15-03-2025, 10:04 AM
అప్పుడు పులోమ తండ్రి తన తపోశక్తి తో పులోముడి ముఖాన్ని గాడిద ముఖంగా మార్చాడు. పులోముడు తన ముఖాన్ని చూసుకుని భయపడి పులోమ తండ్రి కాళ్ళపై పడ్డాడు. పులోమ తండ్రి శాంతించి, "నువ్వు కశ్యప ప్రజాపతి కుమారుడు పులోముడివని నా తపోశక్తి తో గ్రహించాను. నీలో సురగుణాలు లేవు. మహర్షుల గుణాలు లేవు. మానవుల గుణాలు లేవు. రాక్షస గుణాలు మెండు గా ఉన్నాయి.
నా కుమార్తె పులోమ మహర్షి వంశాన జన్మించింది. వేద పురాణేతిహాసాల మూలాలను అసాంతం అర్థం చేసుకుంది. ఆశువ్రీహి అనే ధాన్యాన్ని కనిపెట్టింది. తల్లి గర్భంలోని శిశువుకు ధ్యాన శక్తిని, జ్ఞానశక్తిని ఎలా నేర్పించాలో ప్రయోగ పూర్వకంగా నేర్చుకుంది.
స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత, సూర్య సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, రుద్ర సావర్ణి, ధర్మ సావర్ణి, , దేవ సావర్ణి, ఇంద్ర సావర్ణి అనే పదునాలుగు మనువుల మూలాలను తెలుసుకున్నది.
స్వయంప్రభ గురించి పరిశోధన చేసింది. కొంత సుర తేజాన్ని వంట పట్టించుకుంది. అలాంటి నా కుమార్తెను నీకిచ్చి వివాహం చెయ్యను. కశ్యప ప్రజా పతి మీద ఉన్న గౌరవం తో నీ ముఖాన్ని నీకు ప్రసాదిస్తున్నాను " అని పులోమ తండ్రి పులోముని గాడిద ముఖం నుండి విముక్తుడిని చేసాడు.
"బతుకు జీవుడా" అనుకుంటూ పులోముడు అక్కడినుండి వెళ్ళిపోయాడు. కానీ అతని మనసుని పులోమ రూపం వదలలేదు. పులోమునికి పులోమ మీద ఉన్న వ్యామోహం క్షణ క్షణం పెరగసాగింది కానీ తరగలేదు. రాక్షసాంశ ఉన్న తన మిత్రులను కలిసి పులోముడు పులోమ గురించి చెప్పాడు. వారు అవకాశం కోసం ఎదురు చూడు అని అన్నారు.
పులోమకు పులోముని గురించి, అతను చేసిన దౌర్జన్యకర పనుల గురించి అసలు తెలియదు. తన విద్యా సాధనలో తాను మునిగిపోయింది.
పులోమ తండ్రి పులోమను భృగు మహర్షి కి యిచ్చి వివాహం చేయాలనుకున్నాడు. తన మనసు లోని మాటను ముందుగా కుమార్తె పులోమకు చెప్పా డు. అపుడు పులోమ "భృగు మహర్షి భూత దయ కల వాడు. అన్ని ప్రాణుల మేలు కోరేవాడు. సతతం సత్యమునే పలుకుతాడు. ధైర్యవంతుడు. ధర్మాత్ముడు. పర స్త్రీని తల్లిలా గౌరవిస్తాడు. కాబట్టి అతనిని వివాహమాడి తే నా బ్రతుకు ధన్యవుతుంది " అని అనుకుంది.
తర్వాత పులోమ తండ్రి భృగు మహర్షి ని కలిసి తన మనసు
లోని మాటను చెప్పాడు. భృగు మహర్షి కూడా పులోమ లాగే ఆలోచించాడు. అలా ఇరువురు ఇష్టపడ్డారు. అంగ రంగ వైభవంగా పులోమ భృగు మహర్షి వివాహం జరిగింది. భృగు మహర్షి అప్పటికే తనకు కావ్యమాతతో వివాహం అయిన విషయం శుక్రాచార్యుడు పుట్టిన విషయం భార్య పులోమకు చెప్పాడు.
