07-03-2025, 08:51 AM
అయితే తపోశక్తి తో కూడిన ప్రమధ్వర శరీరం పాము విషం వేగాన్ని నిరోధిస్తుంది. నేల మీద పడి ఉన్న ప్రమధ్వర ను చూసిన ఆమె స్నేహితురాళ్ళు కంగారు గా స్థూలకేశ మహర్షి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు.
స్థూలకేశ మహర్షి కుశికుడు, గౌతముడు, భరద్వాజుడు, ఉద్దాలకుడు, శ్వేతుడు వంటి మరి కొందరు మహర్షుల తో ప్రమధ్వర పడి ఉన్న చోటకు వచ్చా డు.. మునులు, మహర్షులు అందరూ ప్రమధ్వరను చూసారు. అప్పటికే ప్రమధ్వర శరీరంలో ఉన్న ప్రాణం ఆమెను వదిలిపోయింది.
ప్రమధ్వర మృత దేహము చూచిన కొందరు మునులు, "ప్రమధ్వర మరణించినా ఆమె శరీరం లో తేజస్సు ఇంకా తగ్గలేదు. " అని అనుకున్నారు.
జ్యోతిష శాస్త్రం మీద కొంచెం పట్టు ఉన్న మునులు, "ప్రమ ధ్వర పుట్టిన సమయాన్ని, గ్రహాలనీ, నక్షత్రాదులను ఒకటికి పది సార్లు పరీక్షించి, "ప్రమధ్వర ఇప్పుడే చనిపోవడానికి అవకాశం లేదే?!" అని అనుకోసాగారు.
వారు మరికొందరు మహర్షులతో కలిసి ప్రమధ్వరను బతికించే ఉపాయం కోసం ఆలోచించసాగారు. చివరకు "ఇక లాభం లేదు. ఏదో చిత్రం జరిగితేగానీ ప్రమధ్వర బతకదు" అని అనుకున్నారు.
ఈ విషయం తెలిసిన రురుడు ప్రమధ్వర మృత దేహం వద్దకు వడివడిగా వచ్చాడు. నిశ్చితార్థం జరిగింది కాబట్టి ప్రమధ్వర తన భార్యే అని రురుడు అనుకున్నాడు.
రురుడు మృతిచెంది ఉన్న ప్రమధ్వరను చూచి గుండె బద్దలయ్యేలా ఏడ్చాడు. అతని కన్నులు ఎర్రబడ్డాయి. ప్రమధ్వర ప్రాణాన్ని హరించినవారి అంతు చూడాలి అని ప్రాణ స్నేహితులతో అన్నాడు. అప్పుడు రురునితో వచ్చిన దేవదూత అనే రురుని ప్రాణమిత్రుడు " మిత్రమా! పవిత్ర సశాస్త్రీయంగా వేదాధ్యయనం చేసావు.. దేవ యజ్ఞములు, వ్రతములు, పుణ్యకార్యాలు చేసావు. ఘోరమైన తపస్సు చేసావు. దేవతలు వరం కోరుకోమన్నా కోరు కోకుండా నా తపస్సంతా సాత్వికత ను, మంచిని, అమలిన ప్రేమను పెంపొందించడానికే అన్నావు.
యమదేవేంద్రాది లోకాలకు వెళ్ళే శక్తిని పొందావు. విష తత్వ శాస్త్రమును చదివావు. ప్రాణ విభజన వైద్యం తెలిసిన వాడివి. నువ్వు దుఃఖించనేలా?. ప్రమధ్వర ను బతికేంచే ఉపాయం ఆలోచించు". అని అన్నాడు.
ప్రాణ మిత్రుడు దేవదూత చెప్పిన మాటలను విన్న రురుడు ప్రమధ్వర దేహాన్ని పరిశీలించాడు. ఆమె దేహంలో ఉన్న విషాన్ని తీసివేసాడు. అయినా ప్రమధ్వర బతకలేదు. అప్పటికే ప్రమధ్వర ప్రాణం పోయిందని రురుడు గ్రహించాడు. అంత తన తపోశక్తి ప్రభావం తో యమలోకంలో ఉన్న యముని దగ్గరకు వెళ్ళాడు.
యమునితో, " సూర్య పుత్ర! యమలోకాధిపతి! దక్షిణ దిశాధినేత! సమవర్తి! యమధర్మ రాజ! మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా ప్రమధ్వర నేనూ ప్రేమించు కున్నాము. పెళ్ళి చేసుకోవాలనుకున్నాము. మా యిద్దరి కి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది.
