06-02-2025, 09:46 PM
చివరకు మిగిలేది..
రచన: ఏ. అన్నపూర్ణ
ఆసరా రీహాబిటేషన్ సెంటర్ రూంలో ప్రాణం ఉండీ లేనట్టు బెడ్ మీద నిస్సహాయంగా పడుకుని వుంది దీప! కంట నీరుకూడా రాని మనసులోనే రోదిస్తోంది. ఎదురుగా ఉన్న కిటికీలోనుంచి కనబడే ప్రకృతి దృశ్యాలు మాత్రమే కాస్తంత ఓదార్పు నిస్తాయి ఆమెకు.
చెట్లమీద సందడిచేస్తూ గూడు కట్టుకుని పిల్లలను సాకే పక్షులు, పూలచుట్టూ తిరిగే భ్రమరాలు, రెక్కలు ఆర్చుతూ ఎగిరే రంగు రంగుల సీతాకోక చిలుకలు జీవిత సత్యానికి
ప్రతీకలుగా తోస్తున్నాయి ఆమెకు.
అందాలతో ఆకర్షించడం పూల తప్పా.. మకరందాన్ని కోరి చేరవచ్చిన భ్రమరానిది తప్పా! అంటే అది ప్రకృతి సహజ పరిణామం అంటారు.
కానీ మనుషులకు కొన్ని హద్దులు, నియంత్రణలు వున్నాయి. అదే పెళ్లి అనే కట్టుబాటు. పవిత్ర బంధం ! ఆ బంధాన్ని తెంచుకున్నాను చేజేతులా.. అనుకుంది.
ఇప్పుడు విచారించి ఉపయోగంలేదు. తిరిగిరాని అమూల్య జీవితం అది.
''దీపా ! ఇదిగో టాబ్లెట్ వేసుకునే టైం ఐనది..” అంటూ ఇచ్చాడు శేఖర్.
ఆలోచనలనుంచి బయటకు వచ్చి, టాబ్లెట్ అందుకుని అతడు చూడకుండా తలగడ కిందపెట్టి, నీళ్ళుమాత్రం తాగింది, తనకు ఇదే శిక్ష అనుకుంటూ.
కళ్ళు సరిగా కనిపించక, వెన్నెముక దెబ్బతిని, నడుము వొంగిపొయి, మెల్లిగా చేయగలిగిన సేవ చేస్తున్నాడు శేఖర్.. ఆమె దగ్గిరే ఉండి.
ఇది మరీ నరక యాతన అనిపిస్తోంది దీపకు. అతడి మంచితనాన్ని, జాలిని, ప్రేమనూ భరించడమే కష్టంగావుంది.
‘ఆ మంచితనానికి నేను అర్హురాలిని కాదు. దూరంగా వెళ్లిపోండి. నన్నుపశ్చాతాపంలో కాలి పోనివ్వండి.. ఒంటరిగా వదిలిపెట్టు శేఖర్ !’ అని అరవాలని ఉంది.. ఆమెకు.
ఏది చేయలేక నిస్సహాయంగా కళ్ళు మూసుకుంది.
భరద్వాజకు ఇద్దరు అమ్మాయిలు. రైల్వెలో వుద్యోగం చేసే అతడికి ఉత్తర్ ప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ డివిజన్లకు మధ్య ప్రతి రెండేళ్లకు బదిలీలు ఉంటాయి. అందువలన పెద్ద కూతురు దీపను విశాఖపట్నం అమ్మమ్మ గాయత్రి దగ్గిర ఉంచాడు. రెండో కూతురు రూపకి ఇంకా ఐదేళ్లు. కూడానే ఉంటుంది. ఇద్దరికీ ఏడు ఏళ్ళు తేడా.
హై కాలేజ్ చదువుకి దీపను విశాఖలో ఉంచాడు. తరచుగా చూసివెళ్లే వీలు ఉంటుందని. అక్కడే పీజి చేసింది దీప. గాయత్రికి గుడిలో పరిచయం వున్న అర్చకుడు ''దీపకి సంబంధాలు చూస్తున్నారా.. మంచి సంబంధం ఉంది. అబ్బాయి మెరైన్ ఇంజినీరు. మంచి కుటుంబం. ''అన్నాడు ఒకరోజు.
