26-04-2025, 09:54 AM
"అల్లుడుగారూ!! మీకు తెలియదని కాదు!! పుట్టిన బిడ్డలకి అమ్మ భాషలోనే ఆది నుండి అన్నీ నేర్పితేనే, ఈ ఆధునిక సమాజంలో చీకు చింతా లేకుండా బ్రతుకుతారు. సంపాదిస్తూ బ్రతకడం వేరు, సంతోషంగా బ్రతకడం వేరు.. ఇప్పుడు మీరేమో, పిల్లలు భవిష్యత్తులో బాగా సంపాదించాలీ అని, చదువుల కోసం దూరంగా పంపుతారు.., వాళ్లు పెద్ద అయిన తరువాత సంపాదిస్తారు తప్ప సంతోషంగా ఉండరు.,, ఆ తర్వాత, వాళ్ళు కూడా మిమ్మల్ని దూరంగానే పెట్టి, అదే ప్రేమ అనే భ్రమలో తమ సంపాదనతో వెలకట్టి చూస్తారు,, అంతే నాయనా!!.." అని తన అవేదనను వెళ్లగక్కింది రత్నమాల.
"అంటే!! ఇంటి నుండి దూరంగా పెట్టి చదివిస్తే, వాళ్ళు మమ్మల్ని కూడా ఇంటి నుండి గెంటేస్తారు అంటారు అంతేనా!!"
"నేను అలా అనడం లేదు. ఇంటి నుండి దూరంగా పోతే అమ్మ నాన్నల విలువ తెలిసి కష్టపడి చదువుకుంటారు అనే రోజులు కాలంలో కలిసిపోయాయి. ఇప్పుడు ఎటు చూసినా చెడు తప్ప మరేం లేదు, అన్ని రకాల చెడు వ్యాపకాలు అరచేతి దూరంలో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రోజుల్లో పిల్లలకి మనం మంచి భవిష్యత్తు ఇవ్వటం అంటే మంచి వ్యక్తిత్వం ఇవ్వడమే కదా!! కాబట్టి, కనీసం వాడికి కొంచెం వితరణ జ్ఞానం వచ్చేంత వరకూ అయినా పిల్లల్ని ఇంటి దగ్గరే పెంచుదాము అంటున్నాను!!...."
"మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇళ్ళ దగ్గర పెరిగిన పిల్లలు అందరూ పద్దతిగా ఉన్నారా ఏంటి??"
"నేను చెప్పేది పూర్తిగా వినండి!!.." అని కూతురి మొహం చూస్తూ... సౌమ్యం నిండిన గొంతుతో రత్నమాల, "అవును ఒక కుటుంబంలో పిల్లలు పెరగటానికీ, అలాగే ఖరీదైన వసతిగృహాల్లో పెరగటానికి చాలా వ్యత్యాసం ఉంది. అలా పెరిగిన పిల్లలు నాలుగు గోడల మధ్య, మహా అయితే ఓ పది మంది అదే వయసు ఉన్న పిల్లల మధ్య పెరుగుతారు.., వాళ్ళకి సమాజం గురించి ఏం తెలుస్తుందీ,, ఏమీ తెలియదు. ఎందుకంటే, నేను అలాంటి వాళ్ళను కళ్ళారా చూసాను.., అప్పటి వరకు అణిచిపెట్టిన వాళ్ళ మనసులోని కోరికలకు ఒక్కసారిగా స్వేచ్ఛ వస్తే వాళ్ళు ఏం చేస్తారు?? అప్పటి వరకు నాలుగు గోడల మధ్య బందీగా ఉండి, ఒక్కసారిగా సమాజంలోకి వస్తే వాళ్ళు సమాజంలో పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారు..?? ఈ విషయాలేవీ ఈకాలం తల్లిదండ్రులు ఆలోచించరు కేవలం చదువు పూర్తి చేసుకుని ఒక మంచి ఉద్యోగంతో బయటకు రావాలనే ఆలోచిస్తారు" అంది.
