07-03-2025, 08:49 AM
ప్రమధ్వర
[font=var(--ricos-font-family,unset)]
[/font]
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
పూర్వం విశ్వావసువు అనే గంధర్వ రాజు ఉండేవాడు. వాగ్దేవి వర ప్రసాదంతో విశ్వావసువు మంచి సుకవికి ఉండే సులక్షణాలన్నిటిని పుణికిపుచ్చుకున్నాడు. అతడు దేవేంద్రుని స్తుతించి, అనేక బహుమతులను, వరాలను పొందాడు. అతనికి నూతన విద్యలను అభ్యసించడం అంటే మహా యిష్టం గా ఉండేది. ఎవరి దగ్గర ఏ నూతన విద్య ఉందని తెలిసినా, దానిని నేర్చు కునేవరకు అతనికి నిద్రపట్టేదికాదు. ఆకలిదప్పికలు ఉండేవి కావు. అలా విశ్వావసువు భ్రమలు, సోమ, చక్షుషీ విద్యలందు మంచి నైపుణ్యం సంపాదించాడు. తను నేర్చుకున్న చక్షుషీ విద్యను చిత్ర రథుడు వంటి గంధర్వులకు కూడా నేర్పించాడు.
విశ్వావసువు చక్షుషీ విద్య ద్వారా గంధర్వులందరిని ఒకేచోట నుండే చూడటం గమనించిన గంధర్వులు గంధర్వ రాజులలో అతనిని మిన్నగా భావించారు. గంధర్వ రాజులుగ చెలామణి అవ్వాలనుకునే చిత్రసేన, తుంబురు వంటివారు కూడా విశ్వావసువు విద్యల ముందు తలవంచి తాము విశ్వావసువు ముందు సామంత రాజులుగా ఉంటే చాలు అని అనుకునే వారు.
విశ్వావసువు జ్ఞాన నైపుణ్యానికి, అందానికి ముగ్దులైన అనేకమంది అప్సరసలు అతని పిలుపు కోసం ఎదురుచూసేవారు. ఇంద్రుని కొలువులో ఉండే మేనక విశ్వావసువు దృష్టిలో పడింది. అది గ్రహించిన మేనక మహదానంద పడింది.
"కాలం, ఖర్మ ఎవరిని ఎప్పుడు ఎలా కలుపుతుందో ఎవరూ చెప్పలేం. కాలం కలిపిన క్షణాల ను మధుర క్షణాలుగా భావించాలి. వాటిని సద్విని యోగం చేసుకోవాలి. " అని మేనక అనుకుంది.
మేనక, విశ్వావసువు ఇరువురు కలిసి అనేక పుణ్య ప్రదేశాలు తిరిగారు. శృంగార ప్రదేశాలను సందర్శించారు. అక్కడ ఆనందంగా ఆడిపాడారు. కడకు పవిత్రమైన మహత్తుగల స్థూలకేశ మహర్షి ఆశ్రమ సమీపాన కొంత కాలం సంచరించారు. ఆ ఆశ్రమ సమీపాన ఉన్న సమయంలో విశ్వావసువు మేనకతో, " మేను.. ఈ సృష్టిలో అన్ని జన్మలలోకెల్లా మానవ జన్మ ఉత్తమ జన్మ. అలాంటి మానవ జన్మను ఎత్తినవారు మహా అదృష్టవంతులు. అయితే వారెందుకు పుట్టారో వారు ముందుగా ఆలోచించి గమనించాలి.. వారి శక్తి, యుక్తి ఏపాటిదో ముందుగా వారు గ్రహించాలి. ఆపై అందుకు అనుగుణంగా నడుచుకోవాలి. అలా నడుచుకున్నవారే పదుగురికి ఉపయోగ పడతారు. పరమాత్మ ఆత్మలో పదిలంగా ఉంటారు. మానవ లోకంలో మహదానందంగా జీవిస్తారు. ధర్మార్థ కామమోక్షాలను సమస్దాయిలో స్వీకరింగలుగుతారు.
అలాంటి వారే అమలిన శృంగార సీమలో ఆధ్యాత్మిక చట్రంలో విహరించగలుగుతారు. అలాగే మన గత జన్మ మనకు ప్రసాదించిన అదృష్టాన్ని వినయంగా మనం అందిపుచ్చుకోవాలి గాని మనమే అదృష్టవంతులమని అహంకరించకూడదు" అని అన్నాడు.
మేనకకు విశ్వావసువు మాటలు బాగా నచ్చా యి.నాటినుండి మేనక విశ్వావసువు మాటలకు అనుకూలంగా నడుచుకో సాగింది. వారు అక్కడ ఒక పాపకు జన్మనిచ్చారు.
