01-05-2025, 04:47 PM
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 21
మరుదినం ఉదయం ఆరుగంటలకు ఈశ్వర్ భౌతికకాయం గూడూరులోని అతని ఇంటికి అంబులెన్సులో చేర్చబడింది.
విషయం విన్న ప్రణవి... వీధిన భోరున ఏడుస్తూ హరికృష్ణ ఇంటికి చేరింది. కూతురు దీప్తిని పట్టుకొని వెక్కివెక్కి ఏడ్చింది.
ఈశ్వర్!... దీప్తి ప్రక్కన కూర్చున్నాడు. నవ్వుతున్నాడు.
అతన్ని చూచి దీప్తి ఆశ్చర్యపోయింది.
"దీపూ! నేను వెళ్ళిపోయాననుకోకు. నీలో వున్నాను. తొమ్మిదినెలల తర్వాత నీ చేతుల్లో వుంటాను. నీ జీవితాంతం నీ బిడ్డగా నీకు తోడుగా నీతోనే వుంటాను. నీవు కోరిన రీతిలో హాస్పిటల్ నిర్మాణం జరిగింది. నీవు డాక్టర్గా పదిమందికి సేవచెయ్యి. మంచిపేరు తెచ్చుకో. నీ ఈశ్వర్ నీ ప్రక్కనే వున్నాడనే విషయాన్ని ఏనాడూ మరువకు. జననం మరణం ప్రతిజీవికి తప్పదు కదా!... కానీ వారు పదిమందితో తెచ్చుకొన్న ’పేరు’ అది ఆ తరంలోనే కాక ముందు తరాల వారికీ గుర్తుంటుంది. దానికి మన తాతయ్య. ఏడవకు.... అందరికి ధైర్యం చెప్పు. మన ఇంటివారి బాధ్యత అంతా నీమీదనే వుంది. శార్వరికి, సీతాపతికి వివాహం జరిపించు.’
ప్రక్కన వున్న ఈశ్వర్ రూపు మాయమైంది. నట్టింట శాశ్వత నిద్రలో వున్న ఈశ్వర్ ముఖంలోకి చూచింది దీప్తి. ఈశ్వర్ ముఖంలో చిరునవ్వు కనిపించింది దీప్తికి. కొన్ని క్షణాలు చూచి కళ్ళు మూసుకుంది. ఆ కాటుక కనుల నుండి కన్నీరు జలజలా రాలాయి. శివరామకృష్ణ అమెరికాలో వున్న దినకర్కు, ఢిల్లీలో వున్న వాణికి హైదరాబాద్లో వున్న శార్వరీకి, విశాఖపట్నంలో ఉన్న సీతాపతికి విషయాన్ని తెలియజేశారు. అందరూ ఆవేదనలో మునిగిపోయారు.
ఊరిజనం అంతా హరికృష్ణ ఇంటి ముందు గుమికూడారు. కొందరు... ’ఈ దారుణాన్ని ఆ ప్రజాపతే చేయించి వుంటాడు’ అనుకొన్నారు. కొందరు భయస్తులు అవునన్నట్లు తలాడించారు.
"నేను వస్తున్నాను... జరుగవలసింది నేను వచ్చాకనే" ఫోన్లో శివరామకృష్ణకు చెప్పాడు దివాకర్.
ఐస్ బాక్స్ లో ఈశ్వర్ శవాన్ని భద్రపరిచారు.
హరికృష్ణ, లావణ్యలు తమ గదిలో ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయారు. దీప్తి తన గదిలో దుఃఖసాగరంలో మునిగిపోయింది. వారిని ఊర్మిళ, ప్రణవి, శివరామకృష్ణ తమలో దుఃఖభారాన్ని అణచుకొని ఓదార్చ ప్రయత్నించారు. వారి మధ్యన క్షణం ఒక యుగంగా గడుస్తూ వుంది.
పోయిన వ్యక్తి వృద్ధుడా! అనారోగ్యంతో బాధపడేవాడా! ఇరవై ఏడేళ్ళ యువకుడు. గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు. అందరి మంచినీ కోరేవాడు. తల్లితండ్రి బంధువులంటే ప్రాణ సమానంగా భావించేవాడు. అతన్ని ఎవరైనా ఎలా మరువగలరు? ఎలా నిర్లక్ష్యం చేయగలరు?
రైల్వే స్టేషన్లో పినాకినీ ఎక్స్ ప్రెస్ నుండి సీతాపతి, శార్వరీ వేరు వేరు కంపార్టుమెంట్ల నుంచి ఒకేసారి దిగారు. విషయం తెలియగానే సీతాపతి లారీలో, శార్వరీ బస్సులో విజయవాడ చేరారు. వేరు వేరు కంపార్టుమెంట్లో ఎక్కారు. గూడూరులో దిగారు.
