Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
#53
ఏయ్!.... ముసలీ!.... నా వయస్సుతో నీకేం పనే!... మూసుకొని కుర్చీలో కూర్చోలేవా!... అధిక ప్రసంగం చేస్తున్నావ్!... అనుకొంది దీప్తి.



"మాట్లాడవేం?... నాకు ఎప్పుడు పెళ్ళయిందో తెలుసా!..."



అబ్బా ఇది నన్ను వదిలేటట్లు లేదు. రామయోగీ! త్వరగా రావయ్యా! అనుకొని.
"ఎప్పుడయిందీ!..." దీర్ఘం తీస్తూ అడిగింది.



"పదిహేను ఏళ్ళకు..."



"అలాగా!...."



"అవునూ... ఇంతకూ నీ వయస్సెంతో చెప్పనేలేదు."



రామయోగి వరండాలోకి వచ్చాడు.
"ఈకాలం పిల్లలలాగే ఎవరినైనా లవ్వు గివ్వు చేశావా!..." నవ్వింది నిర్మల.



"అలాంటిదేమీ లేదు..." అంది దీప్తి.



తన చేతిలోని కాగితాన్ని దీప్తికి అందించాడు రామయోగి.
దీప్తి అందుకొంది.
"ఎప్పుడమ్మా నీ ప్రయాణం!..." అడిగాడు.



" వారంరోజుల లోపల..."



"అందులో మావాడి ఫోన్ నెంబర్ కూడా వ్రాశాను. ఫోన్ చేస్తే నీవు ఎక్కడ వున్నా మావాడు వచ్చి నిన్ను ఇంటికి తీసుకొని వెళతాడు. నేను వాడితో మాట్లాడుతాను" చెప్పాడు రామయోగి.



"ఎవరితోనండీ!..."



"మన అబ్బాయి కళ్యాణ్తో..."



"ఏం చెబుతావు?..." అడిగింది నిర్మల.



"తర్వాత చెబుతాను..." నవ్వాడు రామయోగి.



"అంకుల్!... థాంక్యూ! వెళ్ళిస్తాను...." చిరునవ్వుతో చెప్పింది దీప్తి.



"మంచిదమ్మా!... వూరికి వెళ్ళేనాడు చెప్పు మా ఆవిడ ఆవకాయ పెట్టింది. కొంత నీచేతికి పార్శిల్ చేసి ఇస్తాను. మావాడికి ఇవ్వగలవా!..." అడిగాడు రామయోగి.



"తప్పకుండా అంకుల్!..." అంది దీప్తి.



వరండా మెట్లు దిగి తన కారువైపుకు నడిచింది.



శార్వరి... ఇంటికి చేరింది. ఆమె మనస్సు ఎంతో వ్యాకులంగా వుంది. సీతాపతి తన అక్క వాణిని గురించి చెప్పిన విషయం అమ్మా నాన్నలకు చెప్పాలా వద్దా అనేదే ఆమె సమస్య. 



నాన్నా!... దేనికీ తొందరపడరు. ఆవేశపడరు... విషయాన్ని వింటే బాధపడతారు. అమ్మ!....ఆవేశం ఎక్కువ... ఆక్కను ఎంతగానో అభిమానించి సాకింది. అక్క చేసిన పనికి ఎంతోకాలం బాధపడింది. ఇప్పుడిప్పుడే అక్క జ్ఞాపకాలకు దూరం అయినట్లుగా వుంది. ఇప్పుడు నేను విషయాన్ని వారికి చెబితే... తప్పకుండా బాధపడతారు. అన్న ఈశ్వర్ సౌమ్యుడు. సహనం కలవాడు నాన్నలాగే. వాడితో విషయం చెబితే... ఆలోచించి ఏదో మంచి నిర్ణయం తీసుకొంటాడు.



 అక్క చేసింది తప్పే!.... అంతమాత్రాన జీవితాంతం వరకూ ఆమెను వెలివేయడం తప్పు కదా!.... అక్క చేసింది నేరం ఎలా అవుతుంది?... తనకు నచ్చినవాడిని... తనంటే ఇష్టపడిన వాడిని వివాహం చేసికొంది. అలా జరిగివుండక పోవచ్చు. ప్రజాపతి మామయ్య విషయం తెలియగానే అమ్మానాన్నలకు చెప్పి వుంటే!.... తన రాజకీయ విజయానికి అక్కను అడ్డుపెట్టుకొని బంధుత్వాలను... కుటుంబ గౌరవాలను, రక్తసంబంధాన్ని మరిచిపోయి... నీచంగా ప్రవర్తించాడు. నా కుటుంబ సభ్యులందరికి ఎంతో ఆవేదనను కలిగించాడు. విషయం అమ్మా నాన్నలకు చెబితే... పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకువస్తాయి. కనుక విషయాన్ని చెప్పవలసింది ఈశ్వర్ అన్నయ్యకే!...’ 



అనేక విధాల ఆలోచించి శార్వరి చివరకు నిర్ణయానికి వచ్చింది. రాత్రి ఎనిమిదిన్నరకు నలుగురూ కలిసి భోజనం చేశారు. ఈశ్వర్ తన గదికి వెళ్ళిపోయాడు. హరికృష్ణ, లావణ్యలు టీవీ ముందు కుర్చొని వస్తున్న పాత రుక్మిణీ కళ్యాణం సినిమాను చూడసాగారు.



శార్వరి... కొంతసేపు తన గదిలో వుండి మెల్లగా ఈశ్వర్ గదిలోనికి సమీపించి తలుపును తోసింది. లోన గడియ పెట్టనందున తలుపు తెరుచుకొంది. లోనికి చూచింది. ఈశ్వర్ ఆమెను చూచాడు.
"శారూ!.... పడుకోలేదా!..." అడిగాడు ఈశ్వర్.



"నిద్రరావడం లేదన్నయ్యా!..." అంటూ తలుపుమూసి అతన్ని సమీపించింది.



"రా.... కూర్చో!..."



శార్వరి మంచంపై కూర్చుంది.
ఆమె ముఖంలోకి చూచిన ఈశ్వర్కు... ఎప్పుడూ వికసితకమలంలా వుండే ఆమె ముఖంలో విచారం గోచరించింది.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 9 - by k3vv3 - 10-01-2025, 09:39 PM



Users browsing this thread: 1 Guest(s)