''మంచిమాట చెప్పారు. ఇప్పుడే నాకు ఆలోచన వచ్చింది. మిమ్ములను అడగాలని అనుకుంటున్నాను. అమ్మాయి, అల్లుడితో చెబుతాను. వివరాలు చెప్పండి” అని తెలుసుకుని భరద్వాజతో చెప్పింది.
''చదువు బాధ్యత తీసుకున్నారు. పెళ్లికూడా మీబాధ్యతే.. అలాగే చూదండి !” అన్నాడు భరద్వాజ, అత్తగారితో.
గాయత్రి, శేఖర్ తల్లి తండ్రులతో మాటాడి అన్ని సిద్ధం చేసాక భరద్వాజ వచ్చి పెళ్లి జరిపించి వెంటనే వెళ్లిపోయాడు.
మూడేళ్ళలో ఇద్దరు పిల్లలు కలిగారు దీపకి. వాళ్ళతోనే రోజులు గడిచిపోతుంటే శేఖర్ కంపెనీలు మారినా జాబ్ ఒకటే కనుక ఎప్పటిలా సెలవు ఇచ్చినపుడు వచ్చి వెడుతున్నాడు.
పిల్లలు హైకాలేజ్ చదువుకి వచ్చేరు. దీపకి టీవీ, బుక్స్, సినిమాలు, టైంపాస్ అయ్యాయి. ఒకరోజు మూవీ థియేటర్లో హఠాత్తుగా కనిపించాడు మధుకర్!
మధు శేఖరుకి బంధువు. పెళ్లి చూపులకు శేఖర్తో బాటు వచ్చాడు. బ్యాంకు ఆఫీసర్గా గుంటూరులో పనిచేసేవాడు.. ఆతర్వాత పెళ్ళికి వచ్చాడు. అప్పుడప్పుడు బంధువుల ఇళ్లలో శుభకార్యాలకు కలియడం జరిగేది.
అతడికి పెళ్లి జరిగినా, భార్య సునంద లెక్చరర్ గా పనిచేయడం వలన ఇద్దరూ ఓకే వూళ్ళో వుండే అవకాశం ఎప్పుడూ రాలేదు. అతను కూడా శేఖరులాగే సెలవులకు సునంద వున్న వూరు వెళ్లడమో, ఆమె మధు వున్న చోటుకి రావడమో జరిగేది.
ఇలా చెరొక చోట వుండే భార్యా భర్తలు దాంపత్య జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించే అవకాశం లేకుండా పోయినది. ఉద్యోగాన్ని వచ్చే డబ్బును వదులుకోలేదు.. కానీ.. సంతోషాలను వదులుకున్నారు. డబ్బు మహిమ అది !
మధుకర్ పూల మధువును గ్రోలే భ్రమరం లాంటి స్వభావం గలవాడు. పేరు అతడికి సరిగ్గా సరిపోతుంది. ఏవూళ్లో ఉంటే అక్కడో మగువతో ఎంజాయ్ చేసేవాడు. తెలిసి, సునంద గొడవపడేది. అలా అని జాబుని వదులుకోదు. ఇప్పుడు వైజాగ్ వచ్చాడు.
దీప సాన్నిహిత్యం లభించింది. ఒంటరిగా పిల్లలతో ఇబ్బందులు పడుతోంది. సహాయంగా వుంటాను అనుకున్నాడు. శేఖర్ గురించి పూర్తిగా తెలుసును.
అతను అమాయకుడు. మధుకర్ వైజాగ్ రావడం నా కుటుంబానికి అండ, నాకు నిశ్చింత.. అని సంతోషించాడు. అంతేకానీ నాకూ దీపకి మధ్య బంధం సడలిపోతుందని
గ్రహించలేదు.
అలాగే వాళ్ళ ముగ్గురి జీవితాలు గడిచి పోతున్నాయి.
అటు సునంద, ఇటు శేఖర్ ఇద్దరూ నష్టపోయారు. ఈ విషయాన్ని సునంద త్వరలోనే గ్రహించింది. మధు బుద్ధి తెలుసుకుంది.
శేఖర్ చాలా ఆలస్యంగా గ్రహించాడు. ఐనా దీపని నిలదీయలేదు. మధుని రావద్దని చెప్పలేదు.
దీపను మందలించి పరువును పోగొట్టుకోలేడు. అందుకే తెలియనట్టు దూరంగా ఉండటం మొదలుపెట్టేడు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడిక గొడవ పడితే వాళ్ళు కూడా దూరం అవుతారు.
