15-01-2025, 09:39 PM
శుభాంగి
[font=var(--ricos-font-family,unset)]
[/font]
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
యదువంశంలో ఎందరెందరో రాజులు, మహా రాజులు, రాజర్షులు, మహానుభావులు మరెందరో అవతార పురుషులు, అంశావతార పురుషలు ఉన్నారు. వారంత యుగ ధర్మాన్ని పాటిస్తూ వారి వారి రాజ్యాలను విస్తరించారు. ప్రజలను కన్న బిడ్డలవలే కాపాడారు. ప్రజల శక్తి యుక్తులను, మంచి చెడులను గమనించి వారిని తగిన విధంగా ఆదరించారు. వారి వారి ధర్మాలను వారు ధర్మ బద్ధంగా నిర్వర్తించారు. అనేక మంది మహానుభావులను, ఋషులను, మహర్షులను, బ్రహ్మర్షులను సేవించారు.
రాజసూయాది రకరకాల యాగాలను చేసి దేవ గంధర్వ కిన్నెర కింపురుషాది సమస్త గణాల వరాలను పొందారు. అనేకమంది అసురులను అంత మొందించారు. అవనిమాతకు ఆనందాన్ని కలిగించారు. అలాంటి యదువంశ రాజులలో దశార్హ మహా రాజు ఒకడు. అతని మహోన్నత పరిపాలన కారణంగానే అతని పేర దశార్హ మహా రాజ్యం ఏర్పడింది. దశార్హ మహా రాజు సుపరిపాలనలో రాజ్యంలోని ప్రజలు సుఖ సంతోషాలతో హాయిగా ఆనందంగా జీవించేవారు.
దశార్హ మహారాజ పుత్రిక శుభాంగి. పేరుకు తగిన ఆకారం కలది. ఏ పని చేసేటప్పుడైన ఆమె ఎదురు వస్తే చాలు అన్నీ శుభాలే జరుగుతాయి అని రాణి మందిరంలోని వారేకాదు ఆ రాజ్యంలోని చాలా మంది అనుకునేవారు. ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు సహితం వారు యజ్ఞయాగాది శుభకార్యాలను చేసేటప్పు డు శుభాంగినే తమకు ఎదురురమ్మనేవారు. వయసు తో నిమిత్తం లేకుండా ప్రతి శుభ కార్యంలో శుభాంగికే ప్రథమ తాంబూలం ఇచ్చేవారు.
శుభాంగి ఋషుల సేవన, మహర్షుల సేవన, బ్రహ్మర్షుల సేవన వేదపురాణేతిహాసాలన్నిటిని చక్కగా వంట పట్టించుకుంది.. వేద మంత్రాలలోని విజ్ఞాన అంశాలను, వేద మంత్రోచ్ఛారణలోని శారీక విజ్ఞాన అంశాల ను తనకు తెలిసినంత మేర తన స్నేహితురాళ్ళకు, రాజ మందిరాలలోని పరిచారికా సమూహంనకు చక్కగా వివరించి చెప్పేది. శుభాంగిని సందర్శిస్తే చాలు సమస్త రోగాలు మటుమాయం అవుతాయి అని దశార్హ రాజ్యం లోని ప్రజలు అనుకునేవారు. ఆమెలో అశ్వనీదేవతల అంశ ఉందనుకునేవారు.
శుభాంగి సంప్రాప్తయౌవనవతి అయ్యింది. శుభాంగిని చూడగానే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ రెండు చేతులెత్తి నమస్కరించేవారు.
హస్తినాపురం ను పరిపాలించే మహారాజు సంవరుణు. అతని ధర్మపత్ని తపతి వారి ముద్దుల కమారుడు కురువు. వేద పురాణేతిహాసాల విద్యలను, అస్త్రశస్త్ర ప్రయోగాది విద్యలను, రాజనీతి విద్యలను, భవబంధ సంబంధ విద్యలను సమస్తం శాస్త్రోక్తంగా అభ్యసించాడు. అటుపిమ్మట తన రాజ్యం లోని అన్ని ప్రాంతాలను ప్రత్యక్షంగా సందర్శించాడు. ప్రతి ప్రాంతంలో నివసించే ప్రజల కష్టసుఖాలను ప్రత్యక్షంగా చూసాడు. వారి కష్టాలను చూడటమేగాక వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాడు.
