Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
#80
ఆవిధంగా ఎదిగి ప్రయోజకులైన కుమారులు ఇరువురూ.. తమ వివాహాలను తల్లీతండ్రి ప్రమేయం లేకుండా చేసుకొన్నారు.



తమ కుమారులు రీతిగా మారిపోతారని శివరామకృష్ణ - ఊర్మిళ వూహించలేదు. కారణంగా మగపిల్లల మీద దంపతులకు ఎలాంటి ఆశలూ మిగలలేదు.



ముఖ్యంగా చివరివాడు విష్ణు. జన్మతః అంధుడు. అతని గురించి పెద్దవారైన చంద్రశేఖర్, రాఘవలు పట్టించుకోకుండా విదేశాల్లో వున్నందున.. విష్ణును దేశాల్లో వుండే మంచి డాక్టర్లకు చూపించలేదని దంపతుల మనస్సున వున్న పెద్ద కొరత.



ఆర్థాంగుల మాటల ప్రకారం నడుచుకొనే అన్నదమ్ములు ఇండియాకు వచ్చినప్పుడు.. విష్ణు విషయాన్ని శివరామకృష్ణ ఊర్మిళలు ప్రస్తావిస్తే.. వినిపించుకొనే వారు కారు. వారి చర్య దంపతులకు ఎంతో బాధను కలిగిందేది. ఎదిగి స్వతంత్రులైన కొడుకులను గురించి తలచుకొని విచారపడేవారు.



కూతుళ్ళు అల్లుళ్ళు సంవత్సరానికి ఒక్కసారి వచ్చి వారంరోజులు వుండి వెళ్ళిపోయేవారు.
వయస్సు మీరిన తమని, గ్రుడ్డివాడైన విష్ణును ఎవరూ పట్టించుకోకుండా తయారైనందున ఏకాంతంలో తమ సంతతి గొప్ప గుణాలను తలచుకొని కన్నీరు కార్చేవారు.



శివరామకృష్ణ కుటుంబ పరిస్థితిని బాగా గ్రహించిన దండాయుధపాణి.. తమ సామర్థ్యాన్ని ఉపయోగించుకొని సంవత్సరంలోపల కంపెనీ లాస్లో మునిగిపోయేలా చేసి క్రింది వారినందరినీ తన గుప్పెట్లో పెట్టుకొన్నాడు. నష్టపు తాలూకు ఋణాల పట్టిని శివరామకృష్ణ ముందు వుంచాడు.
కంపెనీ ఛైర్మన్ స్థానంలో వున్న శివరామకృష్ణ.. తనకు తానుగా పదవీ విరమణ చేసి కంపెనీ నుంచి బయటికి పోయేలా చేశాడు.



శివరామకృష్ణ కంపెనీలో తన భాగాన్ని దండాయుధపాణికి ఋణాలను తీర్చేదానికి అప్పగించి వట్టి చేతులతో కంపెనీ నుంచి బయటికి వచ్చాడు.



ఇరువురు వ్యక్తుల మధ్యన అది గొప్పదని చెప్పుకోతగినది మంచి స్నేహం.. శివరామకృష్ణ ఎంతగానో నమ్మిన దండాయుధపాణి అతన్ని మోసం చేశాడు. సంతతి వల్ల శాంతిలేని శివరామకృష్ణ కంపెనీ ఛైర్మన్గా తన బాధ్యతలను పర్యవేక్షణను సక్రమంగా నిర్వర్తించలేకపోయాడు. అతనిలోని బలహీనతను దండాయుధపాణి.. తన సామర్థ్యాలతో సద్వినియోగం చేసుకొన్నాడు. శివరామకృష్ణను అనామకుడిగా మార్చేశాడు.
సన్నివేశం జరిగిన పదిరోజుల్లో మరో ఇరువురు మార్వాడీలు శివరామకృష్ణను కలుసుకొని.. మాకు కంపెనీ కోటిరూపాయలు బాకీ పత్రాల మీద మీరే సంతకం చేసి వున్నారు. ఎప్పుడు చెల్లుస్తారని నిలదీసి అడిగారు. వారి మాటలకు శివరామకృష్ణ ఆశ్చర్యపోయాడు. తనకంటూ వున్నది భవంతి. దాదాపు కోటిన్నర ఖరీదు చేసేది. వారితో ఎలాంటి వాదనను కొనసాగించకుండా.. శివరామకృష్ణ వారంరోజుల్లో చెల్లిస్తానని క్లుప్తంగా జవాబు చెప్పాడు.