శార్వరిని చూచిన సీతాపతి కన్నీటితో ఆగిపోయాడు. శార్వరి పరుగున వచ్చి అతన్ని చుట్టుకొని భోరున ఏడ్చింది. ఇరువురి మధ్యనా కొన్నిక్షణాలు కన్నీటి క్షణాలుగా సాగిపోయాయి. తెప్పరిల్లుకొన్న సీతాపతి "శారూ!.... ఏడవకు.. నీవు ఏడుస్తూ వుంటే నాకూ నీకన్నా ఎక్కువగా ఏడుపు వస్తూంది. కంట్రోల్... ప్లీజ్ కంట్రోల్. అందరూ విచిత్రంగా మనల్నే చూస్తున్నారు. పద... ఇంటికి వెళదాం" బొంగురుపోయిన కంఠంతో చెప్పాడు సీతాపతి. శార్వరి తన్ను స్టేషన్లో కలుస్తుందని, తన ఎదపై వాలి తన హృదయ వేదనను తనకు పంచుతుందని సీతాపతి ఊహించలేదు.
ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని భుజంపై చేయివేసి మెల్లగా రిక్షాను సమీపించి ఇంటివైపుకు బయలుదేరారు.
మాధవయ్య... ప్రక్క ఊర్లో ఓ పెళ్ళి జరిపించేదానికి వెళ్ళి వున్నందున, విషయం తెలిశాక ఆ కార్యక్రమాన్ని ముగించి భోరున ఏడుస్తూ హరికృష్ణ ఇంట్లో ప్రవేశించాడు.
సీతాపతి, శార్వరీలు నట్టింట నిద్రావస్థలో వున్నట్లున్న ఈశ్వర్ అచేతనా శరీరాన్ని చూచి అతనిపై వాలి భోరున ఏడ్చారు. రెండురోజులు గడిచాయి. ఎంతో భారంగా ఆ ఇంటి సభ్యుల మధ్యన....
వస్తానన్న దివాకర్....
రాలేదు....
అప్పటికీ ఈశ్వర్ శ్వాస ఆగిపోయి డైబ్బై ఆరుగంటలు...
శివరామకృష్ణ మెల్లగా హరికృష్ణను సమీపించాడు.
"హరీ!..." భుజంపై చెయ్యివేసి పిలిచాడు.
భారమైన కనురెప్పలను ఎంతో ప్రయాస పూర్వకంగా పైకి లేపి... శివరామకృష్ణ ముఖంలోకి చూచాడు హరికృష్ణ.
"మూడు రోజులు గడిచిపోయాయిరా!" గద్గద స్వరంతో చెప్పాడు శివరామకృష్ణ.
"అవును" మెల్లగా చెప్పాడు హరికృష్ణ.
"దినకర్ ఎప్పుడూ వస్తాడో!" శివరామకృష్ణ పూర్తి చేయకముందే....
"మనకు తెలియదు"
"ఇక మనం..."
"జాప్యం చేసి ప్రయోజనం లేదు!!!"
అందరూ శోక సముద్రంలో మునిగిపోయి వున్నారు.
"నీ భావన నాకు అర్థం అయింది బావా! పద...." మెల్లగా లేచి నిలబడ్డాడు హరికృష్ణ.
కన్నీటితో తననే చూస్తున్న మాధవయ్యను చూచి...
"బావా! నీ అల్లుడు నీ పట్ల ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించి వుంటే మన్నించి... వాడికి చివరిసారిగా మనం చేయవలసిన మర్యాదలను సక్రమంగా జరిపించు" మాధవయ్య చేతులు పట్టుకొని కన్నీరు కార్చాడు హరికృష్ణ.
గంటలో ఇంట్లో జరుగవలసిన తతంగాలన్నీ ముగిసిపోయాయి. అలసి అణగారిపోయిన కంఠాలన్నీ మరోసారి తారాస్థాయిలో రోదించాయి.
హరికృష్ణ ముందు...
వెనుక నలుగురి వాహకులతో ఈశ్వర్ తనువు... శవం... ఆ వూరి స్మశానం వైపుకు బయలుదేరింది ఒక వూరేగింపులా!... వెనకాల బంధువులు.... హితులు... వూరిజనం... మౌన ముద్రలో ముందుకు సాగారు.
ఆ ఈశ్వర్ అంతిమ యాత్ర సాగిన పదిహేను నిముషాలకు దివాకర్.... అతని భార్య ఇద్దరు పిల్లలూ ఇంటికి కార్లో చేరారు.
అక్కడి స్థితిని చూచి.... దివాకర్ స్మశానం వైపు పరుగు తీశాడు. శాశ్వత నిద్రావస్థలో వున్న తమ్ముని చూచి భోరున ఏడ్చాడు. ఈశ్వర్.... శరీరం... అగ్ని స్నానంతో బూడిదగా మారిపోయింది.
