12-01-2025, 10:38 AM
ఆ మట్టిని తీసుకెళ్లి జజీరా పూర్ణిమ నాడు ఆ పదకొండు విష సర్పాలకూ అందించాడు.
ఆ మట్టి వాసన పసిగట్టాయి ఆ విష సర్పాలు. ఒక్కసారిగా పదకొండు సర్పాలూ జజీరా వైపు చూశాయి. జజీరాకు ముచ్చెమటలు పట్టాయి.
"సగరుడు తాకిన ఈ మట్టి నీకెక్కడిది?" అని ముక్తకంఠంతో ప్రశ్నించాయి ఆ సర్పాలు.
"ప్రలోభలో దొరికింది", అని తడబడుతూ జవాబిచ్చాడు జజీరా.
కాసేపటి మౌనం తర్వాత,
"ఏదైతేనేం, మాకు ముక్తిని కలిగించినవాడివయ్యావు", అంటూ ఆశీర్వదించాయవి.
జజీరాకేమీ అంతుబట్టడం లేదు. ఆ బిలం నుండి నిష్క్రమించాడు.
ఆ పూర్ణిమ రాత్రి విక్రమసింహుడు ప్రలోభలో మిథిలాను కలవబోతున్నాడు . మిథిలా విక్రమసింహుడు ఆరాధించే పరమశివునికి అభిషేకం చేసిన పాలు ఒక బంగారు పాత్రలో తీసుకుని వస్తోంది. మిథిలా చేతుల మీదుగా ఆ అభిషేక తీర్థాన్ని పుచ్చుకోవాలని విక్రమసింహుడు ఆనందంగా ఎదురుచూస్తున్నాడు ఆకాశంలోని పున్నమి చంద్రుణ్ణి చూస్తూ. మిథిలా మాత్రం తను అంతవరకు చేసిన పూజలో ఆ పరమశివునికి విన్నవించుకున్న తన ప్రేమ గురించే ఆలోచిస్తూ విక్రమసింహుణ్ణి ధ్యానిస్తూ వస్తోంది.
జజీరా మిథిలాను వెంబడిస్తున్నాడు. అదే సమయంలో మిథిలా ఒక చోట ఆగి విక్రమసింహుడికి ఎంతో ఇష్టమైన మందార మకరందాన్ని దాచి ఉంచిన వనంలోకి వెళ్ళింది. వెళుతూ ఆ అభిషేక పాత్రను అక్కడే వదిలి వెళ్ళింది. జజీరా ఆ పాత్రలోనే తను తెచ్చిన ప్రహీణ లోని ఆ విషపు చుక్కను కలిపాడు అందులో. వేడిగా పొగలు కమ్ముతూ ఉంది ఆ పాత్ర. ఆ అభిషేక మహిమో మరేంటో తెలియట్లేదు గానీ పాల రంగు మాత్రం అలాగే ఉంది. జజీరా అది చూస్తూ వికృతంగా నవ్వాడు. మిథిలా మందార మకరందాన్ని ప్రోగు చేసుకుని తన దగ్గర దాచుకుని వనం నుండి బయటికొచ్చింది. ఆ పాత్రను తీసుకుని ముందుకు సాగింది. జజీరా ఇంకా మిథిలా వెనకే వస్తూ ఉన్నాడు.
ప్రలోభలో వున్న పర్వత ప్రాంతం చేరుకున్నారు. ఆ పర్వతం విశాలంగా దారి పొడుగునా పరుచుకుని ఉన్నది. మిథిలా విక్రమసింహుని కోసం వెతుకుతూ ముందుకు సాగుతూ ఉన్నది. వెనకే జజీరా వస్తున్నాడు. అల్లంత దూరాన విక్రమసింహుడు కూర్చుని ఉన్నాడు.
ఇంతలో ఆ పర్వతాన్ని చీల్చుకుంటూ పదకొండు మంది ఒక్కరొక్కరుగా జజీరా వెనుకే వస్తున్నారు. ఇదంతా జజీరా దృష్టికి అందట్లేదు. ఎందుకంటే జజీరా వెనక్కి తిరిగి చూస్తే కదా. తన చూపంతా ఆ పాత్ర పై, ముందున్న విక్రమ సింహుడిపై ఉన్నది. మిథిలా దృష్టి అంతా విక్రమసింహుడి పై.
