06-01-2025, 10:08 AM
"వృత్రాసురుని మరణం నా చేతిలోనే రాసి పెట్టినట్లుంది. నేను వృత్రాసురునితో యుద్దం చేయడానికి వెళ్ళినప్పుడు అసురులెవరైన ఇంద్రలోక సింహాసనాన్ని ఆక్రమించవచ్చు. అది సమస్త లోకాలకు మంచిది కాదు. కావున నేను యుద్ధం నుండి తిరిగివచ్చేవరకు ఇంద్రలోక దేవేంద్ర పదవిని స్వీకరించు. అందుకు నువ్వే సమర్థుడివి. అలా తమను కాపాడు" అని ఇంద్రుడు నహుషుని అర్థించాడు.
దేవేంద్ర పదవి మీద వ్యామోహం లేని నహుషుడు ముందుగా ఇంద్రుని మాటలను తోసిపుచ్చాడు. ఇంద్రు ని సమస్యను అర్థం చేసుకున్న ప్రియంవద భర్తకు నచ్చ చెప్పడంతో, ప్రియంవద మాటలను అనుసరించి నహుషుడు దేవేంద్ర పదవిని స్వీకరించాడు. ఆ సమయంలో ప్రియంవద ప్రతిష్టాన పుర ప్రజలందరికీ చేదోడు వాదోడు గా ఉండటానికి సిద్ద పడింది.
నహుషుడు దేవేంద్ర పదవిని స్వీకరించాడు. రంభ, ఊర్వశి, మేనక, త్రిలోత్తమాది అప్సరసల నృత్యాలను నహుషుడు కనులార చూసాడు. తదితర దేవతల అవసరాలను తెలుసుకుని వారి సమస్యలను తీర్చాడు.
ఒకనాడు నందనవనంలో ఇంద్రుని భార్య అయిన శచీదేవిని నహుషుడు చూసాడు. అతనిలో రజోగుణం పెల్లుబికింది. నహుషుడు శచీదేవిని తన భార్యగా చేసుకోవాలనుకున్నాడు. నహుషుడు శచీదేవి దగ్గరకు వెళ్ళి తన మనసులోని మాటను చెప్పాడు. తన సమ్మతిని తెలుపమని శచీదేవికి మూడు రోజుల సమయం ఇచ్చాడు.
శచీదేవి సమర రంగాన ఉన్న తన భర్త ఇంద్రునికి తన దగ్గర ఉన్న దేవ గణం ద్వారా నహుషుని దుర్మార్గ గుణాన్ని తెలియచేసింది. ప్రమద గణాల ద్వారా ఇంద్రుడు నహుషుని దుర్మార్గ చిత్తాన్ని ప్రియంవద కు తెలియ చేసాడు.
ప్రతిష్టాన పురంలో ఉన్న ప్రియంవదకు తన భర్త మనో చాంచల్యం ప్రమద గణాల ద్వారా తెలిసింది. వెంటనే తన తలిదండ్రులు పార్వతీపరమేశ్వరుల సహాయంతో శచీదేవిని కలిసింది. ప్రియంవద శచీదేవికి ధైర్యం చెప్పింది.
"సప్త మహర్షులు మోసే పల్లకిలో నువ్వు నా దగ్గరకు వస్తే నిన్ను నేను వివాహం చేసుకుంటాను" అని శచీదేవి చెప్పినట్లు చెప్పమని చెలికత్తెకు చెప్పి చెలికత్తెను నహుషుని వద్దకు పంపింది.
చెలికత్తె నహుషుని దగ్గరకు వెళ్ళింది. శచీదేవి చెప్పుకున్నట్లుగా ప్రియంవద మాటలను చెలికత్తె నహుషునికి చెప్పింది.
చెలికత్తె మాటలను విన్న నహుషుడు తను ఎక్కే పల్లకిని మోయమని సప్త మహర్షులను ఆదేశించా డు. నహుషుడు పల్లకిని ఎక్కాడు. సప్త మహర్షులు చేసేదేమీలేక పల్లకిని మోయ సాగారు. పల్లకి శచీదేవి మందిరం వైపుకు కదిలింది.