కానీ నేడు ప్రమధ్వర పాము కాటుకు బలైంది. ప్రమధ్వర లేనిదే నేనూ జీవించలేను. నా ప్రాణం నా ప్రేమ ప్రాణం రెండింటినీ ఇక్కడే ఇప్పుడే తీసేసుకోండి. " అన్నాడు.
రురుని మాటలను విన్న యమధర్మరాజు, " రురు.. పరమేష్టి శాసనం అనుసరించి ప్రమధ్వర ఆయువు తీరి పోయింది. అందుకే ఆమె మరణించింది.
వేద పురాణేతిహాసాలను క్షుణ్ణంగా చదివిన నీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. యిలలో యమ ధర్మాన్ని మించిన ధర్మం మరో ధర్మం లేదు. విధాత రాత ను అనుసరించి నా ధర్మం నేను నిర్వర్తిస్తాను. మహిలో మనుషుల నడుమ కలిగే సంబంధ బాంధవ్యాలు అక్క డి వరకే పరిమితం. ఇక్కడ అందరూ ఒక్కటే. " అని యమధర్మరాజు ప్రమధ్వర దేహాన్ని చూసాడు.
ఆపై "రురు.. చూడ చూడ ప్రమధ్వర తనువుకు మరికొంత ప్రాణశక్తి ని భరించగల శక్తి ఉందనిపిస్తుంది.. అది ఆమె తపో ఫలం వలన ఆమెకు లభించిన శక్తి. ప్రియురాలిని బతికించుకోవాలని నువ్వు నా దగ్గరకు రావడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నీ ప్రేయసి ప్రమధ్వర బ్రతకాలంటే నీ ఆయుష్షు లో సగం ఆమె కు ధారపోయాలి. ప్రాణ విభజన విద్యను తెలిసిన వాడివి కదా? నువ్వు ఆ పని చేయగలవా?" అని రురుని యమధర్మరాజు అడిగాడు.
రురుడు యమధర్మరాజు కు ప్రత్యుత్తరం ఇవ్వకుండా ప్రమధ్వర దగ్గరకు వచ్చాడు. ప్రమధ్వర మృత దేహానికి కొంచెం ముందుగా పద్మాసనం వేసుకుని తన వైద్య విధానం అనుసరించి తనకు మిగిలి ఉన్న ఆయువులో సగభాగం ప్రాణాన్ని ప్రమధ్వరకు సమర్పించాడు. అప్పటివరకు అ చేతనంగా పడి ఉన్న ప్రమధ్వర నిద్రలో నుండి లేచినట్లు లేచింది.. అంత రురుడు దక్షిణ దిక్కుకు నిలబడి రెండు చేతులు జోడించి యమ ధర్మరాజు కు నమస్కరించాడు.
యమ ధర్మరాజు రురుని ఆశీర్వదిస్తూ, " ఇదంత బ్రహ్మ సంకల్పమే. మీ తలరాత రూపమే. " అని అన్నాడు.
రురుని ప్రేమయే ప్రమధ్వర ని బతికించిందని అందరూ అనుకున్నారు. ఏదేమైనా ప్రమధ్వర మరల ప్రాణం పోసుకున్నందుకు అందరూ మిక్కిలి సంతోషించారు.
రురుడు తన ప్రాణ విభజన వైద్యం విజయవంత మైనందుకు మిక్కిలి సంతోషించాడు. ఆ సంతోషంతో ప్రమధ్వర దగ్గరకు వచ్చాడు. ప్రమధ్వరను చూస్తూ మనసులో "నువ్వే నా ప్రాణం నేనే నీ ధ్యానం" అని అనుకున్నాడు ఆ తర్వాత అనుకున్న శుభముహూర్తా న ప్రమధ్వర రురుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
ఒక మనిషికి మిగిలి ఉన్న ఆయువును రెండు సమ భాగాలుగా చేసి, అందులో ఒక భాగాన్ని అప్పుడే చనిపోయిన మరో మనిషికి యిచ్చి, ఆ చనిపోయిన మనిషిని బతికించే అవకాశం యింకా ఆధునిక విజ్ఞాన శాస్త్రాలలోకి ప్రవేశించలేదు. అయితే ఆ విజ్ఞాన సంపద మన వేద కాలం నందే ఉంది. అందుకు ఒక ఉదాహరణ.. ప్రమధ్వర. ఇది మాయ కాదు. మంత్రం కాదు. మానవ శరీర శాస్త్ర విజ్ఞానము. అయితే ఇది నేడు ప్రయోగ శాలలో ఋజువు కావలసిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రమధ్వర కథ మగవారి ప్రాణాన్ని ఆడవారికి, ఆడవారి ప్రాణాన్ని మగవారికి పోయవచ్చును అని చెబుతుంది. ప్రయోగ శాలలో ఇక్కడ అనేక దివ్య ఔషద వాడకాల ప్రస్తావన చేయవలసి వస్తుంది.