మీరు చెల్లించకపోతే మేము కోర్టుకు వెళ్ళి ఇంటిని వేలం వేయించి మా సొమ్మును మేము రాబట్టుకొంటామని బెదిరించి వెళ్ళిపోయారు. ఒకప్పుడు.. నన్ను కలిసికొనేటందుకు గంటల తరబడి నా వాకిట నిలబడినవారు.. నేడు నన్ను శాసించే స్థితికి ఎదిగారు. కారణంగానే తనకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇంటిని అమ్మి వారి సొమ్మును వారికి ఇవ్వాలి. విశాఖపట్నం వదిలి నా వూరికి నా హరికృష్ణ వద్దకు వెళ్ళాలి. హరి నా బంధువు, ప్రాణస్నేహితుడు. మంచి మనసున్నవాడు. నా ఊర్మిళల శేష జీవితం ప్రశాంతంగా వూర్లో సాగే దానికి వాడు.. నా హరి..తన చేతిని నాకు అందిస్తాడు అనుకొన్నాడు శివరామకృష్ణ.
ఆరోజు కార్తీకమాసం తొలి సోమవారం. లావణ్య, ప్రణవి, శార్వరి, దీప్తి ఉపవాసం. నలుగురూ సాయంత్రం ఆరుగంటలకు శివాలయానికి వెళ్ళారు. ప్రమిదలతో జ్యోతులను వెలిగించారు. జగన్మాతాపితలను దర్శించారు. తమ తమ కోర్కెలను విన్నవించుకొన్నారు.



లావణ్య మాతా పితా.. రేపటి మా ఢిల్లీ ప్రయాణం ఆనందంగా సాగాలి. నా ఈశ్వర్కు దీప్తి భార్య కావాలి. శార్వరికి సీతాపతి కావాలి. దీప్తి ప్రారంభించాలనుకొన్న హాస్పిటల్ ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రారంభం కావాలి. చెడు స్నేహాలవల్ల నా అన్నయ్య ప్రజాపతి తత్వంలో వచ్చిన మార్పు.. వాడికి మాకు వున్న అభిప్రాయభేదాలు సమసిపోయి మా నాన్న అమ్మల హాయంలో మాదిరిగా మారెండు కుటుంబాలు ఏకం కావాలి. తమేవ కరుణా కటాక్షాన్ని మాపై చూపండి. నా కోర్కెలు తీరేలా చేయండి ఎంతో భక్తితో వేడుకొంది.



శార్వరి.. నా బావ సీతాపతి అంటే నాకు ఎంతో ఇష్టం. కానీ మారెండు కుటుంబాల పెద్దలు విరోధులుగా వున్నారు. నా నిర్ణయం ద్వారా పగ పెరగకూడదు. నా అభిప్రాయాన్ని నేను ఎవ్వరికీ చెప్పలేను. అక్క వాణిలా సాహసించలేను. మీరే నాయందు దయచూపి నా కోర్కె తీరేలా చేయాలి. త్వరలో రానున్న పరీక్షలలో మంచి ర్యాంక్ సాధించి అమ్మా నాన్నలకు ఆనందం కలిగించాలి. వారి ఆనందమే నా ఆనందం కళ్ళు మూసుకొని ఎంతో శ్రద్ధతో జగన్మాతాపితలను ధ్యానించింది.
ప్రణవి.. తండ్రీ సర్వేశ్వరా!.. మాతా మహేశ్వరీ.. మావారిలోని రాక్షసతత్త్వాన్ని మార్చండి. మంచి మనిషిగా అందరి అభిమానాన్ని పొందేలా చేయండి. నా కూతురు ఈశ్వర్కు ఇల్లాలుగా, శార్వరి నా ఇంటి కోడలుగా అయ్యేలా చేయండి. నా బిడ్డల వివాహాలు వారు కోరుకున్న వారితో జరిపించే మనస్తత్వాన్ని మా వారికి ప్రసాదించండి. మావారి అవివేకంతో విడిపోయిన మా రెండు కుటుంబాలు మా పిల్లల హాయంలో కలిసేలా చూడండి. మీ తలపులకు సృష్టిలో అతీతం అన్నది ఏదీ లేదు. నా విన్నపాన్ని చిత్తగించండి. నా కోర్కెలను నెరవేర్చండి దీనాతిదీనంగా కన్నీటితో వేడుకొంది ప్రణవి.



దీప్తి..తండ్రి విశ్వనాథా!.. మాతా అన్నపూర్ణమ్మా.. నేను సంకల్పించి హాస్పిటల్ నా గ్రామంలో వెలిసేలా చూడండి. పేదలకు వైద్యం చేయాలనే నా సంకల్పాన్ని నెరవేర్చండి. మా బావ ఈశ్వర్తో నా వివాహం.. మా నాన్నగారి సమ్మతితో జరిగేలా చూడండి. మా అత్తయ్య కుటుంబంపై మా నాన్న మనస్సులో వుండే ద్వేషాన్ని చంపి.. స్థానంలో అభిమానాన్ని నింపండి. నాన్న శేష జీవితంలో మంచి మనిషిగా మారి బ్రతికేలా చూడండి. నా కోర్కెలు సరైనవైతే.. మీరు తప్పక నెరవేరుస్తారని మీ మీద నాకు నమ్మకం భక్తి శ్రద్ధలతో జగన్మాతా పితలను ధ్యానించింది.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 13 - by k3vv3 - 24-02-2025, 11:26 AM



Users browsing this thread: 1 Guest(s)