22-02-2025, 09:52 AM
"అలాంటి పనులు మాత్రం ఇక మీదట చేయకండి. గో సంపదను విక్రయించడం ధర్మం అవుతుంది కానీ కొల్లగొట్టడం ధర్మం కాదు. రాజధాని నిర్మాణం పవిత్ర పథాన సాగాలి కానీ అపవిత్ర పథాన సాగరాదు.
గో సంపద తర్వాత అనేకానేక వ్యూహాలలో ఆరితేరిన సమరయోధులను తయారు చేద్దాం. నాకు జలంధర వంటి కొన్ని వ్యూహాలతో పాటు గరుడ వ్యూహం బాగా తెలుసు. దానిని సమయం చూసుకుని ఉత్సాహం ఉన్న స్త్రీ పురుషులందరికీ నేర్పుతాను.
మన రాజ్యాలలో రాజ్యం కోసం ప్రాణాలిచ్చే సమర యోధులు అనేకమంది ఉన్నారు. వారిని సంసప్తకాలు గా విభజించుదాం. అనేకమంది అతిరథ మహారథులను తయారు చేద్దాం. ఇక ధర్మం తెలిసిన వ్యాపారస్తులను, నూతన వస్తు రూపకల్పన చేయగల విజ్ఞానవేత్తలను, మేథావులను ప్రోత్సహించుదాం. ఇలా కొత్త రాజధాని లో సమస్తం ఉండేటట్లు రాజధాని నిర్మాణం చేద్దాం " అంది యశోధర.
యశోధర మాటలను అందరూ సమ్మతించారు.
యశోధర గో విక్రయం నిమిత్తం గోపాలకులతో, కొంత సైన్యంతో కలిసి మత్స్య రాజ్యం పయనమయ్యింది.
హస్తి మహారాజు రాజధాని నిర్మాణం కు కావలసిన పెద్ద పెద్ద కొండ రాళ్ళ నిమిత్తం గజ సంపదను తీసుకుని అచలాచలం వెళ్ళాడు. దారి మధ్యలో యశోధర సైన్యం ను చేడి, బొడ్డు రాజ్యాల సైన్యం ముట్టడించింది.
యశోధర శత్రు సైన్యం తో సమరానికి సిద్దపడింది. వివిధ రకాల నాగాస్త్రములను శత్రువుల మీదకు వదిలింది. శత్రువుల కాళ్ళనుండి బొడ్డు వరకు విష నాగులు చుట్టుకున్నాయి. వారిని కదలకుండా చేసాయి. అప్పుడు ఆమె సైన్యం లో ఉన్న సంసప్తకులు వారిని చీల్చి చెండాడారు. సమరము ముందే సంసప్తకులు శత్రువులను చంపుతాము లేదా మేం చనిపోతాము అని ప్రతిజ్ఞ చేసారు. ఆపై శత్రు సైన్యం ను ఊచకోత కోసారు.
శత్రువులు యశోధరతో సమరం చేస్తున్నారన్న విషయం తెలిసి మత్స్యరాజు యశోధర కు సహాయంగా వెళ్ళా డు. శత్రువులు యశోధరను, మత్స్య రాజును చూసి కాలికి బుద్ది చెప్పారు.
మత్స్య రాజు యశోధర కు స్వాగతం పలికాడు. పెద్ద ఎత్తున సన్మానం చేసాడు. తమ ఆడ బిడ్డలు తయారు చేసిన బొమ్మ పొత్తికలను చూపించాడు. "ఆ బొమ్మ పొత్తికల తయారీకి ఉపయోగించిన వస్త్రాలు మచ్ఛిల్లిక, పారదక వంటి రాజ్యాల రాజుల కిరీట అలంకరణకు సంబంధించినవి "అని చెప్పాడు. అనంతరం మీకు కావల్సినంత గోసంపదను ఉచితంగా తీసుకు వెళ్ళమన్నాడు.
అందుకు యశోధర సమ్మతించలేదు. మత్స్య రాజుకు తగిన విత్తం చెల్లించి గోసంపదను వశం చేసుకుంది. అందరితో కలిసి గోపూజ చేసింది.
హస్తి మహారాజు కొండల్లో ఉన్న చోరులతో పోరాటానికి సిద్ద పడ్డాడు. అచల వ్యూహం పన్ని శత్రువులను చెల్లాచెదురు చేసాడు. తన దగ్గర ఉన్న సంసప్తకులతో సమర నియమాలు పాటించని చోరులతో తగు రీతిలో ప్రవర్తించి సమరం చేయమన్నాడు. సంసప్తకులు అలాగే అని పిల్లిగంతుల వ్యూహాన్ని పన్నారు. అప్పుడు చోరులతో ఉన్న మాయావి అసుర అశ్వాలను సృష్టించి సంసప్తకుల మీదకు వదిలారు.