అప్పటి వరకు తల దించుకుని తల్లీ, భర్త మధ్య సంభాషణలు వింటున్న జానకి తల పైకి ఎత్తి, 'అవును కదా!!' అన్నట్టు మొహం పెట్టి భర్త వంక ఆశగా చూడసాగింది.. అది గమనించిన రామ్మూర్తి తన మాటల్లో ఉన్న ఆవేశం తగ్గించి, తను కూడా మెల్లగా, "చూడండి అత్తయ్య గారు!! ఇప్పుడు ఉన్న లోకం పోకడలను బట్టి మనం ముందుకు సాగాలి అంతే, వందలో తొంభై మంది పిల్లలు ఇప్పుడు ఇలానే చదివి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు!! " అన్నాడు.
"ఉపాధి కోసం చదువు కాదండీ!!, ఏది మంచో ఏది చెడో తెలుసుకోవటమే చదువు యొక్క ముఖ్య ఉదేశ్యం కావాలి కానీ, తల్లిదండ్రులు ఆశ, ఇంకా కళాశాల యాజమాన్యాల దురాశ వల్ల చదువు అంటే కేవలం ఉపాధి మాత్రమే అనే ముద్ర వేశారు. అందుకే చెరసాలలో ఖైదీలుగా పిల్లల్ని చూస్తూ, వాళ్లలో ఉన్న ఎన్నో ప్రత్యేకతలను తొక్కిపెట్టి, చదువు!!
చదువు!! అని బండకేసి రుద్దుతున్నారు. నా మనవడికి అలాంటి చదువు వద్దు!! అమ్మానాన్నల మధ్య ఆప్యాయంగా పెరగనిద్దాం అంటున్నాను!!....."
అత్తగారి మాటలు రామ్మూర్తిని సంకోచంలో పడేసినా, తను తీసుకున్న నిర్ణయం కూడా ఏమీ తప్పు కాదన్న నమ్మకంతో, "పిల్లలు మన దగ్గర పెరిగితే అన్నీ అవసరానికి దొరికి, వాళ్ళకి కష్టం తెలీదు. ముద్దు చేస్తే మొండితనం పెరుగుతుంది!. మాట వినరు!, చీటికీ మాటకి గొడవలు పడుతూ, పెద్దవారి మీద ఆధారపడిపోతూ ఉంటారు! ఇలా ఎన్నెన్నో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానండీ నేను!!!...." అన్నాడు.
"అయ్యో అల్లుడు గారు!!, పిల్లల మీద తల్లిదండ్రులు చూపించే ప్రేమ ఇంకా ఆప్యాయత అనేవి ఒక పరిమితి తర్వాత, పిల్లలకి బాధ్యత తెలిపేలాగా మార్పు చెందాలి.,, అంటే పిల్లలు ఇంట్లో పెరిగితే, వాళ్ళ చిన్నవయసు నుండీ, నాన్న పడుతున్న కష్టం వెనుక బాధ్యతనీ, అమ్మ పడుతున్న కష్టం వెనుక ప్రేమనీ చూస్తూ పెరుగుతారు..., అప్పుడే వాళ్ళకి తల్లిదండ్రుల మనసు అర్థం అవుతుంది అంటున్నాను!!! ఇది వాస్తవం నాయనా!!!..."
రత్నమాల మాటల్లో నిజం లేకపోలేదు అని రామ్మూర్తి కి మెల్లగా అర్థం అవుతున్నది కానీ, తను తీసుకున్న నిర్ణయం మార్చుకోవటానికి తన అహం అడ్డు వచ్చో లేక, ఆధునిక ప్రపంచ పోకడలకు భ్రమించో "ఈ రోజుల్లో పిల్లలు ఎక్కడ ఇలా చేస్తున్నారండీ??... బడి నుండి రాగానే దూరదర్శని ముందో, లేకపోతే, అమ్మా నాన్నల చరవాణిని లాక్కుని దాని చేతిలో పెట్టుకుని కాలం వృధా చేస్తున్నారు తప్ప ఇంకేం చెయ్యరు!!!..." అని రత్నమాల మాటలకి అడ్డుకట్ట వెయ్యాలని చూశాడు.
