10-01-2025, 09:40 PM
"నా చెల్లి ముఖం అప్రసన్నంగా వుంది కారణం!..."
చిరునవ్వుతో అడిగాడు ఈశ్వర్.
"వుంది."
"ఏమిటది...?"
"నన్ను నీవు ఏమీ అనవు కదా!..."
"ఎందుకంటానమ్మా!.... నీవు నా ముద్దుల చెల్లెలివి కదా!"
"నేను ఒక విషయం విన్నాను...."
"ఏమిటో చెప్పు!..."
"శివాలయంలో సీతాపతి గాడు నన్ను కలిశాడు."
"సీతాపతా!..."
"అవును..."
"వాడు నీకన్నా పెద్దవాడు. ’గాడు’ అని అనడం తప్పుకదమ్మా!..."
"తప్పో ఒప్పో!... అసలు విషయం...!" ఆగిపోయింది శార్వరి.
"ఏమిటో చెప్పు శారూ!..."
"అక్క!..."
"ఎవరూ!"
"మన అక్క వాణి... ప్రజాపతి మామయ్యకు జాబు వ్రాసిందట."
తాను విన్న విషయాన్ని వివరంగా శార్వరి ఈశ్వర్కు చెప్పింది. చివరిగా "అన్నయ్యా!.... ఈ విషయాన్ని అమ్మా నాన్నలకు చెబితే వారు బాధపడతారు కదా!... అందుకని నీకు చెప్పాను. అక్క ఎలా వుందో ఏమో...! సీతాపతి అక్కను గురించి చెప్పినప్పటి నుంచీ నాకు ఎంతో బాధగా వుంది. ఆలోచించి నీవే ఏదైనా చేయాలి అన్నయ్యా!..." దీనంగా చెప్పింది శార్వరి.
"అక్క మామయ్యకు తొమ్మిదినెలల క్రింద వ్రాసిందా ఉత్తరం!..." ఆశ్చర్యంతో అడిగాడు ఈశ్వర్.
"అవునట. ఆ వుత్తరాన్ని మామయ్య విప్పి చదవలేదట. ఈ రోజు పనిమనిషి ఇవ్వగా దీప్తి చదివిందట."
ఈశ్వర్ కొన్నిక్షణాలు శార్వరి ముఖంలోకి చూచి తలను ప్రక్కకు త్రిప్పి శూన్యంలోకి... కిటికీ గుండా చూడసాగాడు. అతని మనస్సు నిండా తన అక్క వాణిని గురించిన ఆలొచనలే..
"మహారాణిలా ఈ యింట వుండిన వాణి అక్కయ్య.... తన వివాహ విషయంలో తాను తీసుకొన్న నిర్ణయం కారణంగా... తలిదండ్రులకు తోబుట్టువులకు శాశ్వతంగా దూరం అయిపోయింది. ఆ ఢిల్లీలో ఆ వ్యక్తితో ఆమె జీవితం ఎలా వుందో!... ఈ విషయం అమ్మా నాన్నలకు తెలిస్తే ఎంతగానో బాధపడతారు. విషయం వారి చెవికి పోకూడదు’ అనుకొన్నాడు ఈశ్వర్.
"శారూ!... ఈ విషయాన్ని అమ్మా నాన్నలకు చెప్పవద్దు..."
"అలాగే అన్నయ్యా!...." కొన్నిక్షణాల తర్వాత... "అన్నయ్యా!... నేను ఒక విషయం చెబితే తప్పుగా అనుకోవుగా!" ప్రాధేయపూర్వకంగా అడిగింది శార్వరి.
"అనుకోకురా!... చెప్పు..."
"నీవు... ఒకసారి..." ఆపింది శార్వరి... ఈశ్వర్ ఏమనుకొంటాడో అని.
"ఢిల్లీకి వెళ్ళి అక్కను చూచి వస్తే బాగుంటుంది. ఇదేగా నీవు చెప్పదలచుకొన్నది శారూ!"
"అవునన్నయ్యా!...."
వాణిని గురించిన ఆలోచనతో ఈశ్వర్... మౌనంగా వుండిపోయాడు.
"ఎప్పుడో జరిగినదాన్ని మనస్సున పెట్టుకొని జీవితాంతం అక్కను ద్వేషించడం వలన... మనమూ నేరం చేసినవాళ్ళమే అవుతాము కదా అన్నయ్యా!... అన్నిగుణాల్లోకి... క్షమాగుణం గొప్పదని మనం చదువుకొన్నాముగా!... మంచిని పాటించడం తప్పు కాదు కదా అన్నయ్యా!..." దీనంగా అడిగింది శార్వరి.
ఈశ్వర్ ఆమె ముఖంలోకి కొన్నిక్షణాలు పరీక్షగా చూచాడు.
