06-01-2025, 09:58 AM
శంభల రాజ్యం – 13
సింహదత్తుడి ప్రాణ త్యాగం
వరుణ ప్రాకారంలోకి విక్రమసింహుడు అడుగుపెట్టగానే అక్కడున్న ఆకాశం గొడుగు పట్టింది.
శివుణ్ణి వ్యోమకేశి అంటారు. ఆకాశమే తన కేశములుగా కలవాడని అర్థం. కాలమే శివుడు. అలాంటి కాలం అనే ఆకాశం విక్రమసింహుడి రాకకై నిరీక్షిస్తూ ఇన్ని రోజులూ గడిపిందా అన్నంతగా నల్లబడింది కురుల లాంటి మేఘాలతో.
విక్రమసింహుడు జజీరాతో జరిగిన సంగ్రామంలో ఓడిపోయానని అనుకున్నాడు కానీ తన తండ్రి సింహదత్తుడి గొప్పతనం తెలుసుకోలేని కొడుకుగా ఓడిపోయాడని ఇప్పుడే తెలుసుకుంటున్నాడు. అది సింహదత్తుడి గొప్పతనం.
సింహదత్తుడికి తన పూర్వీకులు వదిలి వెళ్లిన గొప్పతనం. వాస్తవానికి సింహళను, సింహళ ప్రజలను ఇందిరాపరిధికి చేర్చటంతోనే సింహళ రాజుల బాధ్యతలన్నీ తీరిపోయాయి. కానీ, అలా చేతులు దులిపేసుకుని వెళ్లే వాళ్ళే అయితే వాళ్ళు సింహళ రాజులెందుకవుతారు? సింహదత్తుని పూర్వీకులు ప్రజలను క్రూరజంతువుల బారి నుండి కాపాడటానికి జరిపిన మారణహోమానికి ప్రాయశ్చిత్తంగా అన్నిశిక్షలనూ అనుభవించారు. ఎన్ని త్యాగాలు చెయ్యాలో అన్నీ చేశారు. అయినా ఇవేవీ సింహదత్తుడికి తెలియనివ్వలేదు. సింహ దత్తుడే స్వయంగా తెలుసుకున్నాడు. ఇప్పుడు విక్రమసింహుడు కూడా అంతే. తనే అభిజిత్ గా వచ్చి విక్రమసింహుడిగా ఆనాడు ఏమేం తెలుసుకోలేకపోయాడో అవన్నీ ఇప్పుడు తెలుసుకుంటున్నాడు.
వరుణ ప్రాకారంలో సింహదత్తుడు తుదిశ్వాస విడిచాడు. అనలప్రాకారంలోని జ్వాలాజిహ్వుడి నుండి, మేఖలలోని భైరవి నుండి శంభలకు పూర్తిగా విముక్తి కల్పించాడు.
జ్వాలాజిహ్వుడు, భైరవి ఒకప్పుడు శంభల రాజ్యంలోని ఈ వరుణ ప్రాకారంలో మూడు అమావాస్యలు విచ్చలవిడిగా శృంగారం జరిపారు. ఈ విషయం తెలిసిన ఏ వ్యక్తి కూడా బతికి బయటపడినట్టు శంభల చరిత్రలోనే లేదు. కానీ కొన్ని విషయాలు దాచిపెడితే దాగేవి కావు. కంటితో చూస్తేనే తెలిసే సత్యాలు కూడా కావు. కొన్ని చర్యలకు విపరీతమైన పరిణామాలుంటాయి. అలాంటిదే ఈ జ్వాలా జిహ్వుడు,
భైరవిల రతిక్రీడ. జ్వాలాజిహ్వుడు, భైరవిల ప్రేమ ఒకప్పుడు రెండు వంశాలనే నాశనం చేసింది. వారిరువురి రూపురేఖలను పూర్తిగా మార్చి వేసింది. అయినా సరే రూపాలకు అతీతంగా వారి మధ్యనున్న మోహం మరింత బలపడుతూ పోయింది. ఆ మోహమే ఎంతో మందిని భయపెడుతూ పోయింది. సరిగ్గా ఈ వరుణ ప్రాకారం ఉన్న చోటునే ఒకప్పుడు సింహళ ఉండేది. అదే సింహళలో కొన్ని క్రూర జంతువులను సింహళ రాజులు యజ్ఞానికి ఆహుతిచ్చి బలిచేశారు. అలాంటి ఈ చోటులో ఉన్న వరుణ ప్రాకారంలో మరిన్ని క్రూరజంతువులు తయారవుతున్నాయని శంభల జ్యోతిష్యుడు కనిపెట్టి శంభల రాజులనూ, మంత్రులనూ హెచ్చరించాడు. కొత్తగా పుట్టుకొస్తున్న ఈ క్రూరజంతువులు ఎక్కడివా అని అంచనా వేస్తే అప్పుడు అర్థం అయింది ఏంటంటే అవి జ్వాలా జిహ్వుడు, భైరవిల ప్రేమకు ప్రతిరూపాలని. అలాంటి సమయంలో వారికి శంభలను కాపాడే యోధుడిగా సింహదత్తుడు మాత్రమే కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న సింహదత్తుడు ఇలా అన్నాడు.