" నాయనా!! నేను మీకు చెప్పేంత దానిని కాదేమో!! కానీ, నేను చూసిన మనుషులను ఆధారంగా చేసుకుని చెప్తున్నాను వినండి!!.." అని పక్కనే ఉన్న జానకిని కూడా అదిలించి, "నువ్వు కూడా విను అమ్మాయ్!!" అంటూ, "కొంతమంది తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు వేసుకునే బట్టలు, ప్రముఖ తయారీదారులవా? కాదా? అని చూస్తున్నారు తప్ప, వాళ్ళు సమాజంలో ఎలా మెలుగుతున్నారో అని కూర్చో బెట్టి మాట్లాడే వాళ్ళు తక్కువ.., పెద్దవాళ్ళు ఏది చేస్తే పిల్లలు కూడా అదే చెయ్యాలి అనుకుంటారు అని ఆలోచించటం లేదు!!....."
"అయితే పిల్లలు సరిగ్గా ఎదగాలి అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళతో కూర్చుని పుస్తకాలు పట్టుకోవాలి అంటారా ఏంటండీ??" అని మెల్లగా వెటకారం ధ్వనించగా అన్నాడు రామ్మూర్తి..
"నేను అలా అనడం లేదు అండీ... జీవితంలో తాను ఎన్ని బాధ్యతలు మొయ్యలో అని ఒక అబ్బాయికి ఎప్పుడు తెలుస్తుంది..?? తన నాన్నను చూస్తేనే తెలుస్తోంది!... ఒక కుటుంబంలో నాన్న అనే స్థానం లేకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో వివరంగా చెప్పాలి. ఆ పరిస్థితి రాకుండా ఉండటం కోసం తాను సమాజంలో ఎలా మెలుగుతున్నాడో?? తన కొడుక్కి ఆ తండ్రి తప్పకుండా చెప్పాలి... అప్పుడే ఆ కొడుక్కి తన మీద వున్న బాధ్యత ఏంటో తెలుస్తోంది!!. తండ్రి తన కొడుక్కి అమ్మను నువ్వు ఎలా చూసి గౌరవిస్తున్నావో అలాగే సమాజంలో మిగిలిన స్త్రీలను కూడా అలాగే గౌరవించాలి అని తప్పకుండా కొంత సమయం వెచ్చించి అర్థం అయ్యేలాగా చెప్పాలి. ఒక తండ్రి పిల్లలు తప్పు చేసినప్పుడు,, గొడ్డును బాదినట్టు బాదకుండా, ఆ తప్పు వల్ల వచ్చే పర్యవసానాలు గురించి క్షుణ్ణంగా చెప్పి, ఆ తప్పును మళ్ళీ చెయ్యకూడదు అని చెప్పాలి. ఇలా పిల్లలకి చెప్పే ఓపిక అయితే అమ్మానాన్నలకి ఉంటుంది లేదా
"అంటే!! ఇంటి నుండి దూరంగా పెట్టి చదివిస్తే, వాళ్ళు మమ్మల్ని కూడా ఇంటి నుండి గెంటేస్తారు అంటారు అంతేనా!!"
"నేను అలా అనడం లేదు. ఇంటి నుండి దూరంగా పోతే అమ్మ నాన్నల విలువ తెలిసి కష్టపడి చదువుకుంటారు అనే రోజులు కాలంలో కలిసిపోయాయి. ఇప్పుడు ఎటు చూసినా చెడు తప్ప మరేం లేదు, అన్ని రకాల చెడు వ్యాపకాలు అరచేతి దూరంలో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రోజుల్లో పిల్లలకి మనం మంచి భవిష్యత్తు ఇవ్వటం అంటే మంచి వ్యక్తిత్వం ఇవ్వడమే కదా!! కాబట్టి, కనీసం వాడికి కొంచెం వితరణ జ్ఞానం వచ్చేంత వరకూ అయినా పిల్లల్ని ఇంటి దగ్గరే పెంచుదాము అంటున్నాను!!...."
"మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇళ్ళ దగ్గర పెరిగిన పిల్లలు అందరూ పద్దతిగా ఉన్నారా ఏంటి??"
