12-01-2025, 10:34 AM
శంభల రాజ్యం – 14
జజీరా ప్రలోభము.....విక్రమసింహుడిని తుదముట్టించుటకు జ్వాలా జిహ్వుడి విశ్వప్రయత్నం
వరుణ ప్రాకారం తర్వాత వరుసగా అనల, మేఖల ప్రాకారాలున్నాయి. అప్పటికే వరుణ ప్రాకారం బయట ఖగరథం ఒకటి నిలుపబడి వున్నది.
ఖగరథం వైపుకు అడుగులేస్తున్న రుద్రసముద్భవను చూస్తూ, "అదేంటి స్వామి? ఎటువైపుకు మన పయనం ?" అని అడిగాడు సంజయ్.
"అనల, మేఖల ప్రాకారాలలో మనకు ప్రవేశం నిషిద్ధం. ఒకప్పుడు జ్వాలా జిహ్వుడు, భైరవిల నివాస స్థానాలవి. అక్కడికి వెళ్లాల్సిన సమయం ఇంకా ఆసన్నమవ్వలేదు ", అంటూ చెప్పటం ఆపేసాడు రుద్రసముద్భవ.
"మనం తెలుసుకోవాల్సిందేదో ఇంకా మిగిలే ఉంది", అన్నది అంకిత.
అభిజిత్, అంకిత, సంజయ్ లతో రుద్రసముద్భవ నేతృత్వంలో ఖగరథం కదిలింది.
గాలిలో వెళుతుండగా అభిజిత్ తన పక్కనే ఉన్న గవాక్షి ద్వారా ఆకాశం వైపుకు చూసాడు.
సూర్యుడు కనిపించాడు. పక్షులు కనిపించాయి. ఒకసారి క్రిందకు చూసాడు. అనల ప్రాకారం కనిపించింది. అనలలో నడయాడినట్టు అక్కడి నేలపై జ్వాలా జిహ్వుడి పాద ముద్రలు, ప్రాకారం నలుమూలలా శరీర రూపురేఖలు స్పష్టంగా ముద్రింపబడ్డాయి. మహనీయుల అడుగులు నేల తల్లికి ఎంత పావనమో లోక కంటకులు ఆవిడకి అంత పెనుభారం. ఆ ప్రాకారం ఇప్పటికీ నిప్పులు వెదజల్లుతున్నట్టుగా అనిపించింది అభిజిత్ దృష్టికి. తదుపరి మేఖల కనిపించింది. ఏదో తెలియని అశాంతి నిండుకున్న ప్రదేశంలా ఉందది. భయం గొలిపే ఎరుపు రంగు అనల అయితే, కమ్ముకొనే పెను చీకటి మేఖల.
"మనమిప్పుడు వెళ్లబోయే ప్రాకారం ఏది స్వామి?" అని అడిగాడు సంజయ్.
"ఇక్కడి నుండి రాబోయే నాలుగు ప్రాకారాలూ విక్రమసింహుడి జీవితాన్ని పూర్తిగా మార్చివేసినవే ", అంటూ రుద్రసముద్భవ అభిజిత్ వైపు చూసాడు.
"ఇప్పుడు మనం అడుగుపెట్టబోయేది ప్రలోభ లో", అంటూ ఊపిరి బిగబట్టి ఏదో తెలియని ఆలోచన తనను వేధిస్తున్నట్టుగా రుద్రసముద్భవ ఒక్కసారిగా సంజయ్, అంకితల వైపు చూసాడు.
ప్రలోభ లో ఏదైనా జరగవచ్చు. మీరు ఇప్పటివరకు మాయారూపధారుల గురించి, కామరూపధారుల గురించి విని ఉంటారు. శంభల మునుపెన్నడూ కనని, వినని, ఎరుగని సంకల్పధారులని ప్రలోభ లో మొట్టమొదటిసారిగా చూడటం జరిగింది. అందుకు విక్రమసింహుడే కారణం. ఆ సంకల్పధారులెవరో, వారెప్పుడు, ఎందుకు, ఎలా కనిపిస్తారో ఒక్క విక్రమసింహుడికే…తెలుసు", అంటూ అభిజిత్ వైపు చూసారు ముగ్గురూ.
"అంతుబట్టని మాయకు ఒక రూపం ఉంటుంది. అంతులేని కామానికి ఒక రూపం ఉంటుంది. మన బుద్ధి బలానికి మనోబలం తోడైనప్పుడు సంకల్పం మనలోనే స్థిరమయ్యి ఉంటుంది. అలాంటి సంకల్పం వేరొక బాహ్య రూపం ఎలా తీసుకుంటుంది స్వామి?" అని అడిగాడు సంజయ్.
"చాలా లోతైన ప్రశ్న అడిగావు సంజయ్. సంకల్పానికి వికల్పం ఎదురైనప్పుడు, ఆ వికల్పము అంతటి మహాసంకల్పానికే మరణసదృశం అవుతున్నప్పుడు ఆ మహాసంకల్పానికున్న బలం వల్ల సంకల్పమొక రూపం తీసుకుంటుంది. బాహ్యరూపం సంతరించుకుంటుంది. ఈ విషయాన్ని నేను కళ్లారా చూసాను కాబట్టే ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను.