"సింహళ ప్రజలు ఇందిరాపరిధికి వెళ్ళిపోయాక మళ్ళీ నేను తిరిగి శంభలకు ఎందుకు రావలసి వచ్చిందో నాకిన్ని రోజులూ బోధపడలేదు. ఇప్పుడు ఆ కార్యకారణ సంబంధం చాలా స్పష్టముగా నా కళ్లముందుంది. శంభలను కాపాడటం నా బాధ్యత", అన్నాడు.
శంభల రాజులు, మంత్రులు సంశయించారు.
మహామంత్రి ముందుకొచ్చి తన సంశయాన్ని ఇలా బయటపెట్టాడు.
"మీరిప్పుడు ఆ క్రూరజంతువులను చంపితే జ్వాలాజిహ్వుడు, భైరవి ఊరుకుంటారా?
శంభలను సజీవంగా దహనం చేస్తారు. ఆ క్రూరజంతువులను చంపకపోతే అవే మనల్ని సంహరిస్తాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితిని మీరొక్కరే ఎలా ఎదుర్కుంటారు?"
"ప్రాంచద్రుద్రుడిచ్చిన యజ్ఞ మంత్రాన్ని ప్రజల శ్రేయస్సు కోసం వాడి వారి కంటే ముఖ్యమైనది మరొకటి లేదని చాటారు మా పూర్వీకులు. వారు పడ్డ కష్టాలను మేరు పర్వత దర్శనం జరిగినప్పుడు నా కళ్లారా నేను చూసాను. అలాంటి రక్తం పంచుకు పుట్టిన నేను సింహళ నేలపై ఉన్న ఈ శంభలను ఎలా వదిలేసి వెళ్లిపోగలను ! పైగా శంభల రాజకుమారి ఐన విజయకుమారి నా ధర్మపత్ని. విక్రమసింహుడు నా కొడుకు. నా పరాక్రమాన్నే శంభలకు కానుకగా ఇచ్చిన నేను నా ప్రాణాన్ని కాపాడుకోవటానికి పారిపొమ్మంటున్నారా?" అని కన్నెర్రజేశాడు.
అంతవరకు సింహదత్తుడిలోని ఆగ్రహ జ్వాలను చూడని వాళ్లకు ఈ ప్రశ్నతో నోట మాటరాలేదు.
వరుణ ప్రాకారం ఉన్న చోటు సింహళ రాజుల, ప్రజల కన్నీళ్లతో పావనమైన స్థలం. అలాంటి నేలపై అరాచకం జరగాలన్నా జరగదు. విధ్వంసం మొదలు పెట్టాలన్నా కుదరదు. అందుకే జ్వాలా జిహ్వుడు, భైరవిల ప్రతిరూపాలైన అంజీరణులను పూర్తిగా నశింపజేయ్యగలిగాడు సింహదత్తుడు. సింహదత్తుడి కత్తికి బలైన ఆ అంజీరణుల ఆర్తనాదాలు జ్వాలా జిహ్వుడికి, భైరవికి వినబడ్డాయి.