రచన: ఏ. అన్నపూర్ణ
ఆసరా రీహాబిటేషన్ సెంటర్ రూంలో ప్రాణం ఉండీ లేనట్టు బెడ్ మీద నిస్సహాయంగా పడుకుని వుంది దీప! కంట నీరుకూడా రాని మనసులోనే రోదిస్తోంది. ఎదురుగా ఉన్న కిటికీలోనుంచి కనబడే ప్రకృతి దృశ్యాలు మాత్రమే కాస్తంత ఓదార్పు నిస్తాయి ఆమెకు.
చెట్లమీద సందడిచేస్తూ గూడు కట్టుకుని పిల్లలను సాకే పక్షులు, పూలచుట్టూ తిరిగే భ్రమరాలు, రెక్కలు ఆర్చుతూ ఎగిరే రంగు రంగుల సీతాకోక చిలుకలు జీవిత సత్యానికి
ప్రతీకలుగా తోస్తున్నాయి ఆమెకు.
అందాలతో ఆకర్షించడం పూల తప్పా.. మకరందాన్ని కోరి చేరవచ్చిన భ్రమరానిది తప్పా! అంటే అది ప్రకృతి సహజ పరిణామం అంటారు.
కానీ మనుషులకు కొన్ని హద్దులు, నియంత్రణలు వున్నాయి. అదే పెళ్లి అనే కట్టుబాటు. పవిత్ర బంధం ! ఆ బంధాన్ని తెంచుకున్నాను చేజేతులా.. అనుకుంది.
ఇప్పుడు విచారించి ఉపయోగంలేదు. తిరిగిరాని అమూల్య జీవితం అది.
''దీపా ! ఇదిగో టాబ్లెట్ వేసుకునే టైం ఐనది..” అంటూ ఇచ్చాడు శేఖర్.
ఆలోచనలనుంచి బయటకు వచ్చి, టాబ్లెట్ అందుకుని అతడు చూడకుండా తలగడ కిందపెట్టి, నీళ్ళుమాత్రం తాగింది, తనకు ఇదే శిక్ష అనుకుంటూ.
కళ్ళు సరిగా కనిపించక, వెన్నెముక దెబ్బతిని, నడుము వొంగిపొయి, మెల్లిగా చేయగలిగిన సేవ చేస్తున్నాడు శేఖర్.. ఆమె దగ్గిరే ఉండి.
ఇది మరీ నరక యాతన అనిపిస్తోంది దీపకు. అతడి మంచితనాన్ని, జాలిని, ప్రేమనూ భరించడమే కష్టంగావుంది.
‘ఆ మంచితనానికి నేను అర్హురాలిని కాదు. దూరంగా వెళ్లిపోండి. నన్నుపశ్చాతాపంలో కాలి పోనివ్వండి.. ఒంటరిగా వదిలిపెట్టు శేఖర్ !’ అని అరవాలని ఉంది.. ఆమెకు.
ఏది చేయలేక నిస్సహాయంగా కళ్ళు మూసుకుంది.
భరద్వాజకు ఇద్దరు అమ్మాయిలు. రైల్వెలో వుద్యోగం చేసే అతడికి ఉత్తర్ ప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ డివిజన్లకు మధ్య ప్రతి రెండేళ్లకు బదిలీలు ఉంటాయి. అందువలన పెద్ద కూతురు దీపను విశాఖపట్నం అమ్మమ్మ గాయత్రి దగ్గిర ఉంచాడు. రెండో కూతురు రూపకి ఇంకా ఐదేళ్లు. కూడానే ఉంటుంది. ఇద్దరికీ ఏడు ఏళ్ళు తేడా.
హై కాలేజ్ చదువుకి దీపను విశాఖలో ఉంచాడు. తరచుగా చూసివెళ్లే వీలు ఉంటుందని. అక్కడే పీజి చేసింది దీప. గాయత్రికి గుడిలో పరిచయం వున్న అర్చకుడు ''దీపకి సంబంధాలు చూస్తున్నారా.. మంచి సంబంధం ఉంది. అబ్బాయి మెరైన్ ఇంజినీరు. మంచి కుటుంబం. ''అన్నాడు ఒకరోజు.
