22-02-2025, 09:50 AM
చివరకు యశోధర హస్తి మహారాజులు ప్రస్థలకు వచ్చారు. యశోధర త్రిగర్త రాజ్యములోని సంశప్తకుల గురించి హస్తి మహారాజు కు చెప్పింది. ఆపై హస్తి మహారాజు త్రిగర్త రాజధాని ప్రస్థల మొత్తాన్ని సందర్శించాడు. అక్కడి ప్రత్యేకతలన్నిటిని గమనించాడు. ఇంతకంటే అందమైన రాజధానిని తన రాజ్యంలో నిర్మించాలని అనుకున్నాడు. అదే విషయాన్ని తన ధర్మపత్ని యశోధర కు చెప్పాడు. అనంతరం హస్తి మహారాజు యశోధర తో తన రాజ్యానికి వచ్చాడు. తన మందిరంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసాడు. ఆసమావేశంలో యశోధర, సువర్ణాదేవి, సుహోత్రుడు, భరద్వాజుడు తదితరులు ఉన్నారు. అంత హస్తి మహా రాజు తన తండ్రి సుహోత్రునితో, " తండ్రి, మీరు అనేక దండ యాత్రలు చేసారు. నానా విధముల యజ్ఞయాగాదులు చేసారు. మన రాజ్య వాసులు రెండు తరములకు పైగా సుఖసంతోషాలతో ఉండేవిధంగా సంపదను కూడబెట్టారు. అది గమనించిన మన ప్రజలు మన కోసం వారి ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్దంగా ఉన్నారు. ఇది చాలా సంతోషించ వలసిన విషయం. అయితే నేను ప్రస్థలను చూచిన పిమ్మట మన రాజ్యానికి చక్కని రాజధాని లేదనిపిస్తుంది. ఇందుకు మీరేమంటారు?" అన్నాడు.
"దీనికి సమాధానం మన భరద్వాజులవారే చెప్పాలి. " కుమారునితో అన్నాడు సుహోత్రుడు.
"తప్పకుండా చెబుతాను సుహోత్ర. తప్పకుండా చెబు తాను. మీ తాతగారు భరత మహారాజుగారు భరత వంశ కర్త. వారి పేరు మీద జంబూ ద్వీపానికి భారత దేశం అనే పేరు వచ్చింది. భారత దేశంలో నివసించే వారందరూ మేం భారతీయులం మాది భారత జాతి అని చెప్పుకోవడానికి నేడు సహితం మహా గర్వపడుతున్నారు..
ఈ జంబూ ద్వీపాన ఇంద్ర కసేరు తామ్ర వర్ణ గభస్తి నాగద్వీప సౌమ్య గంధర్వ వరుణ అని ఎన్ని భాగాల జాతులు ఉన్నా అందరూ మాది భారత జాతి అని చెప్పుకోవడానికే ఎక్కువగా ఇష్ట పడుతారు.. భరత మహారాజు గొప్ప పరిపాలనా దక్షుడు. తన అవక్రపరాక్రమాలతో మహేంద్ర మలయ సహ్య శుక్తిమాన్ వింధ్య పరియాత్ర వంటి ప్రధాన పర్వత శ్రేణుల నడుమన ఉన్న భూమినంత తన స్వంతం చేసుకున్నాడు. ఆయనకు కాశీరాజు కుమార్తె సునందతో పాటు మరో ఇద్దరు భార్యలు ఉన్నారు.
మొదటి ఇద్దరు భార్యల ద్వారా భరతునికి తొమ్మిది మంది సంతానం కలిగారు. వారు మహా కౄరులుగ పెరిగారు. వారి కౄరత్వం వారి తల్లులనే హింసించే స్థాయికి ఎదిగింది. అప్పుడు ఆ తల్లులు ఆ తొమ్మిది మంది వ్యర్థ సంతానాన్ని సంహరించేసారు. ఆ సంహారాన్ని చూచి దుర్గామాత కూడా భయపడి పోయింది.