విక్రమసింహుడికి ఈ ప్రాకారంలో అలా తటస్థపడ్డవారే ఆ సంకల్పధారులు. వారిని శంభల యోగులు అంటారిక్కడ. సంకల్పధారి అన్న దృష్టి ఎంతో లోతుకు వెళితే గానీ అందని భావన. శంభల రాజ్య యోధులు శంభల యోగులుగా వీరిని కొలుస్తారు. యుద్ధానికి సంసిద్ధం అయ్యే సమయంలో వారు ఈ శంభల యోగుల ముందే సంకల్పం చెబుతారు. యుద్ధంలో విజయం ఆ సంకల్పం నెరవేరటం మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎటువంటి విఘ్నాలు ఎదురవ్వుకుండా ఉండేందుకు శంభల యోగుల దీవెనలు వారికి ఎంతైనా అవసరం."
అంతట్లో ఖగరథం ప్రలోభ వాకిట ఆగింది.
ఖగరథం దిగగానే అభిజిత్ అడుగులు తనకు తెలియకుండానే ప్రలోభ లోనికి పడ్డాయి.
తానక్కడికి బహు తక్కువ పర్యాయాలే వచ్చి ఉన్నా సరే, అక్కడేదో చారిత్రక ఘట్టం జరిగిన అనుభూతి కలుగుతోంది.
రుద్రసముద్భవ అభిజిత్ నే చూస్తూ ఉన్నాడు. తను అనుకున్నదే జరుగుతోంది. అభిజిత్ కి అక్కడేదో గుర్తుకొస్తోంది.
మిథిలా విక్రమసింహుడి కోసం పూర్ణిమ రాత్రి నాడు రావటం గుర్తుకొస్తోంది.
మిథిలా ప్రేమలో పడి జజీరా రూపంలో విక్రమసింహుడికి పొంచివున్న ప్రమాదం కనబడకపోవడం గుర్తుకొస్తోంది.
అభిజిత్ ఒక చోట ఆగిపోయాడు. అంతకంటే ఇంకేం గుర్తుకు రావటం లేదు.
రుద్రసముద్భవ, సంజయ్ మరియు అంకితలు అక్కడికి చేరుకున్నారు.
ప్రలోభలో ఏం జరిగిందో చెప్పమన్నట్టుగా అభిజిత్ రుద్రసముద్భవ దిక్కు చూసాడు.
జజీరా ప్రలోభము.....విక్రమసింహుడిని తుదముట్టించుటకు జ్వాలా జిహ్వుడి విశ్వప్రయత్నం
వరుణ ప్రాకారం తర్వాత వరుసగా అనల, మేఖల ప్రాకారాలున్నాయి. అప్పటికే వరుణ ప్రాకారం బయట ఖగరథం ఒకటి నిలుపబడి వున్నది.
ఖగరథం వైపుకు అడుగులేస్తున్న రుద్రసముద్భవను చూస్తూ, "అదేంటి స్వామి? ఎటువైపుకు మన పయనం ?" అని అడిగాడు సంజయ్.
"అనల, మేఖల ప్రాకారాలలో మనకు ప్రవేశం నిషిద్ధం. ఒకప్పుడు జ్వాలా జిహ్వుడు, భైరవిల నివాస స్థానాలవి. అక్కడికి వెళ్లాల్సిన సమయం ఇంకా ఆసన్నమవ్వలేదు ", అంటూ చెప్పటం ఆపేసాడు రుద్రసముద్భవ.
"మనం తెలుసుకోవాల్సిందేదో ఇంకా మిగిలే ఉంది", అన్నది అంకిత.
అభిజిత్, అంకిత, సంజయ్ లతో రుద్రసముద్భవ నేతృత్వంలో ఖగరథం కదిలింది.
గాలిలో వెళుతుండగా అభిజిత్ తన పక్కనే ఉన్న గవాక్షి ద్వారా ఆకాశం వైపుకు చూసాడు.
సూర్యుడు కనిపించాడు. పక్షులు కనిపించాయి. ఒకసారి క్రిందకు చూసాడు. అనల ప్రాకారం కనిపించింది. అనలలో నడయాడినట్టు అక్కడి నేలపై జ్వాలా జిహ్వుడి పాద ముద్రలు, ప్రాకారం నలుమూలలా శరీర రూపురేఖలు స్పష్టంగా ముద్రింపబడ్డాయి. మహనీయుల అడుగులు నేల తల్లికి ఎంత పావనమో లోక కంటకులు ఆవిడకి అంత పెనుభారం. ఆ ప్రాకారం ఇప్పటికీ నిప్పులు వెదజల్లుతున్నట్టుగా అనిపించింది అభిజిత్ దృష్టికి. తదుపరి మేఖల కనిపించింది. ఏదో తెలియని అశాంతి నిండుకున్న ప్రదేశంలా ఉందది. భయం గొలిపే ఎరుపు రంగు అనల అయితే, కమ్ముకొనే పెను చీకటి మేఖల.