మరుదినం ఉదయం ఆరుగంటలకు ఈశ్వర్ భౌతికకాయం గూడూరులోని అతని ఇంటికి అంబులెన్సులో చేర్చబడింది.
విషయం విన్న ప్రణవి... వీధిన భోరున ఏడుస్తూ హరికృష్ణ ఇంటికి చేరింది. కూతురు దీప్తిని పట్టుకొని వెక్కివెక్కి ఏడ్చింది.
ఈశ్వర్!... దీప్తి ప్రక్కన కూర్చున్నాడు. నవ్వుతున్నాడు.
అతన్ని చూచి దీప్తి ఆశ్చర్యపోయింది.
"దీపూ! నేను వెళ్ళిపోయాననుకోకు. నీలో వున్నాను. తొమ్మిదినెలల తర్వాత నీ చేతుల్లో వుంటాను. నీ జీవితాంతం నీ బిడ్డగా నీకు తోడుగా నీతోనే వుంటాను. నీవు కోరిన రీతిలో హాస్పిటల్ నిర్మాణం జరిగింది. నీవు డాక్టర్గా పదిమందికి సేవచెయ్యి. మంచిపేరు తెచ్చుకో. నీ ఈశ్వర్ నీ ప్రక్కనే వున్నాడనే విషయాన్ని ఏనాడూ మరువకు. జననం మరణం ప్రతిజీవికి తప్పదు కదా!... కానీ వారు పదిమందితో తెచ్చుకొన్న ’పేరు’ అది ఆ తరంలోనే కాక ముందు తరాల వారికీ గుర్తుంటుంది. దానికి మన తాతయ్య. ఏడవకు.... అందరికి ధైర్యం చెప్పు. మన ఇంటివారి బాధ్యత అంతా నీమీదనే వుంది. శార్వరికి, సీతాపతికి వివాహం జరిపించు.’
ప్రక్కన వున్న ఈశ్వర్ రూపు మాయమైంది. నట్టింట శాశ్వత నిద్రలో వున్న ఈశ్వర్ ముఖంలోకి చూచింది దీప్తి. ఈశ్వర్ ముఖంలో చిరునవ్వు కనిపించింది దీప్తికి. కొన్ని క్షణాలు చూచి కళ్ళు మూసుకుంది. ఆ కాటుక కనుల నుండి కన్నీరు జలజలా రాలాయి. శివరామకృష్ణ అమెరికాలో వున్న దినకర్కు, ఢిల్లీలో వున్న వాణికి హైదరాబాద్లో వున్న శార్వరీకి, విశాఖపట్నంలో ఉన్న సీతాపతికి విషయాన్ని తెలియజేశారు. అందరూ ఆవేదనలో మునిగిపోయారు.
ఊరిజనం అంతా హరికృష్ణ ఇంటి ముందు గుమికూడారు. కొందరు... ’ఈ దారుణాన్ని ఆ ప్రజాపతే చేయించి వుంటాడు’ అనుకొన్నారు. కొందరు భయస్తులు అవునన్నట్లు తలాడించారు.
"నేను వస్తున్నాను... జరుగవలసింది నేను వచ్చాకనే" ఫోన్లో శివరామకృష్ణకు చెప్పాడు దివాకర్.
ఐస్ బాక్స్ లో ఈశ్వర్ శవాన్ని భద్రపరిచారు.
హరికృష్ణ, లావణ్యలు తమ గదిలో ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయారు. దీప్తి తన గదిలో దుఃఖసాగరంలో మునిగిపోయింది. వారిని ఊర్మిళ, ప్రణవి, శివరామకృష్ణ తమలో దుఃఖభారాన్ని అణచుకొని ఓదార్చ ప్రయత్నించారు. వారి మధ్యన క్షణం ఒక యుగంగా గడుస్తూ వుంది.
పోయిన వ్యక్తి వృద్ధుడా! అనారోగ్యంతో బాధపడేవాడా! ఇరవై ఏడేళ్ళ యువకుడు. గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు. అందరి మంచినీ కోరేవాడు. తల్లితండ్రి బంధువులంటే ప్రాణ సమానంగా భావించేవాడు. అతన్ని ఎవరైనా ఎలా మరువగలరు? ఎలా నిర్లక్ష్యం చేయగలరు?
రైల్వే స్టేషన్లో పినాకినీ ఎక్స్ ప్రెస్ నుండి సీతాపతి, శార్వరీ వేరు వేరు కంపార్టుమెంట్ల నుంచి ఒకేసారి దిగారు. విషయం తెలియగానే సీతాపతి లారీలో, శార్వరీ బస్సులో విజయవాడ చేరారు. వేరు వేరు కంపార్టుమెంట్లో ఎక్కారు. గూడూరులో దిగారు.