సంసప్తకులు అసుర అశ్వాలను మట్టుబెట్టారు. రక్త నాలికలతో అసుర శక్తిని భయ పెట్టి అవతలకు తరిమేశారు. మాయావి మరణించాడు. చోరులు మరణించారు. హస్తి మహారాజు పెద్ద పెద్ద కొండ రాళ్ళ తో రాజధాని నిర్మాణ ప్రాంతానికి వచ్చా డు.
మహర్షుల యజ్ఞయాగాదులను నిర్వహించారు. గోపూజ అనంతరం రాజధాని నిర్మాణం ప్రారంభమైంది. రాజధాని నిర్మాణం నకు ప్రజల ఆర్థిక సహాకారం తీసుకుంటే బాగుంటుందని కొందరు సామంత రాజులు యశోధర హస్తి మహారాజు లతో అన్నారు. అందుకు యశోధర సమ్మతించలేదు.
"రాజధాని నిర్మాణం నకు రాజకీయంగా అధిక ప్రయోజనం పొందేవారు సహాయం చేస్తే సరిపోతుంది. మన రాజధాని లో ఉన్న ఒక్కొక్క సచివుడు ఒ క్కొక్క మందిరాన్ని నిర్మిస్తే చాలు. రాజధాని నిర్మాణం పరిపూర్ణంగా సంపూర్ణం అవుతుంది. రాజధాని నిర్మా ణం పేరుతో ప్రజల శ్రమను దోచుకునేవారు రాజులు సచివులు కారు. దోపిడీ దారులు అవుతారు. అధికార అహంతో నిరుపేదలను యిష్టం వచ్చినట్లు దోచుకున్న రాజులు అధికం అవ్వడంతోనే ఒకనాడు పరశురాముడు 21 పర్యాయాలు భూమిని చుట్టుముట్టి దుర్మార్గ రాజులందరిని హతమార్చాడు. మనం అలాంటి దుర్మార్గ మార్గాన సంచరించవద్దు. సన్మార్గ పథాన సంచరించే రాజధాని నిర్మాణం చేద్దాం. సామంత రాజులు కూడా మీ రాజ్యంలోని నిరుపేద ప్రజలను హింసించి ధనం తీసుకురాకండి. మీరు సహాయం చేయగలిగినంత మాత్రమే సహాయం చెయ్యండి. " అని యశోధర సామంత రాజులతో అంది.
"యశోధర చెప్పినట్లుగా సంచరించుదాం. మనం పరశురాముని కోపానికి బలవ్వవద్దు. " చిరునవ్వుతో సామంత రాజుల తో అన్నాడు హస్తి మహారాజు.
రాజధాని నిర్మాణం అనుకున్నదానికంటే ముందుగానే ముగిసింది. భరద్వాజుడు వంటి మహర్షులు అనేకమంది కలిసి చర్చలు చేసి ఆ రాజధానికి "హస్తినాపురం" అని నామకరణం చేసారు. అనంతరం అనేకానేక యాగాలు చేసారు. రాజధాని లోని ప్రజలందరిని తగిన రీతిలో సన్మానించారు.
హస్తినాపురం దినదిన ప్రవర్ధమానమవ్వ సాగింది. హస్తి మహారాజు గజ బలాన్ని, అశ్వ బలాన్ని విరివిగా అభివృద్ధి చేసాడు. యశోధర అనేకానేక సమర వ్యూహాలను సైనికులకు నేర్పించింది. క్రమం తప్పకుండా గో పూజలను, యజ్ఞ యాగాలను చేయించింది.
యశోధర నెల తప్పింది. అది తెలిసిన హస్తి మహారాజు మిక్కిలి సంతోషించాడు. హస్తినాపురం లో, రాజ్యం లో రకరకాల రీతులలో విందు వినోదాలు ఏర్పా టు చేసాడు.
యశోధర ఓ పుణ్య ముహూర్తాన పండంటి శిశువుకు జన్మనిచ్చింది. భరద్వాజాది మహర్షులు శిశువు జాతకాదులను పరిశీలించి "వికంఠునుడు" అని శిశువుకు నామకరణం చేసారు. ఇలా హస్తి మహారాజు పేరు మీద హస్తినాపురం ఏర్పడింది. ఈ హస్తినాపురం ను కొందరు గజపురం అనీ, మరికొందరు నాగపురం అనీ, బ్రహ్మ స్థలం అని కూడా పిలిచేవారు.
అయితే హస్తి మహారాజు పేరున నిర్మించబడిన హస్తినాపురమనే పేరే యుగయుగాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. యశోధర హస్తి మహారాజుల ముద్దుల తనయుడు గా వికంఠునుడు దినదిన ప్రవర్ధమాన మవ్వసాగాడు.