"నేను చెప్పేది పూర్తిగా వినండి!!.." అని కూతురి మొహం చూస్తూ... సౌమ్యం నిండిన గొంతుతో రత్నమాల, "అవును ఒక కుటుంబంలో పిల్లలు పెరగటానికీ, అలాగే ఖరీదైన వసతిగృహాల్లో పెరగటానికి చాలా వ్యత్యాసం ఉంది. అలా పెరిగిన పిల్లలు నాలుగు గోడల మధ్య, మహా అయితే ఓ పది మంది అదే వయసు ఉన్న పిల్లల మధ్య పెరుగుతారు.., వాళ్ళకి సమాజం గురించి ఏం తెలుస్తుందీ,, ఏమీ తెలియదు. ఎందుకంటే, నేను అలాంటి వాళ్ళను కళ్ళారా చూసాను.., అప్పటి వరకు అణిచిపెట్టిన వాళ్ళ మనసులోని కోరికలకు ఒక్కసారిగా స్వేచ్ఛ వస్తే వాళ్ళు ఏం చేస్తారు?? అప్పటి వరకు నాలుగు గోడల మధ్య బందీగా ఉండి, ఒక్కసారిగా సమాజంలోకి వస్తే వాళ్ళు సమాజంలో పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారు..?? ఈ విషయాలేవీ ఈకాలం తల్లిదండ్రులు ఆలోచించరు కేవలం చదువు పూర్తి చేసుకుని ఒక మంచి ఉద్యోగంతో బయటకు రావాలనే ఆలోచిస్తారు" అంది.
అప్పటి వరకు తల దించుకుని తల్లీ, భర్త మధ్య సంభాషణలు వింటున్న జానకి తల పైకి ఎత్తి, 'అవును కదా!!' అన్నట్టు మొహం పెట్టి భర్త వంక ఆశగా చూడసాగింది.. అది గమనించిన రామ్మూర్తి తన మాటల్లో ఉన్న ఆవేశం తగ్గించి, తను కూడా మెల్లగా, "చూడండి అత్తయ్య గారు!! ఇప్పుడు ఉన్న లోకం పోకడలను బట్టి మనం ముందుకు సాగాలి అంతే, వందలో తొంభై మంది పిల్లలు ఇప్పుడు ఇలానే చదివి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు!! " అన్నాడు.
"ఉపాధి కోసం చదువు కాదండీ!!, ఏది మంచో ఏది చెడో తెలుసుకోవటమే చదువు యొక్క ముఖ్య ఉదేశ్యం కావాలి కానీ, తల్లిదండ్రులు ఆశ, ఇంకా కళాశాల యాజమాన్యాల దురాశ వల్ల చదువు అంటే కేవలం ఉపాధి మాత్రమే అనే ముద్ర వేశారు. అందుకే చెరసాలలో ఖైదీలుగా పిల్లల్ని చూస్తూ, వాళ్లలో ఉన్న ఎన్నో ప్రత్యేకతలను తొక్కిపెట్టి, చదువు!!
చదువు!! అని బండకేసి రుద్దుతున్నారు. నా మనవడికి అలాంటి చదువు వద్దు!! అమ్మానాన్నల మధ్య ఆప్యాయంగా పెరగనిద్దాం అంటున్నాను!!....."
అత్తగారి మాటలు రామ్మూర్తిని సంకోచంలో పడేసినా, తను తీసుకున్న నిర్ణయం కూడా ఏమీ తప్పు కాదన్న నమ్మకంతో, "పిల్లలు మన దగ్గర పెరిగితే అన్నీ అవసరానికి దొరికి, వాళ్ళకి కష్టం తెలీదు. ముద్దు చేస్తే మొండితనం పెరుగుతుంది!. మాట వినరు!, చీటికీ మాటకి గొడవలు పడుతూ, పెద్దవారి మీద ఆధారపడిపోతూ ఉంటారు! ఇలా ఎన్నెన్నో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానండీ నేను!!!...." అన్నాడు.
"అయ్యో అల్లుడు గారు!!, పిల్లల మీద తల్లిదండ్రులు చూపించే ప్రేమ ఇంకా ఆప్యాయత అనేవి ఒక పరిమితి తర్వాత, పిల్లలకి బాధ్యత తెలిపేలాగా మార్పు చెందాలి.,, అంటే పిల్లలు ఇంట్లో పెరిగితే, వాళ్ళ చిన్నవయసు నుండీ, నాన్న పడుతున్న కష్టం వెనుక బాధ్యతనీ, అమ్మ పడుతున్న కష్టం వెనుక ప్రేమనీ చూస్తూ పెరుగుతారు..., అప్పుడే వాళ్ళకి తల్లిదండ్రుల మనసు అర్థం అవుతుంది అంటున్నాను!!! ఇది వాస్తవం నాయనా!!!..."