పల్లకిలో ఉన్న నహుషుడు "కదలండి కదలండి వేగంగా కదలండి " అని సప్త మహర్షులను త్వరపెట్టాడు. నహుషుడు సప్త మహర్షులను "సర్ప సర్ప" అని అన్నాడు. సంస్కృత భాషలో "సర్ప సర్ప అనగా కదలండి కదలండి" అని అర్థం.
నహుషుని వత్తిడికి ఆగ్రహించిన అగస్త్య మహర్షి
"సర్ప సర్ప" అన్న నహుషుని "సర్పం " కమ్మని శపించాడు.
అగస్త్య మహర్షి ఆగ్రహాన్ని కళ్ళార చూచిన నహుషుడు తనలోని అహం ను గమనించాడు. ప్రియం వద తన దగ్గర ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదను కున్నాడు. నహుషుడు తన అహాన్ని తగ్గించుకుని అగ స్త్య మహర్షి కాళ్ళపై పడ్డాడు. అప్పుడే అక్కడకు వచ్చిన ప్రియంవద తన భర్త తప్పును క్షమించమని అగస్త్య మహర్షి ని సప్త మహర్షులను వేడుకుంది.
ప్రియంవద మాటలకు శాంతిచిన అగస్త్య మహర్షి "నహుష, నువ్వు చేసిన తప్పులను నిజంగా తప్పులుగా భావించి, ప్రజాపరిపాలన విషయం లో నహుష ధర్మం ను పాటించడానికి ఎవరు ముందుకు వస్తారో అప్పుడే నేనిచ్చిన శాపం నుండి నువ్వువిముక్తుడ వవుతావు. " అని నహుషునితో అన్నాడు. అనంతరం సప్త మహర్షులు అక్కడి నుండి వెళ్ళిపోయారు.
"మన కుమారుడు యయాతి కి మకుటాభిషేకం చేస్తాను. మీరు శాప విముక్తులయ్యే వరకు నేను కైలాసం లో తపస్సు చేసుకుంటాను. " అని ప్రియంవద నహుషునితో అంది. నహుషుడు అలాగే అన్నాడు.
ప్రియంవద యయాతి కి పట్టాభిషేకం చేసింది. తన మీద గౌరవం ప్రేమాభిమానం చూపించినట్లే యయాతి మహారాజు మీద గౌరవం, ప్రేమాభిమానం చూపించమని ప్రియంవద ప్రతిష్టాన పుర ప్రజలకు చెప్పింది. ఆ తర్వాత కైలాసం వెళ్ళింది. అక్కడ ప్రియంవద సోదరులు గణపతి, కుమార స్వామి సోదరి తపస్సు చేసుకోవడాని కి అనువైన ప్రదేశం చూపించారు.
నహుషుడు సర్పమై భూమి మీద పడ్డాడు.
నహుష సర్పం దైవ చింతనతో కాలం గడపసాగింది.
ప్రియంవద తన తపోతేజంలో బాలా త్రిపుర సుందరి గానూ, లావణ్య గానూ, అన్విగాను కొందరు మహర్షులకు దర్శనం ఇచ్చింది.
పాండవులు అజ్ఞాతవాసం లో ఉన్నప్పుడు ఒక సారి సర్పంగా ఉన్న నహుషుడు భీముని బంధించాడు. అప్పుడే అక్కడకు వచ్చిన ధర్మరాజు సర్పరూపంలో ఉ న్న నహుషునికి నమస్కరించి తన చంద్ర వంశం గురించి తెలియచేసాడు.. సర్ప రూపంలో ఉన్న నహుషుడు "నేను మీ పూర్వీకుడిని నహుషుడిని" అని తన పరిపాలన గురించి, తన తప్పుల గురించి ధర్మరాజు కు చెప్పా డు. పరిపాలనా విషయంలో నహుష ధర్మం పాటించడానికి ధర్మరాజు నేను సిద్ధం అనగానే నహుషుడు శాప విముక్తుడయ్యాడు.
