Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#50
రథంతరి                                
[font=var(--ricos-font-family,unset)][Image: image-2025-01-31-102834557.png][/font]

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు



తను ఎన్నుకున్న విజ్ఞాన ప్రపంచ అంచులను తాకుతూ, ఆద్యాత్మిక ప్రపచంలో ఆహ్లాదంగా, నిస్వార్థంగా, నిర్మలంగ నివసించి పరవసించే ప్రతివారు మానవులకే కాదు, దేవతలకు కూడ ఆదర్శవంతంగా నిలుస్తారు. అలాంటి వారు దేవతలకు సహితం అప్పుడప్పుడు అవసర మవుతుంటారు. అలాంటి వారిని అసురులు కూడా తమ వశం చేసుకోవాలని చూస్తారు. అయితే వారు అసురులకు చిక్కరు. అలాగని వారు అసురులకు దూరంగానూ ఉండరు. వారు అత్యవసరం అనుకుంటే అసురులకు దగ్గరయ్యి అసురులలోని అసురత్వాన్ని అంత మొందించి అసురులను సురులుగ మలుస్తారు. అలాంటి వారిలో అగ్రగణ్యురాలు రథంతరి. 



ఇలను పవిత్రంగా ఉంచడానికి మహర్షులతో అనేక యాగాలు చేయించిన ఈలనుని కుమార్తె రథంతరి. ఈలనుని మహర్షులు అనేక పవిత్ర నామధేయాలతో పిలిచేవారు. కొందరు మహర్షులు ఈలనుని దీప్తివంత అంటే మరికొందరు సోమవంత అని, ఇంకొందరు హోత అని పిలిచేవారు.. వేద ధర్మాలకు అనుగుణంగా ఈలనుడు ప్రకృతిని పరిరక్షించేవాడు. భూమి మీద పుట్టి, చెట్లలో పెరిగే అగ్నిని సంరక్షించేవాడు. చెట్టులోని అగ్ని తో సురయాగాలు చేయించేవాడు. 



 పుట్టుకతోనే సోమవంత తేజంతో ప్రకాసించిన తన కుమార్తెను చూసిన ఈలనుడు మహదానంద పడ్డాడు. వశిష్టాది మహర్షుల ఆదేశానుసారం ఈలనుడు తన కుమార్తెను చేతులలో ఉంచుకుని యాగాగ్ని నడుమ నిలబడి కుమార్తెకు "రథంతరి" అని నామకరణం చేసాడు. 



 రథంతరి కిలకిల నవ్వులను చూసి ప్రకృతి పరవసించిపోయేది. లేళ్ళు చెంగు చెంగున ఎగిరేవి. కుందేళ్ళు మహదానందంతో గంతులు వేసేవి. రథంతరి కిల కిల నవ్వులకు అనుగుణంగా యాగాగ్నులు ఎగసిపడేవి. పర్ణశాలల దగ్గర పచ్చదనం కళకళలాడేది. 



 రథంతరికి ఈలనుడు తనకు తెలిసిన విద్య లన్నిటిని నేర్పించాడు. "తండ్రి తనయుని లేదా తనయ ను చూచినట్లు యాగాగ్ని చూడాలి " అని ఈలనుడు రథంతరికి నూరిపోసాడు. అలాగే తనకు తెలిసిన మహర్షులు, బ్రహ్మర్షులందరిని పిలిపించాడు. వారందరి చేత నానా విధము లైన యాగములు చేయించాడు. 



ఆయా యాగాదులు చేసే విధానం అంతటిని తన కూతురు రంథంతరి ని దగ్గరుండి చూసి నేర్చుకోమన్నాడు. రథంతరి తండ్రి మాటలను అనుసరించి మహర్షులు, బ్రహ్మర్షులు చేసే యాగాదులన్నిటిని ప్రత్య క్షంగా చూచింది. ఆయా యాగాల అంతరార్థాలను ఔపాసన పట్టింది. యాగ నైవేద్యాదులను నిరుపేదలకు పెట్టి, వారి కడుపు నింపింది. వనంలో లభించే ఔషద మొక్కలతో నిరు పేదల గ్రామాలకు వెళ్ళి వారికి వైద్యం చేసింది. 



 అనంతరం బ్రహ్మర్షులు రథంతరిని బ్రహ్మ దేవుని గురించి తపస్సు చేయమని ప్రోత్స హించారు. రథంతరి బ్రహ్మర్షుల మాటలను అనుసరించి బ్రహ్మ దేవుని గురించి తపస్సు చేసింది. రథంతరి బ్రహ్మ దేవుని గురించి తపస్సు చేస్తుందని తెలుసుకున్న నిరుపేదలు రథంతరి తపస్సు విజయవంతం కావాలి అని వారు కూడా వారికి తెలిసిన పూజలు చేసారు. 



 బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరు కోమని రథంతరిని అడిగాడు. అప్పుడు రథంతరి, "ఆరోగ్యమే మహాభాగ్యము. అనారోగ్యమే పలు సమస్యలకు నిలయం.. కావున పదుగురి అనారోగ్యాన్ని తగ్గించే సామర్థ్యం నాకు ప్రసాదించు బ్రహ్మ దేవ. " అని వరం కోరు కుంది. 



 రథంతరి కోరికను విన్న బ్రహ్మ దేవుడు మిక్కిలి సంతోషించాడు. , "రథంతరి, నువ్వు మానవుల ఆరోగ్యాన్నే కాదు, దేవతల ఆరోగ్యాన్ని కూడా కుదుటపరుస్తావు. " అని రథంతరిని ఆశీర్వదించి బ్రహ్మ దేవుడు అంతర్థానమైపోయాడు. రథంతరి ఆనంద హృదయ సంద్రాన తేలియాడింది
.................... 
 త్రస మహారాజు తన కుమారుడు ఇలినుడుని తన తర్వాత రాజుగ ప్రకటించాడు. అందకు సామంత రాజులందరు సంతోషించారు. ఇలినుడి ప్రాణ స్నేహితుడు తరంతర మహారాజు మిక్కిలి సంతోషించాడు. తరంతర మహారాజు సామంత రాజులు ఇలినుడుకి గొప్ప గొప్ప బహుమతులను అందించారు. 



 సామంత రాజుల సంతోషం వెనుకన ఉన్న కించిత్ ఖేదాన్ని ఇలినుడు గుర్తించాడు. అంత సామంత రాజులతో ఇలినుడు "సామంత రాజులారా! మీ సంతోషం వెనుకన ఉన్న కించిత్ ఖేదాన్ని నేను గమనించాను. మా జననీజనకులు కాళింద త్రసల సాక్షిగా చెబుతున్నాను. మీ కించిత్ ఖేదమేమిటో అర్థం చేసుకు న్నాను. మన మన రాజ్యాలలో అంటు రోగాల బెడద, మూర్చ రోగాల బెడద కొంచెం ఎక్కువగానే ఉంది. దీనిని రూపు మాపడానికి మా జననీజనకులు బాగానే కృషి చే సారు. అయితే ఫలితం మాత్రం స్వల్పంగా దక్కింది. నేను సమస్యల మీదనే ఎక్కువ గా దృష్టి పెడతాను అని మీకు మాట ఇస్తున్నాను. 



 ముఖ్యంగా తురుడు, జఢుడు వంటి మన త్రు రాజులు పదిమంది వరకు ఉన్నారు. వారు మా తండ్రిగారు త్రస మహా రాజు గారిని, మా తాతగారు, త్రస మహారాజు తండ్రి గారైన మతినారు మహారాజు గారిని సమర రంగాన ఎదుర్కొనలేక వారి వారి కుటిల మనస్తత్వం గల మనుషులను మన రాజ్యాలకు పంపి మన తటాకములను, చెరువులను, కాలువలను, బావులను జలమున్న ప్రతి ప్రాంతాన్ని రసాయన లేపనాలతో కలుషితం చేస్తున్నారు. జలాన్ని తాగిన మన జనం చనిపోవడం లేదు కానీ రకరకాల అంటురోగాలకు గుర వుతున్నారు. 



 శత్రు రాజులు కొంతమంది మహా తెలివిగా ప్రవర్తి స్తున్నారు. వారికి మన ప్రజల శక్తి సామర్థ్యాల మీద, మన ప్రజల జ్ఞానం మీద ముఖ్యంగా మన ప్రజల అదృష్ట దీపికల మీద విపరీతమైన నమ్మకం ఉంది. అందుకే వారు ప్రజలను అనారోగ్యాలకు గురి చేస్తున్నారు కానీ వారిని చంపే ప్రయత్నాలు చేయడం లేదు. 



అనారోగ్యం తో మన ప్రజలు ఎవరైనా వారి వారి రాజ్యాలకు వెళితే వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. మన ప్రజల శక్తి యుక్తులను, అదృష్ట దీపికలను వారు తమకు అనుకూలంగా వినియోగించు కుంటున్నారు. అయితే మన ప్రజలు అధిక శాతం మంది అనారోగ్యానికి గురైనప్పటికీ రాజ్యాన్ని వదలడం లేదు. వారి దేశభక్తి నిజంగ అద్భుతం. అమోఘం. అనిర్వచనీయం. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - సారస్వతి - by k3vv3 - 31-01-2025, 10:31 AM



Users browsing this thread: 1 Guest(s)