పులోమ భృగు మహర్షుల వైవాహిక జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా అన్యోన్యంగా సాగిపోయింది. వారి దాంపత్య జీవితాన్ని చూచి ప్రకృతి మాత పరవసించి పోయింది. వారి ఆదర్శమయ సంసారాన్ని చూచి అక్కడి ముని దంపతులందరూ వారిని అనుసరించారు. పులోమ ప్రతిరోజూ తన పతి దేవుడు భృగు మహర్షి చెప్పే పురాణ గాథలను విని తన జ్ఞానాన్ని, తన ఆధ్యాత్మిక శక్తిని పెంచుకునేది.
ఒకనాడు భృగు మహర్షి తన భార్య పులోమ కు అతలలోకంలో ఉన్న 96 మాయల గురించి చెప్పా డు. అలాగే వితల లోకంలో ఉన్న హాటకీ నది గురించి, అందులో తయారయ్యే బంగారం గురించి, ఆ నదిలో విహరించే భవానీ హాటకేశ్వరుల గురించి చెప్పాడు.
పార్వతీ పరమేశ్వరులు భవానీ హాటకేశ్వరుల గా మారిన వైనమంత భర్త భృగు మహర్షి చెప్పగా పులోమ విని బ్రహ్మానంద భరితురాలయ్యింది. ఆపై సుతల లోకం లో ఉన్న బలి చక్రవర్తి వైభవం గురించి, తలాతలం లోని మయుని గురించి, తలాతలాన్ని రక్షించే రుద్రుని గురించి, మహాతలంలోని కద్రువ సంతానం గురించి, రసాతలం లోని దైత్యుల గురించి, పాతళంలోని ఆది శేషుని గురించి భర్త ద్వారా తెలుసుకుంది. ఇలా పులోమ, భర్త భృగు మహర్షి అడుగుజాడలలో నడుస్తూ కాలం గడప సాగింది. కొంత కాలానికి పులోమ గర్భవతి అయ్యింది.
పులోమ ప్రతిరోజూ తన తపో శక్తిని, తన తేజో శక్తిని గర్భం లో ఉన్న శిశువుకు ధారపోయ సాగింది. ఆమె గర్భంలోని శిశువు మహా తేజోవంతంగా పెరగసాగాడు. తన గర్భంలోని శిశు సంరక్షణ విషయంలో పులోమ తగిన వైద్య జాగ్రత్తలు అన్నీ తీసుకునేది.
పులోమకు భృగు మహర్షి తో వివాహం అయ్యింది అని పులోమునికి తెలిసింది. పులోమ మీద ఉన్న కామం అతనిలోని రాక్షస ప్రవృత్తిని ద్విగుణీ కృతం, త్రిగుణీకృతం చేసింది. ఇంద్రుడు అహల్యను వంచించినట్లు పులోమను పులోముడు వంచించాలనుకున్నాడు.
ఒకనాడు నిత్యకర్మానుష్టానానికి భృగు మహర్షి నదీ స్నానానికి వెళుతూ, పులోమకు తోడుండమని అగ్ని దేవునికి చెప్పి నదీ స్నానానికి వెళ్ళాడు. అది గమనించిన పులోముడు పులోమను చెరపట్టడానికి వచ్చాడు.
పులోమునికి అగ్ని దేవుడు అడ్డు పడ్డాడు. భగ భగమండే అగ్నిని చూచిన పులోముడు, "అగ్ని దేవ! నేను చేసే పని తప్పుకాదు. ఈ పులోమను ముందుగా నేనే యిష్టపడ్డాను. కానీ ఈమె తండ్రి నన్ను కాదని పులోమను భృగు మహర్షి కి యిచ్చి వివాహం చేసాడు. మనసులో ఉన్న మగువను చెరబట్టడంలో తప్పేముంది?" అని అన్నాడు.
అందుకు అగ్ని దేవుడు "పులోముడ! నీ ఆలోచనలు ఈ యుగానికి చెందినవి కావు. ఇవి కలియుగం లో చివరి పాదానికి చెందినవి. భృగు మహర్షి పులోమ ను వేద మంత్రాల మాటు అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్నాడు. కావున ఆమెను రక్షించాల్సిన బాధ్యత నా మీద ఉంది. పులోమ భృగు మహర్షి కి ధర్మ బద్ధమైన ధర్మపత్ని. పైగా పూర్ణ గర్భవతి. మహా తేజోవంతమైన శిశువును తన కడుపులో మోస్తుంది. ఈమెను కామ దృష్టితో చూడటం మహా పాపం. బలగర్వంతో అధర్మానికి పాల్పడితే అంతమైపోతావు. కావున నీ ఆలోచనలు మార్చుకో" అన్నా డు.