అనల నుండి కోపంగా నలుదిశలా జ్వాలలతో బయలుదేరిన యాళి జ్వాలా జిహ్వుడు అయితే, మేఖల నుండి ఉగ్రరూపం దాల్చి రెక్కలు పెద్దవిగా చేసి అడ్డొచ్చిన దాన్నల్లా తన్నుకుపోయే గరుడపక్షి భైరవి.
వరుణ ప్రాకారంలో వీరిరువురి కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు సింహదత్తుడు.
అంజీరణుల శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి అక్కడ. జ్వాలా జిహ్వుడు, భైరవి అల్లంత దూరం నుండే చూసారీ ఘోరాన్ని. అంత కోపంలో కూడా కన్నీరు మున్నీరయ్యారు. అంత ఘోరంగా అక్కడ చచ్చి పడున్న అంజీరణులను చూస్తూ బాధగా తన రెక్కలతో నిర్జీవంగా పడున్న వాటి శరీర భాగాలను ఒడిలోకి తీసుకుని కుమిలి కుమిలి ఏడ్చింది భైరవి. ఒక్క ప్రాణం అయినా మిగిలుందేమోనని ఆతృతగా వెతుకుతున్న కళ్ళతో చుట్టూ చూస్తున్నాడు జ్వాలా జిహ్వుడు. హృదయవిదారకంగా ఉంది వారిరువురి పరిస్థితి. జ్వాలా జిహ్వుడిలో తండ్రి కనిపించాడు. భైరవిలో తల్లి కనిపించింది. భైరవి మాతృవేదన, జ్వాలాజిహ్వుడి పితృశోకం రెండూ ఆ సమయంలో అరణ్యరోదనే అయ్యాయి. ఏడ్చి ఏడ్చి కనులలో నీళ్లు ఇంకిపోయాయి భైరవికి. వెతికి వెతికి కనులలో ప్రేమ ఇంకిపోయింది జ్వాలా జిహ్వుడికి. ఇప్పుడు ఇద్దరూ సింహదత్తుడి కోసమే వెతుకుతున్నారు.
సింహదత్తుడి ప్రాణ త్యాగం
వరుణ ప్రాకారంలోకి విక్రమసింహుడు అడుగుపెట్టగానే అక్కడున్న ఆకాశం గొడుగు పట్టింది.
శివుణ్ణి వ్యోమకేశి అంటారు. ఆకాశమే తన కేశములుగా కలవాడని అర్థం. కాలమే శివుడు. అలాంటి కాలం అనే ఆకాశం విక్రమసింహుడి రాకకై నిరీక్షిస్తూ ఇన్ని రోజులూ గడిపిందా అన్నంతగా నల్లబడింది కురుల లాంటి మేఘాలతో.
విక్రమసింహుడు జజీరాతో జరిగిన సంగ్రామంలో ఓడిపోయానని అనుకున్నాడు కానీ తన తండ్రి సింహదత్తుడి గొప్పతనం తెలుసుకోలేని కొడుకుగా ఓడిపోయాడని ఇప్పుడే తెలుసుకుంటున్నాడు. అది సింహదత్తుడి గొప్పతనం.
సింహదత్తుడికి తన పూర్వీకులు వదిలి వెళ్లిన గొప్పతనం. వాస్తవానికి సింహళను, సింహళ ప్రజలను ఇందిరాపరిధికి చేర్చటంతోనే సింహళ రాజుల బాధ్యతలన్నీ తీరిపోయాయి. కానీ, అలా చేతులు దులిపేసుకుని వెళ్లే వాళ్ళే అయితే వాళ్ళు సింహళ రాజులెందుకవుతారు? సింహదత్తుని పూర్వీకులు ప్రజలను క్రూరజంతువుల బారి నుండి కాపాడటానికి జరిపిన మారణహోమానికి ప్రాయశ్చిత్తంగా అన్నిశిక్షలనూ అనుభవించారు. ఎన్ని త్యాగాలు చెయ్యాలో అన్నీ చేశారు. అయినా ఇవేవీ సింహదత్తుడికి తెలియనివ్వలేదు. సింహ దత్తుడే స్వయంగా తెలుసుకున్నాడు. ఇప్పుడు విక్రమసింహుడు కూడా అంతే. తనే అభిజిత్ గా వచ్చి విక్రమసింహుడిగా ఆనాడు ఏమేం తెలుసుకోలేకపోయాడో అవన్నీ ఇప్పుడు తెలుసుకుంటున్నాడు.