విశ్వావసువు తన చక్షుషీ విద్య ద్వారా పసి పాపలో ఉన్న మానవ తత్వాన్ని, మానవత్వాన్ని, మహ ర్షి తత్వాన్ని గ్రహించాడు. పసిపాప వదనంలో తారాడే సుర నర కళను గ్రహించాడు. "కారణ జన్మురాలు. కాదు కాదు మానవ జన్మకు మహోన్నత విజ్ఞాన కళను అద్దే మహనీయురాలు" అని అనుకున్నాడు. ఆ శిశివును అక్కడే ఉంచి తనలోకం వెళ్ళి పోయాడు. విశ్వావసువు మాటలను అనుసరించి మేనక కూడా తనలోకం వెళ్ళి పోయింది.
కొండల మీద నుండి ప్రవహిస్తున్న సరోవరంలో
స్తూలకేశ మహర్షి సంద్యావందన కార్యక్రమాన్ని ముగించు కున్నాడు. సరోవరం లోని నీటిని దోసిలి తో తీసుకుని, "సరస్వతీ నదీ జలం కన్నా, గంగా నదీ జలం కన్నా, యమునా నదీ జలం కన్నా, నర్మదానదీ జలం కన్నా ఈ జలం మహా పవిత్రం" అని దోసిలిలోని నీటిని స్థూలకేశ మహర్షి కళ్ళకు అద్దుకున్నాడు. సరోవరం చుట్టూ ఉన్న చూత ఫలములతో నిండిన చూత వృక్షములను, జంభూ ఫలములతో నిండిన జంభూ వృక్షములను, బిల్వ ఫలములతో నిండిన శ్రీ వృక్షములను, నింబ వృక్షము లను చూసాడు.
స్థూలకేశ మహర్షి సరోవరం నుండి బయటకు వచ్చాడు. తన ఆశ్రమం వైపు నడవసాగాడు. దారికి రెండు వైపులా ఉన్న బదరీ, అమల, అమృత, జంభీర వృక్షములను చూసాడు. వాటి ప్రక్కనే ఉన్న రంభా వృక్ష తోటలో కిలకిల నవ్వుతున్న పసిపాపను చూసాడు.. రంభా వృక్షాలకున్న రంభాఫల గెలలను చూసాడు.
స్థూలకేశుడు అటూ ఇటూ చూసి శిశువు దగ్గర ఎవరూ లేరని గ్రహించాడు. కిలకిల నవ్వుల శిశువును రెండు చేతుల్లోకి తీసుకున్నాడు. స్థూలకేశ మహర్షి పసి పాప కళ్ళలో కళ్ళు పెట్టి చూసాడు. రెండు ప్రాణ తేజాలతో ప్రకాశిస్తున్న పాప అతని జ్ఞాన నేత్రాలకు కనపడింది.
"అహో బ్రహ్మ దేవ! నాకెంతటి అదృష్టాన్ని ప్రసాదించావయ్య. " అనుకుంటూ స్థూలకేశ మహర్షి పసి పాపను తన ఆశ్రమానికి తీసుకువచ్చాడు. స్థూలకేశ మహర్షి మిగతా మునులకు, మహర్షులకు, తదితరులందరికీ జరిగిన విషయమంతా చెప్పాడు.
స్థూలకేశ మహర్షి ఆడ శిశువుకు "ప్రమద్వర" అని నామకరణం చేసాడు. స్థూలకేశ మహర్షి ప్రమద్వర ను అల్లారు ముద్దుగా పెంచసాగాడు.
రురుడు అనే యువ మహర్షి తన తండ్రి ప్రమతి కి తెలిసిన సమస్త విద్యలను చక్కగా అభ్యసించాడు. అలాగే తన తల్లి ఘృతాచిని కలిసి అనేక విద్యలను అభ్యసించాడు.
ఘృతాచి మాటలను అనుసరించి తన పూర్వీకులు చ్యవన మహర్షి, సుకన్య వంటి వారు ఎంత గొప్పవారో తెలుసుకున్నాడు..
తన పూర్వీకులు "చ్యవన మహర్షి పుట్టుకతోనే పులోముడనే రాక్ష సుని సంహరించి తల్లి పులోమను కాపాడాడు. నేను కూడా అలాంటి గొప్ప విద్యలను నేర్చుకోవాలి" అని రురుడు అనుకున్నాడు. అతని మనసు జీవాల ప్రాణ విభజన మీదకు వెళ్ళింది. ప్రాణ విభజన విద్యకై రురుడు అనేక మంది మహర్షులను ఆశ్రయించాడు. వారి దగ్గర అనేకానేక విషయాలు నేర్చుకున్నాడు. చివరికి ప్రాణ విభజన విద్యను ఔపాసన పట్టాడు.