రాజ్యప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడంలో కుమారుడు కురువు చూపించే ఆసక్తిని గమనించిన సంవరణ మహారాజు పుత్రునికి మకుటాభిషేకం చేయాలనుకున్నాడు. అదే విషయాన్ని తన ధర్మపత్ని తపతి కి చెప్పాడు. అందుకు తపతి, "నాథ! మీ ఆలోచన మహా శ్రేష్టంగా ఉంది. ఈ విషయం లో మన కుల గురువు వసిష్ట మహర్షిగారిని కూడా సంప్రదించండి. వారి దివ్య ఆలోచన మేరకు ముందడుగు వేయండి. " అని అంది.
తపతి మాటలను విన్న సంవరణ మహారాజు, " దేవీ మన మూల గురువు, కుల గురువు అయిన వసిష్ట మహర్షి నేను ఏ పనిని చేసేటప్పుడయిన ముందుగా నీ ధర్మపత్ని సలహా తీసుకో అని అంటారు.
ఈ హస్తినాపురం కు నీ వలన జరిగిన మేలు అంతా యింత కాదు. ఒకప్పుడు వాతావరణ కాలుష్య ప్రభావం తో హస్తినాపురం లో సూర్యుని రశ్మి ప్రవేసించడమే కష్టమైపోయింది. అప్పుడు ప్రజల దేహాలు మంచు గడ్డల్లా మారి పోసాగాయి. అప్పుడే సూర్య పుత్రిక వైన నిన్ను నేను వివాహం చేసుకుని హస్తినాపురం తీసుకు వచ్చాను. అశ్వనీ దేవ తేజంతో ప్రకాశించే నువ్వు హస్తినాపురం రాగానే నీ శరీర తేజస్సును విస్తరింపచేసావు.
నీ శరీర తేజస్సులోని విపరీతమైన వేడి ప్రభావంతో హస్తినాపురం లోని మంచుదనం కరిగిపోయింది. వాతావరణ సమతుల్యత ఏర్పడింది. నాటినుండి ప్రజలు ఆనందంగా జీవించసాగారు. అందుకే వసిష్ట మహర్షి నువ్వు ఈ రాజ్య సంరక్షణ దేవతవు అని అంటారు. " అని అన్నాడు.
సంవరణుడు వసిష్ట మహర్షిని, హితులను, పురోహి తులను తదితరులను సంప్రదించి ఒక శుభ ముహూర్తాన కురువుకు మకుటాభిషేకం చేసాడు. సూర్య భగవానుని అనుగ్రహంతో, వసిష్ట మహర్షి అనుగ్రహంతో, నీ తల్లి తపతి అనుగ్రహంతో హస్తినాపురం ను పరిపాలించమని కుమారునికి చెప్పాడు. కురు మహారాజు అలాగే అన్నాడు.
కురు మహారాజు వసిష్ట మహర్షి ఆదేశానుసారం తన తండ్రి సంవరుణుడు మీద కత్తి కట్టిన పాంచాల రాజు మీదకు యుద్దానికి వెళ్ళాడు. పాంచాల రాజు కురు మహారాజు ల నడుమ కనీవినీ ఎరుగని రీతిన సమరం జరిగింది. కురు మహారాజు గజ బలం చూసి పాంచాల రాజు భయపడ్డాడు. సమరావనిలో ఏనుగులన్నీ ఒక్కసారి ఘీంకరించాయి. ఆ శబ్దానికి పాంచాల రాజు సైన్యంలో వణుకు పుట్టింది.
మత్య్స, వరాహ, కూర్మాది ఆకారాల రథాలతో, గుర్రాల సకిలింపులతో సమరాంగణం విచిత్ర శోభను సంతరించుకుంది. శత్రువుల ఊహలకు అందకుండా రకరకాల వ్యూహ నైపుణ్యాలతో కురు మహారాజు కదనరంగంలో చెలరేగిపోయాడు. పాంచాల రాజు శక్తి పూర్తిగా క్షీణించిపోయింది. చివరకు పాంచాల రాజు కాళ్ళ బేరానికి వచ్చాడు.
కురు మహారాజు పాంచాల రాజు ను క్షమించాడు. తనకు సామంత రాజు గా ఉండమని కురు మహా రాజు పాంచాల రాజును కోరాడు.. పాంచాల రాజు అందుకు సమ్మతించాడు. సామంత రాజ ధర్మాన్ని అనుసరించి పాంచాల రాజు వసిష్ట మహర్షి తో తన రాజ్యంలో మహా యాగం చేయించాడు.
