప్తిని కలిసి ’అక్కా!..... నేను మీతో కలిసి పనిచేసే దానికి సమ్మతిస్తారా!’ అడిగింది దీప్తి.
దీప్తి సమ్మతించడంతో శాంతి ఆ హాస్పిటల్లోనే పనిచేయడం ప్రారంభించింది.
సీతాపతి ఎంటెక్ చేయడానికి వైజాగ్ బయలుదేర నిశ్చయించుకొన్నాడు. శార్వరి.... తనూ వైజాగ్ వెళతానని ఎంటెక్ చేస్తానని లావణ్యతో చెప్పింది. లావణ్య, హరికృష్ణలు సమ్మతించారు.
వాణికి నెలలు నిండాయి. కాన్పుకు సాయంగా లావణ్య, హరికృష్ణలు ఢిల్లీకి వెళ్ళారు. పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది వాణి. ఆ బిడ్డ నామకరణ మహోత్సవానికి అందరూ ఢిల్లీ వెళ్ళారు. ఆ కార్యక్రమాన్ని కళ్యాణ్ ఎంతో గొప్పగా నిర్వహించాడు. అతను వాణి బాబు పెద్దలందరి ఆశీస్సులను అందుకొన్నాడు. ఆ బాబు పేరు భరత్.
దీప్తికి కూడా నెలలు నిండాయి.
శ్రీ మహాశివరాత్రి నాడు... దీప్తి ప్రసవించింది. మగబిడ్డ.
’దీపూ!.... నేను వెళ్ళిపోయాననుకోకు.... నీలోనే వున్నాను. తొమ్మిదినెలల తర్వాత నీ చేతుల్లో వుంటాను. నా జీవితాంతం నీ బిడ్డగా నీకు తోడుగా నీతోనే వుంటాను.’
తొమ్మిది నెలల క్రిందట ఈశ్వర్ తనకు చెప్పిన మాటలు దీప్తికి గుర్తుకువచ్చాయి. బోసినవ్వులతో తన ప్రక్కనే పడుకొని వున్న బాబుని చూచిన దీప్తి కళ్ళల్లో కన్నీరు... పెదవులపై చిరునవ్వు.
దీప్తి మనోవేదనను ఎరిగిన తల్లి ప్రణవి తన పవిటతో ఆమె కన్నీళ్ళను తుడిచింది. ప్రీతిగా బాబు తలను నిమిరింది దీప్తి.
ఆ దృశ్యాన్ని చూచిన లావణ్య.
"ఏమండీ!... మన ఈశ్వర్ మరలా పుట్టాడండీ!...." ఆనందభాష్పాలతో బిగ్గరగా చెప్పింది. ’అవును’ అన్నట్లు తలడించాడు హరికృష్ణ.
విష్ణు.... శాంతి, సీతాపతి, శార్వరీలు లోనికి వచ్చారు. దీప్తిని బాబును చూచారు. ఆ రెండు జంటలు ప్రక్కప్రక్కన నిలబడ్డ తీరు.... వారి చూపులను చూచిన దీప్తి తృప్తిగా నవ్వుకొంది.
శివరామకృష్ణ, ఊర్మిళ, విష్ణు బాబును చూచి ఆనందంగా నవ్వుకొన్నారు. దీప్తి విష్ణు కళ్ళల్లోకి చూచింది. ’బావా!.... నీవు నీ మాటను నిలబెట్టుకొన్నావు’ అనుకొంది.
====================================================================
సమాప్తం
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