[font=var(--ricos-font-family,unset)]
![[Image: image-2025-03-07-084717179.png]](https://i.ibb.co/S4CbdTzJ/image-2025-03-07-084717179.png)
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
పూర్వం విశ్వావసువు అనే గంధర్వ రాజు ఉండేవాడు. వాగ్దేవి వర ప్రసాదంతో విశ్వావసువు మంచి సుకవికి ఉండే సులక్షణాలన్నిటిని పుణికిపుచ్చుకున్నాడు. అతడు దేవేంద్రుని స్తుతించి, అనేక బహుమతులను, వరాలను పొందాడు. అతనికి నూతన విద్యలను అభ్యసించడం అంటే మహా యిష్టం గా ఉండేది. ఎవరి దగ్గర ఏ నూతన విద్య ఉందని తెలిసినా, దానిని నేర్చు కునేవరకు అతనికి నిద్రపట్టేదికాదు. ఆకలిదప్పికలు ఉండేవి కావు. అలా విశ్వావసువు భ్రమలు, సోమ, చక్షుషీ విద్యలందు మంచి నైపుణ్యం సంపాదించాడు. తను నేర్చుకున్న చక్షుషీ విద్యను చిత్ర రథుడు వంటి గంధర్వులకు కూడా నేర్పించాడు.
విశ్వావసువు చక్షుషీ విద్య ద్వారా గంధర్వులందరిని ఒకేచోట నుండే చూడటం గమనించిన గంధర్వులు గంధర్వ రాజులలో అతనిని మిన్నగా భావించారు. గంధర్వ రాజులుగ చెలామణి అవ్వాలనుకునే చిత్రసేన, తుంబురు వంటివారు కూడా విశ్వావసువు విద్యల ముందు తలవంచి తాము విశ్వావసువు ముందు సామంత రాజులుగా ఉంటే చాలు అని అనుకునే వారు.
విశ్వావసువు జ్ఞాన నైపుణ్యానికి, అందానికి ముగ్దులైన అనేకమంది అప్సరసలు అతని పిలుపు కోసం ఎదురుచూసేవారు. ఇంద్రుని కొలువులో ఉండే మేనక విశ్వావసువు దృష్టిలో పడింది. అది గ్రహించిన మేనక మహదానంద పడింది.
"కాలం, ఖర్మ ఎవరిని ఎప్పుడు ఎలా కలుపుతుందో ఎవరూ చెప్పలేం. కాలం కలిపిన క్షణాల ను మధుర క్షణాలుగా భావించాలి. వాటిని సద్విని యోగం చేసుకోవాలి. " అని మేనక అనుకుంది.
మేనక, విశ్వావసువు ఇరువురు కలిసి అనేక పుణ్య ప్రదేశాలు తిరిగారు. శృంగార ప్రదేశాలను సందర్శించారు. అక్కడ ఆనందంగా ఆడిపాడారు. కడకు పవిత్రమైన మహత్తుగల స్థూలకేశ మహర్షి ఆశ్రమ సమీపాన కొంత కాలం సంచరించారు. ఆ ఆశ్రమ సమీపాన ఉన్న సమయంలో విశ్వావసువు మేనకతో, " మేను.. ఈ సృష్టిలో అన్ని జన్మలలోకెల్లా మానవ జన్మ ఉత్తమ జన్మ. అలాంటి మానవ జన్మను ఎత్తినవారు మహా అదృష్టవంతులు. అయితే వారెందుకు పుట్టారో వారు ముందుగా ఆలోచించి గమనించాలి.. వారి శక్తి, యుక్తి ఏపాటిదో ముందుగా వారు గ్రహించాలి. ఆపై అందుకు అనుగుణంగా నడుచుకోవాలి. అలా నడుచుకున్నవారే పదుగురికి ఉపయోగ పడతారు. పరమాత్మ ఆత్మలో పదిలంగా ఉంటారు. మానవ లోకంలో మహదానందంగా జీవిస్తారు. ధర్మార్థ కామమోక్షాలను సమస్దాయిలో స్వీకరింగలుగుతారు.
అలాంటి వారే అమలిన శృంగార సీమలో ఆధ్యాత్మిక చట్రంలో విహరించగలుగుతారు. అలాగే మన గత జన్మ మనకు ప్రసాదించిన అదృష్టాన్ని వినయంగా మనం అందిపుచ్చుకోవాలి గాని మనమే అదృష్టవంతులమని అహంకరించకూడదు" అని అన్నాడు.
మేనకకు విశ్వావసువు మాటలు బాగా నచ్చా యి.నాటినుండి మేనక విశ్వావసువు మాటలకు అనుకూలంగా నడుచుకో సాగింది. వారు అక్కడ ఒక పాపకు జన్మనిచ్చారు.