దుర్మార్గులకు సింహాసన బాధ్యత అప్పగించకూడదని ఆ తల్లులు పుత్ర వధతో నిరూపించి చూపించారు. నేను అప్పుడు భరతుని ప్రార్థనను అనుసరించి శాంతి యాగం చేయించాను. ఆపై భరతుని మూడవ భార్య అయిన సుమమ, భరతుల చేత సంతాన యాగం చేయించాను. వారికి భూమన్యుడు జన్మించాడు. భూమన్యుడు రాజయ్యాడు..
భూమన్యుడు మొదలైన వారు రాజ్యాభి వృద్ధికి కృషిచేసినంతగా రాజధాని నిర్మాణం నిమిత్తం కృషి చెయ్యలేదు. ఇక రాజధాని నిర్మాణం మన హస్తి మహారాజే చేపట్టాలి" అన్నాడు భరద్వాజుడు.
"చిత్తం భరద్వాజ మునీంద్ర చిత్తం. మీ మా టలను తప్పని సరిగా పాటిస్తాను. " రెండు చేతులు జోడించి భరద్వాజునికి నమస్కరిస్తూ అన్నాడు హస్తి మహారాజు.
"హస్తి మహారాజ! రాజధాని నిర్మాణ విషయంలో నువ్వు నీ ధర్మ పత్ని యశోధర సలహాలను తీసుకోవడం సముచితంగా ఉంటుంది. యశోధర సామాన్య వనిత కాదు. ఆమె శిక్షణ లో తయారైన సంసప్తకులు శత్రు బలాలను, బలహీనతలను చక్కగా గమనిస్తారు. వారు శత్రువులు బలవంతులని గమనిస్తే వారికి వెన్ను చూపరు. వారి అంత్యక్రియలను వారే చేసుకుని సమర రంగం లో కొదమ సింగాల్లా చెలరేగిపోతారు. సంసప్తకులకు యశోధర అలా శిక్షణ ఇచ్చింది. కావున నీ ధర్మపత్ని యశోధర సలహాలు నీకు మహోన్నత మేలు చేస్తాయని మరువకు. " అని హస్తి మహారాజు తో అన్నాడు భరద్వాజుడు.
"చిత్తం " అన్నాడు హస్తి మహారాజు. తదనంతరం
హస్తి మహారాజు రాజధాని నిర్మాణ నిమిత్తం తన ధర్మప త్ని యశోధర అభిప్రాయాలను అడిగాడు.
యశోధర మాటలను అనుసరించి హస్తి మహారాజు సామంత రాజులందరిని సతీ సమేతంగా సమావేశ పరిచాడు. తను రాజధాని నిర్మాణమునకు సంసిద్దమ య్యానని వారందరికి చెప్పాడు. సామంత రాజులందరూ మిక్కిలి సంతోషించారు. వారికి తెలిసిన సూచనలు ఇచ్చారు. హస్తి మహారాజు అందరి సూచనలను స్వీకరించాడు. ఆపై రాజధాని నిర్మాణ విషయంలో తన అభి ప్రాయాలను చెప్పమని ధర్మపత్ని యశోధరను అడిగాడు.
అప్పుడు యశోధర "అందరికీ ముందుగా వందనాలు. త్రిగర్త రాజధాని ప్రస్థల. అది మా పుట్టిల్లు. ఒకసారి మూడు నదుల అంతర్భాగం నుండి శత్రువులు ప్రస్థల మీదకు యుద్దానికి వచ్చారు. అప్పుడు నేను జలంధర విద్య ద్వారా సంసప్తకుల సహాయంతో శత్రువులను జలవలయంలో బంధించి చంపాను.. ఆ అనుభవా లన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రస్థలను మించిన రాజధానిని నిర్మించాలనే సంకల్పంతో ఉన్నాము.
కాల ధర్మ చక్రంలో ద్విపాద సంచార ధర్మం మనది. అందుకు తగ్గట్టుగానే మనం నడుచుకోవాలి. మన రాజధాని నిర్మాణం కూడా అందుకు తగ్గట్టుగానే ఉండాలి. రాజధాని లోని రాజ మందిరాలకు రకరకాల చలువరాళ్ళను సేకరించాలి. అలాగే రకరకాల ఉష్ణ రాళ్ళను, ఉష్ణశీతల రాళ్ళను సేకరించాలి. శ్రేష్టమైన మట్టిని, సున్నమును, జిగురును, రకరకాల చెట్లు నుండి వచ్చే చెక్కను సేకరించాలి. కొండ రాళ్ళను సేకరించాలి.