మిథిలా విక్రమసింహుణ్ణి చేరుకొని తన దగ్గరున్న ఆ పాత్రలోని అభిషేక క్షీరాన్ని అందివ్వబోతుండగా,
జజీరా వెనకున్న ఆ పదకొండు మంది
"హరహర మహాదేవ శంభో శంకర " అనుకుంటూ
పరమశివునికి అభిషేకం చేసిన ఆ పాత్రలోని క్షీరాన్ని విషంతో కలిసినా సరే అలాగే స్వీకరించారు. జజీరా వారిని చూసి నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే వారు పదకొండు మంది ఉన్నారు. సరిగ్గా పదకొండు విష సర్పాలను మెడలపై ధరించి ఉన్నారు. జజీరా అనలలో చూసిన విష సర్పాలే అవి .
ఆ పాత్రలోని క్షీరాన్ని పుచ్చుకోగానే ఆ పదకొండు మంది ఉగ్రులైపోయారు. వారి కళ్ళల్లో దావాగ్ని ప్రవహిస్తోందేమో అన్నట్టుగా ఉన్నారు. వారిని చూసి జజీరాలోని జ్వాలా జిహ్వుడి ప్రేతం అదిరిపడి జజీరా శరీరాన్ని వదిలిపెట్టింది. ఆ పదకొండు మంది కలిసి ఆ ప్రేతాన్ని అంతమొందించారు. జజీరా కళ్లెదుటే జరుగుతున్న ఈ విలయ తాండవాన్ని చూస్తూ నోరు మెదపకుండా ఉండిపోయాడు.
జ్వాలా జిహ్వుడి ప్రేతానికి విముక్తి కల్పించిన తర్వాత ఆ పదకొండు మంది విక్రమసింహుడిని, మిథిలా ను కలిశారు.
"ఏకాదశ రుద్ర విభూతులము మేము. ఇక్కడే కొన్నేళ్లుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. పర్వత గర్భంలో కలిసిపోయాం. మీ నాన్న గారైన సింహ దత్తుడు ఆ పరమ శివుని దగ్గర మా గురించి ప్రస్తావించారు. ఆయన వల్లే ఈ రోజున మాకు విముక్తి లభించింది. మా ద్వారా ఈ పదకొండు విష సర్పాలకూ లభించింది. ఈ పూర్ణిమ రాత్రి ఏకాదశ రుద్రులలో శాశ్వతంగా కలిసిపోతున్నాం. మాకు ఇకపై జన్మ లేదు. నీకేమైనా కావాలంటే కోరుకో" అని వరం అడిగారా పదకొండు మంది.
"ఇవ్వాల్టి రోజున మీ పరాక్రమాన్ని నా కళ్ళతో చూసాక శంభల యోగులుగా మీరిక్కడి యోధులకు కార్యసిద్ధిని కలిగిస్తారనే దృఢ నమ్మకం కలిగింది. జ్వాలా జిహ్వుడితో మా నాన్న గారు పోరాడి ప్రాణ త్యాగం చేశారు. అయినా ఆ ప్రేతం ఇంకా బతికే ఉండటం నన్నెంతగానో కలవరానికి గురిచేసింది. మీరు లేకుంటే నేను బ్రతికుండే వాణ్ని కాను. నేనే మీకెంతో రుణపడి ఉన్నాను. అలాంటిది మీరే తిరిగి వరం ఇచ్చారు నాకు", అంటూ వినయంగా వారికి నమస్కరించాడు.
"ఇదంతా కార్యకారణ సంబంధం, విక్రమసింహ. నువ్వు అడిగినట్టుగానే శంభల యోగులుగా మా శక్తి ఈ శంభల రాజ్య యోధులకు ఎప్పుడూ ఒక రక్షణ కవచంలా వాళ్ళ చుట్టూ ఉంటుంది. వరం నీకోసం కాకుండా రాజ్యం కోసం కోరుకున్నావు చూడు అక్కడే నీలో సింహ దత్తుడు కనిపించాడు మాకు. జయము", అంటూ జజీరా వైపు కన్నెత్తి కూడా చూడకుండా అక్కడి నుండి నిష్క్రమించారా ఏకాదశ రుద్ర విభూతులైన శంభల యోగులు ", అని చెప్పటం ముగించాడు రుద్రసముద్భవ.