వరుణ ప్రాకారంలో సింహదత్తుడు తుదిశ్వాస విడిచాడు. అనలప్రాకారంలోని జ్వాలాజిహ్వుడి నుండి, మేఖలలోని భైరవి నుండి శంభలకు పూర్తిగా విముక్తి కల్పించాడు.
జ్వాలాజిహ్వుడు, భైరవి ఒకప్పుడు శంభల రాజ్యంలోని ఈ వరుణ ప్రాకారంలో మూడు అమావాస్యలు విచ్చలవిడిగా శృంగారం జరిపారు. ఈ విషయం తెలిసిన ఏ వ్యక్తి కూడా బతికి బయటపడినట్టు శంభల చరిత్రలోనే లేదు. కానీ కొన్ని విషయాలు దాచిపెడితే దాగేవి కావు. కంటితో చూస్తేనే తెలిసే సత్యాలు కూడా కావు. కొన్ని చర్యలకు విపరీతమైన పరిణామాలుంటాయి. అలాంటిదే ఈ జ్వాలా జిహ్వుడు,
భైరవిల రతిక్రీడ. జ్వాలాజిహ్వుడు, భైరవిల ప్రేమ ఒకప్పుడు రెండు వంశాలనే నాశనం చేసింది. వారిరువురి రూపురేఖలను పూర్తిగా మార్చి వేసింది. అయినా సరే రూపాలకు అతీతంగా వారి మధ్యనున్న మోహం మరింత బలపడుతూ పోయింది. ఆ మోహమే ఎంతో మందిని భయపెడుతూ పోయింది. సరిగ్గా ఈ వరుణ ప్రాకారం ఉన్న చోటునే ఒకప్పుడు సింహళ ఉండేది. అదే సింహళలో కొన్ని క్రూర జంతువులను సింహళ రాజులు యజ్ఞానికి ఆహుతిచ్చి బలిచేశారు. అలాంటి ఈ చోటులో ఉన్న వరుణ ప్రాకారంలో మరిన్ని క్రూరజంతువులు తయారవుతున్నాయని శంభల జ్యోతిష్యుడు కనిపెట్టి శంభల రాజులనూ, మంత్రులనూ హెచ్చరించాడు. కొత్తగా పుట్టుకొస్తున్న ఈ క్రూరజంతువులు ఎక్కడివా అని అంచనా వేస్తే అప్పుడు అర్థం అయింది ఏంటంటే అవి జ్వాలా జిహ్వుడు, భైరవిల ప్రేమకు ప్రతిరూపాలని. అలాంటి సమయంలో వారికి శంభలను కాపాడే యోధుడిగా సింహదత్తుడు మాత్రమే కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న సింహదత్తుడు ఇలా అన్నాడు.
"సింహళ ప్రజలు ఇందిరాపరిధికి వెళ్ళిపోయాక మళ్ళీ నేను తిరిగి శంభలకు ఎందుకు రావలసి వచ్చిందో నాకిన్ని రోజులూ బోధపడలేదు. ఇప్పుడు ఆ కార్యకారణ సంబంధం చాలా స్పష్టముగా నా కళ్లముందుంది. శంభలను కాపాడటం నా బాధ్యత", అన్నాడు.
శంభల రాజులు, మంత్రులు సంశయించారు.
మహామంత్రి ముందుకొచ్చి తన సంశయాన్ని ఇలా బయటపెట్టాడు.
"మీరిప్పుడు ఆ క్రూరజంతువులను చంపితే జ్వాలాజిహ్వుడు, భైరవి ఊరుకుంటారా?
శంభలను సజీవంగా దహనం చేస్తారు. ఆ క్రూరజంతువులను చంపకపోతే అవే మనల్ని సంహరిస్తాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితిని మీరొక్కరే ఎలా ఎదుర్కుంటారు?"