నా కుమార్తె పులోమ మహర్షి వంశాన జన్మించింది. వేద పురాణేతిహాసాల మూలాలను అసాంతం అర్థం చేసుకుంది. ఆశువ్రీహి అనే ధాన్యాన్ని కనిపెట్టింది. తల్లి గర్భంలోని శిశువుకు ధ్యాన శక్తిని, జ్ఞానశక్తిని ఎలా నేర్పించాలో ప్రయోగ పూర్వకంగా నేర్చుకుంది.
స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత, సూర్య సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, రుద్ర సావర్ణి, ధర్మ సావర్ణి, , దేవ సావర్ణి, ఇంద్ర సావర్ణి అనే పదునాలుగు మనువుల మూలాలను తెలుసుకున్నది.
స్వయంప్రభ గురించి పరిశోధన చేసింది. కొంత సుర తేజాన్ని వంట పట్టించుకుంది. అలాంటి నా కుమార్తెను నీకిచ్చి వివాహం చెయ్యను. కశ్యప ప్రజా పతి మీద ఉన్న గౌరవం తో నీ ముఖాన్ని నీకు ప్రసాదిస్తున్నాను " అని పులోమ తండ్రి పులోముని గాడిద ముఖం నుండి విముక్తుడిని చేసాడు.
"బతుకు జీవుడా" అనుకుంటూ పులోముడు అక్కడినుండి వెళ్ళిపోయాడు. కానీ అతని మనసుని పులోమ రూపం వదలలేదు. పులోమునికి పులోమ మీద ఉన్న వ్యామోహం క్షణ క్షణం పెరగసాగింది కానీ తరగలేదు. రాక్షసాంశ ఉన్న తన మిత్రులను కలిసి పులోముడు పులోమ గురించి చెప్పాడు. వారు అవకాశం కోసం ఎదురు చూడు అని అన్నారు.
పులోమకు పులోముని గురించి, అతను చేసిన దౌర్జన్యకర పనుల గురించి అసలు తెలియదు. తన విద్యా సాధనలో తాను మునిగిపోయింది.
పులోమ తండ్రి పులోమను భృగు మహర్షి కి యిచ్చి వివాహం చేయాలనుకున్నాడు. తన మనసు లోని మాటను ముందుగా కుమార్తె పులోమకు చెప్పా డు. అపుడు పులోమ "భృగు మహర్షి భూత దయ కల వాడు. అన్ని ప్రాణుల మేలు కోరేవాడు. సతతం సత్యమునే పలుకుతాడు. ధైర్యవంతుడు. ధర్మాత్ముడు. పర స్త్రీని తల్లిలా గౌరవిస్తాడు. కాబట్టి అతనిని వివాహమాడి తే నా బ్రతుకు ధన్యవుతుంది " అని అనుకుంది.
తర్వాత పులోమ తండ్రి భృగు మహర్షి ని కలిసి తన మనసు
లోని మాటను చెప్పాడు. భృగు మహర్షి కూడా పులోమ లాగే ఆలోచించాడు. అలా ఇరువురు ఇష్టపడ్డారు. అంగ రంగ వైభవంగా పులోమ భృగు మహర్షి వివాహం జరిగింది. భృగు మహర్షి అప్పటికే తనకు కావ్యమాతతో వివాహం అయిన విషయం శుక్రాచార్యుడు పుట్టిన విషయం భార్య పులోమకు చెప్పాడు.
పులోమ భృగు మహర్షుల వైవాహిక జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా అన్యోన్యంగా సాగిపోయింది. వారి దాంపత్య జీవితాన్ని చూచి ప్రకృతి మాత పరవసించి పోయింది. వారి ఆదర్శమయ సంసారాన్ని చూచి అక్కడి ముని దంపతులందరూ వారిని అనుసరించారు. పులోమ ప్రతిరోజూ తన పతి దేవుడు భృగు మహర్షి చెప్పే పురాణ గాథలను విని తన జ్ఞానాన్ని, తన ఆధ్యాత్మిక శక్తిని పెంచుకునేది.
