Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 14(సమాప్తం))
 
"ఇప్పుడు నేను చెప్పబోయేది నీకెలా అర్థం అవుతుందో నాకు తెలియట్లేదు కానీ ఘట్టం ద్వారా ఎప్పటికీ మరువలేని శంభల యోగులు మాత్రం శాశ్వతంగా శంభలకు దొరికారు. వారెవరో తెలిస్తే నీకు విక్రమసింహుడు అర్థం అవుతాడు. సింహ దత్తుడు అర్థం అవుతాడు. నీకు నువ్వు ఇంకా బాగా అర్థం అవుతావు అభిజిత్", అంటూ రుద్రసముద్భవ చెప్పటం మొదలు పెట్టాడిలా.
 
"విక్రమసింహుడు మిథిలాను ఇష్టపడుతున్న రోజులవి. మిథిలా కోసం ఏదైనా చేసే ధైర్యం, సాహసం విక్రమసింహుడి దగ్గర ఉండనే ఉన్నాయి. వాటిని మించే ప్రేమను మిథిలా మాత్రమే విక్రమసింహుడికివ్వగలిగింది. మిథిలా రాజకుమారి కాదు. కానీ, రూపలావణ్యంలో రాజకుమారికీ, దేవకన్యకు తీసిపోని అందం తనదివిక్రమసింహుడు రాజు. విక్రమసింహుడంతటి అందగాణ్ణి అంతక్రితం శంభల ఖచ్చితంగా చూడలేదు. అలాంటి వీరిరువురూ కలిసిన ప్రతి సారి వీరిద్దర్నీ చూస్తూ ప్రకృతి మైమరచిపోయి ఆనందతాండవం చేస్తోందేమో అన్నట్టుండేది. వీరి మాటల్లో చూపులు కలిసేవి. చూపుల్లో మాటలు కలిసేవి. శంభలలో అంతులేని ప్రేమ భాష తెలిసిన ప్రేమికులు వీరిద్దరేనా అన్నట్టుండేది. మిథిలా కోసం ఏదైనా చేసెయ్యగలిగే విక్రమసింహుడి బలాన్ని బలహీనతగా చూసే జజీరా కళ్ళకు వీరి ప్రేమ అంతగా రుచించేది కాదు. మిథిలాను మోజుపడ్డాడు జజీరా. జజీరాది శారీరక వాంఛ. పైగా జజీరా తనను తాను విక్రమసింహుడితో పోల్చుకుంటూ తానెందులోనూ అతనికి తీసిపోనని భావిస్తూ ఈర్ష్యాద్వేషాలను పోగుచేసుకున్న బలవంతుడు. విక్రమసింహుడు జజీరా గురించి ఏనాడు ఆలోచించలేదు. విక్రమసింహుడికి తన ప్రేమలో మిథిలా తప్ప వేరెవ్వరూ కనిపించేవారు కాదు.
 
మిథిలాకు విక్రమసింహుడి అమ్మగారైన విజయకుమారితో మంచి అనుబంధం ఏర్పడింది. విజయకుమారికి మిథిలా అంటే ఎంతో ఇష్టం. విక్రమసింహుడికి అన్ని విధాలా ఆమె సరైన ఈడు జోడు అని తన నిశ్చితాభిప్రాయం. జజీరాకి వేగుల ద్వారా విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉండేవి. శంభలలో ఎవ్వరికీ  ప్రవేశం లేని అనల, మేఖలలో జజీరా ఒకనాటి రాత్రి ప్రవేశించాడు. సింహ దత్తుడు జ్వాలా జిహ్వుడిని, భైరవిని సంహరించిన తర్వాత అనల, మేఖల ప్రాకారాలను పూర్తిగా నిర్బంధించి వేశారు. అసలక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. జజీరా మొట్టమొదటి సారి అక్కడికెళ్ళాడు. అనలలో మొట్టమొదటి సారిగా విషాన్ని కాకుండా నిప్పును విరజిమ్మే పాములను చూసాడు జజీరా. గాలిలోనే విషం ఉంది. జజీరా అణువణువులోనూ అది రివ్వున ఎక్కేసింది. జజీరా అక్కడ ఏదో అద్భుత శక్తి ఉందనుకుని శక్తిని జపం చేస్తూ ప్రార్థించాడు. ప్రార్థన వల్ల జ్వాలా జిహ్వుడు సింహ దత్తుడికిచ్చిన శాపం తాలూకు ఘట్టం మొత్తం జజీరా కళ్ళకు కట్టినట్టు కనబడింది. జ్వాలా జిహ్వుడు అంతం అయిపోయినా అక్కడ ఉత్తరక్రియలు జరగకపోవటం చేత అతని ప్రేతం అలానే మిగిలిపోయింది. ప్రేతాన్ని ఆవాహన చేసుకునే మంత్రం జజీరా దగ్గరుంది. విక్రమ సింహుడి మీదున్న ఈర్ష్య జజీరా చేత ప్రేతాన్ని తనలోకి ఆవాహన చేసుకునేలా పురికొలిపింది. ముందు వెనుక ఆలోచించకుండా కేవలం విక్రమసింహుడి పైనున్న అసూయతో జ్వాలా జిహ్వుడి ప్రేతాన్ని తనలోకి ఆహ్వానం పలికాడు జజీరా. జ్వాలా జిహ్వుడి ప్రేతం జజీరాలోకి ప్రవేశించగానే పిచ్చి పట్టినవాడిలా చుట్టూ వెతికాడు. దేనికోసం వెతుకుతున్నాడో అర్థం కావట్లేదు.
 