సర్వే జనాః సుఖినోభవంతు
గో సంపద తర్వాత అనేకానేక వ్యూహాలలో ఆరితేరిన సమరయోధులను తయారు చేద్దాం. నాకు జలంధర వంటి కొన్ని వ్యూహాలతో పాటు గరుడ వ్యూహం బాగా తెలుసు. దానిని సమయం చూసుకుని ఉత్సాహం ఉన్న స్త్రీ పురుషులందరికీ నేర్పుతాను.
మన రాజ్యాలలో రాజ్యం కోసం ప్రాణాలిచ్చే సమర యోధులు అనేకమంది ఉన్నారు. వారిని సంసప్తకాలు గా విభజించుదాం. అనేకమంది అతిరథ మహారథులను తయారు చేద్దాం. ఇక ధర్మం తెలిసిన వ్యాపారస్తులను, నూతన వస్తు రూపకల్పన చేయగల విజ్ఞానవేత్తలను, మేథావులను ప్రోత్సహించుదాం. ఇలా కొత్త రాజధాని లో సమస్తం ఉండేటట్లు రాజధాని నిర్మాణం చేద్దాం " అంది యశోధర.
యశోధర మాటలను అందరూ సమ్మతించారు.
యశోధర గో విక్రయం నిమిత్తం గోపాలకులతో, కొంత సైన్యంతో కలిసి మత్స్య రాజ్యం పయనమయ్యింది.
హస్తి మహారాజు రాజధాని నిర్మాణం కు కావలసిన పెద్ద పెద్ద కొండ రాళ్ళ నిమిత్తం గజ సంపదను తీసుకుని అచలాచలం వెళ్ళాడు. దారి మధ్యలో యశోధర సైన్యం ను చేడి, బొడ్డు రాజ్యాల సైన్యం ముట్టడించింది.
యశోధర శత్రు సైన్యం తో సమరానికి సిద్దపడింది. వివిధ రకాల నాగాస్త్రములను శత్రువుల మీదకు వదిలింది. శత్రువుల కాళ్ళనుండి బొడ్డు వరకు విష నాగులు చుట్టుకున్నాయి. వారిని కదలకుండా చేసాయి. అప్పుడు ఆమె సైన్యం లో ఉన్న సంసప్తకులు వారిని చీల్చి చెండాడారు. సమరము ముందే సంసప్తకులు శత్రువులను చంపుతాము లేదా మేం చనిపోతాము అని ప్రతిజ్ఞ చేసారు. ఆపై శత్రు సైన్యం ను ఊచకోత కోసారు.
శత్రువులు యశోధరతో సమరం చేస్తున్నారన్న విషయం తెలిసి మత్స్యరాజు యశోధర కు సహాయంగా వెళ్ళా డు. శత్రువులు యశోధరను, మత్స్య రాజును చూసి కాలికి బుద్ది చెప్పారు.
మత్స్య రాజు యశోధర కు స్వాగతం పలికాడు. పెద్ద ఎత్తున సన్మానం చేసాడు. తమ ఆడ బిడ్డలు తయారు చేసిన బొమ్మ పొత్తికలను చూపించాడు. "ఆ బొమ్మ పొత్తికల తయారీకి ఉపయోగించిన వస్త్రాలు మచ్ఛిల్లిక, పారదక వంటి రాజ్యాల రాజుల కిరీట అలంకరణకు సంబంధించినవి "అని చెప్పాడు. అనంతరం మీకు కావల్సినంత గోసంపదను ఉచితంగా తీసుకు వెళ్ళమన్నాడు.
అందుకు యశోధర సమ్మతించలేదు. మత్స్య రాజుకు తగిన విత్తం చెల్లించి గోసంపదను వశం చేసుకుంది. అందరితో కలిసి గోపూజ చేసింది.
హస్తి మహారాజు కొండల్లో ఉన్న చోరులతో పోరాటానికి సిద్ద పడ్డాడు. అచల వ్యూహం పన్ని శత్రువులను చెల్లాచెదురు చేసాడు. తన దగ్గర ఉన్న సంసప్తకులతో సమర నియమాలు పాటించని చోరులతో తగు రీతిలో ప్రవర్తించి సమరం చేయమన్నాడు. సంసప్తకులు అలాగే అని పిల్లిగంతుల వ్యూహాన్ని పన్నారు. అప్పుడు చోరులతో ఉన్న మాయావి అసుర అశ్వాలను సృష్టించి సంసప్తకుల మీదకు వదిలారు.