శార్వరిని చూచిన సీతాపతి కన్నీటితో ఆగిపోయాడు. శార్వరి పరుగున వచ్చి అతన్ని చుట్టుకొని భోరున ఏడ్చింది. ఇరువురి మధ్యనా కొన్నిక్షణాలు కన్నీటి క్షణాలుగా సాగిపోయాయి. తెప్పరిల్లుకొన్న సీతాపతి "శారూ!.... ఏడవకు.. నీవు ఏడుస్తూ వుంటే నాకూ నీకన్నా ఎక్కువగా ఏడుపు వస్తూంది. కంట్రోల్... ప్లీజ్ కంట్రోల్. అందరూ విచిత్రంగా మనల్నే చూస్తున్నారు. పద... ఇంటికి వెళదాం" బొంగురుపోయిన కంఠంతో చెప్పాడు సీతాపతి. శార్వరి తన్ను స్టేషన్లో కలుస్తుందని, తన ఎదపై వాలి తన హృదయ వేదనను తనకు పంచుతుందని సీతాపతి ఊహించలేదు.
ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని భుజంపై చేయివేసి మెల్లగా రిక్షాను సమీపించి ఇంటివైపుకు బయలుదేరారు.
మాధవయ్య... ప్రక్క ఊర్లో ఓ పెళ్ళి జరిపించేదానికి వెళ్ళి వున్నందున, విషయం తెలిశాక ఆ కార్యక్రమాన్ని ముగించి భోరున ఏడుస్తూ హరికృష్ణ ఇంట్లో ప్రవేశించాడు.
సీతాపతి, శార్వరీలు నట్టింట నిద్రావస్థలో వున్నట్లున్న ఈశ్వర్ అచేతనా శరీరాన్ని చూచి అతనిపై వాలి భోరున ఏడ్చారు. రెండురోజులు గడిచాయి. ఎంతో భారంగా ఆ ఇంటి సభ్యుల మధ్యన....
వస్తానన్న దివాకర్....
రాలేదు....
అప్పటికీ ఈశ్వర్ శ్వాస ఆగిపోయి డైబ్బై ఆరుగంటలు...
శివరామకృష్ణ మెల్లగా హరికృష్ణను సమీపించాడు.
"హరీ!..." భుజంపై చెయ్యివేసి పిలిచాడు.
భారమైన కనురెప్పలను ఎంతో ప్రయాస పూర్వకంగా పైకి లేపి... శివరామకృష్ణ ముఖంలోకి చూచాడు హరికృష్ణ.
"మూడు రోజులు గడిచిపోయాయిరా!" గద్గద స్వరంతో చెప్పాడు శివరామకృష్ణ.
"అవును" మెల్లగా చెప్పాడు హరికృష్ణ.
"దినకర్ ఎప్పుడూ వస్తాడో!" శివరామకృష్ణ పూర్తి చేయకముందే....
"మనకు తెలియదు"
"ఇక మనం..."
"జాప్యం చేసి ప్రయోజనం లేదు!!!"
అందరూ శోక సముద్రంలో మునిగిపోయి వున్నారు.
"నీ భావన నాకు అర్థం అయింది బావా! పద...." మెల్లగా లేచి నిలబడ్డాడు హరికృష్ణ.
కన్నీటితో తననే చూస్తున్న మాధవయ్యను చూచి...
"బావా! నీ అల్లుడు నీ పట్ల ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించి వుంటే మన్నించి... వాడికి చివరిసారిగా మనం చేయవలసిన మర్యాదలను సక్రమంగా జరిపించు" మాధవయ్య చేతులు పట్టుకొని కన్నీరు కార్చాడు హరికృష్ణ.
గంటలో ఇంట్లో జరుగవలసిన తతంగాలన్నీ ముగిసిపోయాయి. అలసి అణగారిపోయిన కంఠాలన్నీ మరోసారి తారాస్థాయిలో రోదించాయి.
హరికృష్ణ ముందు...
వెనుక నలుగురి వాహకులతో ఈశ్వర్ తనువు... శవం... ఆ వూరి స్మశానం వైపుకు బయలుదేరింది ఒక వూరేగింపులా!... వెనకాల బంధువులు.... హితులు... వూరిజనం... మౌన ముద్రలో ముందుకు సాగారు.
ఆ ఈశ్వర్ అంతిమ యాత్ర సాగిన పదిహేను నిముషాలకు దివాకర్.... అతని భార్య ఇద్దరు పిల్లలూ ఇంటికి కార్లో చేరారు.
అక్కడి స్థితిని చూచి.... దివాకర్ స్మశానం వైపు పరుగు తీశాడు. శాశ్వత నిద్రావస్థలో వున్న తమ్ముని చూచి భోరున ఏడ్చాడు. ఈశ్వర్.... శరీరం... అగ్ని స్నానంతో బూడిదగా మారిపోయింది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