''మంచిమాట చెప్పారు. ఇప్పుడే నాకు ఆలోచన వచ్చింది. మిమ్ములను అడగాలని అనుకుంటున్నాను. అమ్మాయి, అల్లుడితో చెబుతాను. వివరాలు చెప్పండి” అని తెలుసుకుని భరద్వాజతో చెప్పింది.
''చదువు బాధ్యత తీసుకున్నారు. పెళ్లికూడా మీబాధ్యతే.. అలాగే చూదండి !” అన్నాడు భరద్వాజ, అత్తగారితో.
గాయత్రి, శేఖర్ తల్లి తండ్రులతో మాటాడి అన్ని సిద్ధం చేసాక భరద్వాజ వచ్చి పెళ్లి జరిపించి వెంటనే వెళ్లిపోయాడు.
మూడేళ్ళలో ఇద్దరు పిల్లలు కలిగారు దీపకి. వాళ్ళతోనే రోజులు గడిచిపోతుంటే శేఖర్ కంపెనీలు మారినా జాబ్ ఒకటే కనుక ఎప్పటిలా సెలవు ఇచ్చినపుడు వచ్చి వెడుతున్నాడు.
పిల్లలు హైకాలేజ్ చదువుకి వచ్చేరు. దీపకి టీవీ, బుక్స్, సినిమాలు, టైంపాస్ అయ్యాయి. ఒకరోజు మూవీ థియేటర్లో హఠాత్తుగా కనిపించాడు మధుకర్!
మధు శేఖరుకి బంధువు. పెళ్లి చూపులకు శేఖర్తో బాటు వచ్చాడు. బ్యాంకు ఆఫీసర్గా గుంటూరులో పనిచేసేవాడు.. ఆతర్వాత పెళ్ళికి వచ్చాడు. అప్పుడప్పుడు బంధువుల ఇళ్లలో శుభకార్యాలకు కలియడం జరిగేది.
అతడికి పెళ్లి జరిగినా, భార్య సునంద లెక్చరర్ గా పనిచేయడం వలన ఇద్దరూ ఓకే వూళ్ళో వుండే అవకాశం ఎప్పుడూ రాలేదు. అతను కూడా శేఖరులాగే సెలవులకు సునంద వున్న వూరు వెళ్లడమో, ఆమె మధు వున్న చోటుకి రావడమో జరిగేది.
ఇలా చెరొక చోట వుండే భార్యా భర్తలు దాంపత్య జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించే అవకాశం లేకుండా పోయినది. ఉద్యోగాన్ని వచ్చే డబ్బును వదులుకోలేదు.. కానీ.. సంతోషాలను వదులుకున్నారు. డబ్బు మహిమ అది !
మధుకర్ పూల మధువును గ్రోలే భ్రమరం లాంటి స్వభావం గలవాడు. పేరు అతడికి సరిగ్గా సరిపోతుంది. ఏవూళ్లో ఉంటే అక్కడో మగువతో ఎంజాయ్ చేసేవాడు. తెలిసి, సునంద గొడవపడేది. అలా అని జాబుని వదులుకోదు. ఇప్పుడు వైజాగ్ వచ్చాడు.
దీప సాన్నిహిత్యం లభించింది. ఒంటరిగా పిల్లలతో ఇబ్బందులు పడుతోంది. సహాయంగా వుంటాను అనుకున్నాడు. శేఖర్ గురించి పూర్తిగా తెలుసును.
అతను అమాయకుడు. మధుకర్ వైజాగ్ రావడం నా కుటుంబానికి అండ, నాకు నిశ్చింత.. అని సంతోషించాడు. అంతేకానీ నాకూ దీపకి మధ్య బంధం సడలిపోతుందని
గ్రహించలేదు.
అలాగే వాళ్ళ ముగ్గురి జీవితాలు గడిచి పోతున్నాయి.
అటు సునంద, ఇటు శేఖర్ ఇద్దరూ నష్టపోయారు. ఈ విషయాన్ని సునంద త్వరలోనే గ్రహించింది. మధు బుద్ధి తెలుసుకుంది.
శేఖర్ చాలా ఆలస్యంగా గ్రహించాడు. ఐనా దీపని నిలదీయలేదు. మధుని రావద్దని చెప్పలేదు.
దీపను మందలించి పరువును పోగొట్టుకోలేడు. అందుకే తెలియనట్టు దూరంగా ఉండటం మొదలుపెట్టేడు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడిక గొడవ పడితే వాళ్ళు కూడా దూరం అవుతారు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