విశ్వావసువు తన చక్షుషీ విద్య ద్వారా పసి పాపలో ఉన్న మానవ తత్వాన్ని, మానవత్వాన్ని, మహ ర్షి తత్వాన్ని గ్రహించాడు. పసిపాప వదనంలో తారాడే సుర నర కళను గ్రహించాడు. "కారణ జన్మురాలు. కాదు కాదు మానవ జన్మకు మహోన్నత విజ్ఞాన కళను అద్దే మహనీయురాలు" అని అనుకున్నాడు. ఆ శిశివును అక్కడే ఉంచి తనలోకం వెళ్ళి పోయాడు. విశ్వావసువు మాటలను అనుసరించి మేనక కూడా తనలోకం వెళ్ళి పోయింది.
కొండల మీద నుండి ప్రవహిస్తున్న సరోవరంలో
స్తూలకేశ మహర్షి సంద్యావందన కార్యక్రమాన్ని ముగించు కున్నాడు. సరోవరం లోని నీటిని దోసిలి తో తీసుకుని, "సరస్వతీ నదీ జలం కన్నా, గంగా నదీ జలం కన్నా, యమునా నదీ జలం కన్నా, నర్మదానదీ జలం కన్నా ఈ జలం మహా పవిత్రం" అని దోసిలిలోని నీటిని స్థూలకేశ మహర్షి కళ్ళకు అద్దుకున్నాడు. సరోవరం చుట్టూ ఉన్న చూత ఫలములతో నిండిన చూత వృక్షములను, జంభూ ఫలములతో నిండిన జంభూ వృక్షములను, బిల్వ ఫలములతో నిండిన శ్రీ వృక్షములను, నింబ వృక్షము లను చూసాడు.
స్థూలకేశ మహర్షి సరోవరం నుండి బయటకు వచ్చాడు. తన ఆశ్రమం వైపు నడవసాగాడు. దారికి రెండు వైపులా ఉన్న బదరీ, అమల, అమృత, జంభీర వృక్షములను చూసాడు. వాటి ప్రక్కనే ఉన్న రంభా వృక్ష తోటలో కిలకిల నవ్వుతున్న పసిపాపను చూసాడు.. రంభా వృక్షాలకున్న రంభాఫల గెలలను చూసాడు.
స్థూలకేశుడు అటూ ఇటూ చూసి శిశువు దగ్గర ఎవరూ లేరని గ్రహించాడు. కిలకిల నవ్వుల శిశువును రెండు చేతుల్లోకి తీసుకున్నాడు. స్థూలకేశ మహర్షి పసి పాప కళ్ళలో కళ్ళు పెట్టి చూసాడు. రెండు ప్రాణ తేజాలతో ప్రకాశిస్తున్న పాప అతని జ్ఞాన నేత్రాలకు కనపడింది.
"అహో బ్రహ్మ దేవ! నాకెంతటి అదృష్టాన్ని ప్రసాదించావయ్య. " అనుకుంటూ స్థూలకేశ మహర్షి పసి పాపను తన ఆశ్రమానికి తీసుకువచ్చాడు. స్థూలకేశ మహర్షి మిగతా మునులకు, మహర్షులకు, తదితరులందరికీ జరిగిన విషయమంతా చెప్పాడు.
స్థూలకేశ మహర్షి ఆడ శిశువుకు "ప్రమద్వర" అని నామకరణం చేసాడు. స్థూలకేశ మహర్షి ప్రమద్వర ను అల్లారు ముద్దుగా పెంచసాగాడు.
రురుడు అనే యువ మహర్షి తన తండ్రి ప్రమతి కి తెలిసిన సమస్త విద్యలను చక్కగా అభ్యసించాడు. అలాగే తన తల్లి ఘృతాచిని కలిసి అనేక విద్యలను అభ్యసించాడు.
ఘృతాచి మాటలను అనుసరించి తన పూర్వీకులు చ్యవన మహర్షి, సుకన్య వంటి వారు ఎంత గొప్పవారో తెలుసుకున్నాడు..
తన పూర్వీకులు "చ్యవన మహర్షి పుట్టుకతోనే పులోముడనే రాక్ష సుని సంహరించి తల్లి పులోమను కాపాడాడు. నేను కూడా అలాంటి గొప్ప విద్యలను నేర్చుకోవాలి" అని రురుడు అనుకున్నాడు. అతని మనసు జీవాల ప్రాణ విభజన మీదకు వెళ్ళింది. ప్రాణ విభజన విద్యకై రురుడు అనేక మంది మహర్షులను ఆశ్రయించాడు. వారి దగ్గర అనేకానేక విషయాలు నేర్చుకున్నాడు. చివరికి ప్రాణ విభజన విద్యను ఔపాసన పట్టాడు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