నహుషుడు శాప విముక్తుడయ్యాడని తెలిసి ప్రియంవద నహుషుని కలిసింది. ప్రియంవద నహుషులు ఇద్దరూ స్వర్గాన్ని చేరారు.
శుభం భూయాత్
దేవేంద్ర పదవి మీద వ్యామోహం లేని నహుషుడు ముందుగా ఇంద్రుని మాటలను తోసిపుచ్చాడు. ఇంద్రు ని సమస్యను అర్థం చేసుకున్న ప్రియంవద భర్తకు నచ్చ చెప్పడంతో, ప్రియంవద మాటలను అనుసరించి నహుషుడు దేవేంద్ర పదవిని స్వీకరించాడు. ఆ సమయంలో ప్రియంవద ప్రతిష్టాన పుర ప్రజలందరికీ చేదోడు వాదోడు గా ఉండటానికి సిద్ద పడింది.
నహుషుడు దేవేంద్ర పదవిని స్వీకరించాడు. రంభ, ఊర్వశి, మేనక, త్రిలోత్తమాది అప్సరసల నృత్యాలను నహుషుడు కనులార చూసాడు. తదితర దేవతల అవసరాలను తెలుసుకుని వారి సమస్యలను తీర్చాడు.
ఒకనాడు నందనవనంలో ఇంద్రుని భార్య అయిన శచీదేవిని నహుషుడు చూసాడు. అతనిలో రజోగుణం పెల్లుబికింది. నహుషుడు శచీదేవిని తన భార్యగా చేసుకోవాలనుకున్నాడు. నహుషుడు శచీదేవి దగ్గరకు వెళ్ళి తన మనసులోని మాటను చెప్పాడు. తన సమ్మతిని తెలుపమని శచీదేవికి మూడు రోజుల సమయం ఇచ్చాడు.
శచీదేవి సమర రంగాన ఉన్న తన భర్త ఇంద్రునికి తన దగ్గర ఉన్న దేవ గణం ద్వారా నహుషుని దుర్మార్గ గుణాన్ని తెలియచేసింది. ప్రమద గణాల ద్వారా ఇంద్రుడు నహుషుని దుర్మార్గ చిత్తాన్ని ప్రియంవద కు తెలియ చేసాడు.
ప్రతిష్టాన పురంలో ఉన్న ప్రియంవదకు తన భర్త మనో చాంచల్యం ప్రమద గణాల ద్వారా తెలిసింది. వెంటనే తన తలిదండ్రులు పార్వతీపరమేశ్వరుల సహాయంతో శచీదేవిని కలిసింది. ప్రియంవద శచీదేవికి ధైర్యం చెప్పింది.
"సప్త మహర్షులు మోసే పల్లకిలో నువ్వు నా దగ్గరకు వస్తే నిన్ను నేను వివాహం చేసుకుంటాను" అని శచీదేవి చెప్పినట్లు చెప్పమని చెలికత్తెకు చెప్పి చెలికత్తెను నహుషుని వద్దకు పంపింది.
చెలికత్తె నహుషుని దగ్గరకు వెళ్ళింది. శచీదేవి చెప్పుకున్నట్లుగా ప్రియంవద మాటలను చెలికత్తె నహుషునికి చెప్పింది.
చెలికత్తె మాటలను విన్న నహుషుడు తను ఎక్కే పల్లకిని మోయమని సప్త మహర్షులను ఆదేశించా డు. నహుషుడు పల్లకిని ఎక్కాడు. సప్త మహర్షులు చేసేదేమీలేక పల్లకిని మోయ సాగారు. పల్లకి శచీదేవి మందిరం వైపుకు కదిలింది.
పల్లకిలో ఉన్న నహుషుడు "కదలండి కదలండి వేగంగా కదలండి " అని సప్త మహర్షులను త్వరపెట్టాడు. నహుషుడు సప్త మహర్షులను "సర్ప సర్ప" అని అన్నాడు. సంస్కృత భాషలో "సర్ప సర్ప అనగా కదలండి కదలండి" అని అర్థం.