[font=var(--ricos-font-family,unset)]
![[Image: image-2025-01-15-213732504.png]](https://i.ibb.co/hmTS09b/image-2025-01-15-213732504.png)
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
యదువంశంలో ఎందరెందరో రాజులు, మహా రాజులు, రాజర్షులు, మహానుభావులు మరెందరో అవతార పురుషులు, అంశావతార పురుషలు ఉన్నారు. వారంత యుగ ధర్మాన్ని పాటిస్తూ వారి వారి రాజ్యాలను విస్తరించారు. ప్రజలను కన్న బిడ్డలవలే కాపాడారు. ప్రజల శక్తి యుక్తులను, మంచి చెడులను గమనించి వారిని తగిన విధంగా ఆదరించారు. వారి వారి ధర్మాలను వారు ధర్మ బద్ధంగా నిర్వర్తించారు. అనేక మంది మహానుభావులను, ఋషులను, మహర్షులను, బ్రహ్మర్షులను సేవించారు.
రాజసూయాది రకరకాల యాగాలను చేసి దేవ గంధర్వ కిన్నెర కింపురుషాది సమస్త గణాల వరాలను పొందారు. అనేకమంది అసురులను అంత మొందించారు. అవనిమాతకు ఆనందాన్ని కలిగించారు. అలాంటి యదువంశ రాజులలో దశార్హ మహా రాజు ఒకడు. అతని మహోన్నత పరిపాలన కారణంగానే అతని పేర దశార్హ మహా రాజ్యం ఏర్పడింది. దశార్హ మహా రాజు సుపరిపాలనలో రాజ్యంలోని ప్రజలు సుఖ సంతోషాలతో హాయిగా ఆనందంగా జీవించేవారు.
దశార్హ మహారాజ పుత్రిక శుభాంగి. పేరుకు తగిన ఆకారం కలది. ఏ పని చేసేటప్పుడైన ఆమె ఎదురు వస్తే చాలు అన్నీ శుభాలే జరుగుతాయి అని రాణి మందిరంలోని వారేకాదు ఆ రాజ్యంలోని చాలా మంది అనుకునేవారు. ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు సహితం వారు యజ్ఞయాగాది శుభకార్యాలను చేసేటప్పు డు శుభాంగినే తమకు ఎదురురమ్మనేవారు. వయసు తో నిమిత్తం లేకుండా ప్రతి శుభ కార్యంలో శుభాంగికే ప్రథమ తాంబూలం ఇచ్చేవారు.
శుభాంగి ఋషుల సేవన, మహర్షుల సేవన, బ్రహ్మర్షుల సేవన వేదపురాణేతిహాసాలన్నిటిని చక్కగా వంట పట్టించుకుంది.. వేద మంత్రాలలోని విజ్ఞాన అంశాలను, వేద మంత్రోచ్ఛారణలోని శారీక విజ్ఞాన అంశాల ను తనకు తెలిసినంత మేర తన స్నేహితురాళ్ళకు, రాజ మందిరాలలోని పరిచారికా సమూహంనకు చక్కగా వివరించి చెప్పేది. శుభాంగిని సందర్శిస్తే చాలు సమస్త రోగాలు మటుమాయం అవుతాయి అని దశార్హ రాజ్యం లోని ప్రజలు అనుకునేవారు. ఆమెలో అశ్వనీదేవతల అంశ ఉందనుకునేవారు.
శుభాంగి సంప్రాప్తయౌవనవతి అయ్యింది. శుభాంగిని చూడగానే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ రెండు చేతులెత్తి నమస్కరించేవారు.
హస్తినాపురం ను పరిపాలించే మహారాజు సంవరుణు. అతని ధర్మపత్ని తపతి వారి ముద్దుల కమారుడు కురువు. వేద పురాణేతిహాసాల విద్యలను, అస్త్రశస్త్ర ప్రయోగాది విద్యలను, రాజనీతి విద్యలను, భవబంధ సంబంధ విద్యలను సమస్తం శాస్త్రోక్తంగా అభ్యసించాడు. అటుపిమ్మట తన రాజ్యం లోని అన్ని ప్రాంతాలను ప్రత్యక్షంగా సందర్శించాడు. ప్రతి ప్రాంతంలో నివసించే ప్రజల కష్టసుఖాలను ప్రత్యక్షంగా చూసాడు. వారి కష్టాలను చూడటమేగాక వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాడు.