సంసప్తకులు అసుర అశ్వాలను మట్టుబెట్టారు. రక్త నాలికలతో అసుర శక్తిని భయ పెట్టి అవతలకు తరిమేశారు. మాయావి మరణించాడు. చోరులు మరణించారు. హస్తి మహారాజు పెద్ద పెద్ద కొండ రాళ్ళ తో రాజధాని నిర్మాణ ప్రాంతానికి వచ్చా డు.
మహర్షుల యజ్ఞయాగాదులను నిర్వహించారు. గోపూజ అనంతరం రాజధాని నిర్మాణం ప్రారంభమైంది. రాజధాని నిర్మాణం నకు ప్రజల ఆర్థిక సహాకారం తీసుకుంటే బాగుంటుందని కొందరు సామంత రాజులు యశోధర హస్తి మహారాజు లతో అన్నారు. అందుకు యశోధర సమ్మతించలేదు.
"రాజధాని నిర్మాణం నకు రాజకీయంగా అధిక ప్రయోజనం పొందేవారు సహాయం చేస్తే సరిపోతుంది. మన రాజధాని లో ఉన్న ఒక్కొక్క సచివుడు ఒ క్కొక్క మందిరాన్ని నిర్మిస్తే చాలు. రాజధాని నిర్మాణం పరిపూర్ణంగా సంపూర్ణం అవుతుంది. రాజధాని నిర్మా ణం పేరుతో ప్రజల శ్రమను దోచుకునేవారు రాజులు సచివులు కారు. దోపిడీ దారులు అవుతారు. అధికార అహంతో నిరుపేదలను యిష్టం వచ్చినట్లు దోచుకున్న రాజులు అధికం అవ్వడంతోనే ఒకనాడు పరశురాముడు 21 పర్యాయాలు భూమిని చుట్టుముట్టి దుర్మార్గ రాజులందరిని హతమార్చాడు. మనం అలాంటి దుర్మార్గ మార్గాన సంచరించవద్దు. సన్మార్గ పథాన సంచరించే రాజధాని నిర్మాణం చేద్దాం. సామంత రాజులు కూడా మీ రాజ్యంలోని నిరుపేద ప్రజలను హింసించి ధనం తీసుకురాకండి. మీరు సహాయం చేయగలిగినంత మాత్రమే సహాయం చెయ్యండి. " అని యశోధర సామంత రాజులతో అంది.
"యశోధర చెప్పినట్లుగా సంచరించుదాం. మనం పరశురాముని కోపానికి బలవ్వవద్దు. " చిరునవ్వుతో సామంత రాజుల తో అన్నాడు హస్తి మహారాజు.
రాజధాని నిర్మాణం అనుకున్నదానికంటే ముందుగానే ముగిసింది. భరద్వాజుడు వంటి మహర్షులు అనేకమంది కలిసి చర్చలు చేసి ఆ రాజధానికి "హస్తినాపురం" అని నామకరణం చేసారు. అనంతరం అనేకానేక యాగాలు చేసారు. రాజధాని లోని ప్రజలందరిని తగిన రీతిలో సన్మానించారు.
హస్తినాపురం దినదిన ప్రవర్ధమానమవ్వ సాగింది. హస్తి మహారాజు గజ బలాన్ని, అశ్వ బలాన్ని విరివిగా అభివృద్ధి చేసాడు. యశోధర అనేకానేక సమర వ్యూహాలను సైనికులకు నేర్పించింది. క్రమం తప్పకుండా గో పూజలను, యజ్ఞ యాగాలను చేయించింది.
యశోధర నెల తప్పింది. అది తెలిసిన హస్తి మహారాజు మిక్కిలి సంతోషించాడు. హస్తినాపురం లో, రాజ్యం లో రకరకాల రీతులలో విందు వినోదాలు ఏర్పా టు చేసాడు.
యశోధర ఓ పుణ్య ముహూర్తాన పండంటి శిశువుకు జన్మనిచ్చింది. భరద్వాజాది మహర్షులు శిశువు జాతకాదులను పరిశీలించి "వికంఠునుడు" అని శిశువుకు నామకరణం చేసారు. ఇలా హస్తి మహారాజు పేరు మీద హస్తినాపురం ఏర్పడింది. ఈ హస్తినాపురం ను కొందరు గజపురం అనీ, మరికొందరు నాగపురం అనీ, బ్రహ్మ స్థలం అని కూడా పిలిచేవారు.
అయితే హస్తి మహారాజు పేరున నిర్మించబడిన హస్తినాపురమనే పేరే యుగయుగాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. యశోధర హస్తి మహారాజుల ముద్దుల తనయుడు గా వికంఠునుడు దినదిన ప్రవర్ధమాన మవ్వసాగాడు.
సర్వే జనాః సుఖినోభవంతు
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