"మనమిప్పుడు వెళ్లబోయే ప్రాకారం ఏది స్వామి?" అని అడిగాడు సంజయ్.
"ఇక్కడి నుండి రాబోయే నాలుగు ప్రాకారాలూ విక్రమసింహుడి జీవితాన్ని పూర్తిగా మార్చివేసినవే ", అంటూ రుద్రసముద్భవ అభిజిత్ వైపు చూసాడు.
"ఇప్పుడు మనం అడుగుపెట్టబోయేది ప్రలోభ లో", అంటూ ఊపిరి బిగబట్టి ఏదో తెలియని ఆలోచన తనను వేధిస్తున్నట్టుగా రుద్రసముద్భవ ఒక్కసారిగా సంజయ్, అంకితల వైపు చూసాడు.
ప్రలోభ లో ఏదైనా జరగవచ్చు. మీరు ఇప్పటివరకు మాయారూపధారుల గురించి, కామరూపధారుల గురించి విని ఉంటారు. శంభల మునుపెన్నడూ కనని, వినని, ఎరుగని సంకల్పధారులని ప్రలోభ లో మొట్టమొదటిసారిగా చూడటం జరిగింది. అందుకు విక్రమసింహుడే కారణం. ఆ సంకల్పధారులెవరో, వారెప్పుడు, ఎందుకు, ఎలా కనిపిస్తారో ఒక్క విక్రమసింహుడికే…తెలుసు", అంటూ అభిజిత్ వైపు చూసారు ముగ్గురూ.
"అంతుబట్టని మాయకు ఒక రూపం ఉంటుంది. అంతులేని కామానికి ఒక రూపం ఉంటుంది. మన బుద్ధి బలానికి మనోబలం తోడైనప్పుడు సంకల్పం మనలోనే స్థిరమయ్యి ఉంటుంది. అలాంటి సంకల్పం వేరొక బాహ్య రూపం ఎలా తీసుకుంటుంది స్వామి?" అని అడిగాడు సంజయ్.
"చాలా లోతైన ప్రశ్న అడిగావు సంజయ్. సంకల్పానికి వికల్పం ఎదురైనప్పుడు, ఆ వికల్పము అంతటి మహాసంకల్పానికే మరణసదృశం అవుతున్నప్పుడు ఆ మహాసంకల్పానికున్న బలం వల్ల సంకల్పమొక రూపం తీసుకుంటుంది. బాహ్యరూపం సంతరించుకుంటుంది. ఈ విషయాన్ని నేను కళ్లారా చూసాను కాబట్టే ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను.
విక్రమసింహుడికి ఈ ప్రాకారంలో అలా తటస్థపడ్డవారే ఆ సంకల్పధారులు. వారిని శంభల యోగులు అంటారిక్కడ. సంకల్పధారి అన్న దృష్టి ఎంతో లోతుకు వెళితే గానీ అందని భావన. శంభల రాజ్య యోధులు శంభల యోగులుగా వీరిని కొలుస్తారు. యుద్ధానికి సంసిద్ధం అయ్యే సమయంలో వారు ఈ శంభల యోగుల ముందే సంకల్పం చెబుతారు. యుద్ధంలో విజయం ఆ సంకల్పం నెరవేరటం మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎటువంటి విఘ్నాలు ఎదురవ్వుకుండా ఉండేందుకు శంభల యోగుల దీవెనలు వారికి ఎంతైనా అవసరం."
అంతట్లో ఖగరథం ప్రలోభ వాకిట ఆగింది.
ఖగరథం దిగగానే అభిజిత్ అడుగులు తనకు తెలియకుండానే ప్రలోభ లోనికి పడ్డాయి.
తానక్కడికి బహు తక్కువ పర్యాయాలే వచ్చి ఉన్నా సరే, అక్కడేదో చారిత్రక ఘట్టం జరిగిన అనుభూతి కలుగుతోంది.
రుద్రసముద్భవ అభిజిత్ నే చూస్తూ ఉన్నాడు. తను అనుకున్నదే జరుగుతోంది. అభిజిత్ కి అక్కడేదో గుర్తుకొస్తోంది.
మిథిలా విక్రమసింహుడి కోసం పూర్ణిమ రాత్రి నాడు రావటం గుర్తుకొస్తోంది.
మిథిలా ప్రేమలో పడి జజీరా రూపంలో విక్రమసింహుడికి పొంచివున్న ప్రమాదం కనబడకపోవడం గుర్తుకొస్తోంది.
అభిజిత్ ఒక చోట ఆగిపోయాడు. అంతకంటే ఇంకేం గుర్తుకు రావటం లేదు.
రుద్రసముద్భవ, సంజయ్ మరియు అంకితలు అక్కడికి చేరుకున్నారు.
ప్రలోభలో ఏం జరిగిందో చెప్పమన్నట్టుగా అభిజిత్ రుద్రసముద్భవ దిక్కు చూసాడు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