శ్రేష్టమైన ఇసుకను సేకరించాలి.
ఇక మన రాజధాని లో విస్తృతం గా గోసంపద ఉండాలి. మా మామగారి దయవలన మన రాజ్యం లో ధన కనక మణిమయాది విలువైన వస్తువులకు కొదవలేదు. మనకున్న ధనంలో పావు లో పావు శాతం ధనాన్ని వెచ్చిస్తే చాలు మనకు కావాల్సినంత గోసంపద వస్తుంది.
మత్స్య రాజ్యంలో గో సంపద పుష్కలంగా ఉంటుందని విన్నాము. " అంది యశోధర.
"ఆ గోసంపదను కొల్లగొడదాం మహారాణి " అని ఒక సామంత రాజు యశోధరతో అన్నాడు.
"దీనికి సమాధానం మన భరద్వాజులవారే చెప్పాలి. " కుమారునితో అన్నాడు సుహోత్రుడు.
"తప్పకుండా చెబుతాను సుహోత్ర. తప్పకుండా చెబు తాను. మీ తాతగారు భరత మహారాజుగారు భరత వంశ కర్త. వారి పేరు మీద జంబూ ద్వీపానికి భారత దేశం అనే పేరు వచ్చింది. భారత దేశంలో నివసించే వారందరూ మేం భారతీయులం మాది భారత జాతి అని చెప్పుకోవడానికి నేడు సహితం మహా గర్వపడుతున్నారు..
ఈ జంబూ ద్వీపాన ఇంద్ర కసేరు తామ్ర వర్ణ గభస్తి నాగద్వీప సౌమ్య గంధర్వ వరుణ అని ఎన్ని భాగాల జాతులు ఉన్నా అందరూ మాది భారత జాతి అని చెప్పుకోవడానికే ఎక్కువగా ఇష్ట పడుతారు.. భరత మహారాజు గొప్ప పరిపాలనా దక్షుడు. తన అవక్రపరాక్రమాలతో మహేంద్ర మలయ సహ్య శుక్తిమాన్ వింధ్య పరియాత్ర వంటి ప్రధాన పర్వత శ్రేణుల నడుమన ఉన్న భూమినంత తన స్వంతం చేసుకున్నాడు. ఆయనకు కాశీరాజు కుమార్తె సునందతో పాటు మరో ఇద్దరు భార్యలు ఉన్నారు.
మొదటి ఇద్దరు భార్యల ద్వారా భరతునికి తొమ్మిది మంది సంతానం కలిగారు. వారు మహా కౄరులుగ పెరిగారు. వారి కౄరత్వం వారి తల్లులనే హింసించే స్థాయికి ఎదిగింది. అప్పుడు ఆ తల్లులు ఆ తొమ్మిది మంది వ్యర్థ సంతానాన్ని సంహరించేసారు. ఆ సంహారాన్ని చూచి దుర్గామాత కూడా భయపడి పోయింది.
దుర్మార్గులకు సింహాసన బాధ్యత అప్పగించకూడదని ఆ తల్లులు పుత్ర వధతో నిరూపించి చూపించారు. నేను అప్పుడు భరతుని ప్రార్థనను అనుసరించి శాంతి యాగం చేయించాను. ఆపై భరతుని మూడవ భార్య అయిన సుమమ, భరతుల చేత సంతాన యాగం చేయించాను. వారికి భూమన్యుడు జన్మించాడు. భూమన్యుడు రాజయ్యాడు..
భూమన్యుడు మొదలైన వారు రాజ్యాభి వృద్ధికి కృషిచేసినంతగా రాజధాని నిర్మాణం నిమిత్తం కృషి చెయ్యలేదు. ఇక రాజధాని నిర్మాణం మన హస్తి మహారాజే చేపట్టాలి" అన్నాడు భరద్వాజుడు.
"చిత్తం భరద్వాజ మునీంద్ర చిత్తం. మీ మా టలను తప్పని సరిగా పాటిస్తాను. " రెండు చేతులు జోడించి భరద్వాజునికి నమస్కరిస్తూ అన్నాడు హస్తి మహారాజు.