స్వస్తి
శుభం
ఆ మట్టి వాసన పసిగట్టాయి ఆ విష సర్పాలు. ఒక్కసారిగా పదకొండు సర్పాలూ జజీరా వైపు చూశాయి. జజీరాకు ముచ్చెమటలు పట్టాయి.
"సగరుడు తాకిన ఈ మట్టి నీకెక్కడిది?" అని ముక్తకంఠంతో ప్రశ్నించాయి ఆ సర్పాలు.
"ప్రలోభలో దొరికింది", అని తడబడుతూ జవాబిచ్చాడు జజీరా.
కాసేపటి మౌనం తర్వాత,
"ఏదైతేనేం, మాకు ముక్తిని కలిగించినవాడివయ్యావు", అంటూ ఆశీర్వదించాయవి.
జజీరాకేమీ అంతుబట్టడం లేదు. ఆ బిలం నుండి నిష్క్రమించాడు.
ఆ పూర్ణిమ రాత్రి విక్రమసింహుడు ప్రలోభలో మిథిలాను కలవబోతున్నాడు . మిథిలా విక్రమసింహుడు ఆరాధించే పరమశివునికి అభిషేకం చేసిన పాలు ఒక బంగారు పాత్రలో తీసుకుని వస్తోంది. మిథిలా చేతుల మీదుగా ఆ అభిషేక తీర్థాన్ని పుచ్చుకోవాలని విక్రమసింహుడు ఆనందంగా ఎదురుచూస్తున్నాడు ఆకాశంలోని పున్నమి చంద్రుణ్ణి చూస్తూ. మిథిలా మాత్రం తను అంతవరకు చేసిన పూజలో ఆ పరమశివునికి విన్నవించుకున్న తన ప్రేమ గురించే ఆలోచిస్తూ విక్రమసింహుణ్ణి ధ్యానిస్తూ వస్తోంది.
జజీరా మిథిలాను వెంబడిస్తున్నాడు. అదే సమయంలో మిథిలా ఒక చోట ఆగి విక్రమసింహుడికి ఎంతో ఇష్టమైన మందార మకరందాన్ని దాచి ఉంచిన వనంలోకి వెళ్ళింది. వెళుతూ ఆ అభిషేక పాత్రను అక్కడే వదిలి వెళ్ళింది. జజీరా ఆ పాత్రలోనే తను తెచ్చిన ప్రహీణ లోని ఆ విషపు చుక్కను కలిపాడు అందులో. వేడిగా పొగలు కమ్ముతూ ఉంది ఆ పాత్ర. ఆ అభిషేక మహిమో మరేంటో తెలియట్లేదు గానీ పాల రంగు మాత్రం అలాగే ఉంది. జజీరా అది చూస్తూ వికృతంగా నవ్వాడు. మిథిలా మందార మకరందాన్ని ప్రోగు చేసుకుని తన దగ్గర దాచుకుని వనం నుండి బయటికొచ్చింది. ఆ పాత్రను తీసుకుని ముందుకు సాగింది. జజీరా ఇంకా మిథిలా వెనకే వస్తూ ఉన్నాడు.
ప్రలోభలో వున్న పర్వత ప్రాంతం చేరుకున్నారు. ఆ పర్వతం విశాలంగా దారి పొడుగునా పరుచుకుని ఉన్నది. మిథిలా విక్రమసింహుని కోసం వెతుకుతూ ముందుకు సాగుతూ ఉన్నది. వెనకే జజీరా వస్తున్నాడు. అల్లంత దూరాన విక్రమసింహుడు కూర్చుని ఉన్నాడు.
ఇంతలో ఆ పర్వతాన్ని చీల్చుకుంటూ పదకొండు మంది ఒక్కరొక్కరుగా జజీరా వెనుకే వస్తున్నారు. ఇదంతా జజీరా దృష్టికి అందట్లేదు. ఎందుకంటే జజీరా వెనక్కి తిరిగి చూస్తే కదా. తన చూపంతా ఆ పాత్ర పై, ముందున్న విక్రమ సింహుడిపై ఉన్నది. మిథిలా దృష్టి అంతా విక్రమసింహుడి పై.