"ప్రాంచద్రుద్రుడిచ్చిన యజ్ఞ మంత్రాన్ని ప్రజల శ్రేయస్సు కోసం వాడి వారి కంటే ముఖ్యమైనది మరొకటి లేదని చాటారు మా పూర్వీకులు. వారు పడ్డ కష్టాలను మేరు పర్వత దర్శనం జరిగినప్పుడు నా కళ్లారా నేను చూసాను. అలాంటి రక్తం పంచుకు పుట్టిన నేను సింహళ నేలపై ఉన్న ఈ శంభలను ఎలా వదిలేసి వెళ్లిపోగలను ! పైగా శంభల రాజకుమారి ఐన విజయకుమారి నా ధర్మపత్ని. విక్రమసింహుడు నా కొడుకు. నా పరాక్రమాన్నే శంభలకు కానుకగా ఇచ్చిన నేను నా ప్రాణాన్ని కాపాడుకోవటానికి పారిపొమ్మంటున్నారా?" అని కన్నెర్రజేశాడు.
అంతవరకు సింహదత్తుడిలోని ఆగ్రహ జ్వాలను చూడని వాళ్లకు ఈ ప్రశ్నతో నోట మాటరాలేదు.
వరుణ ప్రాకారం ఉన్న చోటు సింహళ రాజుల, ప్రజల కన్నీళ్లతో పావనమైన స్థలం. అలాంటి నేలపై అరాచకం జరగాలన్నా జరగదు. విధ్వంసం మొదలు పెట్టాలన్నా కుదరదు. అందుకే జ్వాలా జిహ్వుడు, భైరవిల ప్రతిరూపాలైన అంజీరణులను పూర్తిగా నశింపజేయ్యగలిగాడు సింహదత్తుడు. సింహదత్తుడి కత్తికి బలైన ఆ అంజీరణుల ఆర్తనాదాలు జ్వాలా జిహ్వుడికి, భైరవికి వినబడ్డాయి.
అనల నుండి కోపంగా నలుదిశలా జ్వాలలతో బయలుదేరిన యాళి జ్వాలా జిహ్వుడు అయితే, మేఖల నుండి ఉగ్రరూపం దాల్చి రెక్కలు పెద్దవిగా చేసి అడ్డొచ్చిన దాన్నల్లా తన్నుకుపోయే గరుడపక్షి భైరవి.
వరుణ ప్రాకారంలో వీరిరువురి కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు సింహదత్తుడు.
అంజీరణుల శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి అక్కడ. జ్వాలా జిహ్వుడు, భైరవి అల్లంత దూరం నుండే చూసారీ ఘోరాన్ని. అంత కోపంలో కూడా కన్నీరు మున్నీరయ్యారు. అంత ఘోరంగా అక్కడ చచ్చి పడున్న అంజీరణులను చూస్తూ బాధగా తన రెక్కలతో నిర్జీవంగా పడున్న వాటి శరీర భాగాలను ఒడిలోకి తీసుకుని కుమిలి కుమిలి ఏడ్చింది భైరవి. ఒక్క ప్రాణం అయినా మిగిలుందేమోనని ఆతృతగా వెతుకుతున్న కళ్ళతో చుట్టూ చూస్తున్నాడు జ్వాలా జిహ్వుడు. హృదయవిదారకంగా ఉంది వారిరువురి పరిస్థితి. జ్వాలా జిహ్వుడిలో తండ్రి కనిపించాడు. భైరవిలో తల్లి కనిపించింది. భైరవి మాతృవేదన, జ్వాలాజిహ్వుడి పితృశోకం రెండూ ఆ సమయంలో అరణ్యరోదనే అయ్యాయి. ఏడ్చి ఏడ్చి కనులలో నీళ్లు ఇంకిపోయాయి భైరవికి. వెతికి వెతికి కనులలో ప్రేమ ఇంకిపోయింది జ్వాలా జిహ్వుడికి. ఇప్పుడు ఇద్దరూ సింహదత్తుడి కోసమే వెతుకుతున్నారు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