"హస్తి మహారాజ! రాజధాని నిర్మాణ విషయంలో నువ్వు నీ ధర్మ పత్ని యశోధర సలహాలను తీసుకోవడం సముచితంగా ఉంటుంది. యశోధర సామాన్య వనిత కాదు. ఆమె శిక్షణ లో తయారైన సంసప్తకులు శత్రు బలాలను, బలహీనతలను చక్కగా గమనిస్తారు. వారు శత్రువులు బలవంతులని గమనిస్తే వారికి వెన్ను చూపరు. వారి అంత్యక్రియలను వారే చేసుకుని సమర రంగం లో కొదమ సింగాల్లా చెలరేగిపోతారు. సంసప్తకులకు యశోధర అలా శిక్షణ ఇచ్చింది. కావున నీ ధర్మపత్ని యశోధర సలహాలు నీకు మహోన్నత మేలు చేస్తాయని మరువకు. " అని హస్తి మహారాజు తో అన్నాడు భరద్వాజుడు.
"చిత్తం " అన్నాడు హస్తి మహారాజు. తదనంతరం
హస్తి మహారాజు రాజధాని నిర్మాణ నిమిత్తం తన ధర్మప త్ని యశోధర అభిప్రాయాలను అడిగాడు.
యశోధర మాటలను అనుసరించి హస్తి మహారాజు సామంత రాజులందరిని సతీ సమేతంగా సమావేశ పరిచాడు. తను రాజధాని నిర్మాణమునకు సంసిద్దమ య్యానని వారందరికి చెప్పాడు. సామంత రాజులందరూ మిక్కిలి సంతోషించారు. వారికి తెలిసిన సూచనలు ఇచ్చారు. హస్తి మహారాజు అందరి సూచనలను స్వీకరించాడు. ఆపై రాజధాని నిర్మాణ విషయంలో తన అభి ప్రాయాలను చెప్పమని ధర్మపత్ని యశోధరను అడిగాడు.
అప్పుడు యశోధర "అందరికీ ముందుగా వందనాలు. త్రిగర్త రాజధాని ప్రస్థల. అది మా పుట్టిల్లు. ఒకసారి మూడు నదుల అంతర్భాగం నుండి శత్రువులు ప్రస్థల మీదకు యుద్దానికి వచ్చారు. అప్పుడు నేను జలంధర విద్య ద్వారా సంసప్తకుల సహాయంతో శత్రువులను జలవలయంలో బంధించి చంపాను.. ఆ అనుభవా లన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రస్థలను మించిన రాజధానిని నిర్మించాలనే సంకల్పంతో ఉన్నాము.
కాల ధర్మ చక్రంలో ద్విపాద సంచార ధర్మం మనది. అందుకు తగ్గట్టుగానే మనం నడుచుకోవాలి. మన రాజధాని నిర్మాణం కూడా అందుకు తగ్గట్టుగానే ఉండాలి. రాజధాని లోని రాజ మందిరాలకు రకరకాల చలువరాళ్ళను సేకరించాలి. అలాగే రకరకాల ఉష్ణ రాళ్ళను, ఉష్ణశీతల రాళ్ళను సేకరించాలి. శ్రేష్టమైన మట్టిని, సున్నమును, జిగురును, రకరకాల చెట్లు నుండి వచ్చే చెక్కను సేకరించాలి. కొండ రాళ్ళను సేకరించాలి.
శ్రేష్టమైన ఇసుకను సేకరించాలి.
ఇక మన రాజధాని లో విస్తృతం గా గోసంపద ఉండాలి. మా మామగారి దయవలన మన రాజ్యం లో ధన కనక మణిమయాది విలువైన వస్తువులకు కొదవలేదు. మనకున్న ధనంలో పావు లో పావు శాతం ధనాన్ని వెచ్చిస్తే చాలు మనకు కావాల్సినంత గోసంపద వస్తుంది.
మత్స్య రాజ్యంలో గో సంపద పుష్కలంగా ఉంటుందని విన్నాము. " అంది యశోధర.
"ఆ గోసంపదను కొల్లగొడదాం మహారాణి " అని ఒక సామంత రాజు యశోధరతో అన్నాడు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