ఒకనాడు భృగు మహర్షి తన భార్య పులోమ కు అతలలోకంలో ఉన్న 96 మాయల గురించి చెప్పా డు. అలాగే వితల లోకంలో ఉన్న హాటకీ నది గురించి, అందులో తయారయ్యే బంగారం గురించి, ఆ నదిలో విహరించే భవానీ హాటకేశ్వరుల గురించి చెప్పాడు.
పార్వతీ పరమేశ్వరులు భవానీ హాటకేశ్వరుల గా మారిన వైనమంత భర్త భృగు మహర్షి చెప్పగా పులోమ విని బ్రహ్మానంద భరితురాలయ్యింది. ఆపై సుతల లోకం లో ఉన్న బలి చక్రవర్తి వైభవం గురించి, తలాతలం లోని మయుని గురించి, తలాతలాన్ని రక్షించే రుద్రుని గురించి, మహాతలంలోని కద్రువ సంతానం గురించి, రసాతలం లోని దైత్యుల గురించి, పాతళంలోని ఆది శేషుని గురించి భర్త ద్వారా తెలుసుకుంది. ఇలా పులోమ, భర్త భృగు మహర్షి అడుగుజాడలలో నడుస్తూ కాలం గడప సాగింది. కొంత కాలానికి పులోమ గర్భవతి అయ్యింది.
పులోమ ప్రతిరోజూ తన తపో శక్తిని, తన తేజో శక్తిని గర్భం లో ఉన్న శిశువుకు ధారపోయ సాగింది. ఆమె గర్భంలోని శిశువు మహా తేజోవంతంగా పెరగసాగాడు. తన గర్భంలోని శిశు సంరక్షణ విషయంలో పులోమ తగిన వైద్య జాగ్రత్తలు అన్నీ తీసుకునేది.
పులోమకు భృగు మహర్షి తో వివాహం అయ్యింది అని పులోమునికి తెలిసింది. పులోమ మీద ఉన్న కామం అతనిలోని రాక్షస ప్రవృత్తిని ద్విగుణీ కృతం, త్రిగుణీకృతం చేసింది. ఇంద్రుడు అహల్యను వంచించినట్లు పులోమను పులోముడు వంచించాలనుకున్నాడు.
ఒకనాడు నిత్యకర్మానుష్టానానికి భృగు మహర్షి నదీ స్నానానికి వెళుతూ, పులోమకు తోడుండమని అగ్ని దేవునికి చెప్పి నదీ స్నానానికి వెళ్ళాడు. అది గమనించిన పులోముడు పులోమను చెరపట్టడానికి వచ్చాడు.
పులోమునికి అగ్ని దేవుడు అడ్డు పడ్డాడు. భగ భగమండే అగ్నిని చూచిన పులోముడు, "అగ్ని దేవ! నేను చేసే పని తప్పుకాదు. ఈ పులోమను ముందుగా నేనే యిష్టపడ్డాను. కానీ ఈమె తండ్రి నన్ను కాదని పులోమను భృగు మహర్షి కి యిచ్చి వివాహం చేసాడు. మనసులో ఉన్న మగువను చెరబట్టడంలో తప్పేముంది?" అని అన్నాడు.
అందుకు అగ్ని దేవుడు "పులోముడ! నీ ఆలోచనలు ఈ యుగానికి చెందినవి కావు. ఇవి కలియుగం లో చివరి పాదానికి చెందినవి. భృగు మహర్షి పులోమ ను వేద మంత్రాల మాటు అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్నాడు. కావున ఆమెను రక్షించాల్సిన బాధ్యత నా మీద ఉంది. పులోమ భృగు మహర్షి కి ధర్మ బద్ధమైన ధర్మపత్ని. పైగా పూర్ణ గర్భవతి. మహా తేజోవంతమైన శిశువును తన కడుపులో మోస్తుంది. ఈమెను కామ దృష్టితో చూడటం మహా పాపం. బలగర్వంతో అధర్మానికి పాల్పడితే అంతమైపోతావు. కావున నీ ఆలోచనలు మార్చుకో" అన్నా డు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