రాజ్యప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడంలో కుమారుడు కురువు చూపించే ఆసక్తిని గమనించిన సంవరణ మహారాజు పుత్రునికి మకుటాభిషేకం చేయాలనుకున్నాడు. అదే విషయాన్ని తన ధర్మపత్ని తపతి కి చెప్పాడు. అందుకు తపతి, "నాథ! మీ ఆలోచన మహా శ్రేష్టంగా ఉంది. ఈ విషయం లో మన కుల గురువు వసిష్ట మహర్షిగారిని కూడా సంప్రదించండి. వారి దివ్య ఆలోచన మేరకు ముందడుగు వేయండి. " అని అంది.
తపతి మాటలను విన్న సంవరణ మహారాజు, " దేవీ మన మూల గురువు, కుల గురువు అయిన వసిష్ట మహర్షి నేను ఏ పనిని చేసేటప్పుడయిన ముందుగా నీ ధర్మపత్ని సలహా తీసుకో అని అంటారు.
ఈ హస్తినాపురం కు నీ వలన జరిగిన మేలు అంతా యింత కాదు. ఒకప్పుడు వాతావరణ కాలుష్య ప్రభావం తో హస్తినాపురం లో సూర్యుని రశ్మి ప్రవేసించడమే కష్టమైపోయింది. అప్పుడు ప్రజల దేహాలు మంచు గడ్డల్లా మారి పోసాగాయి. అప్పుడే సూర్య పుత్రిక వైన నిన్ను నేను వివాహం చేసుకుని హస్తినాపురం తీసుకు వచ్చాను. అశ్వనీ దేవ తేజంతో ప్రకాశించే నువ్వు హస్తినాపురం రాగానే నీ శరీర తేజస్సును విస్తరింపచేసావు.
నీ శరీర తేజస్సులోని విపరీతమైన వేడి ప్రభావంతో హస్తినాపురం లోని మంచుదనం కరిగిపోయింది. వాతావరణ సమతుల్యత ఏర్పడింది. నాటినుండి ప్రజలు ఆనందంగా జీవించసాగారు. అందుకే వసిష్ట మహర్షి నువ్వు ఈ రాజ్య సంరక్షణ దేవతవు అని అంటారు. " అని అన్నాడు.
సంవరణుడు వసిష్ట మహర్షిని, హితులను, పురోహి తులను తదితరులను సంప్రదించి ఒక శుభ ముహూర్తాన కురువుకు మకుటాభిషేకం చేసాడు. సూర్య భగవానుని అనుగ్రహంతో, వసిష్ట మహర్షి అనుగ్రహంతో, నీ తల్లి తపతి అనుగ్రహంతో హస్తినాపురం ను పరిపాలించమని కుమారునికి చెప్పాడు. కురు మహారాజు అలాగే అన్నాడు.
కురు మహారాజు వసిష్ట మహర్షి ఆదేశానుసారం తన తండ్రి సంవరుణుడు మీద కత్తి కట్టిన పాంచాల రాజు మీదకు యుద్దానికి వెళ్ళాడు. పాంచాల రాజు కురు మహారాజు ల నడుమ కనీవినీ ఎరుగని రీతిన సమరం జరిగింది. కురు మహారాజు గజ బలం చూసి పాంచాల రాజు భయపడ్డాడు. సమరావనిలో ఏనుగులన్నీ ఒక్కసారి ఘీంకరించాయి. ఆ శబ్దానికి పాంచాల రాజు సైన్యంలో వణుకు పుట్టింది.
మత్య్స, వరాహ, కూర్మాది ఆకారాల రథాలతో, గుర్రాల సకిలింపులతో సమరాంగణం విచిత్ర శోభను సంతరించుకుంది. శత్రువుల ఊహలకు అందకుండా రకరకాల వ్యూహ నైపుణ్యాలతో కురు మహారాజు కదనరంగంలో చెలరేగిపోయాడు. పాంచాల రాజు శక్తి పూర్తిగా క్షీణించిపోయింది. చివరకు పాంచాల రాజు కాళ్ళ బేరానికి వచ్చాడు.
కురు మహారాజు పాంచాల రాజు ను క్షమించాడు. తనకు సామంత రాజు గా ఉండమని కురు మహా రాజు పాంచాల రాజును కోరాడు.. పాంచాల రాజు అందుకు సమ్మతించాడు. సామంత రాజ ధర్మాన్ని అనుసరించి పాంచాల రాజు వసిష్ట మహర్షి తో తన రాజ్యంలో మహా యాగం చేయించాడు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