అతని కళ్ళల్లో నీళ్ళు చుట్టుకొన్నాయి.
’నేను ఎత్తుకొని ఆడించి... మాటలు.. పాఠాలు నేర్పిన నా చెల్లి శార్వరిలో ఎంతటి ఉన్నత భావాలు!... ఎంత గొప్ప మనస్తత్వం!...’ అనుకొన్నాడు. లేచి ఆమెను సమీపించి ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని "శారూ! నీకు అక్కని చూడాలని వుంది కదూ!..."
అవునన్నట్లు కన్నీటితో తలాడించింది శార్వరి. రెండు క్షణాల తర్వాత... "మరి నీకు!..." అడిగింది.
"నాకూ చూడాలని వుందిరా!... మనం ఢిల్లీకి వెళుతున్నాము."
"ఎప్పుడన్నయ్యా!..." ఆత్రంగా అడిగింది శార్వరి.
"నాలుగురోజుల్లో హైద్రాబాద్ వెళతాంగా!... అక్కడి నుంచి ఢిల్లీకి మనం పోదాం... అక్కను చూద్దాం!..."
"మరి అమ్మా నాన్నలతో!...."
"ఇప్పుడు ఏమీ చెప్పవద్దు.... మనం ఢిల్లీ వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత... ఆలోచించి చెప్పే రీతిగా చెబుదాం. సరేనా!..."
"అలాగే అన్నయ్యా!... నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా వుందో తెలుసా!..."
"నీవు చెప్పక్కర్లేదమ్మా!.... నీ కళ్ళే చెబుతున్నాయ్!..." నవ్వాడు ఈశ్వర్.
"థాంక్స్ అన్నయ్యా!... వెళ్ళి పడుకొంటాను..." నవ్వుతూ చెప్పింది శార్వరి.
"మంచిదిరా!... వెళ్ళి.... పడుకో!...." అన్నాడు ఈశ్వర్ నవ్వుతూ.
శార్వరి ఆనందంగా నవ్వుకొంటూ గదినుండి బయటికి నడిచింది.
ప్రజాపతిగారు చెన్నై నుంచి తిరిగి వచ్చారు. ఉదయం అల్పాహారాన్ని సేవించి తన గదిలోకి ప్రవేశించారు. ఇరువురు వ్యక్తులు వారిని చూడాలని వచ్చారు. వాకిట ముందు నిలబడి వున్న వారిని దీప్తి చూచింది.
చిరునవ్వుతో అడిగాడు ఈశ్వర్.
"వుంది."
"ఏమిటది...?"
"నన్ను నీవు ఏమీ అనవు కదా!..."
"ఎందుకంటానమ్మా!.... నీవు నా ముద్దుల చెల్లెలివి కదా!"
"నేను ఒక విషయం విన్నాను...."
"ఏమిటో చెప్పు!..."
"శివాలయంలో సీతాపతి గాడు నన్ను కలిశాడు."
"సీతాపతా!..."
"అవును..."
"వాడు నీకన్నా పెద్దవాడు. ’గాడు’ అని అనడం తప్పుకదమ్మా!..."
"తప్పో ఒప్పో!... అసలు విషయం...!" ఆగిపోయింది శార్వరి.
"ఏమిటో చెప్పు శారూ!..."
"అక్క!..."
"ఎవరూ!"
"మన అక్క వాణి... ప్రజాపతి మామయ్యకు జాబు వ్రాసిందట."
తాను విన్న విషయాన్ని వివరంగా శార్వరి ఈశ్వర్కు చెప్పింది. చివరిగా "అన్నయ్యా!.... ఈ విషయాన్ని అమ్మా నాన్నలకు చెబితే వారు బాధపడతారు కదా!... అందుకని నీకు చెప్పాను. అక్క ఎలా వుందో ఏమో...! సీతాపతి అక్కను గురించి చెప్పినప్పటి నుంచీ నాకు ఎంతో బాధగా వుంది. ఆలోచించి నీవే ఏదైనా చేయాలి అన్నయ్యా!..." దీనంగా చెప్పింది శార్వరి.
"అక్క మామయ్యకు తొమ్మిదినెలల క్రింద వ్రాసిందా ఉత్తరం!..." ఆశ్చర్యంతో అడిగాడు ఈశ్వర్.
"అవునట. ఆ వుత్తరాన్ని మామయ్య విప్పి చదవలేదట. ఈ రోజు పనిమనిషి ఇవ్వగా దీప్తి చదివిందట."
ఈశ్వర్ కొన్నిక్షణాలు శార్వరి ముఖంలోకి చూచి తలను ప్రక్కకు త్రిప్పి శూన్యంలోకి... కిటికీ గుండా చూడసాగాడు. అతని మనస్సు నిండా తన అక్క వాణిని గురించిన ఆలొచనలే..