సర్వే జనాః సుఖినోభవంతు
స్థూలకేశ మహర్షి కుశికుడు, గౌతముడు, భరద్వాజుడు, ఉద్దాలకుడు, శ్వేతుడు వంటి మరి కొందరు మహర్షుల తో ప్రమధ్వర పడి ఉన్న చోటకు వచ్చా డు.. మునులు, మహర్షులు అందరూ ప్రమధ్వరను చూసారు. అప్పటికే ప్రమధ్వర శరీరంలో ఉన్న ప్రాణం ఆమెను వదిలిపోయింది.
ప్రమధ్వర మృత దేహము చూచిన కొందరు మునులు, "ప్రమధ్వర మరణించినా ఆమె శరీరం లో తేజస్సు ఇంకా తగ్గలేదు. " అని అనుకున్నారు.
జ్యోతిష శాస్త్రం మీద కొంచెం పట్టు ఉన్న మునులు, "ప్రమ ధ్వర పుట్టిన సమయాన్ని, గ్రహాలనీ, నక్షత్రాదులను ఒకటికి పది సార్లు పరీక్షించి, "ప్రమధ్వర ఇప్పుడే చనిపోవడానికి అవకాశం లేదే?!" అని అనుకోసాగారు.
వారు మరికొందరు మహర్షులతో కలిసి ప్రమధ్వరను బతికించే ఉపాయం కోసం ఆలోచించసాగారు. చివరకు "ఇక లాభం లేదు. ఏదో చిత్రం జరిగితేగానీ ప్రమధ్వర బతకదు" అని అనుకున్నారు.
ఈ విషయం తెలిసిన రురుడు ప్రమధ్వర మృత దేహం వద్దకు వడివడిగా వచ్చాడు. నిశ్చితార్థం జరిగింది కాబట్టి ప్రమధ్వర తన భార్యే అని రురుడు అనుకున్నాడు.
రురుడు మృతిచెంది ఉన్న ప్రమధ్వరను చూచి గుండె బద్దలయ్యేలా ఏడ్చాడు. అతని కన్నులు ఎర్రబడ్డాయి. ప్రమధ్వర ప్రాణాన్ని హరించినవారి అంతు చూడాలి అని ప్రాణ స్నేహితులతో అన్నాడు. అప్పుడు రురునితో వచ్చిన దేవదూత అనే రురుని ప్రాణమిత్రుడు " మిత్రమా! పవిత్ర సశాస్త్రీయంగా వేదాధ్యయనం చేసావు.. దేవ యజ్ఞములు, వ్రతములు, పుణ్యకార్యాలు చేసావు. ఘోరమైన తపస్సు చేసావు. దేవతలు వరం కోరుకోమన్నా కోరు కోకుండా నా తపస్సంతా సాత్వికత ను, మంచిని, అమలిన ప్రేమను పెంపొందించడానికే అన్నావు.
యమదేవేంద్రాది లోకాలకు వెళ్ళే శక్తిని పొందావు. విష తత్వ శాస్త్రమును చదివావు. ప్రాణ విభజన వైద్యం తెలిసిన వాడివి. నువ్వు దుఃఖించనేలా?. ప్రమధ్వర ను బతికేంచే ఉపాయం ఆలోచించు". అని అన్నాడు.
ప్రాణ మిత్రుడు దేవదూత చెప్పిన మాటలను విన్న రురుడు ప్రమధ్వర దేహాన్ని పరిశీలించాడు. ఆమె దేహంలో ఉన్న విషాన్ని తీసివేసాడు. అయినా ప్రమధ్వర బతకలేదు. అప్పటికే ప్రమధ్వర ప్రాణం పోయిందని రురుడు గ్రహించాడు. అంత తన తపోశక్తి ప్రభావం తో యమలోకంలో ఉన్న యముని దగ్గరకు వెళ్ళాడు.
యమునితో, " సూర్య పుత్ర! యమలోకాధిపతి! దక్షిణ దిశాధినేత! సమవర్తి! యమధర్మ రాజ! మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా ప్రమధ్వర నేనూ ప్రేమించు కున్నాము. పెళ్ళి చేసుకోవాలనుకున్నాము. మా యిద్దరి కి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది.
కానీ నేడు ప్రమధ్వర పాము కాటుకు బలైంది. ప్రమధ్వర లేనిదే నేనూ జీవించలేను. నా ప్రాణం నా ప్రేమ ప్రాణం రెండింటినీ ఇక్కడే ఇప్పుడే తీసేసుకోండి. " అన్నాడు.