మిథిలా విక్రమసింహుణ్ణి చేరుకొని తన దగ్గరున్న ఆ పాత్రలోని అభిషేక క్షీరాన్ని అందివ్వబోతుండగా,
జజీరా వెనకున్న ఆ పదకొండు మంది
"హరహర మహాదేవ శంభో శంకర " అనుకుంటూ
పరమశివునికి అభిషేకం చేసిన ఆ పాత్రలోని క్షీరాన్ని విషంతో కలిసినా సరే అలాగే స్వీకరించారు. జజీరా వారిని చూసి నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే వారు పదకొండు మంది ఉన్నారు. సరిగ్గా పదకొండు విష సర్పాలను మెడలపై ధరించి ఉన్నారు. జజీరా అనలలో చూసిన విష సర్పాలే అవి .
ఆ పాత్రలోని క్షీరాన్ని పుచ్చుకోగానే ఆ పదకొండు మంది ఉగ్రులైపోయారు. వారి కళ్ళల్లో దావాగ్ని ప్రవహిస్తోందేమో అన్నట్టుగా ఉన్నారు. వారిని చూసి జజీరాలోని జ్వాలా జిహ్వుడి ప్రేతం అదిరిపడి జజీరా శరీరాన్ని వదిలిపెట్టింది. ఆ పదకొండు మంది కలిసి ఆ ప్రేతాన్ని అంతమొందించారు. జజీరా కళ్లెదుటే జరుగుతున్న ఈ విలయ తాండవాన్ని చూస్తూ నోరు మెదపకుండా ఉండిపోయాడు.
జ్వాలా జిహ్వుడి ప్రేతానికి విముక్తి కల్పించిన తర్వాత ఆ పదకొండు మంది విక్రమసింహుడిని, మిథిలా ను కలిశారు.
"ఏకాదశ రుద్ర విభూతులము మేము. ఇక్కడే కొన్నేళ్లుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. పర్వత గర్భంలో కలిసిపోయాం. మీ నాన్న గారైన సింహ దత్తుడు ఆ పరమ శివుని దగ్గర మా గురించి ప్రస్తావించారు. ఆయన వల్లే ఈ రోజున మాకు విముక్తి లభించింది. మా ద్వారా ఈ పదకొండు విష సర్పాలకూ లభించింది. ఈ పూర్ణిమ రాత్రి ఏకాదశ రుద్రులలో శాశ్వతంగా కలిసిపోతున్నాం. మాకు ఇకపై జన్మ లేదు. నీకేమైనా కావాలంటే కోరుకో" అని వరం అడిగారా పదకొండు మంది.
"ఇవ్వాల్టి రోజున మీ పరాక్రమాన్ని నా కళ్ళతో చూసాక శంభల యోగులుగా మీరిక్కడి యోధులకు కార్యసిద్ధిని కలిగిస్తారనే దృఢ నమ్మకం కలిగింది. జ్వాలా జిహ్వుడితో మా నాన్న గారు పోరాడి ప్రాణ త్యాగం చేశారు. అయినా ఆ ప్రేతం ఇంకా బతికే ఉండటం నన్నెంతగానో కలవరానికి గురిచేసింది. మీరు లేకుంటే నేను బ్రతికుండే వాణ్ని కాను. నేనే మీకెంతో రుణపడి ఉన్నాను. అలాంటిది మీరే తిరిగి వరం ఇచ్చారు నాకు", అంటూ వినయంగా వారికి నమస్కరించాడు.
"ఇదంతా కార్యకారణ సంబంధం, విక్రమసింహ. నువ్వు అడిగినట్టుగానే శంభల యోగులుగా మా శక్తి ఈ శంభల రాజ్య యోధులకు ఎప్పుడూ ఒక రక్షణ కవచంలా వాళ్ళ చుట్టూ ఉంటుంది. వరం నీకోసం కాకుండా రాజ్యం కోసం కోరుకున్నావు చూడు అక్కడే నీలో సింహ దత్తుడు కనిపించాడు మాకు. జయము", అంటూ జజీరా వైపు కన్నెత్తి కూడా చూడకుండా అక్కడి నుండి నిష్క్రమించారా ఏకాదశ రుద్ర విభూతులైన శంభల యోగులు ", అని చెప్పటం ముగించాడు రుద్రసముద్భవ.
స్వస్తి
శుభం
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