రత్నమాల మాటల్లో నిజం లేకపోలేదు అని రామ్మూర్తి కి మెల్లగా అర్థం అవుతున్నది కానీ, తను తీసుకున్న నిర్ణయం మార్చుకోవటానికి తన అహం అడ్డు వచ్చో లేక, ఆధునిక ప్రపంచ పోకడలకు భ్రమించో "ఈ రోజుల్లో పిల్లలు ఎక్కడ ఇలా చేస్తున్నారండీ??... బడి నుండి రాగానే దూరదర్శని ముందో, లేకపోతే, అమ్మా నాన్నల చరవాణిని లాక్కుని దాని చేతిలో పెట్టుకుని కాలం వృధా చేస్తున్నారు తప్ప ఇంకేం చెయ్యరు!!!..." అని రత్నమాల మాటలకి అడ్డుకట్ట వెయ్యాలని చూశాడు.
" నాయనా!! నేను మీకు చెప్పేంత దానిని కాదేమో!! కానీ, నేను చూసిన మనుషులను ఆధారంగా చేసుకుని చెప్తున్నాను వినండి!!.." అని పక్కనే ఉన్న జానకిని కూడా అదిలించి, "నువ్వు కూడా విను అమ్మాయ్!!" అంటూ, "కొంతమంది తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు వేసుకునే బట్టలు, ప్రముఖ తయారీదారులవా? కాదా? అని చూస్తున్నారు తప్ప, వాళ్ళు సమాజంలో ఎలా మెలుగుతున్నారో అని కూర్చో బెట్టి మాట్లాడే వాళ్ళు తక్కువ.., పెద్దవాళ్ళు ఏది చేస్తే పిల్లలు కూడా అదే చెయ్యాలి అనుకుంటారు అని ఆలోచించటం లేదు!!....."
"అయితే పిల్లలు సరిగ్గా ఎదగాలి అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళతో కూర్చుని పుస్తకాలు పట్టుకోవాలి అంటారా ఏంటండీ??" అని మెల్లగా వెటకారం ధ్వనించగా అన్నాడు రామ్మూర్తి..
"నేను అలా అనడం లేదు అండీ... జీవితంలో తాను ఎన్ని బాధ్యతలు మొయ్యలో అని ఒక అబ్బాయికి ఎప్పుడు తెలుస్తుంది..?? తన నాన్నను చూస్తేనే తెలుస్తోంది!... ఒక కుటుంబంలో నాన్న అనే స్థానం లేకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో వివరంగా చెప్పాలి. ఆ పరిస్థితి రాకుండా ఉండటం కోసం తాను సమాజంలో ఎలా మెలుగుతున్నాడో?? తన కొడుక్కి ఆ తండ్రి తప్పకుండా చెప్పాలి... అప్పుడే ఆ కొడుక్కి తన మీద వున్న బాధ్యత ఏంటో తెలుస్తోంది!!. తండ్రి తన కొడుక్కి అమ్మను నువ్వు ఎలా చూసి గౌరవిస్తున్నావో అలాగే సమాజంలో మిగిలిన స్త్రీలను కూడా అలాగే గౌరవించాలి అని తప్పకుండా కొంత సమయం వెచ్చించి అర్థం అయ్యేలాగా చెప్పాలి. ఒక తండ్రి పిల్లలు తప్పు చేసినప్పుడు,, గొడ్డును బాదినట్టు బాదకుండా, ఆ తప్పు వల్ల వచ్చే పర్యవసానాలు గురించి క్షుణ్ణంగా చెప్పి, ఆ తప్పును మళ్ళీ చెయ్యకూడదు అని చెప్పాలి. ఇలా పిల్లలకి చెప్పే ఓపిక అయితే అమ్మానాన్నలకి ఉంటుంది లేదా
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