రురుని మాటలను విన్న యమధర్మరాజు, " రురు.. పరమేష్టి శాసనం అనుసరించి ప్రమధ్వర ఆయువు తీరి పోయింది. అందుకే ఆమె మరణించింది.
వేద పురాణేతిహాసాలను క్షుణ్ణంగా చదివిన నీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. యిలలో యమ ధర్మాన్ని మించిన ధర్మం మరో ధర్మం లేదు. విధాత రాత ను అనుసరించి నా ధర్మం నేను నిర్వర్తిస్తాను. మహిలో మనుషుల నడుమ కలిగే సంబంధ బాంధవ్యాలు అక్క డి వరకే పరిమితం. ఇక్కడ అందరూ ఒక్కటే. " అని యమధర్మరాజు ప్రమధ్వర దేహాన్ని చూసాడు.
ఆపై "రురు.. చూడ చూడ ప్రమధ్వర తనువుకు మరికొంత ప్రాణశక్తి ని భరించగల శక్తి ఉందనిపిస్తుంది.. అది ఆమె తపో ఫలం వలన ఆమెకు లభించిన శక్తి. ప్రియురాలిని బతికించుకోవాలని నువ్వు నా దగ్గరకు రావడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నీ ప్రేయసి ప్రమధ్వర బ్రతకాలంటే నీ ఆయుష్షు లో సగం ఆమె కు ధారపోయాలి. ప్రాణ విభజన విద్యను తెలిసిన వాడివి కదా? నువ్వు ఆ పని చేయగలవా?" అని రురుని యమధర్మరాజు అడిగాడు.
రురుడు యమధర్మరాజు కు ప్రత్యుత్తరం ఇవ్వకుండా ప్రమధ్వర దగ్గరకు వచ్చాడు. ప్రమధ్వర మృత దేహానికి కొంచెం ముందుగా పద్మాసనం వేసుకుని తన వైద్య విధానం అనుసరించి తనకు మిగిలి ఉన్న ఆయువులో సగభాగం ప్రాణాన్ని ప్రమధ్వరకు సమర్పించాడు. అప్పటివరకు అ చేతనంగా పడి ఉన్న ప్రమధ్వర నిద్రలో నుండి లేచినట్లు లేచింది.. అంత రురుడు దక్షిణ దిక్కుకు నిలబడి రెండు చేతులు జోడించి యమ ధర్మరాజు కు నమస్కరించాడు.
యమ ధర్మరాజు రురుని ఆశీర్వదిస్తూ, " ఇదంత బ్రహ్మ సంకల్పమే. మీ తలరాత రూపమే. " అని అన్నాడు.
రురుని ప్రేమయే ప్రమధ్వర ని బతికించిందని అందరూ అనుకున్నారు. ఏదేమైనా ప్రమధ్వర మరల ప్రాణం పోసుకున్నందుకు అందరూ మిక్కిలి సంతోషించారు.
రురుడు తన ప్రాణ విభజన వైద్యం విజయవంత మైనందుకు మిక్కిలి సంతోషించాడు. ఆ సంతోషంతో ప్రమధ్వర దగ్గరకు వచ్చాడు. ప్రమధ్వరను చూస్తూ మనసులో "నువ్వే నా ప్రాణం నేనే నీ ధ్యానం" అని అనుకున్నాడు ఆ తర్వాత అనుకున్న శుభముహూర్తా న ప్రమధ్వర రురుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
ఒక మనిషికి మిగిలి ఉన్న ఆయువును రెండు సమ భాగాలుగా చేసి, అందులో ఒక భాగాన్ని అప్పుడే చనిపోయిన మరో మనిషికి యిచ్చి, ఆ చనిపోయిన మనిషిని బతికించే అవకాశం యింకా ఆధునిక విజ్ఞాన శాస్త్రాలలోకి ప్రవేశించలేదు. అయితే ఆ విజ్ఞాన సంపద మన వేద కాలం నందే ఉంది. అందుకు ఒక ఉదాహరణ.. ప్రమధ్వర. ఇది మాయ కాదు. మంత్రం కాదు. మానవ శరీర శాస్త్ర విజ్ఞానము. అయితే ఇది నేడు ప్రయోగ శాలలో ఋజువు కావలసిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రమధ్వర కథ మగవారి ప్రాణాన్ని ఆడవారికి, ఆడవారి ప్రాణాన్ని మగవారికి పోయవచ్చును అని చెబుతుంది. ప్రయోగ శాలలో ఇక్కడ అనేక దివ్య ఔషద వాడకాల ప్రస్తావన చేయవలసి వస్తుంది.
సర్వే జనాః సుఖినోభవంతు
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