"మహారాణిలా ఈ యింట వుండిన వాణి అక్కయ్య.... తన వివాహ విషయంలో తాను తీసుకొన్న నిర్ణయం కారణంగా... తలిదండ్రులకు తోబుట్టువులకు శాశ్వతంగా దూరం అయిపోయింది. ఆ ఢిల్లీలో ఆ వ్యక్తితో ఆమె జీవితం ఎలా వుందో!... ఈ విషయం అమ్మా నాన్నలకు తెలిస్తే ఎంతగానో బాధపడతారు. విషయం వారి చెవికి పోకూడదు’ అనుకొన్నాడు ఈశ్వర్.
"శారూ!... ఈ విషయాన్ని అమ్మా నాన్నలకు చెప్పవద్దు..."
"అలాగే అన్నయ్యా!...." కొన్నిక్షణాల తర్వాత... "అన్నయ్యా!... నేను ఒక విషయం చెబితే తప్పుగా అనుకోవుగా!" ప్రాధేయపూర్వకంగా అడిగింది శార్వరి.
"అనుకోకురా!... చెప్పు..."
"నీవు... ఒకసారి..." ఆపింది శార్వరి... ఈశ్వర్ ఏమనుకొంటాడో అని.
"ఢిల్లీకి వెళ్ళి అక్కను చూచి వస్తే బాగుంటుంది. ఇదేగా నీవు చెప్పదలచుకొన్నది శారూ!"
"అవునన్నయ్యా!...."
వాణిని గురించిన ఆలోచనతో ఈశ్వర్... మౌనంగా వుండిపోయాడు.
"ఎప్పుడో జరిగినదాన్ని మనస్సున పెట్టుకొని జీవితాంతం అక్కను ద్వేషించడం వలన... మనమూ నేరం చేసినవాళ్ళమే అవుతాము కదా అన్నయ్యా!... అన్నిగుణాల్లోకి... క్షమాగుణం గొప్పదని మనం చదువుకొన్నాముగా!... మంచిని పాటించడం తప్పు కాదు కదా అన్నయ్యా!..." దీనంగా అడిగింది శార్వరి.
ఈశ్వర్ ఆమె ముఖంలోకి కొన్నిక్షణాలు పరీక్షగా చూచాడు.
అతని కళ్ళల్లో నీళ్ళు చుట్టుకొన్నాయి.
’నేను ఎత్తుకొని ఆడించి... మాటలు.. పాఠాలు నేర్పిన నా చెల్లి శార్వరిలో ఎంతటి ఉన్నత భావాలు!... ఎంత గొప్ప మనస్తత్వం!...’ అనుకొన్నాడు. లేచి ఆమెను సమీపించి ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని "శారూ! నీకు అక్కని చూడాలని వుంది కదూ!..."
అవునన్నట్లు కన్నీటితో తలాడించింది శార్వరి. రెండు క్షణాల తర్వాత... "మరి నీకు!..." అడిగింది.
"నాకూ చూడాలని వుందిరా!... మనం ఢిల్లీకి వెళుతున్నాము."
"ఎప్పుడన్నయ్యా!..." ఆత్రంగా అడిగింది శార్వరి.
"నాలుగురోజుల్లో హైద్రాబాద్ వెళతాంగా!... అక్కడి నుంచి ఢిల్లీకి మనం పోదాం... అక్కను చూద్దాం!..."
"మరి అమ్మా నాన్నలతో!...."
"ఇప్పుడు ఏమీ చెప్పవద్దు.... మనం ఢిల్లీ వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత... ఆలోచించి చెప్పే రీతిగా చెబుదాం. సరేనా!..."
"అలాగే అన్నయ్యా!... నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా వుందో తెలుసా!..."
"నీవు చెప్పక్కర్లేదమ్మా!.... నీ కళ్ళే చెబుతున్నాయ్!..." నవ్వాడు ఈశ్వర్.
"థాంక్స్ అన్నయ్యా!... వెళ్ళి పడుకొంటాను..." నవ్వుతూ చెప్పింది శార్వరి.
"మంచిదిరా!... వెళ్ళి.... పడుకో!...." అన్నాడు ఈశ్వర్ నవ్వుతూ.
శార్వరి ఆనందంగా నవ్వుకొంటూ గదినుండి బయటికి నడిచింది.
ప్రజాపతిగారు చెన్నై నుంచి తిరిగి వచ్చారు. ఉదయం అల్పాహారాన్ని సేవించి తన గదిలోకి ప్రవేశించారు. ఇరువురు వ్యక్తులు వారిని చూడాలని వచ్చారు. వాకిట ముందు నిలబడి వున్న వారిని దీప్తి చూచింది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