'పదకొండు...పదకొండు.... పదకొండు' అంటున్నాడు. అదే సమయంలో అక్కడొక బిలం కనబడింది. ఏదో గుర్తుకొచ్చినవాడిలా అందులోకి వెళ్ళాడు. అక్కడ పదకొండు సర్పాలు కనిపించాయి. అవి మాట్లాడే విష సర్పాలు. కానీ వాటి విషాన్ని అవి ఇతరులపై ప్రయోగించవు. విషయం జ్వాలా జిహ్వుడికి బాగా తెలుసు. అందుకే పూర్ణిమ రాత్రి కోసం ఇన్నేళ్లు ఎదురు చూసాడు. ఇప్పుడు సమయం ఆసన్నం అయ్యింది. పూర్ణిమ రోజున పదకొండు సర్పాలకూ విముక్తి దొరుకుతుందని ఎప్పుడో ఒక ఋషివర్యుడు చెప్పాడు. అదే వాక్యాన్ని ఆలంబనగా చేసుకుని అక్కడే ధ్యానంలో ఉన్నాయవి. కానీ సర్పాల విషం అత్యంత ప్రమాదకరం. ఒకసారి సర్పాల విషపు చుక్క అక్కడి రాతిపై పడటం, రాయి  మలమల మాడిపోవటం తన కళ్లారా చూసాడు జ్వాలా జిహ్వుడు.
 
అది చూసిన రోజు నుండి మదిలో నిలిచిపోయిందా దృశ్యం. ఇప్పుడదే విషపు చుక్కతో జ్వాలా జిహ్వుడి ప్రేతం సింహ దత్తుడి కొడుకైన విక్రమ సింహుడిని అంతం చేద్దాం అనుకుంటోంది. విక్రమసింహుడిని చూసి ఈర్ష్య పడే జజీరా ద్వారా తన శాపాన్ని ఎలాగైనా నెరవేర్చాలన్న కసి జ్వాలా జిహ్వుడి ప్రేతానిది. విషపు నాగులకు పూర్ణిమ రోజున సగరుడు తాకిన మట్టి తెచ్చి పూజ చేస్తే విముక్తి కలుగుతుందని తెలియటంతో జజీరా వెంటనే తాను పని చేస్తానని మాటిచ్చాడు. అందుకు కృతజ్ఞతగా తాము ఏమి చెయ్యాలో జజీరాను అడిగాయి పదకొండు విషసర్పాలు. ప్రలోభలో మిథిలా, విక్రమసింహుడు కలవనున్న పూర్ణిమ రోజున వారిరువురి మధ్యనా దూరం పెరిగేలా చెయ్యమని కోరాడు జజీరా. ఇద్దరు ప్రేమికుల్ని విడదీయ్యటం కాకుండా మరేదైనా కోరుకొమ్మని అడిగాయి పదకొండు విష సర్పాలు. జజీరా ఊహించని పరిణామం ఇది.
 
పదకొండు సర్పాలనూ విడి విడిగా వాటి విషపు చుక్కలను ఇవ్వమని కోరాడు. ఒక నిమిషం పాటు దీర్ఘాలోచన చేశాయి.
 
"నువ్వు మా విషాన్ని ఎందుకు అడుగుతున్నావో మాకు అనవసరం. కానీ విషం చాలా ప్రమాదకారి. పుట్టగతులుండవు. ఒకే ఒక్క విషపు చుక్క అయినా సరే అతి భయంకరమైన నరకాన్ని బ్రతికుండగానే చవిచూపిస్తుంది. ఇది హెచ్చరిక మాత్రమే. పై నీ మనోగతాన్ని అనుసరించే నువ్వు ప్రవర్తిస్తావు", అని జజీరా కోరినట్టుగానే విషపు చుక్కల్ని ఇవ్వటానికి సిద్ధమయ్యాయి.
 
"ఇది నువ్వు ఎవరి మీద ప్రయోగించాలి అన్నా ముందు ఇక్కడి నుండి నువ్వు విషాన్ని తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళటానికి వీలుగా ఉండే  ప్రహీణ అదుగో అక్కడున్నది. అందులో మాత్రమే నువ్వు విషాన్ని నింపగలవు" అన్నాయా విష సర్పాలు.
 
జజీరా విషం నిండిన   ప్రహీణ  తో బిలం నుండి నిష్క్రమించాడు.
 
సగరుడు తాకిన మట్టి కోసం వెతకసాగాడు జజీరా. ప్రలోభలో సగరుడు తాకిన మట్టి ఉంటుందని తన వేగుల ద్వారా వాకబు చేయిస్తే తెలిసింది. సగరుడు అంటే సముద్రుడు. సముద్రం తాకిన మట్టి ఇక్కడెలా ఉందబ్బా అని ఆశ్చర్యపోయాడు జజీరా. ప్రలోభలో విస్తారముగా పరుచుకుని వున్న పర్వతం నుండి తెచ్చిన మట్టిని అతనికి అందించారు వేగులు.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 13 - by k3vv3 - 12-01-2025, 10:37 AM



Users browsing this thread: 1 Guest(s)