నహుషుని వత్తిడికి ఆగ్రహించిన అగస్త్య మహర్షి
"సర్ప సర్ప" అన్న నహుషుని "సర్పం " కమ్మని శపించాడు.
అగస్త్య మహర్షి ఆగ్రహాన్ని కళ్ళార చూచిన నహుషుడు తనలోని అహం ను గమనించాడు. ప్రియం వద తన దగ్గర ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదను కున్నాడు. నహుషుడు తన అహాన్ని తగ్గించుకుని అగ స్త్య మహర్షి కాళ్ళపై పడ్డాడు. అప్పుడే అక్కడకు వచ్చిన ప్రియంవద తన భర్త తప్పును క్షమించమని అగస్త్య మహర్షి ని సప్త మహర్షులను వేడుకుంది.
ప్రియంవద మాటలకు శాంతిచిన అగస్త్య మహర్షి "నహుష, నువ్వు చేసిన తప్పులను నిజంగా తప్పులుగా భావించి, ప్రజాపరిపాలన విషయం లో నహుష ధర్మం ను పాటించడానికి ఎవరు ముందుకు వస్తారో అప్పుడే నేనిచ్చిన శాపం నుండి నువ్వువిముక్తుడ వవుతావు. " అని నహుషునితో అన్నాడు. అనంతరం సప్త మహర్షులు అక్కడి నుండి వెళ్ళిపోయారు.
"మన కుమారుడు యయాతి కి మకుటాభిషేకం చేస్తాను. మీరు శాప విముక్తులయ్యే వరకు నేను కైలాసం లో తపస్సు చేసుకుంటాను. " అని ప్రియంవద నహుషునితో అంది. నహుషుడు అలాగే అన్నాడు.
ప్రియంవద యయాతి కి పట్టాభిషేకం చేసింది. తన మీద గౌరవం ప్రేమాభిమానం చూపించినట్లే యయాతి మహారాజు మీద గౌరవం, ప్రేమాభిమానం చూపించమని ప్రియంవద ప్రతిష్టాన పుర ప్రజలకు చెప్పింది. ఆ తర్వాత కైలాసం వెళ్ళింది. అక్కడ ప్రియంవద సోదరులు గణపతి, కుమార స్వామి సోదరి తపస్సు చేసుకోవడాని కి అనువైన ప్రదేశం చూపించారు.
నహుషుడు సర్పమై భూమి మీద పడ్డాడు.
నహుష సర్పం దైవ చింతనతో కాలం గడపసాగింది.
ప్రియంవద తన తపోతేజంలో బాలా త్రిపుర సుందరి గానూ, లావణ్య గానూ, అన్విగాను కొందరు మహర్షులకు దర్శనం ఇచ్చింది.
పాండవులు అజ్ఞాతవాసం లో ఉన్నప్పుడు ఒక సారి సర్పంగా ఉన్న నహుషుడు భీముని బంధించాడు. అప్పుడే అక్కడకు వచ్చిన ధర్మరాజు సర్పరూపంలో ఉ న్న నహుషునికి నమస్కరించి తన చంద్ర వంశం గురించి తెలియచేసాడు.. సర్ప రూపంలో ఉన్న నహుషుడు "నేను మీ పూర్వీకుడిని నహుషుడిని" అని తన పరిపాలన గురించి, తన తప్పుల గురించి ధర్మరాజు కు చెప్పా డు. పరిపాలనా విషయంలో నహుష ధర్మం పాటించడానికి ధర్మరాజు నేను సిద్ధం అనగానే నహుషుడు శాప విముక్తుడయ్యాడు.
నహుషుడు శాప విముక్తుడయ్యాడని తెలిసి ప్రియంవద నహుషుని కలిసింది. ప్రియంవద నహుషులు ఇద్దరూ స్వర్గాన్ని చేరారు.
శుభం భూయాత్
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
